Yash Dayal: యశ్ దయాల్ చెత్త రికార్డ్.. ఐపీఎల్లో రెండో బౌలర్గా..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Yash Dayal Creates Worst Record In IPL: గుజరాత్ టైటాన్స్ బౌలర్ యశ్ దయాల్ తన పేరిట ఒక చెత్త రికార్డ్ మూటగట్టుకున్నాడు. ఏప్రిల్ 9వ తేదీన కోల్కతా నైట్ రైడర్స్తో జరిగిన మ్యాచ్లో నాలుగు ఓవర్లలో 69 పరుగులిచ్చిన అతగాడు.. ఐపీఎల్ చరిత్రలో ఒక మ్యాచ్లో ఎక్కువ పరుగులు సమర్పించుకున్న రెండో బౌలర్గా నిలిచాడు. తన నాలుగు ఓవర్ల కోటాలో భాగంగా మొదటి మూడు ఓవర్లలో యశ్ దయాల్ 38 పరుగులే ఇచ్చాడు. కానీ.. చివరి ఓవర్లో ఏకంగా 31 పరుగులు ధారాళంగా ఇచ్చేశాడు. అయితే.. అతనికంటే ముందుగా బాసిల్ థంపి 70 పరుగులిచ్చి అగ్రస్థానంలో ఉన్నాడు. 2018లో హైదరాబాద్ తరుపున ఆడిన థంపి.. బెంగుళూరుపై నాలుగు ఓవర్లలో 70 పరుగులు సమర్పించుకున్నాడు. ఈ జాబితాలో ఇషాంత్ శర్మ(66), ముజీబ్ రెహ్మాన్ (66), ఉమేశ్ యాదవ్ (65) వరుసగా మూడు, నాలుగు, ఐదు స్థానాల్లో ఉన్నారు. కాగా.. యశ్ దయాల్ ఈ సీజన్లో గుజరాత్ తరఫున 3 మ్యాచ్లు ఆడాడు. కానీ, ఒక్క వికెట్ కూడా తీయలేకపోయాడు. గత సీజన్లో మాత్రం 9 మ్యాచుల్లో 11 వికెట్లు తీశాడు.
Ponguleti Srinivas Reddy: నన్ను సస్పెండ్ చేయడం హాస్యాస్పదం.. వందలసార్లు పలిచినా వెళ్లలేదు
Also Read
- Shubman Gill: ఆ ఒక్క మార్పుతోనే శుభ్మన్ గిల్ పరుగుల వరద.. సీక్రెట్ బయటపెట్టిన అశ్విన్..
- Krunal Pandya: హార్దిక్ పాండ్యాకు కృనాల్కు మధ్య విభేదాలు.. ఎట్టకేలకు ఏం జరిగిందో చెప్పిన కృనాల్ పాండ్య..
- Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీకి అదిరే శుభవార్త.. విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మతో జతకట్టనున్న వైభవ్..
- Jos Buttler: నెహ్రా నిర్ణయంతో షాకైన జోస్ బట్లర్.. గుజరాత్ ఫైనల్ ఓటమి వెనుక అసలు కథ ఇదే!
ఇక మ్యాచ్ విషయానికొస్తే.. తొలుత బ్యాటింగ్ చేసిన గుజరాత్ టైటాన్స్ నిర్ణీత 20 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 204 పరుగులు చేసింది. శుబ్మన్ గిల్ (39), సాయి సుదర్శన్ (53)లు మెరుగ్గా రాణించగా.. విజయ్ శంకర్ చివర్లో విధ్వంసకర ఇన్నింగ్స్ ఆడాడు. కేవలం 24 బంతుల్లో నాలుగు ఫోర్లు, ఐదు సిక్సర్ల సహాయంతో 63 పరుగులు చేశాడు. అందుకే.. గుజరాత్ 204 పరుగుల భారీ స్కోర్ చేసింది. 205 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన కేకేఆర్.. మొదటి నుంచే గట్టి పోటీనిచ్చింది. అఫ్కోర్స్.. మొదట్లో గుర్బాజ్, జగదీశన్ వెంటనే ఔటైనా.. ఆ తర్వాత వచ్చిన వెంకటేశ్ అయ్యర్ (83), నితీశ్ రానా (45) విజృంభించారు. అయితే.. వీళ్లిద్దరు ఔటయ్యాక ఆశలు సన్నగిల్లాయి. చివర్లో 5 బంతులకు 28 పరుగులు చేయాలన్నప్పుడు.. ఇక గుజరాత్దే విజయమని దాదాపు ఫిక్సయ్యారు. అప్పుడు రింకూ సింగ్ వరుసగా ఐదు సిక్సులు కొట్టి, కేకేఆర్ని గెలిపించాడు. కనీవినీ ఎరుగని రీతిలో సిక్సుల వర్షం కురిపించి.. మ్యాచ్ స్వరూపాన్నే మార్చేశాడు. దీంతో.. అతడు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్గా నిలిచాడు.
KA Paul: ట్రంప్ అరెస్ట్ అవుతాడని గతంలోనే చెప్పాను.. కేఏ పాల్ హాట్ కామెంట్స్
తాజావార్తలు
-
E85 Fuel: E85 ఇంధనంపై కేంద్రం కీలక ప్రకటన.. భారీగా తగ్గనున్న పెట్రో ధరలు..!?
-
Ameerpet Fire Accident: అగ్ని ప్రమాదానికి కారణం ఇదే.. ప్రత్యక్ష సాక్షుల విస్తుపోయే నిజాలు..!
-
Modi-Delcy Rodriguez: మోడీతో వెనిజులా అధ్యక్షురాలు డెల్సీ రోడ్రిగ్జ్ భేటీ.. ఇరు దేశాల సంబంధాలపై చర్చ
-
Shubman Gill: ఆ ఒక్క మార్పుతోనే శుభ్మన్ గిల్ పరుగుల వరద.. సీక్రెట్ బయటపెట్టిన అశ్విన్..
-
Delimitation: దేశ రాజకీయ ముఖచిత్రాన్ని మార్చే నిర్ణయం.. డీలిమిటేషన్పై కేంద్రం ఫోకస్
ట్రెండింగ్
-
Home Remedies : రాత్రిపూట దోమల బెడదా..? దీన్ని ఒక నిమ్మకాయలో పిండి, మీ దిండు దగ్గర ఉంచుకోండి..!
-
Xiaomi 17T భారత్లో లాంచ్.! Leica కెమెరాలు, 6500mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్ప్లేతో ప్రీమియం స్మార్ట్ఫోన్..
-
Motorola edge 70 pro+ లాంచ్.. మిలిటరీ గ్రేడ్ సర్టిఫికేషన్, 50MP క్వాడ్ కెమెరాలు, 6.99 మి.మీ. మందంతో అదిరిపోయే ఫోన్..
-
Heart Disease: లైంగిక సమస్య గుండెపోటుకు దారి తీస్తోందా.? అసలు నిజమేంటంటే.!
-
రూ.11,999కే Lava Bold N2 5G స్మార్ట్ఫోన్ లాంచ్.. 6000mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో పాటు.!