IPL Playoffs Scenarios: ప్లేఆఫ్స్ రేసు మరింత ఆసక్తికరం.. ఆర్ఆర్ కంటే సీఎస్కేకు ఛాన్సెస్.. ఆ 3 జట్లకు మాత్రం!
- ఐపీఎల్ 2026 ప్లేఆఫ్స్ రేసు మరింత ఆసక్తికరం
- ఇప్పటివరకు ఒక్క జట్టు కూడా ప్లేఆఫ్స్కు అర్హత సాధించలేదు
- ఆర్ఆర్ కంటే సీఎస్కేకు ప్లేఆఫ్స్ ఛాన్సెస్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్ ప్లేఆఫ్స్ రేసు చివరి దశకు చేరుకోవడంతో.. పోటీ మరింత ఉత్కంఠభరితంగా మారింది. లీగ్ దశ ముగియడానికి రెండు వారాల కంటే తక్కువ సమయం మాత్రమే మిగిలి ఉన్నా.. ఇప్పటివరకు ఒక్క జట్టు కూడా అధికారికంగా ప్లేఆఫ్స్కు అర్హత సాధించలేదు. ప్రస్తుతం రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ), సన్రైజర్స్ హైదరాబాద్ (ఎస్ఆర్హెచ్), గుజరాత్ టైటాన్స్ (జీటీ) జట్లు 11 మ్యాచ్లలో 14 పాయింట్లతో టాప్లో కొనసాగుతున్నాయి. పంజాబ్ కింగ్స్ 11 మ్యాచ్లలో 13 పాయింట్లతో నాలుగో స్థానంలో ఉంది. ఇక చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్కే), రాజస్థాన్ రాయల్స్ (ఆర్ఆర్) జట్లు 12 పాయింట్లతో వరుసగా ఐదో, ఆరో స్థానాల్లో నిలిచాయి.
ఢిల్లీ క్యాపిటల్స్ (డీసీ), కోల్కతా నైట్ రైడర్స్ (కేకేఆర్) జట్లకు కూడా ప్లేఆఫ్స్ అవకాశాలు పూర్తిగా ముగియలేదు. ఢిల్లీకి 12 మ్యాచ్ల్లో 10 పాయింట్లు ఉండగా.. కేకేఆర్ 10 మ్యాచ్ల్లో 9 పాయింట్లతో ఉంది. అయితే ముంబై ఇండియన్స్, లక్నో సూపర్ జెయింట్స్ మాత్రం ఇప్పటికే ప్లేఆఫ్స్ రేసు నుంచి అధికారికంగా తప్పుకున్నాయి. ప్రతి జట్టు లీగ్ దశలో మొత్తం 14 మ్యాచ్లు ఆడనుండటంతో చివరి వరకు సమీకరణాలు మారే అవకాశం ఉంది.
Also Read
- Vaibhav Sooryavanshi: రికార్డుల మోత మోగిస్తున్న సూర్యవంశీ.. ఐపీఎల్ చరిత్రలో ఒకే ఒక్కడు..
- Vaibhav Sooryavanshi: విరాట్ కోహ్లీ రికార్డు బద్దలు కొట్టిన వైభవ్ సూర్యవంశీ.. విధ్వంసం స్పష్టిస్తున్న బుడ్డోడు..
- RR Vs GT: రాజస్థాన్ రాయల్స్ బ్యాటింగ్.. ఆ రికార్డుపై గురిపెట్టిన వైభవ్..
- Rishabh Pant: రూ.27 కోట్ల పంత్ ఫెయిల్.. LSG కెప్టెన్సీకి గుడ్బై
ఐపీఎల్ 10 జట్ల టోర్నీగా మారిన తర్వాత ప్లేఆఫ్స్కు అర్హత సాధించడానికి సాధారణంగా 16 పాయింట్లను ‘మ్యాజిక్ నంబర్’గా భావిస్తున్నారు. 2022లో ఆర్సీబీ, 2023లో ముంబై, 2025లో మరోసారి ముంబై 16 పాయింట్లతో నాలుగో స్థానంలో నిలిచి ప్లేఆఫ్స్ చేరాయి. అయితే 2024లో మాత్రం 14 పాయింట్లతో నాలుగు జట్లు సమానంగా నిలిచాయి. ఆ సమయంలో మెరుగైన నెట్ రన్రేట్ కారణంగా ఆర్సీబీ ప్లేఆఫ్స్ బెర్త్ దక్కించుకుంది. అధికారిక ప్లేఆఫ్స్కు పాయింట్స్ 18 అని తెలిసిన విషయమే.
