Mumbai Indians: ఐపీఎల్ చరిత్రలో ముంబై ఇండియన్స్ చెత్త రికార్డు!
- ఐపీఎల్ 2026లో ముంబై ఇండియన్స్ దారుణ ప్రదర్శన
- ఐపీఎల్ చరిత్రలోనే ముంబై అరుదైన చెత్త రికార్డు
- ముంబై ఇండియన్స్ జట్టు కెప్టెన్సీలో మార్పులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఐపీఎల్ 2026లో ముంబై ఇండియన్స్ (ఎంఐ) దారుణ ప్రదర్శన కొనసాగుతోంది. ఇప్పటికే ప్లేఆఫ్స్ రేసు నుంచి తప్పుకున్న ముంబై.. ఇప్పుడు ఐపీఎల్ చరిత్రలోనే అరుదైన చెత్త రికార్డును కూడా తన పేరిట నమోదు చేసుకుంది. వరుసగా మూడు మ్యాచ్ల్లో ముగ్గురు వేర్వేరు కెప్టెన్లతో బరిలోకి దిగిన రెండో జట్టుగా ముంబై నిలిచింది. ఈ జాబితాలో గతంలో పుణే వారియర్స్ ఇండియా మాత్రమే ఉంది. అప్పట్లో రాస్ టేలర్, ఏంజెలో మాథ్యూస్, ఆరోన్ ఫించ్ వరుసగా మూడు మ్యాచ్ల్లో కెప్టెన్సీ వహించారు. ఇప్పుడు సూర్యకుమార్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా, హార్దిక్ పాండ్యా వరుసగా మూడు మ్యాచ్ల్లో ముంబైకి నాయకత్వం వహించడం గమనార్హం.
హార్దిక్ పాండ్యా గాయం కారణంగా కొన్ని మ్యాచ్లకు దూరమవడంతో ముంబై ఇండియన్స్ జట్టు కెప్టెన్సీలో మార్పులు చోటుచేసుకున్నాయి. హార్దిక్ గాయం కారణంగా ఒక మ్యాచ్లో సూర్యకుమార్ యాదవ్ జట్టును నడిపించాడు. సూర్యకు కూతురు జన్మించడంతో.. మరో మ్యాచ్లో జస్ప్రీత్ బుమ్రా కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టాడు. తాజాగా కోల్కతా నైట్ రైడర్స్తో జరిగిన మ్యాచ్లో హార్దిక్ మళ్లీ జట్టులోకి వచ్చి కెప్టెన్సీ అందుకున్నాడు. అయితే కెప్టెన్ మారినా ముంబై పరిస్థితి మాత్రం మారలేదు.
Also Read
- IPL 2027: కోహ్లీ, రోహిత్తో కలిసి IPL ఆడాలన్న పాక్ క్రికెటర్ కల నెరవేరుతుందా? బ్రిటిష్ పౌరసత్వంతో ఉత్కంఠ
- KKR Captaincy Crisis: రెండేళ్ల వ్యూహాత్మక తప్పిదం.. కేకేఆర్ను సంక్షోభంలోకి నెట్టిందెలా? రహానే రిటైర్మెంట్ కేవలం సాకు మాత్రమే..!
- రూ.2 లక్షల కోట్లకు చేరువలో IPL.. బ్రాండ్ విలువలో నెం.1గా RCB..
- Hardik Pandya: ఐపీఎల్ ట్రేడ్ హీట్.. హార్దిక్ పాండ్యా ఢిల్లీకా? చెన్నైకా? భారత మాజీ క్రికెటర్ ఆసక్తికర వ్యాఖ్యలు..
ఈడెన్ గార్డెన్స్ వేదికగా జరిగిన మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన ముంబై ఇండియన్స్ 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 147 పరుగులే చేసింది. ప్రారంభం నుంచే ముంబై బ్యాటర్లు తీవ్ర ఒత్తిడిలో కనిపించారు. ర్యాన్ రికెల్టన్ (6), నమన్ ధీర్ (0), రోహిత్ శర్మ (15), సూర్యకుమార్ యాదవ్ (15)లు నిరాశపర్చారు. పవర్ప్లే ముగిసే సమయానికి ముంబై 46/4తో కష్టాల్లో పడింది. తిలక్ వర్మ (20), హార్దిక్ పాండ్యా (26) రాణించలేదు. చివర్లో కార్బిన్ బోష్ 18 బంతుల్లో అజేయంగా 32 పరుగులు చేసి జట్టును గౌరవప్రదమైన స్కోర్కు చేర్చాడు. దాంతో ముంబై ఈ సీజన్లో మరోసారి నిరాశపరిచింది.
తాజావార్తలు
-
Rose Water: ముఖానికి ఫ్రెష్నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!
-
Kiara Advani: ‘టాక్సిక్’ తర్వాత కియారా చేతికి బంపర్ ఆఫర్.. పదేళ్ల తర్వాత వస్తున్న సీక్వెల్లో ఛాన్స్?
-
Bank Holidays September 2026: సెప్టెంబర్ 2026 బ్యాంక్ సెలవులు ఇవే.. బ్యాంకుకు వెళ్లే ముందు లిస్ట్ చెక్ చేయండి
-
Tirupati: శేషాచలం అడవుల్లో రెండుగా విడిపోయిన ఏనుగుల గుంపు.. అప్రమత్తంగా ఉండాలని అధికారుల హెచ్చరిక!
-
Toxic Flop : యశ్ చేసిన తప్పే ఎన్టీఆర్, అల్లు అర్జున్, మహేశ్, ప్రభాస్ చేస్తున్నారా?
ట్రెండింగ్
-
మార్కెట్లో కిలో రూ.1500.. ఇంట్లోనే కేవలం 15 నిమిషాల్లో ‘కాజూ కట్లీ’ తయారీ చేయండి ఇలా.!
-
Hockey World Cup 2026: నెదర్లాండ్స్ ఆధిపత్యానికి చెక్.. 16 ఏళ్ల తర్వాత హాకీ ప్రపంచకప్ గెలిచిన అర్జెంటీనా!
-
House Construction Cost: ఇల్లు కట్టే ఆలోచన ఉందా?.. కేవలం 5 నిమిషాల్లో బడ్జెట్ అంచనా వేసే సింపుల్ ట్రిక్ ఇదే!
-
ఇదేం ఫోన్ బాబోయ్.. బ్లాక్ అండ్ వైట్ నుంచి కలర్లోకి మారిపోతుంది..! Hisense A10 e-ink లాంచ్.!
-
రూ.15,999కే IP69 రేటింగ్, 120Hz డిస్ప్లే, 5,200mAh బ్యాటరీతో TECNO SPARK Go 3 Pro లాంచ్..!