IPL 2026లో కొంపముంచుతున్న క్యాచ్ డ్రాప్లు.. మారిపోతున్న మ్యాచ్ల లెక్కలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
IPL 2026: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2026 సీజన్లో ఒక ఆశ్చర్యకరమైన ధోరణి కనిపిస్తోంది. భారీ స్కోర్లు, ఉత్కంఠభరిత పోరాటాలు, చివరి బంతి వరకు సస్పెన్స్ మధ్య మరో అంశం ప్రతి మ్యాచ్ను ప్రభావితం చేస్తోంది. అదే క్యాచ్ డ్రాప్లు. ఫీల్డర్లు జారవిడుస్తున్న సులభమైన క్యాచ్లు మ్యాచ్ ఫలితాలను పూర్తిగా మార్చేస్తున్నాయి. ఈ సీజన్లో క్యాచ్లు వదిలేయడం జట్లకు పెద్ద తలనొప్పిగా మారింది. ఒక లైఫ్ ఇచ్చిన ఆటగాడు తర్వాత సెంచరీ చేయడం, మ్యాచ్ను ఒంటిచేత్తో గెలిపించడం వంటి ఘటనలు వరుసగా జరుగుతున్నాయి. దీంతో ఫీల్డింగ్ లోపాలు జట్ల విజయావకాశాలను దెబ్బతీస్తున్నాయి.
కేఎల్ రాహుల్ ఇన్నింగ్స్కు కారణమైన డ్రాప్ క్యాచ్
అరుణ్ జైట్లీ స్టేడియంలో ఢిల్లీ క్యాపిటల్స్, పంజాబ్ కింగ్స్ మధ్య జరిగిన మ్యాచ్ దీనికి తాజా ఉదాహరణ. ఢిల్లీ జట్టు 264 పరుగుల భారీ స్కోరు నమోదు చేసింది. ఇందులో కేఎల్ రాహుల్ 152 పరుగులతో అద్భుత ఇన్నింగ్స్ ఆడాడు. అయితే, మూడో ఓవర్లోనే శశాంక్ సింగ్ సులభమైన క్యాచ్ను జారవిడవడంతో రాహుల్కు లైఫ్ లభించింది. ఆ తర్వాత అతడు ప్రత్యర్థి బౌలర్లపై విరుచుకుపడి భారీ స్కోరు నమోదు చేశాడు.
Also Read
- CSK vs LSG: నేడు చెపాక్లో అసలైన యుద్ధం.. ఈ మ్యాచ్లో అయిన ధోనీ ఉంటాడా?
- IPL 2026: ఆర్సీబీకి తలనొప్పిగా మారిన ఇద్దరు స్టార్ ప్లేయర్లు.. కోట్లు ఖర్చు చేసినా ఫలితం శూన్యం..!
- CSK: విజయ్ ప్రమాణ స్వీకారం వేళ.. అభిమానులకు చెన్నై సూపర్ కింగ్స్ ప్రత్యేక సందేశం!
- Shubman Gill: ఏబీ డి విలియర్స్ను వెనక్కి నెట్టి.. కోహ్లీ, రోహిత్ సైతం సాధించలేని రికార్డ్ క్రియేట్ చేసిన శుభ్మన్ గిల్
శ్రేయస్ అయ్యర్ రికార్డు ఛేజ్ వెనుక కూడా అదే కారణం
ఈ మ్యాచ్లో పంజాబ్ ఫీల్డర్లు మాత్రమే కాదు, ఢిల్లీ జట్టు కూడా అనేక క్యాచ్లు వదిలేసింది. మొత్తం ఆరు అవకాశాలను జారవిడిచినట్లు సమాచారం. 15వ ఓవర్లో కరుణ్ నాయర్ ఇచ్చిన క్యాచ్ను వదిలేయడంతో శ్రేయస్ అయ్యర్ ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని జట్టును విజయానికి చేర్చాడు.
పడిపోతున్న ఫీల్డింగ్ ప్రమాణాలు
నిపుణుల ప్రకారం ఇది ఒక్కసారిగా వచ్చిన సమస్య కాదు. గణాంకాలు చూస్తే 2020లో ప్రతి 100 క్యాచ్లలో 85 క్యాచ్లు పట్టేవారు. కానీ 2025 నాటికి ఆ సంఖ్య 76కు పడిపోయింది. ప్రస్తుత సీజన్లో ఇది మరింత తగ్గే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.
