Venugopal Rao: ఢిల్లీ క్యాపిటల్స్ను ముంచేసింది వాళ్లే.. డైరెక్టర్ వేణుగోపాల్ రావు కుండబద్దలు!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Venugopal Rao: నిన్న ఉప్పల్లో జరిగిన మ్యాచ్లో సన్రైజర్స్ హైదరాబాద్ ఢిల్లీని ముప్పు తిప్పలు పెట్టింది. ఎస్ఆర్హెచ్ 47 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. సన్రైజర్స్ హైదరాబాద్ (SRH) నిర్దేశించిన 243 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించడంలో ఢిల్లీ క్యాపిటల్స్ (DC) చతికిలపడింది. ఇక మ్యాచ్ అనంతరం ఢిల్లీ డైరెక్టర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ మ్యాచ్లో ఢిల్లీ ఓటమికి టాప్ ఆర్డర్ వైఫల్యమే ప్రధాన కారణమని ఆ జట్టు క్రికెట్ డైరెక్టర్ వై.వేణుగోపాల్ రావు (Yalaka Venugopal Rao) కుండబద్దలు కొట్టారు. ముఖ్యంగా పవర్ప్లేలో ఆశించిన స్థాయిలో పరుగులు రాబట్టలేకపోవడం జట్టును దెబ్బతీసిందని విశ్లేషించారు. 240కి పైగా పరుగులను ఛేదించేటప్పుడు తొలి ఆరు ఓవర్లలో కనీసం 80 నుంచి 90 పరుగులు చేయాలని, కానీ తమ జట్టు కేవలం 59 పరుగులు మాత్రమే చేసిందని వేణుగోపాల్ రావు అసంతృప్తి వ్యక్తం చేశారు. “మేము పవర్ప్లేలో 15 నుంచి 20 పరుగులు తక్కువగా చేశాం. ఇంత భారీ లక్ష్యం ముందున్నప్పుడు ఆరంభం మెరుపు వేగంతో ఉండాలి. మా వద్ద ఉన్న బ్యాటింగ్ డెప్త్కు ఆ స్కోరు చేసి ఉంటే ఫలితం మరోలా ఉండేది” అని పేర్కొన్నారు.
READ MORE: Dhurandhar: హిస్టరీలో ఫస్ట్ టైమ్.. థియేటర్లలో ‘ధురంధర్’ మేకింగ్?
Also Read
- Shubman Gill: ఏబీ డి విలియర్స్ను వెనక్కి నెట్టి.. కోహ్లీ, రోహిత్ సైతం సాధించలేని రికార్డ్ క్రియేట్ చేసిన శుభ్మన్ గిల్
- Vaibhav Sooryavanshi: సిరాజ్ దెబ్బకు కుప్పకూలిన బుడ్డోడు.. నొప్పిని భరిస్తూనే వరల్డ్ రికార్డు బద్దలు..
- IPL 2026 ప్లేఆఫ్స్ రేసు.. ఎస్ఆర్హెచ్, ఆర్సీబీ పక్కా.. ఈ మ్యాచ్ గెలిస్తే ఆ జట్టుకు టైటిల్ ఖాయమన్న అశ్విన్
- Vaibhav Sooryavanshi: "సిక్సర్ల సునామీ".. ఫస్ట్ బాల్కే ప్రపంచ రికార్డు బద్దలుగొట్టిన వైభవ్ సూర్యవంశీ!
ఓపెనర్ పాతుమ్ నిస్సంక (8) త్వరగా అవుటైన తర్వాత, కెప్టెన్ కేఎల్ రాహుల్కు తగినంత స్ట్రైక్ దొరకలేదని వేణుగోపాల్ అభిప్రాయపడ్డారు. పవర్ప్లేలో రాహుల్ కేవలం 6 బంతులు మాత్రమే ఎదుర్కోగా, వన్ డౌన్లో వచ్చిన నితీష్ రాణా 17 బంతులు ఆడాడు. రాణా టైమింగ్ దొరకక ఇబ్బంది పడటం వల్ల రాహుల్ తన రిథమ్ను కోల్పోయాడని, ఇదే మ్యాచ్ మొమెంటమ్ను ఎస్ఆర్హెచ్ వైపు తిప్పిందని వివరించారు. రాహుల్ 23 బంతుల్లో 37 పరుగులు చేయగా, రాణా 30 బంతుల్లో 57 పరుగులు చేశాడు. స్పెషలిస్ట్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్తో కేవలం రెండు ఓవర్లే వేయించి, పార్ట్ టైమ్ స్పిన్నర్ నితీష్ రాణాతో నాలుగు ఓవర్లు వేయించడంపై వచ్చిన ప్రశ్నలకు వేణుగోపాల్ రావు స్పందిస్తూ.. “ఫీల్డ్ లో కెప్టెన్ తీసుకునే తక్షణ నిర్ణయాలు అవి. టి20ల్లో ఇలాంటి జూదాలు (Gambles) పారితే గొప్ప నిర్ణయాలంటారు, లేదంటే విమర్శలు వస్తాయి” అని వెనకేసుకొచ్చారు.
తాజావార్తలు
-
TG Inter Admissions: పాఠశాల విద్యలో ఇంటర్మీడియట్ విలీనంపై ప్రభుత్వం కీలక నిర్ణయం..
-
Vijay-Trisha: విజయ్-త్రిష పెళ్లి చేసుకుంటే ఆ ఫంక్షన్లో నేనే డాన్స్ చేస్తా.. రాఖీ సావంత్ షాకింగ్ కామెంట్స్!
-
Beetroot Buttermilk Recipe: నిమిషాల్లో బీట్రూట్ మజ్జిగ రెడీ.. ప్రతిరోజూ తాగితే ముఖం మెరిసిపోతుంది..!
-
Tamilanadu CM Vijay: తమిళనాడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన విజయ్.. దశాబ్దాల నాటి డీఎంకే-ఏఐఏడీఎంకే శకానికి తెర
-
Shubman Gill: ఏబీ డి విలియర్స్ను వెనక్కి నెట్టి.. కోహ్లీ, రోహిత్ సైతం సాధించలేని రికార్డ్ క్రియేట్ చేసిన శుభ్మన్ గిల్