PBKS-Dharamsala: పంజాబ్ కింగ్స్ కొంపముంచిన ధర్మశాల.. ప్రత్యర్థి జట్లకు మాత్రం అదృష్ట వేదిక!
- సొంత మైదానంలోనే వరుస పరాజయాలు
- పంజాబ్ కింగ్స్ కొంపముంచిన ధర్మశాల
- ప్రత్యర్థి జట్లకు మాత్రం అదృష్ట వేదిక
- Follow Us :
-
-
Add as a preferred
source on google
PBKS Worst Record in Dharamsala: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో ప్రతి జట్టుకూ తమ సొంత మైదానం ఒక పెద్ద బలంగా ఉంటుంది. హోమ్ గ్రౌండ్లో పిచ్ పరిస్థితులు, వాతావరణం, ప్రేక్షకుల మద్దతు.. ఇలా అన్నీ జట్లకు అదనపు అడ్వాంటేజ్ ఇస్తాయి. అయితే ఐపీఎల్ 2026లో మాత్రం పంజాబ్ కింగ్స్ (పీబీకేఎస్) పరిస్థితి పూర్తిగా భిన్నంగా మారింది. ముఖ్యంగా ధర్మశాల వేదిక పంజాబ్కు ఏమాత్రం కలిసి రావడం లేదు. సొంత మైదానంలోనే వరుస పరాజయాలతో పీబీకేఎస్ ప్లేఆఫ్స్ రేస్ నుంచి నిష్క్రమించే పరిస్థితి నెలకొంది.
ధర్మశాలలో ఇప్పటివరకు పంజాబ్ కింగ్స్ మొత్తం 17 మ్యాచ్లు ఆడింది. అందులో కేవలం 6 విజయాలు మాత్రమే సాధించగా.. 11 మ్యాచ్లలో ఓటమిపాలైంది. ముఖ్యంగా 2023 తర్వాత పరిస్థితి మరింత దారుణంగా మారింది. గత మూడు సీజన్లలో ధర్మశాలలో పంజాబ్ 8 మ్యాచ్లు ఆడగా.. అందులో కేవలం ఒక్క మ్యాచ్లో మాత్రమే గెలిచింది. మిగతా 7 మ్యాచ్లలో పరాజయం చవిచూసింది. దీంతో ధర్మశాల ఇప్పుడు పంజాబ్కు హోమ్ గ్రౌండ్ కంటే.. ప్రత్యర్థి జట్లకు అదృష్ట వేదికగా మారిపోయిందనే విమర్శలు వినిపిస్తున్నాయి.
Also Read
- Angry On Vaibhav: ‘వెళ్లి ఐపీఎల్ ఆడుకోపో.. నీకు అంతర్జాతీయ క్రికెట్ అనవసరం’.. వైభవ్పై తీవ్ర ఆగ్రహం..
- NKR: ‘చిన్న మార్పు చేశాను.. సక్సెస్ అయ్యాను’.. నితీష్ కుమార్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు..
- Vaibhav Batting: ఎట్టకేలకు వైభవ్ బ్యాటింగ్ సీక్రెట్ రివీల్ చేసిన కోచ్.. అందరూ ఇది ఫాలో అవుతారేమో ఇక..
- Kane Williamson: ఆరెంజ్ ఆర్మీ గుండెల్లో ‘కేన్ మామ’.. ఒంటిచేత్తో SRHను ఫైనల్కు చేర్చిన క్షణాలు..
ఐపీఎల్ 2026లో పంజాబ్ కింగ్స్ వరుస ఓటములతో మరో చెత్త రికార్డుకు చేరువైంది. పీబీకేఎస్ వరుసగా 6 మ్యాచ్లు ఓడిపోయింది. ఐపీఎల్ చరిత్రలో పంజాబ్కు ఇది రెండో అత్యంత చెత్త లూజింగ్ స్ట్రీక్. 2015లో పంజాబ్ వరుసగా 7 మ్యాచ్లు ఓడిపోయింది. ఇప్పుడు మరో ఓటమి నమోదైతే.. 2015 చెత్త రికార్డును సమం చేస్తుంది. 2011, 2018, 2020 సీజన్లలో కూడా పంజాబ్ వరుసగా ఐదు మ్యాచ్లు ఓడిపోయింది. పంజాబ్ జట్టు స్థిరమైన ప్రదర్శన చేయలేక తీవ్ర ఇబ్బందులు పడుతోంది.
హోమ్ గ్రౌండ్లోనే వరుస పరాజయాలు ఎదురవుతుండటంతో పంజాబ్ కింగ్స్ అభిమానులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. జట్టులో స్టార్ ఆటగాళ్లు ఉన్నప్పటికీ.. కీలక సమయాల్లో బౌలింగ్ విభాగం విఫలమవుతుండటం పీబీకేఎస్కు పెద్ద సమస్యగా మారింది. నిజానికి పంజాబ్ సొంత మైదానం ధర్మశాల కాదు. న్యూ చండీగఢ్లోని ముల్లన్పూర్లో ఉన్న మహారాజా యాదవేంద్ర సింగ్ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం ప్రాథమిక మైదానం. ద్వితీయ సొంత మైదానం హిమాచల్ ప్రదేశ్లోని ధర్మశాలలో ఉన్న హిమాచల్ ప్రదేశ్ క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలో పంజాబ్ కొన్ని మ్యాచ్లు ఆడుతోంది.
తాజావార్తలు
-
Chairmans Desk : హైదరాబాద్ రియల్ ఎస్టేట్ ఇంకా కోలుకోలేదా..?
-
Monsoon Traffic: వర్షాకాలం ట్రాఫిక్ యాక్షన్ ప్లాన్.. పోలీసులకు సైబరాబాద్ సీపీ కీలక ఆదేశాలు!
-
OTR: అసెంబ్లీకి పోటీ చేయాలని ఉవ్విళ్ళూరుతున్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు.. నియోజకవర్గాలను ఎంపిక చేసుకున్నారా?
-
OTR: గుంటూరు జిల్లాలో టీడీపీకి ఎదురుదెబ్బా? విజయోత్సవ సభ ఫ్లాప్ వెనుక కారణాలు
-
OTR: మూడు నియోజకవర్గాల చుట్టూ తిరిగిన మాజీ మంత్రి.. ఫైనల్గా ఎక్కడ ఫిక్స్ అయ్యారు?
ట్రెండింగ్
-
Clean and Clutter Free Home: బిజీ లైఫ్లోనూ క్లీన్ హోమ్ సాధ్యం.. పరిశుభ్రమైన ఇంటి రహస్యం ఇదే.!
-
6000mAh భారీ బ్యాటరీ, Snapdragon 6 Gen 3 ప్రాసెసర్తో Samsung Galaxy M47 5G లాంచ్.! ధర ఎంతంటే.?
-
టీవీ కాదు భయ్యో.. అంతకు మించి.! AI పవర్, True RGB డిస్ప్లేతో Sony BRAVIA 9 II, BRAVIA 7 II భారత్లో లాంచ్.!
-
Ragi Milk: శరీరాన్ని సహజంగా చల్లగా ఉంచే సూపర్ డ్రింక్ ‘రాగి మిల్క్’.. ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
Gautam Gambhir: అయ్యా బాబోయ్.. గంభీర్ మాకు కోచ్గా వద్దు.. పసికూన క్రికెట్ బోర్డు ఎద్దేవా!