Yash Dayal: యశ్ దయాల్ చెత్త రికార్డ్.. ఐపీఎల్లో రెండో బౌలర్గా..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Yash Dayal Creates Worst Record In IPL: గుజరాత్ టైటాన్స్ బౌలర్ యశ్ దయాల్ తన పేరిట ఒక చెత్త రికార్డ్ మూటగట్టుకున్నాడు. ఏప్రిల్ 9వ తేదీన కోల్కతా నైట్ రైడర్స్తో జరిగిన మ్యాచ్లో నాలుగు ఓవర్లలో 69 పరుగులిచ్చిన అతగాడు.. ఐపీఎల్ చరిత్రలో ఒక మ్యాచ్లో ఎక్కువ పరుగులు సమర్పించుకున్న రెండో బౌలర్గా నిలిచాడు. తన నాలుగు ఓవర్ల కోటాలో భాగంగా మొదటి మూడు ఓవర్లలో యశ్ దయాల్ 38 పరుగులే ఇచ్చాడు. కానీ.. చివరి ఓవర్లో ఏకంగా 31 పరుగులు ధారాళంగా ఇచ్చేశాడు. అయితే.. అతనికంటే ముందుగా బాసిల్ థంపి 70 పరుగులిచ్చి అగ్రస్థానంలో ఉన్నాడు. 2018లో హైదరాబాద్ తరుపున ఆడిన థంపి.. బెంగుళూరుపై నాలుగు ఓవర్లలో 70 పరుగులు సమర్పించుకున్నాడు. ఈ జాబితాలో ఇషాంత్ శర్మ(66), ముజీబ్ రెహ్మాన్ (66), ఉమేశ్ యాదవ్ (65) వరుసగా మూడు, నాలుగు, ఐదు స్థానాల్లో ఉన్నారు. కాగా.. యశ్ దయాల్ ఈ సీజన్లో గుజరాత్ తరఫున 3 మ్యాచ్లు ఆడాడు. కానీ, ఒక్క వికెట్ కూడా తీయలేకపోయాడు. గత సీజన్లో మాత్రం 9 మ్యాచుల్లో 11 వికెట్లు తీశాడు.
Ponguleti Srinivas Reddy: నన్ను సస్పెండ్ చేయడం హాస్యాస్పదం.. వందలసార్లు పలిచినా వెళ్లలేదు
Also Read
- IPL 2026: RCB Vs KKR మ్యాచ్కు వర్షం గండం.. మ్యాచ్ రద్దయితే వీరికి పండగే.. RCB పరిస్థితి..?
- Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీకి వార్నింగ్ ఇచ్చిన ఏబీ డివిలియర్స్.. అది అంత ఈజీ కాదంటూ..
- CSK Vs SRH: సీఎస్కే జట్టులోకి మరో విధ్వంసకర బ్యాట్స్మెన్.. SRH ప్లే ఆఫ్ ఆశలు గల్లంతేనా..?
- SRH: టాప్ 4లో ఏ ఒక్క టీం సేఫ్ కాదు.. సన్ రైజర్స్ ప్లే ఆఫ్ చేరడం ఖాయమన్న మాజీ క్రికెటర్..
ఇక మ్యాచ్ విషయానికొస్తే.. తొలుత బ్యాటింగ్ చేసిన గుజరాత్ టైటాన్స్ నిర్ణీత 20 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 204 పరుగులు చేసింది. శుబ్మన్ గిల్ (39), సాయి సుదర్శన్ (53)లు మెరుగ్గా రాణించగా.. విజయ్ శంకర్ చివర్లో విధ్వంసకర ఇన్నింగ్స్ ఆడాడు. కేవలం 24 బంతుల్లో నాలుగు ఫోర్లు, ఐదు సిక్సర్ల సహాయంతో 63 పరుగులు చేశాడు. అందుకే.. గుజరాత్ 204 పరుగుల భారీ స్కోర్ చేసింది. 205 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన కేకేఆర్.. మొదటి నుంచే గట్టి పోటీనిచ్చింది. అఫ్కోర్స్.. మొదట్లో గుర్బాజ్, జగదీశన్ వెంటనే ఔటైనా.. ఆ తర్వాత వచ్చిన వెంకటేశ్ అయ్యర్ (83), నితీశ్ రానా (45) విజృంభించారు. అయితే.. వీళ్లిద్దరు ఔటయ్యాక ఆశలు సన్నగిల్లాయి. చివర్లో 5 బంతులకు 28 పరుగులు చేయాలన్నప్పుడు.. ఇక గుజరాత్దే విజయమని దాదాపు ఫిక్సయ్యారు. అప్పుడు రింకూ సింగ్ వరుసగా ఐదు సిక్సులు కొట్టి, కేకేఆర్ని గెలిపించాడు. కనీవినీ ఎరుగని రీతిలో సిక్సుల వర్షం కురిపించి.. మ్యాచ్ స్వరూపాన్నే మార్చేశాడు. దీంతో.. అతడు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్గా నిలిచాడు.
KA Paul: ట్రంప్ అరెస్ట్ అవుతాడని గతంలోనే చెప్పాను.. కేఏ పాల్ హాట్ కామెంట్స్
తాజావార్తలు
-
Norovirus: మరో వైరస్ కలకలం.. 1700 మంది నౌకలోనే క్వారంటైన్..
-
CM Vijay: నీట్ పేపర్ లీక్పై స్పందించిన సీఎం విజయ్.. ఏమన్నారంటే..?
-
Virosh: గ్లోబల్ రికార్డుల వేటలో విజయ్-రశ్మిక జోడీ!
-
Trump: పాపం ట్రంప్.. చైనాలో అమెరికా అధ్యక్షుడికి అవమానం!
-
Natti Kumar: ఇద్దరి మధ్య కోల్డ్ వార్ ప్రొడ్యూసర్స్, డిస్ట్రిబ్యూటర్స్ మధ్య సమస్యలకు కారణం!
ట్రెండింగ్
-
8K కెమెరా, 165Hz డిస్ప్లే, Snapdragon 8 Gen 5తో Motorola Razr Fold లాంచ్.. ధరే కాస్త ఎక్కువ..!
-
48MP ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 1TB స్టోరేజ్ తో Sony Xperia 1 VIII లాంచ్.. ధర ఎంతంటే.?
-
TTE Suspended: రూ. 700 వందే భారత్ టికెట్ రూ. 380కి.. వైరల్ వీడియోతో TTE సస్పెండ్..!
-
Gold Import Duty: పసిడి, వెండి ప్రియులకు షాక్.. దిగుమతి సుంకాలు పెంపు.. నేటి నుంచే అమలు..!
-
Matt Berger Fossil Discovery : కుక్క వెంట పరిగెత్తి.. 20 లక్షల ఏళ్ల రహస్యం బయటపెట్టిన బాలుడు.!