Venugopal Rao: ఢిల్లీ క్యాపిటల్స్ను ముంచేసింది వాళ్లే.. డైరెక్టర్ వేణుగోపాల్ రావు కుండబద్దలు!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Venugopal Rao: నిన్న ఉప్పల్లో జరిగిన మ్యాచ్లో సన్రైజర్స్ హైదరాబాద్ ఢిల్లీని ముప్పు తిప్పలు పెట్టింది. ఎస్ఆర్హెచ్ 47 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. సన్రైజర్స్ హైదరాబాద్ (SRH) నిర్దేశించిన 243 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించడంలో ఢిల్లీ క్యాపిటల్స్ (DC) చతికిలపడింది. ఇక మ్యాచ్ అనంతరం ఢిల్లీ డైరెక్టర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ మ్యాచ్లో ఢిల్లీ ఓటమికి టాప్ ఆర్డర్ వైఫల్యమే ప్రధాన కారణమని ఆ జట్టు క్రికెట్ డైరెక్టర్ వై.వేణుగోపాల్ రావు (Yalaka Venugopal Rao) కుండబద్దలు కొట్టారు. ముఖ్యంగా పవర్ప్లేలో ఆశించిన స్థాయిలో పరుగులు రాబట్టలేకపోవడం జట్టును దెబ్బతీసిందని విశ్లేషించారు. 240కి పైగా పరుగులను ఛేదించేటప్పుడు తొలి ఆరు ఓవర్లలో కనీసం 80 నుంచి 90 పరుగులు చేయాలని, కానీ తమ జట్టు కేవలం 59 పరుగులు మాత్రమే చేసిందని వేణుగోపాల్ రావు అసంతృప్తి వ్యక్తం చేశారు. “మేము పవర్ప్లేలో 15 నుంచి 20 పరుగులు తక్కువగా చేశాం. ఇంత భారీ లక్ష్యం ముందున్నప్పుడు ఆరంభం మెరుపు వేగంతో ఉండాలి. మా వద్ద ఉన్న బ్యాటింగ్ డెప్త్కు ఆ స్కోరు చేసి ఉంటే ఫలితం మరోలా ఉండేది” అని పేర్కొన్నారు.
READ MORE: Dhurandhar: హిస్టరీలో ఫస్ట్ టైమ్.. థియేటర్లలో ‘ధురంధర్’ మేకింగ్?
Also Read
- Justin Langer: ఇప్పుడే ఇలా ఆడుతుంటే, అప్పటికి ఊహించలేం.. వైభవ్తో ప్రపంచ క్రికెట్కు వణుకే!
- Vaibhav Sooryavanshi: వైభవ్ తుఫాన్ ఇన్నింగ్స్కు ప్రత్యర్థి ఓనర్ కూడా ఫిదా.. బుడ్డోడి కోసం వచ్చే ఏడాది బిడ్ ఖాయం!
- Virat Kohli: ఐపీఎల్ చరిత్రలో విరాట్ కోహ్లీ సరికొత్త రికార్డు.. సీఎస్కే, ఎంఐ కాదు టాప్లో కేకేఆర్!
- Riyan Parag: మేము కూడా మనుషులమే, తప్పులు జరుగుతాయి.. ఇక్కడ మిస్టర్ పర్ఫెక్ట్ ఎవడూ లేడు!
ఓపెనర్ పాతుమ్ నిస్సంక (8) త్వరగా అవుటైన తర్వాత, కెప్టెన్ కేఎల్ రాహుల్కు తగినంత స్ట్రైక్ దొరకలేదని వేణుగోపాల్ అభిప్రాయపడ్డారు. పవర్ప్లేలో రాహుల్ కేవలం 6 బంతులు మాత్రమే ఎదుర్కోగా, వన్ డౌన్లో వచ్చిన నితీష్ రాణా 17 బంతులు ఆడాడు. రాణా టైమింగ్ దొరకక ఇబ్బంది పడటం వల్ల రాహుల్ తన రిథమ్ను కోల్పోయాడని, ఇదే మ్యాచ్ మొమెంటమ్ను ఎస్ఆర్హెచ్ వైపు తిప్పిందని వివరించారు. రాహుల్ 23 బంతుల్లో 37 పరుగులు చేయగా, రాణా 30 బంతుల్లో 57 పరుగులు చేశాడు. స్పెషలిస్ట్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్తో కేవలం రెండు ఓవర్లే వేయించి, పార్ట్ టైమ్ స్పిన్నర్ నితీష్ రాణాతో నాలుగు ఓవర్లు వేయించడంపై వచ్చిన ప్రశ్నలకు వేణుగోపాల్ రావు స్పందిస్తూ.. “ఫీల్డ్ లో కెప్టెన్ తీసుకునే తక్షణ నిర్ణయాలు అవి. టి20ల్లో ఇలాంటి జూదాలు (Gambles) పారితే గొప్ప నిర్ణయాలంటారు, లేదంటే విమర్శలు వస్తాయి” అని వెనకేసుకొచ్చారు.
తాజావార్తలు
-
Justin Langer: ఇప్పుడే ఇలా ఆడుతుంటే, అప్పటికి ఊహించలేం.. వైభవ్తో ప్రపంచ క్రికెట్కు వణుకే!
-
Atchannaidu: ఎరువుల అక్రమ రవాణాపై మంత్రి సీరియస్.. డీలర్లపై కఠిన చర్యలకు ఆదేశాలు
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో వచ్చేస్తున్న గేమింగ్ మాన్స్టర్ Lenovo Legion Y70 (2026)..!
-
Caste Census: కులగణనకు గ్రీన్ సిగ్నల్.. పిటిషన్ను కొట్టివేసిన సుప్రీంకోర్టు
-
Healthy Ragi Kudumulu: రక్త హీనతను తొలగించి ఎముకలను దృఢంగా చేసే ‘రాగి కుడుములు’ చేసేయండి ఇలా..!
ట్రెండింగ్
-
భారత్ లోకి Mini Cooper S GP Inspired Edition.. కేవలం 30 కార్లకే పరిమితం.!
-
బ్రిటన్ మార్కెట్లోకి హీరో XPulse 200 బైక్స్.. అడ్వెంచర్ రైడర్ల కోసం కొత్త శక్తి!
-
Google I/O 2026: AIలో Google దూకుడు.. కొత్త Gemini 3.5 Flash నుంచి AI చిప్స్ వరకు భారీ ప్రకటనలు.!
-
PCOS గురించి ఈ నిజాలు తెలుసా..? వైద్యులు చెబుతున్న కీలక విషయాలు ఇవే.!
-
Thotakura Masala Vada Recipe: కరకరలాడే తోటకూర మసాలా వడలు.. ఇంట్లోనే స్ట్రీట్ స్టైల్ రుచి.!