ఐపీఎల్ 2024లో భాగంగా.. ఈరోజు రాజస్థాన్ రాయల్స్-ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య మ్యాచ్ జరుగనుంది. ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా రాత్రి 7.30 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది. ఈ క్రమంలో.. టాస్ గెలిచిన రాజస్థాన్ రాయల్స్ ముందుగా బౌలింగ్ ఎంచుకుంది. ఇప్పటికే.. పాయింట్ల పట్టికలో టాప్ లో ఉన్న రాజస్థాన్, ఈ మ్యాచ్ లో గెలిచి అదే స్థానంలో కొనసాగాలని చూస్తోంది. మరోవైపు.. ఢిల్లీ ఈ మ్యాచ్ లో నెగ్గి ప్లేఆఫ్స్ లోకి వెళ్లేందుకు ప్రయత్నం చేస్తోంది.
ఢిల్లీ ప్లేయింగ్ ఎలెవన్:
అభిషేక్ పోరెల్, జేక్ ఫ్రేజర్-మెక్గుర్క్, షాయ్ హోప్, రిషబ్ పంత్ (కెప్టెన్/వికెట్ కీపర్), ట్రిస్టన్ స్టబ్స్, అక్షర్ పటేల్, గుల్బాదిన్ నాయబ్, కుల్దీప్ యాదవ్, ముఖేష్ కుమార్, ఇషాంత్ శర్మ, ఖలీల్ అహ్మద్.
రాజస్థాన్ ప్లేయింగ్ ఎలెవన్:
యశస్వి జైస్వాల్, రోవ్మాన్ పావెల్, సంజు శాంసన్ (కెప్టెన్/వికెట్ కీపర్), రియాన్ పరాగ్, శుభమ్ దూబే, డోనోవన్ ఫెరీరా, రవిచంద్రన్ అశ్విన్, ట్రెంట్ బౌల్ట్, అవేష్ ఖాన్, సందీప్ శర్మ, యుజ్వేంద్ర చాహల్.