ఒకే రోజులో 17 క్యాచ్లు డ్రాప్
ఏప్రిల్ 25న జరిగిన మ్యాచ్ల్లో మొత్తం 17 క్యాచ్లు జారవిడవడం ఈ సమస్య తీవ్రతను చూపిస్తోంది. జైపూర్లో రాజస్థాన్ రాయల్స్, సన్రైజర్స్ హైదరాబాద్ మ్యాచ్లో కూడా సులభమైన అవకాశాలు వదిలేయడంతో 229 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించడం సాధ్యమైంది.
అలసట, బిజీ షెడ్యూల్ ప్రధాన కారణాలు
మాజీ ఆటగాళ్లు ఈ పరిస్థితికి ప్రధాన కారణంగా తీరికలేని క్రికెట్ క్యాలెండర్ను చెబుతున్నారు. ఐసీసీ టోర్నీలు, ఫ్రాంచైజీ లీగ్లు, ద్వైపాక్షిక సిరీస్ల మధ్య ఆటగాళ్లకు సరైన విశ్రాంతి దొరకడం లేదు. ఇటీవలే టీ20 వరల్డ్ కప్ ముగియడంతో చాలామంది ఆటగాళ్లు శారీరకంగా, మానసికంగా అలసిపోయి ఉన్నారని అంటున్నారు.
తీవ్రమైన వేడి కూడా ప్రభావం
దేశంలోని అనేక నగరాల్లో పెరుగుతున్న ఎండలు కూడా ఫీల్డింగ్పై ప్రభావం చూపుతున్నాయి. ఎత్తుగా వచ్చే బంతులను గమనించడం కష్టమవుతోంది. డీహైడ్రేషన్, అలసట, ఏకాగ్రత లోపం కారణంగా తప్పిదాలు పెరుగుతున్నాయి. ఇక, భారత మాజీ ఫీల్డర్ మహమ్మద్ కైఫ్ మాట్లాడుతూ, ఫీల్డింగ్ మెరుగుపరచుకోవాలంటే నిరంతర సాధన అవసరమని అన్నారు. కానీ ప్రస్తుత షెడ్యూల్లో ఆటగాళ్లకు అందుకు సమయం దొరకడం లేదని స్పష్టం చేశారు.
చిన్న తప్పిదమే పెద్ద ఫలితం
క్యాచ్ డ్రాప్ అనేది కేవలం ఒక చిన్న తప్పిదంలా కనిపించినా, అది మ్యాచ్ ఫలితాన్ని పూర్తిగా మార్చేస్తోంది. IPL లాంటి ఒత్తిడితో కూడిన టోర్నీలో ఒక అవకాశం ఇచ్చినా ప్రత్యర్థి దాన్ని భారీగా మలుచుకుంటున్నాడు. అందుకే ఈ సీజన్లో క్యాచ్లు జారవిడవడం జట్లకు కొంపముంచే సమస్యగా మారింది.. ఎన్నో జట్లకు విజయాన్ని అందించింది.. దీంతో, ప్రత్యర్థి జట్లు చతికిలపడిపోయిన పరిస్థితి..
తాజావార్తలు
-
CM Vijay: తమిళనాడు సీఎంగా దళపతి విజయ్ .. ‘జన నాయగన్’ సినిమా రిలీజ్ ఎప్పుడంటే?
-
Hantavirus Outbreak: హంటావైరస్ కలకలం.. లక్షణాలు, చికిత్సపై WHO కీలక హెచ్చరిక.. కొత్త మహమ్మారిగా మారుతుందా..?
-
PM Modi: పరాన్నజీవి కాంగ్రెస్, డీఎంకేను వెన్నుపోటు పొడిచింది.. ప్రధాని మోడీ ఫైర్..
-
CSK vs LSG: నేడు చెపాక్లో అసలైన యుద్ధం.. ఈ మ్యాచ్లో అయిన ధోనీ ఉంటాడా?
-
IPL 2026: ఆర్సీబీకి తలనొప్పిగా మారిన ఇద్దరు స్టార్ ప్లేయర్లు.. కోట్లు ఖర్చు చేసినా ఫలితం శూన్యం..!