GT Vs RCB: వార్ వన్ సైడ్ అయిపోయింది.. ఫైనల్ మజా రావడం లేదు.. నిరాశలో అభిమానులు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఐపీఎల్ 2026 ఫైనల్ మ్యాచ్పై క్రికెట్ అభిమానులు పెట్టుకున్న అంచనాలు తలకిందులయ్యాయి. సాధారణంగా ఐపీఎల్ ఫైనల్ అంటే చివరి బంతి వరకు ఉత్కంఠగా సాగే పోరు, ఫోర్లు, సిక్సర్ల వర్షం, భారీ స్కోర్లు ఉంటాయని అందరూ ఆశిస్తారు. కానీ, అహ్మదాబాద్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB), గుజరాత్ టైటాన్స్ (GT) మధ్య జరుగుతున్న ఈ ఫైనల్ మ్యాచ్ మాత్రం పూర్తిగా ఒకే వైపు మొగ్గు చూపడంతో అభిమానులు తీవ్ర నిరాశకు లోనవుతున్నారు.
వన్ సైడ్ మ్యాచ్.. పోయిన మజా..
ఈ మ్యాచ్లో గుజరాత్ టైటాన్స్ జట్టు మొదట బ్యాటింగ్ చేస్తూ నిర్ణీత ఓవర్లలో కేవలం 155 పరుగులకే 8 వికెట్లు కోల్పోయింది. గుజరాత్ ఆరంభంలోనే వరుసగా కీలక వికెట్లు కోల్పోవడంతో ఆటలో జోష్ తగ్గిపోయింది. వాషింగ్టన్ సుందర్ ఒంటరి పోరాటం చేసి హాఫ్ సెంచరీ సాధించినప్పటికీ, గుజరాత్ జట్టు అభిమానులు ఆశించిన భారీ స్కోరును బోర్డుపై ఉంచలేకపోయింది.
Also Read
- IPL 2027: కోహ్లీ, రోహిత్తో కలిసి IPL ఆడాలన్న పాక్ క్రికెటర్ కల నెరవేరుతుందా? బ్రిటిష్ పౌరసత్వంతో ఉత్కంఠ
- KKR Captaincy Crisis: రెండేళ్ల వ్యూహాత్మక తప్పిదం.. కేకేఆర్ను సంక్షోభంలోకి నెట్టిందెలా? రహానే రిటైర్మెంట్ కేవలం సాకు మాత్రమే..!
- రూ.2 లక్షల కోట్లకు చేరువలో IPL.. బ్రాండ్ విలువలో నెం.1గా RCB..
- Hardik Pandya: ఐపీఎల్ ట్రేడ్ హీట్.. హార్దిక్ పాండ్యా ఢిల్లీకా? చెన్నైకా? భారత మాజీ క్రికెటర్ ఆసక్తికర వ్యాఖ్యలు..
ఇక 156 పరుగుల స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన ఆర్సీబీ బ్యాటర్లు విరాట్ కోహ్లీ, వెంకటేష్ అయ్యర్ ప్రత్యర్థి బౌలర్లను ముప్పుతిప్పలు పెడుతూ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయారు. కేవలం 3.3 ఓవర్లలోనే జట్టు స్కోరును 50 మార్కుకు చేర్చి ఫైనల్స్ చరిత్రలోనే అత్యంత వేగవంతమైన హాఫ్ సెంచరీ రికార్డును నమోదు చేశారు. పవర్ప్లే ముగిసేసరికే ఆర్సీబీ మ్యాచ్ను పూర్తిగా తమ చేతుల్లోకి తెచ్చుకుంది.
సోషల్ మీడియాలో అభిమానుల అసంతృప్తి..
ఒక ఓవర్లో 20 కి పైగా పరుగులు రావడం, చెమటలు పట్టించే ఉత్కంఠ, చివరి ఓవర్ థ్రిల్లర్ వంటి క్షణాల కోసం ఎదురుచూసిన ఫ్యాన్స్కు ఈ వన్ సైడ్ పోరు అస్సలు నచ్చడం లేదు. “ఇదా ఐపీఎల్ ఫైనల్? కనీస పోటీ కూడా లేదు”, “ఫైనల్ మ్యాచ్ చూస్తున్న మజానే రావట్లేదు” అంటూ సోషల్ మీడియాలో (SM) నెటిజన్లు పోస్టులు పెడుతున్నారు. ఆర్సీబీ విజయం దాదాపు ఖాయం కావడంతో, మ్యాచ్లో ఉత్కంఠ పూర్తిగా లోపించిందని క్రీడాభిమానులు పెదవి విరుస్తున్నారు.
తాజావార్తలు
-
Rahul Gandhi: ఢిల్లీ పోలీస్ స్టేషన్ వద్ద రాహుల్ గాంధీ ధర్నా.. పెల్లెట్ గన్ బాధితుడికి న్యాయం చేయాలని డిమాండ్
-
18 రోజుల బ్యాటరీ, 140+ స్పోర్ట్స్ మోడ్స్, AMOLED డిస్ప్లేతో Redmi Watch 6 Active లాంచ్..!
-
Bethlehem Kudumba Unit : 2026 ఓనమ్ విన్నర్గా నివిన్ పౌలి.. ‘బెత్లేహెమ్ కుటుంబ యూనిట్’ బ్లాక్ బస్టర్
-
Vivo V80 Lite: వివో వి80 లైట్ లాంచ్ డేట్ ఫిక్స్.. 10,000mAh బ్యాటరీ, 44W ఫాస్ట్ ఛార్జింగ్తో అదరగొట్టనున్న వివో ఫోన్
-
Telangana Congress: కొండా సురేఖ తీరుపై కాంగ్రెస్ నేతల ఆగ్రహం.. మంత్రి పదవి నుంచి బర్తరఫ్ చేయాలని డిమాండ్..
ట్రెండింగ్
-
Kitchen Hacks: చాకు పదును పోయిందా? కొత్తది కొనాల్సిన పనిలేదు.. ఈ సింపుల్ ట్రిక్స్తో ఇంట్లోనే పదును పెట్టండి..!
-
Blood Donation: రక్తదానం ఎవరు చేయొచ్చు? ఎవరు చేయకూడదు? ఒకవేళ రక్తదానం చేస్తే ఏమైనా సమస్యలు ఎదురవుతాయా.?
-
IND vs SL 2nd Test: రెండో టెస్ట్ నుంచి కుల్దీప్ యాదవ్ ఔట్.. 33 ఏళ్ల దేశవాళీ కింగ్కు ఛాన్స్?
-
16:9.5 యాస్పెక్ట్ రేషియో వైడ్ స్క్రీన్తో ప్రపంచంలోనే తొలి క్యాండీబార్ ఫోన్ Huawei Pura X View..!
-
గూగుల్ బంపర్ ఆఫర్.. వారందరికీ ఏడాది పాటు Google AI Plus ఉచితం.!