E20 petrol: భారత ‘‘E20 పెట్రోల్’’ను తిరస్కరించిన భూటాన్.. అసలు కారణం ఇదే..
- భారత్ ప్రతిపాదించిన E20 పెట్రోల్ను తిరస్కరించిన భూటాన్.
- పాత ఇంధన నిల్వ ట్యాంకులు, అధిక తేమ ప్రధాన కారణాలు.
- పర్వత ప్రాంతాల్లో E20 పనితీరుపై కూడా భూటాన్ ఆందోళన.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
E20 petrol: E20 పెట్రోల్పై భారత్లో తీవ్ర చర్చ జరుగుతోంది. వాహనాలను దెబ్బతీస్తోందని పలువురు ఈ పెట్రోల్ను వ్యతిరేకిస్తున్నారు. ఇదే సమయంలో భారత్ E20 పెట్రోల్ను భూటాన్కు ఎగుమతి చేయాలని భావించింది. అయితే, ఈ ప్రతిపాదనను భూటాన్ సున్నితంగా తిరస్కరించిందని ‘‘ది భూటానీస్’’ వార్తాపత్రిక నివేదించింది. భారత మార్కెట్లో సాధారణ పెట్రోల్ అందుబాటులో ఉన్నంత కాలం తమకు దానినే సరఫరా చేయాలని కోరింది.
అసలు కారణం ఇదే:
వాస్తవానికి భూటాన్ E20 పెట్రోల్ తిరస్కరించడానికి కారణం వేరేలా ఉంది. భూటాన్ దేశంలో ఇప్పటికీ పాతబడిన, బలహీనమైన ఇంధన నిల్వ మౌలిక సదుపాయాలే ఉన్నాయి. దేశంలో చాలా ఇంధన ట్యాంకులు భూగర్భంలోనే ఉన్నాయి. దీనివల్ల E20 పెట్రోల్ను నిల్వ చేయడం కష్టమవుతుంది. శాస్త్రీయంగా, ఇథనాల్లో హైడ్రాక్సిల్ గ్రూప్ ఉంటుంది, ఇది దానిని అత్యంత హైగ్రోస్కోపిక్గా చేస్తుంది, అంటే అది వాతావరణం నుండి తేమను సులభంగా గ్రహిస్తుంది. నీరు లీక్ అయ్యే అవకాశం ఉంది. దీని వల్ల E20 పెట్రోల్ పాడైపోయి, వాహనాలకు నష్టం కలిగించే అవకాశం ఉంది. ఇదే కాకుండా భూటాన్ పూర్తిగా పర్వతాలలో ఉండే దేశం. ఈ దేశంలో వాహనాలు మరింత శక్తివంతంగా పనిచేయాల్సి ఉంటుంది. ఈ పరిస్థితుల్లో E20 పెట్రోల్ ఆశించినంతగా పనిచేయని స్థితి ఉంటుంది.
Also Read
- Pralhad Joshi: ధర్మేంద్ర ప్రధాన్ వారసుడిగా ప్రహ్లాద్ జోషి.. కొత్త విద్యాశాఖ మంత్రిగా నియామకం
- Indai: దేశ చరిత్రలో రాజీనామాలు చేసిన కేంద్రమంత్రులు ఎవరంటే..!
- CJP Protest: అభిజిత్ హీరో.. సోనమ్ జీరోనా..? వాంగ్చుక్ను పట్టించుకోని సీజేపీ..
