SRH IPL 2026: ఓడినా చరిత్ర సృష్టించిన కాటేరమ్మకొడుకులు.. ఐపీఎల్ హిస్టరీలోనే అరుదైన ఎలైట్ లిస్ట్లో చోటు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
SRH IPL 2026: ఐపీఎల్ 2026 సీజన్లో సన్రైజర్స్ హైదరాబాద్ (SRH) ప్రయాణం ముగిసింది. మే 27న ముల్లాన్పూర్ (న్యూ చండీగఢ్) వేదికగా రాజస్థాన్ రాయల్స్తో జరిగిన ఉత్కంఠభరితమైన ఎలిమినేటర్ మ్యాచ్లో హైదరాబాద్ 47 పరుగుల తేడాతో ఓటమిపాలై టోర్నీ నుంచి నిష్క్రమించింది. ఈ సీజన్ మొత్తంలో సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు బ్యాటింగ్లో అద్భుతమైన ప్రదర్శనలు చేసింది. ముఖ్యంగా ఓపెనర్ ఇషాన్ కిషన్, హిట్టర్ హెన్రిచ్ క్లాసెన్ ఇద్దరూ పరుగుల వరద పారించారు. ఈ క్రమంలోనే వీరిద్దరూ ఐపీఎల్ చరిత్రలోనే ఒక అరుదైన ఎలైట్ లిస్ట్లో చోటు సంపాదించుకున్నారు. ఒకే ఐపీఎల్ సీజన్లో ఒకే జట్టు తరఫున ఇద్దరు వేర్వేరు బ్యాటర్లు 600 కంటే ఎక్కువ పరుగులు చేసిన 7వ జోడీగా ఇషాన్ కిషన్ – హెన్రిచ్ క్లాసెన్ రికార్డు సృష్టించారు. ఈ ఇద్దరి పార్ట్నర్షిప్ జట్టుకు మంచి ఊపునిచ్చిందనే చెప్పాలి.
ఒకే ఐపీఎల్ సీజన్లో ఒకే జట్టు నుంచి 600+ పరుగులు పార్ట్నర్షిప్:
క్రిస్ గేల్ & విరాట్ కోహ్లీ (RCB – 2013)
విరాట్ కోహ్లీ & ఏబీ డివిలియర్స్ (RCB – 2016)
రుతురాజ్ గైక్వాడ్ & ఫాఫ్ డు ప్లెసిస్ (CSK – 2021)
విరాట్ కోహ్లీ & ఫాఫ్ డు ప్లెసిస్ (RCB – 2023)
శుభ్మన్ గిల్ & సాయి సుదర్శన్ (GT – 2025)
శుభ్మన్ గిల్ & సాయి సుదర్శన్ (GT – 2026)
హెన్రిచ్ క్లాసెన్ & ఇషాన్ కిషన్ (SRH – 2026)
Also Read
- Angry On Vaibhav: ‘వెళ్లి ఐపీఎల్ ఆడుకోపో.. నీకు అంతర్జాతీయ క్రికెట్ అనవసరం’.. వైభవ్పై తీవ్ర ఆగ్రహం..
- NKR: ‘చిన్న మార్పు చేశాను.. సక్సెస్ అయ్యాను’.. నితీష్ కుమార్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు..
- Vaibhav Batting: ఎట్టకేలకు వైభవ్ బ్యాటింగ్ సీక్రెట్ రివీల్ చేసిన కోచ్.. అందరూ ఇది ఫాలో అవుతారేమో ఇక..
- Kane Williamson: ఆరెంజ్ ఆర్మీ గుండెల్లో ‘కేన్ మామ’.. ఒంటిచేత్తో SRHను ఫైనల్కు చేర్చిన క్షణాలు..
ఎలిమినేటర్ మ్యాచ్ విషయానికి వస్తే.. మొదట బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ రాయల్స్ జట్టు నిర్ణీత ఓవర్లలో 243 పరుగుల భారీ స్కోరు సాధించింది. యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ కేవలం 29 బంతుల్లోనే 97 పరుగులతో విధ్వంసం సృష్టించగా, ధ్రువ్ జురెల్ 21 బంతుల్లో 50 పరుగులతో మెరుపులు మెరిపించాడు. ఆ తర్వాత 244 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన హైదరాబాద్ను రాజస్థాన్ బౌలర్లు సమర్థవంతంగా కట్టడి చేశారు. రాజస్థాన్ స్పీడ్స్టర్ జోఫ్రా ఆర్చర్ తన 4 ఓవర్లలో 58 పరుగులు ఇచ్చినప్పటికీ, కీలకమైన 3 వికెట్లు పడగొట్టి జట్టును ముందుండి నడిపించాడు. అతనికి తోడుగా రవీంద్ర జడేజా, సుశాంత్ మిశ్రా, నాండ్రే బర్గర్ తలో రెండు వికెట్లు తీసుకోగా.. యశ్ రాజ్ పుంజా ఒక వికెట్ సాధించాడు. రాజస్థాన్ బౌలర్ల ధాటికి సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు 196 పరుగులకే పరిమితమై, 47 పరుగుల తేడాతో మ్యాచ్ను చేజార్చుకుంది.
తాజావార్తలు
-
Telangana Congress : కొండా సురేఖ, చిన్నారెడ్డికి షోకాజ్ నోటీసులు.!
-
AP High Court: కోర్టు ఆదేశాలను తేలిగ్గా తీసుకోవద్దు.. అధికారులకు హైకోర్టు వార్నింగ్..
-
OTR : అమరావతిలో MLA క్వార్టర్స్ రెడీ..వైసీపీ ఎమ్మెల్యేలు తీసుకుంటారా?
-
AP Local Body Elections: స్థానిక ఎన్నికలకు డెడ్లైన్.. హైకోర్టుకు ఏపీ ప్రభుత్వం కీలక సమాచారం
-
Star Couple: బిగ్ డెసిషన్ తీసుకున్న బాలీవుడ్ స్టార్ కపుల్.. నిర్మాతలుగా మారుతున్న సిద్ధార్థ్ మల్హోత్రా, కియారా!
ట్రెండింగ్
-
Shubman Gill: విజయం సాధిస్తామా లేదా అని చాలా టెన్షన్ పడ్డా.. ఆ ఇద్దరి వల్లే ఈ గెలుపు సాధ్యమైంది!
-
7900mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో Redmi M100 లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!
-
MS Dhoni-CSK: సీఎస్కే అభిమానులకు శుభవార్త.. ఇక అంతా ఎంఎస్ ధోనీనే!
-
8000mAh బ్యాటరీ, 144Hz డిస్ప్లేతో ఆగస్టు 26న వచ్చేస్తోన్న Realme P4s 5G..!
-
Green Chillies at Home: మార్కెట్ మిరపకాయలకు బై.. బై.. ఇంటి కుండీలోనే తాజా పచ్చిమిరపకాయలు పెంచండి ఇలా.!