RCB Fans: కప్ గెలిచిన ఆనందం కొన్ని క్షణాలు కూడా లేకపాయే.. ఆర్సీబీ ఫ్యాన్స్కు బ్యాడ్ న్యూస్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) జట్టు వరుసగా రెండోసారి ఐపీఎల్ (IPL 2026) ట్రోఫీని గెలుచుకుని సరికొత్త చరిత్ర సృష్టించింది. అహ్మదాబాద్లో జరిగిన హోరాహోరీ ఫైనల్ మ్యాచ్లో గుజరాత్ టైటాన్స్ జట్టుపై ఆర్సీబీ ఘన విజయం సాధించింది. టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ చేసిన గుజరాత్ జట్టును ఆర్సీబీ బౌలర్లు తక్కువ పరుగులకే కట్టడి చేశారు. 156 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన బెంగళూరు జట్టు కేవలం 18 ఓవర్లలోనే 5 వికెట్లు కోల్పోయి విజయాన్ని అందుకుంది. స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ కేవలం 42 బంతుల్లోనే 75 పరుగులు చేసి నాటౌట్గా నిలిచి జట్టును గెలిపించాడు. రజత్ పటీదార్ కెప్టెన్సీలో ఆర్సీబీ ఈ ఘనత సాధించింది. ఐపీఎల్ చరిత్రలో చెన్నై సూపర్ కింగ్స్, ముంబై ఇండియన్స్ తర్వాత వరుసగా రెండుసార్లు టైటిల్ గెలిచిన మూడో జట్టుగా ఆర్సీబీ నిలిచింది.
అయితే.. ఈ గొప్ప విజయం సాధించినప్పటికీ బెంగళూరు నగరంలో ఎలాంటి ‘విజయ యాత్ర’ (విక్టరీ పరేడ్) నిర్వహించట్లేదని ఆర్సీబీ యాజమాన్యం స్పష్టం చేసింది. అభిమానులంతా తమ ఇళ్లలోనే ఉండి, కుటుంబ సభ్యులతో కలిసి ఈ సంతోషాన్ని జరుపుకోవాలని సోషల్ మీడియా ద్వారా కోరింది.
Also Read
- Angry On Vaibhav: ‘వెళ్లి ఐపీఎల్ ఆడుకోపో.. నీకు అంతర్జాతీయ క్రికెట్ అనవసరం’.. వైభవ్పై తీవ్ర ఆగ్రహం..
- NKR: ‘చిన్న మార్పు చేశాను.. సక్సెస్ అయ్యాను’.. నితీష్ కుమార్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు..
- Vaibhav Batting: ఎట్టకేలకు వైభవ్ బ్యాటింగ్ సీక్రెట్ రివీల్ చేసిన కోచ్.. అందరూ ఇది ఫాలో అవుతారేమో ఇక..
- Kane Williamson: ఆరెంజ్ ఆర్మీ గుండెల్లో ‘కేన్ మామ’.. ఒంటిచేత్తో SRHను ఫైనల్కు చేర్చిన క్షణాలు..
What a night. What a feeling. 🥹
To every member of the RCB nation, congratulations. This is YOUR win. 🏆❤️
As the celebrations begin, let’s be responsible. 🙌
Best way to celebrate is with your loved ones. Relive the memories, and enjoy this special moment from the comfort of… pic.twitter.com/hdGO3n115a
— Royal Challengers Bengaluru (@RCBTweets) May 31, 2026
ఈ నిర్ణయం వెనుక ఒక బాధాకరమైన కారణం ఉంది. జూన్ 2025లో ఆర్సీబీ మొదటిసారి ఐపీఎల్ కప్పు గెలిచినప్పుడు, బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం బయట అభిమానులు భారీ సంఖ్యలో గుమిగూడారు. ఆ సమయంలో జరిగిన తొక్కిసలాటలో 11 మంది ప్రాణాలు కోల్పోయారు. ఆ చేదు జ్ఞాపకాలు, భద్రతా కారణాలను మనసులో ఉంచుకుని, ఈసారి అలాంటి ప్రమాదాలు జరగకూడదనే ఉద్దేశంతో యాజమాన్యం రోడ్లపై వేడుకలను రద్దు చేసింది. అభిమానుల ప్రాణాల రక్షణే తమకు ముఖ్యమని చెప్తూ, అందరూ బాధ్యతాయుతంగా ఇళ్లలోనే పండగ చేసుకోవాలని ఆర్సీబీ కోరింది.
తాజావార్తలు
-
Bihar Crime: బట్టలూడదీసి.. నగ్నంగా…! భర్తను లవర్తో కలిసి కడతేర్చిన భార్య ఎపిసోడ్లో ట్విస్ట్
-
MINI Cooper Convertible Stardust Edition: మినీ కూపర్ కన్వర్టిబుల్ స్టార్డస్ట్ ఎడిషన్ విడుదల.. ధర, ఫీచర్లు ఇవే!
-
CJP: కాక్రోచ్ పార్టీ నిరసనల్లో 2873 మంది క్రిమినల్స్.. కేంద్రం కీలక ప్రకటన..
-
Akhil Akkineni : వంద కోట్ల క్లబ్లో అయ్యగారు.. అఫీషియల్ పోస్టర్ రిలీజ్ చేసిన మేకర్స్
-
Srinivasa Mangapuram OTT: మహేష్ మేనల్లుడు డిజిటల్ ఎంట్రీ.. రిలీజ్ రోజే ఓటీటీ డీల్ ఫిక్స్ చేసుకున్న ‘శ్రీనివాస మంగపురం’
ట్రెండింగ్
-
Ajinkya Rahane: అజింక్య అంటే ఓడిపోనివాడు.. కానీ క్రికెట్ ఎన్నో ఓటములను చూపించింది!
-
Ajinkya Rahane Retirement: అజింక్య రహానే రిటైర్మెంట్.. ఇకపై క్రికెట్ ఆడనంటూ భావోద్వేగ పోస్ట్!
-
Vaibhav Sooryavanshi: నేను ఏ బౌలర్కు భయపడను.. వారే నన్ను చూసి వణికిపోతున్నారు!
-
Health Tips : వర్షాకాలంలో గొంతు నొప్పా? ఈ అల్లం-బెల్లం కషాయం ట్రై చేయండి.!
-
Protein Tips : పనీర్ తింటున్నారా? పచ్చిదా.. వండిందా.. ఏది బెస్ట్.?