PBKS vs MI: ఐపీఎల్ 2025 మెగా టోర్నమెంట్ లో భాగంగా ఇవాళ పంజాబ్ కింగ్స్ వర్సెస్ ముంబై ఇండియన్స్ మధ్య మ్యాచ్ జైపూర్ లోని సవాయ్ మాన్సింగ్ స్టేడియంలో జరుగుతుంది. అయితే, టాస్ ఓడిపోయి ముందుగా బ్యాటింగ్ చేసిన.. ముంబై ఇండియన్స్ 7 వికెట్ల నష్టానికి 184 పరుగులు చేసింది.
Read Also: Top Headlines @ 9 PM: టాప్ న్యూస్
అయితే, మరోవైపు పంజాబ్ కింగ్స్ బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ వేసినప్పటికీ సూర్య కుమార్ మాత్రం చెలరేగిపోవడంతో ముంబై ఇండియన్స్ ను ఆదుకున్నాడు. ఈ మ్యాచ్ లో అర్థ శతకం బాదిన సూర్య.. జట్టుకు భారీ స్కోర్ అందించాడు. ఇక ఈ మ్యాచ్ లో పంజాబ్ కింగ్స్ గెలవాలంటే… 185 రన్స్ చేయాల్సి ఉంది. ఇక, పంజాబ్ బౌలర్లలో అర్ష్దీప్ సింగ్, జేమీసన్, విజయ్ కుమార్ వైశక్ తలో రెండు వికెట్లు తీసుకోగా.. హర్ప్రీత్ బ్రార్ ఒక వికెట్ తీసుకున్నాడు.