RCB Fans: కప్ గెలిచిన ఆనందం కొన్ని క్షణాలు కూడా లేకపాయే.. ఆర్సీబీ ఫ్యాన్స్కు బ్యాడ్ న్యూస్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) జట్టు వరుసగా రెండోసారి ఐపీఎల్ (IPL 2026) ట్రోఫీని గెలుచుకుని సరికొత్త చరిత్ర సృష్టించింది. అహ్మదాబాద్లో జరిగిన హోరాహోరీ ఫైనల్ మ్యాచ్లో గుజరాత్ టైటాన్స్ జట్టుపై ఆర్సీబీ ఘన విజయం సాధించింది. టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ చేసిన గుజరాత్ జట్టును ఆర్సీబీ బౌలర్లు తక్కువ పరుగులకే కట్టడి చేశారు. 156 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన బెంగళూరు జట్టు కేవలం 18 ఓవర్లలోనే 5 వికెట్లు కోల్పోయి విజయాన్ని అందుకుంది. స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ కేవలం 42 బంతుల్లోనే 75 పరుగులు చేసి నాటౌట్గా నిలిచి జట్టును గెలిపించాడు. రజత్ పటీదార్ కెప్టెన్సీలో ఆర్సీబీ ఈ ఘనత సాధించింది. ఐపీఎల్ చరిత్రలో చెన్నై సూపర్ కింగ్స్, ముంబై ఇండియన్స్ తర్వాత వరుసగా రెండుసార్లు టైటిల్ గెలిచిన మూడో జట్టుగా ఆర్సీబీ నిలిచింది.
అయితే.. ఈ గొప్ప విజయం సాధించినప్పటికీ బెంగళూరు నగరంలో ఎలాంటి ‘విజయ యాత్ర’ (విక్టరీ పరేడ్) నిర్వహించట్లేదని ఆర్సీబీ యాజమాన్యం స్పష్టం చేసింది. అభిమానులంతా తమ ఇళ్లలోనే ఉండి, కుటుంబ సభ్యులతో కలిసి ఈ సంతోషాన్ని జరుపుకోవాలని సోషల్ మీడియా ద్వారా కోరింది.
Also Read
- Angry On Vaibhav: ‘వెళ్లి ఐపీఎల్ ఆడుకోపో.. నీకు అంతర్జాతీయ క్రికెట్ అనవసరం’.. వైభవ్పై తీవ్ర ఆగ్రహం..
- NKR: ‘చిన్న మార్పు చేశాను.. సక్సెస్ అయ్యాను’.. నితీష్ కుమార్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు..
- Vaibhav Batting: ఎట్టకేలకు వైభవ్ బ్యాటింగ్ సీక్రెట్ రివీల్ చేసిన కోచ్.. అందరూ ఇది ఫాలో అవుతారేమో ఇక..
- Kane Williamson: ఆరెంజ్ ఆర్మీ గుండెల్లో ‘కేన్ మామ’.. ఒంటిచేత్తో SRHను ఫైనల్కు చేర్చిన క్షణాలు..
What a night. What a feeling. 🥹
To every member of the RCB nation, congratulations. This is YOUR win. 🏆❤️
As the celebrations begin, let’s be responsible. 🙌
Best way to celebrate is with your loved ones. Relive the memories, and enjoy this special moment from the comfort of… pic.twitter.com/hdGO3n115a
— Royal Challengers Bengaluru (@RCBTweets) May 31, 2026
ఈ నిర్ణయం వెనుక ఒక బాధాకరమైన కారణం ఉంది. జూన్ 2025లో ఆర్సీబీ మొదటిసారి ఐపీఎల్ కప్పు గెలిచినప్పుడు, బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం బయట అభిమానులు భారీ సంఖ్యలో గుమిగూడారు. ఆ సమయంలో జరిగిన తొక్కిసలాటలో 11 మంది ప్రాణాలు కోల్పోయారు. ఆ చేదు జ్ఞాపకాలు, భద్రతా కారణాలను మనసులో ఉంచుకుని, ఈసారి అలాంటి ప్రమాదాలు జరగకూడదనే ఉద్దేశంతో యాజమాన్యం రోడ్లపై వేడుకలను రద్దు చేసింది. అభిమానుల ప్రాణాల రక్షణే తమకు ముఖ్యమని చెప్తూ, అందరూ బాధ్యతాయుతంగా ఇళ్లలోనే పండగ చేసుకోవాలని ఆర్సీబీ కోరింది.
తాజావార్తలు
-
The Tatas Web Series: టాటా సామ్రాజ్యం కథ వెబ్ సిరీస్గా.. నాలుగు తరాల చరిత్రతో ‘ది టాటాస్’
-
IMD Weather Alert: దేశవ్యాప్తంగా భారీ వర్షాలు.. ఉత్తరాదిన కుండపోత వానలు
-
Manmadha Re-Release: శింబు కల్ట్ రొమాంటిక్ క్రైమ్ థ్రిల్లర్ ‘మన్మధ’ రీ-రిలీజ్ డేట్ ఫిక్స్.!
-
Iran: ఖమేనీ నివాసంపై దాడి దృశ్యాలు విడుదల.. అంత్యక్రియల వేళ ఇరాన్ సంచలన వీడియో!
-
Lenin Censor Talk : ‘లెనిన్’ సెన్సార్ టాక్.. పెద్ది లాంటి షాకింగ్ ట్విస్ట్ ఉంటుందట
ట్రెండింగ్
-
Jio నుంచి గేమ్ ఛేంజింగ్ ప్లాన్.. 1,000+ టీవీ ఛానెల్స్, 150 ప్రీమియం ఛానెల్స్ కేవలం రూ.55కే.!
-
Viral News: చిన్న పొదుపుతో తీరిన పెద్ద కల.. రూ.10 నాణేలతో రూ.1.10 లక్షల బైక్ కొనుగోలు.!
-
6500mAh బ్యాటరీ, IP65 రేటింగ్తో రానున్న Vivo T5 Lite 5G.!
-
బడ్జెట్లో ప్రీమియం అనుభవం.. 50MP Sony కెమెరా, 7000mAh బ్యాటరీ, మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీతో Moto g77 Power భారత్లో లాంచ్.!
-
Pandu Mirapakaya Pachadi: ఏడాది పాటు నిల్వ ఉండే టేస్టీ ‘పండు మిరపకాయ పచ్చడి’.. ఈ కొలతలు ఫాలో అయితే చాలు!