MS Dhoni: ఎంఎస్ ధోనీ క్రేజ్ చూసి పిచ్చెక్కిపోయింది.. మహీ చిరకాల ప్రత్యర్థి ఆసక్తికర వ్యాఖ్యలు!
- చెపాక్ మైదానంలో చివరి మ్యాచ్ ఆడిన చెన్నై
- ఎంఎస్ ధోనీ భవిష్యత్తుపై జోరుగా చర్చలు
- ప్రపంచ క్రికెట్ను మార్చిన దిగ్గజం ధోనీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
MS Dhoni Craze Leaves Mark Boucher Amazed: ఐపీఎల్ 2026లో చెన్నై సూపర్ కింగ్స్ ప్లేఆఫ్స్ రేసు నుంచి దాదాపుగా తప్పుకుంది. లీగ్ దశలో చివరి మ్యాచ్లో గెలిచినా.. ఇతర జట్ల ఫలితాలపై ఆధారపడాల్సి ఉంది. రాజస్థాన్ రాయల్స్ తన చివరి మ్యాచ్లో గెలిస్తే.. చెన్నై ఇంటికి వెళ్లాల్సిందే. ఈ సీజన్లో ఇప్పటికే చెన్నై చెపాక్ మైదానంలో చివరి మ్యాచ్ ఆడిన నేపథ్యంలో మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ భవిష్యత్తుపై చర్చలు జోరుగా సాగుతున్నాయి. ధోనీ రిటైర్మెంట్పై అధికారిక ప్రకటన రాకపోయినా.. ఇది అతడి చివరి సీజన్ కావచ్చని అభిమానులు, క్రికెట్ నిపుణులు భావిస్తున్నారు. ఈ క్రమంలో దక్షిణాఫ్రికా మాజీ వికెట్కీపర్ మార్క్ బౌచర్ ధోనీపై చేసిన భావోద్వేగ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అంతర్జాతీయ క్రికెట్లో ఎన్నో ఏళ్ల పాటు ధోనీకి ప్రత్యర్థిగా నిలిచిన బౌచర్.. మహీని ప్రపంచ క్రికెట్ను మార్చిన దిగ్గజంగా అభివర్ణించాడు.
తాజాగా స్టార్ స్పోర్ట్స్తో మాట్లాడిన మార్క్ బౌచర్.. చెపాక్ స్టేడియంలో ఎంఎస్ ధోనీకి దక్కే అభిమానాన్ని ప్రత్యేకంగా ప్రస్తావించాడు. ‘నేను చెపాక్కు చాలాసార్లు వచ్చాను. ధోనీపై అభిమానులు చూపించే పిచ్చి ప్రేమ అద్భుతం. ఆ క్రేజ్ మరో ఆటగాడికి లేదు. దక్షిణాఫ్రికాలో కూడా నేను ఇదే విషయం చెబుతుంటాను. ఎవరికైనా ఐపీఎల్ అనుభవం కావాలంటే.. చెపాక్లో ధోనీ ఆడే మ్యాచ్ తప్పకుండా చూడాలని చెబుతాను. అప్పుడే అతడు ఎంత పెద్ద వ్యక్తో అర్థమవుతుంది. ధోనీ కేవలం భారతదేశానికే కాదు.. ప్రపంచ క్రికెట్కే లెజెండ్. అతడు ఆట కోసం చేసిన సేవలు అద్భుతం. అతడు రిటైర్మెంట్ ప్రకటిస్తే.. అది క్రికెట్కు చాలా పెద్ద నష్టం’ అని బౌచర్ పేర్కొన్నాడు.
Also Read
- Shubman Gill: ఆ ఒక్క మార్పుతోనే శుభ్మన్ గిల్ పరుగుల వరద.. సీక్రెట్ బయటపెట్టిన అశ్విన్..
