IPL 2026: ఐపీఎల్ 2026లో మజా లేదు.. ఆ సమరం ఎక్కడ అంటున్న ఫాన్స్?
- వరుసగా నమోదవుతున్న భారీ స్కోర్లు
- 38 మ్యాచ్లలో 200కి పైగా స్కోర్లు
- పిచ్లు పూర్తిగా బ్యాటింగ్కు అనుకూలం
- బౌలర్ల పరిస్థితి మరీ దారుణం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్లో భారీ స్కోర్లు వరుసగా నమోదవుతున్నాయి. ఇప్పటివరకు ఈ సీజన్లో మొత్తం 62 మ్యాచ్లు పూర్తికాగా.. వాటిలో 38 మ్యాచ్లలో 200కి పైగా స్కోర్లు నమోదయ్యాయి. అంతేకాదు భారీ లక్ష్యాలను కూడా జట్లు చాలా ఈజీగా ఛేదిస్తున్నాయి. కేవలం 24 మ్యాచ్ల్లో మాత్రమే స్కోర్లు 170-180 మధ్యలో ఆగాయి. ఈ గణాంకాలే.. ప్రస్తుత ఐపీఎల్లో భారత పిచ్లు ఎంతలా బ్యాటింగ్కు అనుకూలిస్తున్నాయో స్పష్టంగా చెబుతున్నాయి.
ఐపీఎల్ 2026లో దాదాపుగా అన్ని మైదానాల్లో బౌలర్లకు ఏమాత్రం సహకారం లభించడం లేదు. పిచ్ల నుంచి స్వింగ్ లేదు, సీమర్లకు మూవ్మెంట్ లేదు, స్పిన్నర్లకు గ్రిప్ లేదు. దీంతో బౌలర్లు పూర్తిగా తేలిపోతున్నారు. దాంతో సిక్సర్లు, ఫోర్ల వర్షం కురుస్తోంది. ఈ నేపథ్యంలో మ్యాచ్లు ఏకపక్షంగా మారుతున్నాయనే విమర్శలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా కొన్ని జట్ల బ్యాటర్లు.. బౌలర్లను నెట్ ప్రాక్టీస్లో బాదినట్లుగా ఉందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. తాజాగా ఢిల్లీ క్యాపిటల్స్తో జరిగిన మ్యాచ్లో రాజస్థాన్ రాయల్స్ బ్యాటర్లు ఆడిన తీరు కూడా ఈ చర్చకు కారణమైంది.
Also Read
- Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీ బలహీనత బయటపడిందా?.. రాజస్థాన్ కోచ్ ఆసక్తికర వ్యాఖ్యలు!
- Virat Kohli: కోహ్లీ ‘స్టంప్ మైక్’ సీక్రెట్ లీక్.. పంజాబ్ను దెబ్బకొట్టిన ఆర్సీబీ వ్యూహం.. ప్లేఆఫ్స్ వేళ సరికొత్త చర్చ..
- IPL 2026 playoff scenarios: నేడు కీలక మ్యాచ్.. సీఎస్కే-ఎస్ఆర్హెచ్ పోరుతో మారనున్న ప్లేఆఫ్స్ సమీకరణాలు!
- PBKS-Dharamsala: పంజాబ్ కింగ్స్ కొంపముంచిన ధర్మశాల.. ప్రత్యర్థి జట్లకు మాత్రం అదృష్ట వేదిక!
ఐపీఎల్ 2026లో బ్యాటర్లు దూకుడుగా బ్యాటింగ్ చేయడం అభిమానులను ఆశ్చర్యపరిచింది. అయితే దీనికి పూర్తిగా బౌలర్లనే బాధ్యులను చేయడం సరైంది కాదని క్రికెట్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. పిచ్లలో బౌలర్లకు కనీస సహకారం లేకపోవడంతో వారు తమ ప్రణాళికలను అమలు చేయలేకపోతున్నారు. ఈ సీజన్లో అభిమానులను ఉత్కంఠకు గురిచేసిన మ్యాచ్లు 170-180 స్కోర్లవే. ఆ మ్యాచ్ల్లోనే బ్యాట్, బాల్ మధ్య అసలైన సమరం కనిపించింది. ఒత్తిడి, వ్యూహాలు, క్లోజ్ ఫినిష్లు.. ఇలా టీ20 క్రికెట్కు కావాల్సిన అసలైన థ్రిల్ ఈ మ్యాచ్ల్లోనే కనిపించిందని అభిమానులు చెబుతున్నారు. కానీ ప్రతి మ్యాచ్ కూడా 220-230 పరుగుల పండుగగా మారిపోతే.. బౌలర్ల ప్రాధాన్యం పూర్తిగా తగ్గిపోతుందని ఆందోళన వ్యక్తమవుతోంది.
టీ20 క్రికెట్ అసలు మజా బ్యాటర్లు మాత్రమే ఆధిపత్యం చెలాయించినప్పుడు కాదు.. బౌలర్లు కూడా మ్యాచ్ను మలుపు తిప్పగలిగినప్పుడు వస్తుందని అభిమానులు అంటున్నారు. బ్యాట్, బాల్ మధ్య మంచి సమరం ఉన్నప్పుడే మ్యాచ్లు మరింత ఆసక్తికరంగా మారతాయి. ఒకప్పుడు 120-150 పరుగులను కూడా పలు టీమ్స్ కాపాడుకున్నాయని ఫాన్స్ గుర్తుచేస్తున్నారు. అప్పట్లో 180-200 స్కోర్ ఉంటే విజయంపై ధీమా ఉండేదని చెబుతున్నారు. ఐపీఎల్ నిర్వాహకులు, పిచ్ క్యూరేటర్లు ఈ విషయంపై దృష్టి పెట్టాలని మాజీ క్రికెటర్లు, అభిమానులు కోరుతున్నారు.
తాజావార్తలు
-
IPL 2026: ఐపీఎల్ 2026లో మజా లేదు.. ఆ సమరం ఎక్కడ అంటున్న ఫాన్స్?
-
GR Gopinath: రూపాయికే విమాన టికెట్.. సామాన్యుడి విమాన కల నిజం చేసిన వ్యక్తి కథ ఇది! ఆయన ఎవరో తెలుసా?
-
AP Heatwave Alert: ఏపీలో ఎండల తీవ్రత.. వారం రోజుల పాటు హీట్వేవ్స్ హెచ్చరిక
-
Hyderabad Traffic Alert: ఉప్పల్ రింగ్ రోడ్డు క్లోజ్.. నగర, వరంగల్-హైదరాబాద్ ప్రయాణికులకు రూట్ మ్యాప్ ఇదే..
-
Explainer: పిడుగులు చంపుతున్నాయ్.. తెలుగు రాష్ట్రాలకు డేంజర్ అలెర్ట్!
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..