- Dharmendra Pradhan: సోషల్ మీడియా ఖాతాల్లో మార్పు.. కేంద్రమంత్రి హోదా తొలగింపు
ప్రస్తుతం భూటాన్ భారత్ నుంచి అధిక నాణ్యత కలిగిన ఎక్స్పోర్ట్ గ్రేడ్ పెట్రోల్, డీజిల్ను కొనుగోలు చేస్తోంది. దీని ధర భారత బంకుల్లో విక్రయించే ఇంధనం కన్నా ఎక్కువ. దీంతోనే E20 పెట్రోల్ ప్రతిపాదనను భూటాన్ తిరస్కరించింది. ఇదే కాకుండా సాధారణ పెట్రోల్తో పోలిస్తే, E20లో నీటి కాలుష్యం ఎక్కువగా వ్యాపిస్తుంది. ఇలాంటి ఇంధనంలో నీరు కరిగితే, దానిని వేరు చేయడం చాలా కష్టం. దీని వల్ల ఇంధన నాణ్యత దెబ్బతిని, స్టీల్ ట్యాంకులు, పైప్ లైన్లు తుప్పుపట్టే ప్రక్రియ వేగవంతం అవుతుంది. భూటాన్లో చాలా ఇంధన డిపోలు పర్వత ప్రాంతాలు, అధిక తేమ ఉన్న ప్రదేశాల్లో ఉంటాయి. దీని వల్ల ట్యాంకుల్లో తేమ లేదా ఘనీభవనాన్ని నివారించడం చాలా కష్టం. ఈ కారణాలతో భూటాన్ E20 పెట్రోల్ను సరఫరా చేయాలని చూసిన భూటాన్ తిరస్కరించింది.
భారత్లో వివాదంగా E20:
20 శాతం ఇథనాల్, 80 శాతం పెట్రోల్ మిశ్రమమైన E20 పెట్రోల్పై భారతదేశంలో ఇప్పటికే వివాదం నడుస్తోంది. పెట్రోల్ వాహనాల యజమానులు, ముఖ్యంగా 2023కి ముందు తయారైన వాహనాల యజమానులు, మైలేజ్ తగ్గడం, నిర్వహణ ఖర్చులు పెరగడం, ఇంజిన్పై అదనపు భారం పడటం వంటి సమస్యలపై ఫిర్యాదు చేస్తున్నారు. మరోవైపు, ఈ ఇంధనం వల్ల మైలేజ్ తగ్గినప్పటికీ, ఇంజన్ పనితీరు, యాక్సిలరేషన్ మెరుగుపడుతాయని ప్రభుత్వం వాదిస్తోంది.
తాజావార్తలు
-
CM Revanth Reddy : జెన్-జీ గెలిచింది.. మోడీ తలవంచారన్న రేవంత్!
-
OTR: కోమటిరెడ్డి బ్రదర్స్ కు తుంగతుర్తి ఎమ్మెల్యే సీరియస్ వార్నింగ్..! అసలు ఏం జరిగింది ?
-
OTR: జనగామ కాంగ్రెస్లో వర్గపోరు.. డీసీసీ vs నియోజకవర్గ ఇంచార్జ్ వార్!
-
Sikandar Raza: నేనే జట్టును నిరాశపరిచాను.. ఓటమికి బాధ్యత నాదే.. నిజాయితీగా ఒప్పుకున్న జింబాబ్వే కెప్టెన్..
-
Story Board : జెన్ జి ఉద్యమాలు.. సరికొత్త బెంచ్ మార్క్ సెట్ చేస్తున్న యువత..
ట్రెండింగ్
-
Parents Alert: రోజూ ఫ్రూట్ జ్యూస్ ఇస్తున్నారా? పిల్లల్లో ఈ ప్రమాదం 52% పెరుగుతుందట.!
-
Easy Wall Cleaning Tips: గోడలపై మరకలా? ఖరీదైన క్లీనర్లు వద్దు.. ఇంట్లో ఉన్నవే చాలు.!
-
Smart Money Rules: జీవితాన్ని మార్చే స్మార్ట్ ‘మనీ రూల్స్’.! ఆర్థికంగా బలపడాలంటే తప్పక తెలుసుకోవాల్సిన సూత్రాలు ఇవే..
-
12.1 అంగుళాల 2.5K డిస్ప్లే, 10,200mAh బ్యాటరీతో రానున్న Moto Pad 70.!
-
3.2 అంగుళాల టచ్స్క్రీన్, Doubao AIతో HMD Touch AI ఫీచర్ ఫోన్ లాంచ్.!