IPL 2025: బీసీసీఐకి బిగ్ షాక్.. రానంటున్న ఆటగాళ్లు
- బీసీసీఐకి తలనొప్పిగా విదేశీ ఆటగాళ్ల వైదొలగింపు
- దక్షిణాఫ్రికా ప్లేయర్ల లభ్యతపై అనిశ్చితి
- స్టార్ క్రికెటర్లు లేకుండా ఫ్రాంచైజీలు ఫైనల్ చేరడంపై సందేహాలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
IPL 2025: ఐపీఎల్ 2.0 కి డేట్ ఫిక్స్ చేశారు. ఈ నెల పదిహేడు నుంచి ఐపీఎల్ పునప్రారంభం కానుంది. మొత్తం 17 మ్యాచ్లు జరగనుండగా అందులో 13 లీగ్ మ్యాచ్లు, నాలుగు ప్లేఆఫ్ మ్యాచులు జరుగుతాయి. తొలి మ్యాచ్ లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కోల్కతా నైట్ రైడర్స్ తలపడనున్నాయి. అయితే భారత్ పాక్ మధ్య తలెత్తిన ఉద్రిక్తత పరిస్థితుల కారణంగా విదేశీ ఆటగాళ్లు తమ దేశానికి వెళ్లిపోయిన విషయం తెలిసిందే. ఇప్పుడు బీసీసీఐ ఐపీఎల్ పునప్రారంభానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినప్పటికీ, వెళ్లిన వారు వచ్చే పరిస్థితుల్లో లేరు. ఈ జాబితాలో ఆస్ట్రేలియా ,దక్షిణాఫ్రికా ఆటగాళ్లే ఎక్కువమంది ఉన్నారు. మొదట ఆస్ట్రేలియన్ ప్లేయర్లు మిచెల్ స్టార్క్, జోష్ హాజిల్వుడ్, పాట్ కమ్మిన్స్ ఇండియాకు రాలేరన్న వార్తలు వచ్చాయి. ఇప్పుడు దక్షిణాఫ్రికా ఆటగాళ్లు బీసీసీఐకి షాక్ ఇవ్వనున్నారు. ఇండియాకు తిరిగి వచ్చినప్పటికీ ప్లేఆప్స్ కు ఉండే పరిస్థితి లేదు.
Bhargavastra: విజయవంతంగా ‘భార్గవస్త్ర’ పరీక్ష ప్రయోగం.. దీని శక్తి ఏ స్థాయిలో ఉంటుందంటే..!
Also Read
- IPL 2027: కోహ్లీ, రోహిత్తో కలిసి IPL ఆడాలన్న పాక్ క్రికెటర్ కల నెరవేరుతుందా? బ్రిటిష్ పౌరసత్వంతో ఉత్కంఠ
- KKR Captaincy Crisis: రెండేళ్ల వ్యూహాత్మక తప్పిదం.. కేకేఆర్ను సంక్షోభంలోకి నెట్టిందెలా? రహానే రిటైర్మెంట్ కేవలం సాకు మాత్రమే..!
- రూ.2 లక్షల కోట్లకు చేరువలో IPL.. బ్రాండ్ విలువలో నెం.1గా RCB..
- Hardik Pandya: ఐపీఎల్ ట్రేడ్ హీట్.. హార్దిక్ పాండ్యా ఢిల్లీకా? చెన్నైకా? భారత మాజీ క్రికెటర్ ఆసక్తికర వ్యాఖ్యలు..
దక్షిణాఫ్రికా క్రికెట్ బోర్డు మే 26 లోపు తమ ఆటగాళ్లందరినీ అందుబాటులో ఉండాలని కోరింది. ఇక్కడ లీగ్ దశ మ్యాచ్లు మే 27 వరకు జరుగుతాయి. ఆ తర్వాత ప్లేఆప్స్ ప్రారంభమవుతాయి. ఈ పరిస్థితిలో దక్షిణాఫ్రికా క్రికెటర్లు లీగ్ దశ వరకు మాత్రమే అందుబాటులో ఉంటారు. దీంతో ఫ్రాంచైజీలు తీవ్రంగా నష్టపోయే ప్రమాదముంది. ట్రిస్టన్ స్టబ్స్, కగిసో రబాడ, ర్యాన్ రికెల్టన్, లుంగీ ఎంగిడి లాంటి భారీ హిట్టర్లు దక్షిణాఫ్రికా నుంచి వచ్చినవాళ్లే. వీళ్లంతా ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ కోసం ఎంపికయ్యారు. స్టబ్స్ ఢిల్లీ క్యాపిటల్స్ తరఫున, రబాడ గుజరాత్ టైటాన్స్ తరఫున, రికెల్టన్ ముంబై ఇండియన్స్ , లుంగీ ఎంగిడి ఆర్సీబీ తరుపున ఆడుతున్నారు. అయితే రబాడ ఐపీఎల్ నుంచి బ్యాన్ అయిన విషయం తెలిసిందే. ఏదేమైనా.. ఈ స్టార్ ప్లేయర్లు లేకపోతే ఆ ఫ్రాంచైజీలన్నీ ఫైనల్-4కి అర్హత సాధించడం కష్టమేనంటున్నారు.
తాజావార్తలు
-
PMSBY: రూ.20తో రూ.2 లక్షల బీమా.. ఈ ప్రభుత్వ పథకం గురించి తెలుసా?
-
OTR: సీట్ల పంపకానికి ముందే ‘నోట్ల’ పంచాయితీ! టీడీపీ-జనసేనలో కొత్త టెన్షన్
-
Off The Record: కొండా సురేఖ, చిన్నారెడ్డిపై యాక్షన్కు బ్రేక్! ఢిల్లీ నుంచి వచ్చిన సందేశమేంటి?
-
OTR: ఎమ్మెల్యే పదవిని వదిలి మేయర్ అవుతారా? విశాఖలో టీడీపీ నేతల కొత్త స్కెచ్!
-
Story Board : వీసా అపాయింట్మెంట్లు ఎందుకు నిలిపేశారు..?| ట్రంప్ కఠిన చర్యలు దేనికి సంకేతం..?
ట్రెండింగ్
-
Festival Recipes : రక్షా బంధన్ స్పెషల్.. ఇంట్లోనే సింపుల్గా కాజు కట్లీ రెడీ..!
-
MS Dhoni-CSK: సీఎస్కేలో ధోనీకి 25 శాతం వాటానా?.. ఫ్రీగా ఎవరైనా ఇస్తారా?.. మాజీ టీమిండియా ప్లేయర్ సంచలన వ్యాఖ్యలు!
-
కేవలం రూ.7,999కే.. 5000mAh బ్యాటరీ, LED ఫ్లాష్ కెమరాతో Lava Bold N4 Lite లాంచ్..!
-
రూ.14,999కే మిలిటరీ-గ్రేడ్ డ్యూరబిలిటీ, 6500mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లే.. Realme C100i 4G ఫోన్ లాంచ్.!
-
Paneer Bhurji Recipe: పప్పు, కూరలతో బోర్ కొడుతోందా.? అయితే “పనీర్ భుర్జీ”తో కొత్త టేస్ట్ ఆస్వాదించండి..!