IPL Final: ఐపీఎల్ ఫైనల్పై రాజకీయం.. బీసీసీఐ నిర్ణయంపై తృణమూల్ ఆగ్రహం..
- ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్పై రాజకీయం..
- కోల్కతా నుంచి అహ్మదాబాద్ తరలించడంపై టీఎంసీ ఆగ్రహం..
- రాజకీయం కోసమే చేశారని తృణమూల్ మంత్రి ఆరోపణలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
IPL Final: ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)-2025 తుది దశకు చేరుకుంది. మంగళవారం, ఫైనల్లో ఆర్సీబీ, పంజాబ్ జట్లు తలపడనున్నాయి. అయితే, ఇప్పుడు ఈ ఫైనల్పై రాజకీయం మొదలైంది. ఫైనల్ మ్యాచ్ వేదికను కోల్కతా నుంచి గుజరాత్కి మార్చాలని బీసీసీఐ తీసుకున్న నిర్ణయాన్ని బెంగాల్లోని తృణమూల్ కాంగ్రెస్(టీఎంసీ) ప్రభుత్వం ఆదివారం విమర్శించింది.
‘‘ప్లే ఆఫ్స్, ఫైనల్ మ్యాచ్లను ఈడెన్ గార్డెన్స్ నుంచి మార్చాలనే నిర్ణయం వెనక ఉన్న రాజకీయ ఉద్దేశ్యాల గురించి నేను గతంలో మాట్లాడాను. ఇటీవల పరిణామాలు ఈ విషయాన్ని మరింత వెలుగులోకి తెచ్చాయి’’ అని రాష్ట్ర క్రీడా మంత్రి అరూప్ బిస్వాస్ ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ‘‘ఈ సమయంలో వాతావరణం అంచనాలను శాటిలైట్ డేటా ఆధారంగా బీసీసీఐ, ఐపీఎల్ పాలకమండలి సమర్పించింది. ఈ కాలంలో కోల్కతాలో వర్షం పడే అవకాశం ఉందని సూచించింది. దీంతో ప్లే ఆఫ్స్, ఫైనరల్ గుజరాత్కి తరలించారు’’ అని మంత్రి అన్నారు. అయితే, ఈ శాటిలైట్ డేటా కేవలం వాతావరణ పరిస్థితులపై మాత్రమే ఆధారపడి ఉండటమే కాకుండా, రాజకీయం ద్వారా ప్రభావితమైట్లు ఆయన పేర్కొన్నారు.
Also Read
- Vaibhav Brand Value: ఐపీఎల్ సంచలనం వైభవ్ సూర్యవంశీ బ్రాండ్ వాల్యూ షురూ.. ఏడాదికి 2 కోట్లు..
- Shubman Gill: ఆ ఒక్క మార్పుతోనే శుభ్మన్ గిల్ పరుగుల వరద.. సీక్రెట్ బయటపెట్టిన అశ్విన్..
- Krunal Pandya: హార్దిక్ పాండ్యాకు కృనాల్కు మధ్య విభేదాలు.. ఎట్టకేలకు ఏం జరిగిందో చెప్పిన కృనాల్ పాండ్య..
- Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీకి అదిరే శుభవార్త.. విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మతో జతకట్టనున్న వైభవ్..
Read Also: Heinrich Klaasen: అంతర్జాతీయ క్రికెట్కు రిటైర్మెంట్ ఇచ్చిన మరో స్టార్ ప్లేయర్..!
కోల్కతా క్రికెట్ అభిమానులు రాజకీయ ఉద్దేశ్యాల కారణంగా అన్యాయంగా ఫైనల్ మ్యాచ్కి దూరమయ్యారని, కోల్కతాలో వర్షం పడే అవకాశం ఉందనే అంచనా వేసిన శాటిలైట్, నరేంద్రమోడీ స్టేడియంలో వర్షం పడే అవకాశాన్ని గుర్తించడంలో విఫలమైందని బిస్వాస్ అన్నారు. ఇది కేవలం రాజకీయ ఎజెండాను చూపిస్తోందని ఆరోపించారు.
జూన్ 1, 3 తేదీలలో జరగాల్సిన రెండవ క్వాలిఫయర్, IPL ఫైనల్ వరుసగా కోల్కతాలోని ఈడెన్ గార్డెన్స్లో కాకుండా అహ్మదాబాద్లోని నరేంద్ర మోడీ స్టేడియంలో జరుగుతాయని గతంలో బీసీసీఐ ప్రకటించింది. గతేడాది ఛాంపియన్స్ హోమ్ గ్రౌండ్ ఫైనల్కి ఆతిథ్యం ఇవ్వాలనే ఐపీఎల్ నియమాన్ని బీసీసీఐ ఉల్లంఘించిందని మంత్రి బిశ్వాస్ అన్నారు.
తాజావార్తలు
-
Story Board: తెలంగాణ రాజకీయ సమీకరణాలు మారతాయా..? పవన్ ఎంట్రీతో ఎవరికి లాభం..? ఎవరికి నష్టం..?
-
Congress Rajya Sabha Candidates List 2026: రాజ్యసభకు కాంగ్రెస్ అభ్యర్థుల జాబితా.. ఖర్గే, పవన్ ఖేరా, మీనాక్షి నటరాజన్ సహా వీరికి టికెట్లు
-
Robbery: బ్యాంకులో బంగారం చోరీకి ఉద్యోగి యత్నం.. సిబ్బందిపై సుత్తితో దాడి చేసి.. దారుణంగా..
-
Peddi: బుక్ మై షోలో సరికొత్త రికార్డు.. చరణ్ కెరియర్లోనే బిగ్గెస్ట్ ఓపెనర్గా ‘పెద్ది’?
-
Employee Salary Freeze: ఉద్యోగులకు షాక్.. టెక్ కంపెనీ సంచలన నిర్ణయం.. జీతాల కంటే AI ముఖ్యం..!
ట్రెండింగ్
-
Healthy Parenting Tips : పిల్లల ఎత్తు పెరగడం లేదా? తల్లిదండ్రులు తప్పక తెలుసుకోవాల్సిన పోషకాహార రహస్యాలు.!
-
Home Remedies : రాత్రిపూట దోమల బెడదా..? దీన్ని ఒక నిమ్మకాయలో పిండి, మీ దిండు దగ్గర ఉంచుకోండి..!
-
Xiaomi 17T భారత్లో లాంచ్.! Leica కెమెరాలు, 6500mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్ప్లేతో ప్రీమియం స్మార్ట్ఫోన్..
-
Motorola edge 70 pro+ లాంచ్.. మిలిటరీ గ్రేడ్ సర్టిఫికేషన్, 50MP క్వాడ్ కెమెరాలు, 6.99 మి.మీ. మందంతో అదిరిపోయే ఫోన్..
-
Heart Disease: లైంగిక సమస్య గుండెపోటుకు దారి తీస్తోందా.? అసలు నిజమేంటంటే.!