ఐపీఎల్ అధికారిక బ్రాడ్కాస్టర్ల అంచనాల ప్రకారం.. ప్రస్తుతం గుజరాత్ టైటాన్స్, ఆర్సీబీ, సన్రైజర్స్ హైదరాబాద్ జట్లకు ప్లేఆఫ్స్ చేరే అవకాశాలు 80 శాతం ఉన్నాయి. పంజాబ్ కింగ్స్కు 62.5 శాతం అవకాశం ఉండగా.. చెన్నై సూపర్ కింగ్స్కు 42.7 శాతం, రాజస్థాన్ రాయల్స్కు 41.8 శాతం అవకాశాలు ఉన్నట్లు అంచనా. ఇక కేకేఆర్కు కేవలం 11.6 శాతం, ఢిల్లీ క్యాపిటల్స్కు 1.2 శాతం మాత్రమే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. ఆర్సీబీ, ఎస్ఆర్హెచ్, జీటీ టీమ్స్ ప్లేఆఫ్స్కు చేరడం దాదాపుగా ఖాయం. ముగిలిన ఒక్క స్థానం కోసం పంజాబ్, చెన్నై, రాజస్థాన్ పోటీ పడనున్నాయి. ఈ మూడింటిలో పంజాబ్ రేసులో ముందుంది. చూడాలి మరి ఏ టీమ్స్ ప్లేఆఫ్స్కు చేరుతాయో.
తాజావార్తలు
-
Trump: వైట్హౌస్ సిట్యుయేషన్ రూమ్లో కీలక భేటీ.. శాంతి ఒప్పందంపై తేల్చేయనున్న ట్రంప్
-
Vaibhav Sooryavanshi: రికార్డుల మోత మోగిస్తున్న సూర్యవంశీ.. ఐపీఎల్ చరిత్రలో ఒకే ఒక్కడు..
-
Honor X80: 10,000mAh భారీ బ్యాటరీతో హానర్ X80 వచ్చేస్తోంది.. పవర్ఫుల్ ఫీచర్లు హైలైట్!
-
Jagapathi Babu: “నాకు యాక్టింగ్ తప్ప ఇంకేం రాదు.. ఆ విషయంలో నేను జీరో”: జగపతి బాబు
-
Kitchen Hacks : మిక్సీ జార్ వేడెక్కుతుందా..? ఈ చిన్న తప్పే మసాలా రుచి పాడుచేస్తోంది.!
ట్రెండింగ్
-
Tea Ranking : ప్రపంచాన్ని గెలిచిన భారతీయ చాయ్.. ‘నంబర్ 1’గా మసాలా టీ రికార్డ్..!
-
Pachimirchi Avakaya: సీజన్తో పనిలేదు.. మామిడి ఆవకాయకు గట్టి పోటీ ఇచ్చే ‘పచ్చిమిర్చి ఆవకాయ’.! తింటే వావ్ అనాల్సిందే..
-
షియోమీ నుంచి కొత్త గాడ్జెట్స్ వచ్చేశాయ్.. Xiaomi Watch S5, Smart Band 10 Pro, Buds 6 లాంచ్.!
-
120x AI అల్ట్రా జూమ్ కెమెరాలు, 144Hz AMOLED డిస్ప్లే, 8K వీడియో రికార్డింగ్ వంటి ప్రీమియం ఫీచర్లతో Xiaomi 17T, 17T Pro లాంచ్..
-
AC Tips : ఏసీని పదేపదే ఆన్ చేసి ఆఫ్ చేస్తే ఏమవుతుంది.?