ఐపీఎల్ 2021 రెండో సీజన్ లో నిన్న కింగ్స్ పంజాబ్ – కోల్కతా నైట్ రైడర్స్ మధ్య మ్యాచ్ జరిగిన సంగతి తెలిసిందే. అయితే..ఈ కీలక మ్యాచ్లో పంజాబ్ విజయం సాధించింది. కోల్కతా నైట్రైడర్స్తో జరిగిన మ్యాచ్లో ఐదు వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని సాధించింది. పంజాబ్ ఓపెనర్లు రాహుల్, మయాంక్ మంచి భాగ్యస్వామ్యం అందించారు. దీంతో 19. 3 ఓవర్లలోనే.. 168 పరుగులు చేసి పంజాబ్ కింగ్స్ మ్యాచ్ గెలిచింది. ఇక అంతకు ముందు టాస్ ఓడి.. బ్యాటింగ్ కు దిగిన కోల్కతా నైట్ రైడర్స్ జట్టు.. భారీ స్కోర్ చేసింది. 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి ఏకంగా 165 పరుగులు చేసింది కేకేఆర్ టీం. అయితే… భారీ లక్ష్యాన్ని పంజాబ్ కింగ్స్ అవలీలగా గెలిచింది. ఇక ఈ విజయం తో పంజాబ్ ప్లే ఆఫ్ ఆశలు సజీవంగా ఉన్నాయి. మరోవైపు కోల్కతా ప్లే ఆఫ్ అవకాశాలు సక్లింష్టంగా మారాయి.