DC vs PBKS: సెంచరీతో చెలరేగిన ప్రభ్సిమ్రాన్ సింగ్.. ఢిల్లీ టార్గెట్ ఎంతంటే?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Punjab Kings Scored 167 In 20 Overs Against DC: ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్, పంజాబ్ కింగ్స్ మధ్య జరుగుతున్న మ్యాచ్లో.. పంజాబ్ జట్టు బ్యాటింగ్ ఇన్నింగ్స్ ముగిసింది. నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 167 పరుగులు చేయగలిగింది. ఓపెనర్ ప్రభ్సిమ్రన్ సింగ్ సెంచరీతో చెలరేగడం కారణంగానే.. పంజాబ్ జట్టు అంత స్కోరు చేయగలిగింది. మిగిలిన బ్యాటర్లలో ఏ ఒక్కరూ నిలకడగా రాణించలేదు. వచ్చినవాళ్లు వచ్చినట్టుగానే పెవిలియన్ బాట పట్టారు. మధ్యలో సామ్ కర్రన్ ఒకడే అతనికి కాసేపు స్టాండ్ ఇచ్చాడు. అనంతరం అతడు కూడా కొద్దిసేపటికే ఔట్ అయ్యాడు. ఇలా వికెట్లు పడుతున్నా.. ప్రభ్సిమ్రన్ మాత్రం ఒత్తిడికి గురవ్వకుండా, చివరివరకూ ఒంటరి పోరాటం కొనసాగించాడు.
CM KCR : 21 రోజుల పాటు తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ధి ఉత్సవాలు
Also Read
- IPL 2027: కోహ్లీ, రోహిత్తో కలిసి IPL ఆడాలన్న పాక్ క్రికెటర్ కల నెరవేరుతుందా? బ్రిటిష్ పౌరసత్వంతో ఉత్కంఠ
- KKR Captaincy Crisis: రెండేళ్ల వ్యూహాత్మక తప్పిదం.. కేకేఆర్ను సంక్షోభంలోకి నెట్టిందెలా? రహానే రిటైర్మెంట్ కేవలం సాకు మాత్రమే..!
- రూ.2 లక్షల కోట్లకు చేరువలో IPL.. బ్రాండ్ విలువలో నెం.1గా RCB..
- Hardik Pandya: ఐపీఎల్ ట్రేడ్ హీట్.. హార్దిక్ పాండ్యా ఢిల్లీకా? చెన్నైకా? భారత మాజీ క్రికెటర్ ఆసక్తికర వ్యాఖ్యలు..

తొలుత టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన పంజాబ్ జట్టు తరఫున ప్రభ్సిమ్రన్, శిఖర్ ధవన్ ఓపెనింగ్ చేశారు. ఇది పంజాబ్కు అత్యంత కీలకమైన మ్యాచ్ కాబట్టి.. ధవన్ ఈరోజు కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడుతాడని అంతా ఆశించారు. కానీ.. అతడు 7 పరుగులే చేసి ఔట్ అయ్యాడు. ఆ తర్వాత లివింగ్స్టన్ (4), జితేశ్ శర్మ (5) కూడా వెనువెంటనే పెవిలియన్ బాట పట్టారు. అప్పుడు బరిలోకి దిగిన సామ్ కర్రన్తో కలిసి.. ప్రభ్సిమ్రన్ తన జట్టు స్కోరుని ముందుకు నడిపించాడు. కర్రన్ నిదానంగా రాణించగా.. ప్రభ్సిమ్రన్ పరుగుల వర్షం కురిపించే బాధ్యతని తీసుకున్నాడు. వీళ్లిద్దరు కలిసి నాలుగో వికెట్కి 72 పరుగుల భాగస్వామ్యాన్ని జోడించారు. వీరి ఆటతీరు చూసి.. ఈ జోడీనే చివరివరకు కొనసాగుతుందని అందరూ భావించారు. కానీ.. 15వ ఓవర్లో కర్రన్ ప్రవీన్ దూబే బౌలింగ్లో ఔట్ అయ్యాడు.
PM Shahbaz Sharif: ఇమ్రాన్ ఉగ్రవాది కన్నా తక్కువ కాదు.. ఆందోళకారుల అరెస్ట్కు 72 గంటల డెడ్లైన్
తొలుత అర్థశతకం పూర్తయ్యేదాకా నిదానంగా ఆడిన ప్రభ్సిమ్రన్.. ఆ తర్వాతి నుంచి బాదుడు మొదలుపెట్టాడు. ఢిల్లీ బౌలర్లపై వీరవిహారం చేసి.. బౌండరీల మోత మోగించేశాడు. దీంతో అతడు 65 బంతుల్లోనే 10 ఫోర్లు, 6 సిక్సర్లతో 103 పరుగులు చేశాడు. అయితే.. ఆ ఊపులోనే అతడు 19వ ఓవర్లో రెండో బంతికి ముకేశ్ బౌలింగ్లో బౌల్డ్ అయ్యాడు. ప్రభ్సిమ్రన్ పుణ్యమా అని.. పంజాబ్ జట్టు 167 పరుగులు చేయగలిగింది. ఢిల్లీ బౌలర్లలో ఇశాంత్ శర్మ రెండు వికెట్లు తీయగా.. అక్షర్, ప్రవీణ్, కుల్దీప్, ముకేశ్ తలా వికెట్ పడగొట్టారు.
తాజావార్తలు
-
Sandeep Reddy Vanga : ప్రభాస్ ‘స్పిరిట్’ కి A సర్టిఫికెట్ పక్కా.. నేను ఎంత గింజుకున్నా అంతే!
-
Modi-Rahul Gandhi: కులగణనపై మోడీకి ఖర్గే, రాహుల్గాంధీ లేఖ.. ఏముందంటే..!
-
Sandeep Reddy Vanga : ఇండియాస్ బిగ్గెస్ట్ సూపర్ స్టార్ ప్రభాస్!
-
Power Bank Explosion : పవర్ బ్యాంక్ పేలి విద్యార్థికి తీవ్ర గాయాలు
-
OTR: మంత్రి కొండా సురేఖను కేబినెట్ నుంచి తప్పిస్తారా..?
ట్రెండింగ్
-
Medhavi Bidhuri: ‘6-7’ సెలబ్రేషన్తో వైరల్.. ఇప్పుడు వికెట్ల వేటలో తోపు.. ఎవరు ఈ ‘మెధావి బిధూరి’.?
-
Viral Love Story: తైవాన్ అబ్బాయి.. భారత్ అమ్మాయి.. రాత్రికి రాత్రే ఇండియాలో సెన్సేషన్.. కట్చేస్తే..
-
144Hz డిస్ప్లే, కొత్త కలర్ ఆప్షన్లతో సెప్టెంబర్ 4న రాబోతున్న Infinix Hot 70 Pro 5G.!
-
ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్, 2TB వరకు స్టోరేజ్, 50MP కెమెరాతో Sony Xperia 10 VIII లాంచ్..!
-
Green Chillies Plant Grow: కుండీలో పచ్చిమిరపకాయలు విరగకాయాలంటే ఇలా చేయండి.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి!