Kolkata Knight Riders: కేకేఆర్ చారిత్రాత్మక రికార్డ్.. 16 ఏళ్లలో ఇదే తొలిసారి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Kolkata Knight Riders Creates Sensational Record In IPL History: ఐపీఎల్లో కోల్కతా నైట్ రైడర్స్ జట్టు సరికొత్త చారిత్రాత్మక రికార్డ్ని నమోదు చేసింది. ఆఖరి ఓవర్లో అత్యధిక టార్గెట్ను ఛేదించిన జట్టుగా చరిత్రపుటలకెక్కింది. ఏప్రిల్ 9వ తేదీన గుజరాత్ టైటాన్స్తో జరిగిన మ్యాచ్లో.. ఆఖరి ఓవర్లో 29 పరుగుల టార్గెట్ను ఛేజ్ చేసి, కేకేఆర్ ఈ ఘనతను సొంతం చేసుకుంది. చివరి ఓవర్లో ఇంత భారీ టార్గెట్ని ఛేజ్ చేయడం.. 16 ఏళ్ల ఐపీఎల్ చరిత్రలో ఇదే మొదటిసారి. అంతకుముందు 2016లో పంజాబ్ కింగ్స్ జట్టుపై ఆఖరి ఓవర్లో 23 పరుగుల లక్ష్యాన్ని పుణే వారియర్స్ ఛేదించింది. ఈ ఐపీఎల్ సీజన్ వరకూ అదే హయ్యస్ట్ కాగా.. తాజా మ్యాచ్తో ఆ రికార్డ్ని కేకేఆర్ బద్దలుకొట్టింది. చివరి ఓవర్లో రింకూ సింగ్ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయి ఐదు సిక్సులు బాదడం వల్లే.. కేకేఆర్ ఈ రికార్డ్ని తన పేరిట లిఖించుకుంది. ఇక మూడో స్థానంలో గుజరాత్ టైటాన్స్ జట్టు నిలిచింది. 2022లో సన్రైజర్స్ హైదరాబాద్పై గుజరాత్ టైటాన్స్ చివరి ఓవర్లో 22 పరుగుల టార్గెట్ను ఛేధించింది.
China Chickens Case: ఇదెక్కడి ప్రతీకారంరా నాయనా.. 1100 కోళ్లను భయపెట్టి..
Also Read
- IPL 2027: కోహ్లీ, రోహిత్తో కలిసి IPL ఆడాలన్న పాక్ క్రికెటర్ కల నెరవేరుతుందా? బ్రిటిష్ పౌరసత్వంతో ఉత్కంఠ
- KKR Captaincy Crisis: రెండేళ్ల వ్యూహాత్మక తప్పిదం.. కేకేఆర్ను సంక్షోభంలోకి నెట్టిందెలా? రహానే రిటైర్మెంట్ కేవలం సాకు మాత్రమే..!
- రూ.2 లక్షల కోట్లకు చేరువలో IPL.. బ్రాండ్ విలువలో నెం.1గా RCB..
- Hardik Pandya: ఐపీఎల్ ట్రేడ్ హీట్.. హార్దిక్ పాండ్యా ఢిల్లీకా? చెన్నైకా? భారత మాజీ క్రికెటర్ ఆసక్తికర వ్యాఖ్యలు..
ఇక మ్యాచ్ విషయానికొస్తే.. తొలుత టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంపిక చేసుకున్న గుజరాత్ టైటాన్స్, నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 204 పరుగులు చేసింది. శుబ్మన్ గిల్ (39), సాయి సుదర్శన్ (53)లు మొదట్లో అద్భుతంగా రాణించగా.. చివర్లో విజయ్ శంకర్ (24 బంతుల్లో 63) విధ్వంసకర ఇన్నింగ్స్ ఆడటం వల్లే.. గుజరాత్ జట్టు అంత భారీ స్కోరు చేయగలిగింది. అనంతరం 205 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన కేకేఆర్కి ఆరంభంలో ఝలక్ తగిలింది. ఓపెనర్ల వికెట్లను వెనువెంటనే కోల్పోయింది. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన వచ్చిన వెంకటేశ్ అయ్యర్ (83), నితీశ్ రానా (45) విజృంభించారు. మూడో వికెట్కు వీళ్లిద్దరు కలిసి ఏకంగా 100 పరుగుల భాగస్వామ్యాన్ని జోడించారు. ఇక కేకేఆర్దే విజయం అనుకున్న టైంలో.. వరుస వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. 19 ఓవర్లు ముగిసేసరికి.. కేకేఆర్ 7 వికెట్లు కోల్పోయి 176 పరుగులు మాత్రమే చేసింది. ఆఖరి ఓవర్లో 29 పరుగులు చేయాల్సి ఉండగా.. విజయం గుజరాత్దేనని అనుకున్నారు. కానీ.. ఎవరూ ఊహించని విధంగా రింకూ సింగ్ వరుసగా ఐదు సిక్స్లు బాది, తన జట్టుకు మరుపురాని విజయాన్ని అందించాడు.
Yash Dayal: యశ్ దయాల్ చెత్త రికార్డ్.. ఐపీఎల్లో రెండో బౌలర్గా..
తాజావార్తలు
-
Hyderabad: హైడ్రా కమిషనర్ రంగనాథ్ సంతకం ఫోర్జరీ.. 8 కాలేజీలకు ఫేక్ ఫైర్ NOCలు
-
TVS Raider Doctor Doom Edition లాంచ్.. Marvel థీమ్, Spectral Green కలర్తో కొత్త స్టైల్..!
-
Aishwarya Rajesh : ఫ్లాప్లతో డీలా పడిన ఐశ్వర్య రాజేశ్.. పెరిగిన రెమ్యునరేషన్ కష్టాలు
-
Naagin: కోరికలు తీర్చే నాగినిగా శ్రద్ధా కపూర్… ఆరేళ్ల తర్వాత మళ్లీ కదిలిన ‘ఇచ్ఛాధారి నాగిన్’..
-
PM Modi: “మార్క్ జుకర్బర్గ్ ప్రధాని మోడీకి క్షమాపణ చెప్పాలి, లేకపోతే…” మెటా సీఈఓకు పార్లమెంటరీ ప్యానెల్ అల్టిమేటం?
ట్రెండింగ్
-
115 అంగుళాల Mini LED TV, OLED evo, Micro RGB evoతో LG 2026 AI TV సిరీస్ భారత్లో లాంచ్..!
-
VVS Laxman Chief Selector: అజిత్ అగార్కర్కు బిగ్ షాక్.. బీసీసీఐ చీఫ్ సెలెక్టర్గా వీవీఎస్ లక్ష్మణ్?
-
Yamaha R15, MT-15 MotoGP ఎడిషన్ బైక్స్ మళ్లీ వచ్చేశాయి.. కొత్త కలర్ ఆప్షన్లతో FZ-S సిరీస్ కూడా అప్డేట్..!
-
కేవలం 50 మాత్రమే.. లగ్జరీతో పాటు ఫ్యాషన్ టచ్..! MG Cyberster, M9 Couture Edition కార్లు లాంచ్.!
-
Ajit Agarkar-BCCI: అజిత్ అగార్కర్ పదవికి ఎసరు?.. రోహిత్ శర్మనే కారణం!