MS Dhoni: ఎంఎస్ ధోనీ క్రేజ్ చూసి పిచ్చెక్కిపోయింది.. మహీ చిరకాల ప్రత్యర్థి ఆసక్తికర వ్యాఖ్యలు!
- చెపాక్ మైదానంలో చివరి మ్యాచ్ ఆడిన చెన్నై
- ఎంఎస్ ధోనీ భవిష్యత్తుపై జోరుగా చర్చలు
- ప్రపంచ క్రికెట్ను మార్చిన దిగ్గజం ధోనీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
MS Dhoni Craze Leaves Mark Boucher Amazed: ఐపీఎల్ 2026లో చెన్నై సూపర్ కింగ్స్ ప్లేఆఫ్స్ రేసు నుంచి దాదాపుగా తప్పుకుంది. లీగ్ దశలో చివరి మ్యాచ్లో గెలిచినా.. ఇతర జట్ల ఫలితాలపై ఆధారపడాల్సి ఉంది. రాజస్థాన్ రాయల్స్ తన చివరి మ్యాచ్లో గెలిస్తే.. చెన్నై ఇంటికి వెళ్లాల్సిందే. ఈ సీజన్లో ఇప్పటికే చెన్నై చెపాక్ మైదానంలో చివరి మ్యాచ్ ఆడిన నేపథ్యంలో మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ భవిష్యత్తుపై చర్చలు జోరుగా సాగుతున్నాయి. ధోనీ రిటైర్మెంట్పై అధికారిక ప్రకటన రాకపోయినా.. ఇది అతడి చివరి సీజన్ కావచ్చని అభిమానులు, క్రికెట్ నిపుణులు భావిస్తున్నారు. ఈ క్రమంలో దక్షిణాఫ్రికా మాజీ వికెట్కీపర్ మార్క్ బౌచర్ ధోనీపై చేసిన భావోద్వేగ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అంతర్జాతీయ క్రికెట్లో ఎన్నో ఏళ్ల పాటు ధోనీకి ప్రత్యర్థిగా నిలిచిన బౌచర్.. మహీని ప్రపంచ క్రికెట్ను మార్చిన దిగ్గజంగా అభివర్ణించాడు.
తాజాగా స్టార్ స్పోర్ట్స్తో మాట్లాడిన మార్క్ బౌచర్.. చెపాక్ స్టేడియంలో ఎంఎస్ ధోనీకి దక్కే అభిమానాన్ని ప్రత్యేకంగా ప్రస్తావించాడు. ‘నేను చెపాక్కు చాలాసార్లు వచ్చాను. ధోనీపై అభిమానులు చూపించే పిచ్చి ప్రేమ అద్భుతం. ఆ క్రేజ్ మరో ఆటగాడికి లేదు. దక్షిణాఫ్రికాలో కూడా నేను ఇదే విషయం చెబుతుంటాను. ఎవరికైనా ఐపీఎల్ అనుభవం కావాలంటే.. చెపాక్లో ధోనీ ఆడే మ్యాచ్ తప్పకుండా చూడాలని చెబుతాను. అప్పుడే అతడు ఎంత పెద్ద వ్యక్తో అర్థమవుతుంది. ధోనీ కేవలం భారతదేశానికే కాదు.. ప్రపంచ క్రికెట్కే లెజెండ్. అతడు ఆట కోసం చేసిన సేవలు అద్భుతం. అతడు రిటైర్మెంట్ ప్రకటిస్తే.. అది క్రికెట్కు చాలా పెద్ద నష్టం’ అని బౌచర్ పేర్కొన్నాడు.
Also Read
- IPL 2027: కోహ్లీ, రోహిత్తో కలిసి IPL ఆడాలన్న పాక్ క్రికెటర్ కల నెరవేరుతుందా? బ్రిటిష్ పౌరసత్వంతో ఉత్కంఠ
- KKR Captaincy Crisis: రెండేళ్ల వ్యూహాత్మక తప్పిదం.. కేకేఆర్ను సంక్షోభంలోకి నెట్టిందెలా? రహానే రిటైర్మెంట్ కేవలం సాకు మాత్రమే..!