- Krunal Pandya: హార్దిక్ పాండ్యాకు కృనాల్కు మధ్య విభేదాలు.. ఎట్టకేలకు ఏం జరిగిందో చెప్పిన కృనాల్ పాండ్య..
- Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీకి అదిరే శుభవార్త.. విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మతో జతకట్టనున్న వైభవ్..
- Jos Buttler: నెహ్రా నిర్ణయంతో షాకైన జోస్ బట్లర్.. గుజరాత్ ఫైనల్ ఓటమి వెనుక అసలు కథ ఇదే!
‘భవిష్యత్తులో సీఎస్కే డైరెక్టర్ ఆఫ్ క్రికెట్గా లేదా మరో కీలక పాత్రలో అయినా క్రికెట్తో ఎంఎస్ ధోనీ అనుబంధం కొనసాగిస్తాడని ఆశిస్తున్నాను. ధోనీకి అసాధారణమైన క్రికెట్ మైండ్ ఉంది. అతడు ఎప్పటికీ క్రికెట్ చరిత్రలో గొప్ప ఆటగాళ్లలో ఒకడిగానే గుర్తుండిపోతాడు. ప్రపంచ క్రికెట్ తరఫున ధోనీకి థ్యాంక్యూ చెప్పాలనుకుంటున్నాను. నువ్వు ఈ ఆట కోసం చేసిన ప్రతిదానికి ధన్యవాదాలు’ అని బౌచర్ భావోద్వేగంగా చెప్పాడు. చెపాక్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్లో సన్రైజర్స్ 5 వికెట్ల తేడాతో చెన్నైని ఓడించింది. ప్రస్తుతం 13 మ్యాచ్ల్లో 16 పాయింట్లు సాధించిన ఎస్ఆర్హెచ్.. గుజరాత్ టైటాన్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో కలిసి ప్లేఆఫ్స్లోకి ప్రవేశించింది. మధ్యలో వరుస ఓటములతో చెన్నై ప్లేఆఫ్స్ ఆశలు దాదాపుగా వదిలేసుకుంది.
తాజావార్తలు
-
Mamata Banerjee: నా సీటు నుంచి పోటీ చేయండి.. మమతా బెనర్జీకి బంపర్ ఆఫర్..
-
NDA Meeting Andhra Pradesh: ఎన్డీఏ భేటీలో రాజ్యసభ స్థానాల పంపకం.. టీడీపీకి 3, జనసేనకు 1..?
-
Trump: నా యుద్ధ అధికారాల్ని పరిమితం చేయడం దేశద్రోహం.. డెమోక్రాట్లపై ట్రంప్ ఆగ్రహం
-
Rajya Sabha: రాజ్యసభ అభ్యర్థులను ప్రకటించిన బీజేపీ.. కీలక నేతలకు అవకాశం
-
Pawan Kalyan: పాత వీడియో షేర్ చేసిన పవన్ కల్యాణ్.. తెలంగాణపై నా వైఖరి ఇదే..!
ట్రెండింగ్
-
Home Remedies : రాత్రిపూట దోమల బెడదా..? దీన్ని ఒక నిమ్మకాయలో పిండి, మీ దిండు దగ్గర ఉంచుకోండి..!
-
Xiaomi 17T భారత్లో లాంచ్.! Leica కెమెరాలు, 6500mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్ప్లేతో ప్రీమియం స్మార్ట్ఫోన్..
-
Motorola edge 70 pro+ లాంచ్.. మిలిటరీ గ్రేడ్ సర్టిఫికేషన్, 50MP క్వాడ్ కెమెరాలు, 6.99 మి.మీ. మందంతో అదిరిపోయే ఫోన్..
-
Heart Disease: లైంగిక సమస్య గుండెపోటుకు దారి తీస్తోందా.? అసలు నిజమేంటంటే.!
-
రూ.11,999కే Lava Bold N2 5G స్మార్ట్ఫోన్ లాంచ్.. 6000mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో పాటు.!