Rishabh Pant Ban: బిగ్ బ్రేకింగ్.. రిషబ్ పంత్పై సస్పెన్షన్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Rishabh Pant Suspension By BCCI: ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ రిషబ్ పంత్పై ఐపీఎల్ అడ్వైజరీ కమిటీ చర్యలు తీసుకుంది. ఐపీఎల్ 2024లో మూడోసారి స్లో ఓవర్ రేట్ నమోదు చేసినందుకు గాను ఐపీఎల్ యాజమాన్యం అతడిపై ఒక మ్యాచ్ సస్పెన్షన్ వేటు వేసింది. అంతేకాదు రూ.30 లక్షల జరిమానా కూడా విధించింది. ఈ మేరకు బీసీసీఐ శనివారం మధ్యాహ్నం ఓ ప్రకటన విడుదల చేసింది. తాజాగా రాజస్థాన్ రాయల్స్తో జరిగిన మ్యాచ్లో పంత్ స్లో ఓవర్ రేట్ నమోదు చేశాడు. సస్పెన్షన్ కారణంగా ఆదివారం రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరగనున్న మ్యాచ్కు పంత్ దూరం కానున్నాడు.
‘2024 మే 7న ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో రాజస్థాన్ రాయల్స్తో జరిగిన మ్యాచ్లో ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ రిషబ్ పంత్ స్లో ఓవర్ రేట్ను నమోదు చేశాడు. ఐపీఎల్ ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించినందుకు పంత్ను ఒక మ్యాచ్ నుంచి సస్పెండ్ చేశాం. అంతేకాదు జరిమానా కూడా విధించాం’ అని బీసీసీఐ పేర్కొంది. పంత్కు రూ.30 లక్షల జరిమానా విధించబడింది. ఢిల్లీ తుది జట్టులోని ఆటగాళ్లతో సహా ఇంపాక్ట్ ప్లేయర్కు రూ.12 లక్షలు జరిమానా లేదా వారి మ్యాచ్ ఫీజులో 50 శాతం (రెండింటిలో ఏది తక్కువైతే అది) కోత పడింది.
Also Read
- Angry On Vaibhav: ‘వెళ్లి ఐపీఎల్ ఆడుకోపో.. నీకు అంతర్జాతీయ క్రికెట్ అనవసరం’.. వైభవ్పై తీవ్ర ఆగ్రహం..
- NKR: ‘చిన్న మార్పు చేశాను.. సక్సెస్ అయ్యాను’.. నితీష్ కుమార్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు..
- Vaibhav Batting: ఎట్టకేలకు వైభవ్ బ్యాటింగ్ సీక్రెట్ రివీల్ చేసిన కోచ్.. అందరూ ఇది ఫాలో అవుతారేమో ఇక..
- Kane Williamson: ఆరెంజ్ ఆర్మీ గుండెల్లో ‘కేన్ మామ’.. ఒంటిచేత్తో SRHను ఫైనల్కు చేర్చిన క్షణాలు..
Also Read: Gautam Gambhir: గంభీర్ భయ్యా.. మీరు వెళ్లినప్పుడు మా హృదయం ముక్కలైంది!
ఏప్రిల్ 4న వైజాగ్లో కోల్కతా నైట్ రైడర్స్తో జరిగిన మ్యాచ్లో రెండోసారి స్లో ఓవర్ రేట్ నమోదు చేసినందుకు రిషబ్ పంత్కు రూ.24 లక్షల జరిమానా విధించబడింది. అంతకుముందు వైజాగ్లోనే చెన్నై సూపర్ కింగ్స్తో జరిగిన మ్యాచ్లో స్లో ఓవర్ రేట్ను కొనసాగించిన పంత్కు రూ.12 లక్షల జరిమానా పడింది. మే 7న రాజస్థాన్ రాయల్స్తో జరిగిన మ్యాచ్లో స్లో ఓవర్ రేట్ నమోదు చేశాడు. దాంతో పంత్పై సస్పెన్షన్ వేటు పడింది. ప్లేఆఫ్స్ రేసులో ఉన్న ఢిల్లీకి ఇది భారీ ఎదురుదెబ్బే అని చెప్పాలి. పట్టికలో ఢిల్లీ 12 పాయింట్లతో ఐదవ స్థానంలో ఉంది. మిగిలిన రెండు మ్యాచుల్లో గెలిస్తే ప్లేఆఫ్స్ బెర్తు ఖరారు అవుతుంది.
తాజావార్తలు
-
The India Story: మనం తినేది అన్నమా? విషమా?.. భయపెడుతున్న ‘ది ఇండియా స్టోరీ’ టీజర్
-
Ketan Agarwal Case: కోటేశ్వరుడైన కేతన్ను సియా ఎందుకు వద్దనుకుంది? దర్యాప్తులో సంచలన విషయాలు
-
IAS Transfers : తెలంగాణలో 13 మంది ఐఏఎస్ ల బదిలీ
-
Deewana: సినిమా నచ్చి బై వన్ గెట్ వన్ ఆఫర్ ప్రకటించిన హీరో శ్రీ విష్ణు
-
Shani Trayodashi 2026: రేపే శని త్రయోదశి.. పొరపాటున కూడా ఈ 5 తప్పులు చేయొద్దు..
ట్రెండింగ్
-
Health Tips : ప్యూరిఫైయర్ ఉందంటే సరిపోదు.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి.!
-
Home Freshness Tips: ఇంట్లో దుర్వాసనకు చెక్.. ఎయిర్ ఫ్రెషనర్లు లేకుండానే సింపుల్ చిట్కాలతో ఇంటిని ఫ్రెష్గా ఉంచండి.!
-
Vaibhav Sooryavanshi Records: ఐర్లాండ్తో డెబ్యూ.. వైభవ్ ముందున్న 5 రికార్డులు ఇవే.!
-
Viral Video: పోలీస్ స్టేషన్లో సహోద్యోగిని ముద్దుపెట్టుకున్న మహిళా కానిస్టేబుల్.. చివరకు.?
-
రూ.9,999కే Lava Smart 4 Plus లాంచ్.. 6.75 అంగుళాల డిస్ప్లే, 5000mAh బ్యాటరీతో అదిరిపోయే ఫీచర్లు.!