- రూ.2 లక్షల కోట్లకు చేరువలో IPL.. బ్రాండ్ విలువలో నెం.1గా RCB..
- Hardik Pandya: ఐపీఎల్ ట్రేడ్ హీట్.. హార్దిక్ పాండ్యా ఢిల్లీకా? చెన్నైకా? భారత మాజీ క్రికెటర్ ఆసక్తికర వ్యాఖ్యలు..
‘భవిష్యత్తులో సీఎస్కే డైరెక్టర్ ఆఫ్ క్రికెట్గా లేదా మరో కీలక పాత్రలో అయినా క్రికెట్తో ఎంఎస్ ధోనీ అనుబంధం కొనసాగిస్తాడని ఆశిస్తున్నాను. ధోనీకి అసాధారణమైన క్రికెట్ మైండ్ ఉంది. అతడు ఎప్పటికీ క్రికెట్ చరిత్రలో గొప్ప ఆటగాళ్లలో ఒకడిగానే గుర్తుండిపోతాడు. ప్రపంచ క్రికెట్ తరఫున ధోనీకి థ్యాంక్యూ చెప్పాలనుకుంటున్నాను. నువ్వు ఈ ఆట కోసం చేసిన ప్రతిదానికి ధన్యవాదాలు’ అని బౌచర్ భావోద్వేగంగా చెప్పాడు. చెపాక్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్లో సన్రైజర్స్ 5 వికెట్ల తేడాతో చెన్నైని ఓడించింది. ప్రస్తుతం 13 మ్యాచ్ల్లో 16 పాయింట్లు సాధించిన ఎస్ఆర్హెచ్.. గుజరాత్ టైటాన్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో కలిసి ప్లేఆఫ్స్లోకి ప్రవేశించింది. మధ్యలో వరుస ఓటములతో చెన్నై ప్లేఆఫ్స్ ఆశలు దాదాపుగా వదిలేసుకుంది.
తాజావార్తలు
-
Dulquer Salman: ‘ఐ యామ్ గేమ్’ కోసం నాగ్ అశ్విన్ ఎడిటింగ్..
-
Nag Ashwin : దుల్కర్ ‘ఐ యామ్ గేమ్’లో మైండ్ బ్లాంక్ అయ్యే సీక్రెట్ లీక్ చేసిన నాగ్ అశ్విన్!
-
Lionel Messi: ఫుట్బాల్ ప్రపంచంలో శకం సమాప్తం.. అర్జెంటీనా దిగ్గజం మెస్సీ రిటైర్మెంట్..
-
Putin: రష్యా అధ్యక్షుడు షాకింగ్ నిర్ణయం.. కాన్వాయ్ ఆపి ఫొటోలు దిగిన పుతిన్.. వీడియో వైరల్
-
CM Revanth Reddy: ఈ 1000 రోజుల్లో కేసీఆర్ ఒక్కసారైనా జనం కోసం బయటకు వచ్చారా..?: సీఎం రేవంత్రెడ్డి
ట్రెండింగ్
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లేతో POCO X8 5G సెప్టెంబర్ 4న లాంచ్..!
-
క్రిస్టల్స్తో మెరిసిపోనున్న Motorola కొత్త ఫోల్డబుల్ ఫోన్.. IFA 2026లో సరికొత్త స్వరోవ్స్కీ ఎడిషన్.!
-
Viral Video : గుండెలను పిండేస్తున్న దృశ్యం.. చెల్లెలితో చిన్నారి.. తల్లిదండ్రుల కోసం వెతుకులాట.!
-
Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్ను సంప్రదించాల్సిందే.!
-
Rose Water: ముఖానికి ఫ్రెష్నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!