DC vs PBKS: సెంచరీతో చెలరేగిన ప్రభ్సిమ్రాన్ సింగ్.. ఢిల్లీ టార్గెట్ ఎంతంటే?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Punjab Kings Scored 167 In 20 Overs Against DC: ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్, పంజాబ్ కింగ్స్ మధ్య జరుగుతున్న మ్యాచ్లో.. పంజాబ్ జట్టు బ్యాటింగ్ ఇన్నింగ్స్ ముగిసింది. నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 167 పరుగులు చేయగలిగింది. ఓపెనర్ ప్రభ్సిమ్రన్ సింగ్ సెంచరీతో చెలరేగడం కారణంగానే.. పంజాబ్ జట్టు అంత స్కోరు చేయగలిగింది. మిగిలిన బ్యాటర్లలో ఏ ఒక్కరూ నిలకడగా రాణించలేదు. వచ్చినవాళ్లు వచ్చినట్టుగానే పెవిలియన్ బాట పట్టారు. మధ్యలో సామ్ కర్రన్ ఒకడే అతనికి కాసేపు స్టాండ్ ఇచ్చాడు. అనంతరం అతడు కూడా కొద్దిసేపటికే ఔట్ అయ్యాడు. ఇలా వికెట్లు పడుతున్నా.. ప్రభ్సిమ్రన్ మాత్రం ఒత్తిడికి గురవ్వకుండా, చివరివరకూ ఒంటరి పోరాటం కొనసాగించాడు.
CM KCR : 21 రోజుల పాటు తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ధి ఉత్సవాలు
Also Read
- Angry On Vaibhav: ‘వెళ్లి ఐపీఎల్ ఆడుకోపో.. నీకు అంతర్జాతీయ క్రికెట్ అనవసరం’.. వైభవ్పై తీవ్ర ఆగ్రహం..
- NKR: ‘చిన్న మార్పు చేశాను.. సక్సెస్ అయ్యాను’.. నితీష్ కుమార్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు..
- Vaibhav Batting: ఎట్టకేలకు వైభవ్ బ్యాటింగ్ సీక్రెట్ రివీల్ చేసిన కోచ్.. అందరూ ఇది ఫాలో అవుతారేమో ఇక..
- Kane Williamson: ఆరెంజ్ ఆర్మీ గుండెల్లో ‘కేన్ మామ’.. ఒంటిచేత్తో SRHను ఫైనల్కు చేర్చిన క్షణాలు..

తొలుత టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన పంజాబ్ జట్టు తరఫున ప్రభ్సిమ్రన్, శిఖర్ ధవన్ ఓపెనింగ్ చేశారు. ఇది పంజాబ్కు అత్యంత కీలకమైన మ్యాచ్ కాబట్టి.. ధవన్ ఈరోజు కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడుతాడని అంతా ఆశించారు. కానీ.. అతడు 7 పరుగులే చేసి ఔట్ అయ్యాడు. ఆ తర్వాత లివింగ్స్టన్ (4), జితేశ్ శర్మ (5) కూడా వెనువెంటనే పెవిలియన్ బాట పట్టారు. అప్పుడు బరిలోకి దిగిన సామ్ కర్రన్తో కలిసి.. ప్రభ్సిమ్రన్ తన జట్టు స్కోరుని ముందుకు నడిపించాడు. కర్రన్ నిదానంగా రాణించగా.. ప్రభ్సిమ్రన్ పరుగుల వర్షం కురిపించే బాధ్యతని తీసుకున్నాడు. వీళ్లిద్దరు కలిసి నాలుగో వికెట్కి 72 పరుగుల భాగస్వామ్యాన్ని జోడించారు. వీరి ఆటతీరు చూసి.. ఈ జోడీనే చివరివరకు కొనసాగుతుందని అందరూ భావించారు. కానీ.. 15వ ఓవర్లో కర్రన్ ప్రవీన్ దూబే బౌలింగ్లో ఔట్ అయ్యాడు.
PM Shahbaz Sharif: ఇమ్రాన్ ఉగ్రవాది కన్నా తక్కువ కాదు.. ఆందోళకారుల అరెస్ట్కు 72 గంటల డెడ్లైన్
తొలుత అర్థశతకం పూర్తయ్యేదాకా నిదానంగా ఆడిన ప్రభ్సిమ్రన్.. ఆ తర్వాతి నుంచి బాదుడు మొదలుపెట్టాడు. ఢిల్లీ బౌలర్లపై వీరవిహారం చేసి.. బౌండరీల మోత మోగించేశాడు. దీంతో అతడు 65 బంతుల్లోనే 10 ఫోర్లు, 6 సిక్సర్లతో 103 పరుగులు చేశాడు. అయితే.. ఆ ఊపులోనే అతడు 19వ ఓవర్లో రెండో బంతికి ముకేశ్ బౌలింగ్లో బౌల్డ్ అయ్యాడు. ప్రభ్సిమ్రన్ పుణ్యమా అని.. పంజాబ్ జట్టు 167 పరుగులు చేయగలిగింది. ఢిల్లీ బౌలర్లలో ఇశాంత్ శర్మ రెండు వికెట్లు తీయగా.. అక్షర్, ప్రవీణ్, కుల్దీప్, ముకేశ్ తలా వికెట్ పడగొట్టారు.
తాజావార్తలు
-
Siddipet District: కసాయి తల్లి.. ప్రియుడితో ఏకాంతానికి అడ్డొచ్చాడని రెండేళ్ల కొడుకును హతమార్చిన వైనం..
-
IPL 2027: రిషభ్ పంత్ రాక.. కేఎల్ రాహుల్ భవిష్యత్తుపై చర్చ!
-
Viral News: రబ్బర్ను మింగేసిన 4ఏళ్ల బాలుడు.. తర్వాత ఏం జరిగిందో తెలిస్తే..
-
NEET UG 2026 Re-Exam: నాగపూర్ విద్యార్థికి అబుదాబిలో నీట్ రీ-ఎగ్జామ్ సెంటర్.. హాల్ టికెట్ చూసి మైండ్ బ్లాక్!
-
SBI Mutual Fund IPO: ఎస్బీఐ మ్యూచువల్ ఫండ్ IPOకు సెబీ గ్రీన్ సిగ్నల్.. రూ.13,000 కోట్లతో మార్కెట్లోకి
ట్రెండింగ్
-
Titanoboa: డైనోసార్ల తర్వాత భూమిని ఏలిన ‘టైటానోబోవా’.. ఈ అతిపెద్ద సర్పం గురించి షాకింగ్ విషయలు..
-
Kitchen Tips : గ్యాస్ స్టవ్ కడ్డీలపై జిడ్డా.? ఈ 2 చిట్కాలతో కొత్తలా మెరుస్తాయి.!
-
Freezer Cleaning Hacks: ఫ్రీజర్లో ఐస్ పేరుకుపోతోందా.? ఈ ట్రిక్స్తో నిమిషాల్లో క్లీన్.!
-
Food Grade Knives : తుప్పు కత్తులు వాడుతున్నారా.? ఇక భారీ మూల్యం చెల్లించాల్సిందే.!
-
Virat Kohli Retirement: విరాట్ కోహ్లీ రిటైర్మెంట్పై టెన్షన్ అక్కర్లేదు.. మరో నాలుగేళ్లు ఆడుతాడు!