Rishabh Pant Injury: కుడి చేతికి మరో గాయం అయింది.. ఓటమికి ఏదో కారణం చెప్పడం కష్టం!
- పంజాబ్ కింగ్స్తో జరిగిన మ్యాచ్లో లక్నో ఓటమి
- ఓటమికి ఏదో కారణం చెప్పడం కష్టం
- భారీ లక్ష్యాన్ని ఛేదించడం అంత సులువు కాదు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఐపీఎల్ 2026లో భాగంగా పంజాబ్ కింగ్స్తో జరిగిన మ్యాచ్లో లక్నో సూపర్ జెయింట్స్ ఓటమిని ఎదుర్కొంది. 255 పరుగుల భారీ లక్ష్య ఛేదనలో లక్నో 200 పరుగులకే పరిమితమైంది. లక్నో కెప్టెన్ రిషబ్ పంత్ మ్యాచ్ అనంతరం జట్టు ప్రదర్శనపై స్పందించాడు. తన ఎడమ మోచేతి గాయం గురించి మాట్లాడుతూ.. ప్రస్తుతం పరిస్థితి మెరుగుపడుతోందని తెలిపాడు. అయితే ఈ మ్యాచ్లో కుడి చేతికి మరో గాయం (టాటూ లాంటిది) తగిలిందని సరదాగా వ్యాఖ్యానించి నవ్వులు పూయించాడు. పంజాబ్ పరాజయానికి ఏదో ఒక కారణం చెప్పడం కష్టమని పంత్ వెల్లడించాడు.
మ్యాచ్లో ఎక్కడ తప్పు జరిగిందన్న ప్రశ్నకు రిషబ్ పంత్ మాట్లాడుతూ.. ఒక్క అంశాన్ని చూపించడం కష్టం అని అన్నాడు. బౌలర్లు మంచి ప్రదర్శన ఇస్తున్నప్పటికీ.. ఇంకా మెరుగుపడాల్సిన అంశాలు ఉన్నాయని పేర్కొన్నాడు. బ్యాటింగ్లో కూడా కొంత పాజిటివ్ సంకేతాలు కనిపించాయని, వాటితో ముందుకు సాగుతామని చెప్పాడు. జట్టుగా ప్రతి మ్యాచ్లో మెరుగైన ప్రదర్శన ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకున్నామని వెల్లడించాడు. ఓపెనర్గా ఆయుష్ బదోనిని పంపించడంపై స్పందిస్తూ.. ఇది ముందుగానే తీసుకున్న నిర్ణయం అని తెలిపాడు. టాప్ ఆర్డర్లో స్వేచ్ఛగా ఆడే అవకాశం ఇవ్వాలనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నామని, మిడిల్ ఆర్డర్ కూడా బాధ్యత తీసుకోవాలని భావించామని వివరించాడు.
Also Read
- MS Dhoni CSK Stake: సీఎస్కేలో 25 శాతం వాటా డిమాండ్ చేసిన ధోనీ..! మౌనం వీడిన ఫ్రాంచైజీ.. తెరపైకి అసలు విషయం
- IPL 2027: కోహ్లీ, రోహిత్తో కలిసి IPL ఆడాలన్న పాక్ క్రికెటర్ కల నెరవేరుతుందా? బ్రిటిష్ పౌరసత్వంతో ఉత్కంఠ
- KKR Captaincy Crisis: రెండేళ్ల వ్యూహాత్మక తప్పిదం.. కేకేఆర్ను సంక్షోభంలోకి నెట్టిందెలా? రహానే రిటైర్మెంట్ కేవలం సాకు మాత్రమే..!
- రూ.2 లక్షల కోట్లకు చేరువలో IPL.. బ్రాండ్ విలువలో నెం.1గా RCB..
‘భారీ లక్ష్యాన్ని ఛేదించడం అంత సులువు కాదు. మేము ప్రయత్నం మాత్రం చేయగలిగాం. ప్రత్యర్థి జట్టు బాగా ఆడినప్పుడు మనం ఎంత చేసినా ఫలితం ఉపయోగం ఉండదు. పంజాబ్ జట్టు ప్రదర్శన అద్భుతం. మంచి క్రికెట్ ఆడిన జట్టుకు క్రెడిట్ ఇవ్వాల్సిందే. మా జట్టుపై పూర్తి నమ్మకం ఉంది. త్వరలోనే మంచి ఫలితాలు ఆదుకుంటాము’ అని రిషబ్ పంత్ విశ్వాసం వ్యక్తం చేశాడు. జట్టులో సానుకూల వాతావరణం కొనసాగుతుందని, ముందున్న మ్యాచ్ల్లో మెరుగైన ఫలితాలు సాధించేందుకు కృషి చేస్తామని పంత్ స్పష్టం చేశాడు.
తాజావార్తలు
-
OTR : హిందూపురం గడ్డ మా అడ్డా! బాలయ్య ఇలాకాలో లోకల్ వార్ మొదలైందా?
-
Story Board : BRICS సదస్సు ప్రధాన ఉద్దేశమేంటి..? భారత్ ఎలాంటి సందేశం ఇస్తుంది..?
-
Telangana Assembly : తెలంగాణ అసెంబ్లీకి ఒకరోజు పొడిగింపు.. బుధవారానికి వాయిదా
-
Greenfield Highway : గ్రీన్ఫీల్డ్ హైవేపై మృత్యుఘోష.. ఒకే రోజు మూడు ప్రమాదాలు
-
Happy Journey : వందల ఫోన్ నెంబర్లున్నా మాట్లాడుకోలేని ఒంటరితనం.. మనందరి కథే ‘హ్యాపీ జర్నీ’..
ట్రెండింగ్
-
Ganesh Chaturthi AI Prompts: మీ స్వంత ఫొటోలతో AI ఉపయోగించి గణపతి శుభాకాంక్షలు చెప్పండి.. ప్రాంప్ట్స్ ఇదిగో మీకోసం..!
-
Moto Buds 2 Fusion: 55dB ANC, 13 గంటల ప్లేబ్యాక్తో సెప్టెంబర్ 15న భారత్లో లాంచ్ కానున్న Moto Buds 2 Fusion.!
-
1 Crore Investment Plan: రూ. కోటి సంపాదించడానికి ఎంత సమయం పడుతుంది.? SIPలో ఎంత పెట్టుబడి పెట్టాలి?
-
Lemon Storage Tips: రసం తగ్గకుండా, రుచి మారకుండా నిమ్మకాయలు నెల రోజులు తాజాగా ఉండాలంటే ఈ సింపుల్ ట్రిక్స్ ఫాలో అయితే చాలు.!
-
BRICS Summit 2026: బ్రిక్స్ వేదికగా ఇరాన్తో భారత్ దౌత్యం.. చాబహార్తో కొత్త ట్రేడ్ రూట్.!