Virat Kohli: బాక్స్లో కూర్చొని కామెంటరీ చేయడం సులువే.. గవాస్కర్కు ఇచ్చిపడేసిన కోహ్లీ!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Virat Kohli React on IPL 2024 Strike-Rate: ఐపీఎల్ 2024లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ పరుగుల వరద పారిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటివరకు 10 మ్యాచ్లు ఆడిన విరాట్.. 500 పరుగులు చేశాడు. ప్రస్తుతం ఐపీఎల్ 2024 ‘ఆరెంజ్ క్యాప్’ కోహ్లీ వద్దే ఉంది. బెంగళూరు తరఫున ప్రతి మ్యాచ్లోనూ కీలక ఇన్నింగ్స్ ఆడినా.. కోహ్లీ ఆటతీరుపై విమర్శలు వస్తూనే ఉన్నాయి. ఈ ఎడిషన్లో తక్కువ స్ట్రైక్రేట్తో పరుగులు చేస్తున్నాడనే విమర్శలను ఎదుర్కొంటున్నాడు. ముఖ్యంగా సన్రైజర్స్ హైదరాబాద్పై కోహ్లీ 43 బంతుల్లో 51 పరుగులు చేయడాన్ని మాజీలు తప్పుపట్టారు.
సన్రైజర్స్ హైదరాబాద్పై విరాట్ కోహ్లీ కొట్టిన హాఫ్ సెంచరీ ఎంతో విలువైనదే అయినా.. అతడి ఇన్నింగ్స్ చాలా నెమ్మదిగా సాగిందని టీమిండియా మాజీ దిగ్గజం, కామెంటేటర్ సునీల్ గవాస్కర్ అన్నారు. విరాట్ నుంచి జట్టు కోరుకుంటోంది ఇది కాదని, కోహ్లీ పెద్ద షాట్లను ప్రయత్నించాలన్నారు. తనపై వచ్చిన కామెంట్లపై గుజరాత్ టైటాన్స్తో జరిగిన మ్యాచ్ అనంతరం కోహ్లీ తీవ్రంగా స్పందించాడు. స్ట్రైక్రేట్ తక్కువగా ఉందని కామెంట్లు చేసేవారికి ఆటపై పెద్దగా అవగాహన ఉండి ఉండదని ఎద్దేవా చేశాడు. బాక్స్లో కూర్చొని కామెంటరీ చేయడం సులువే అన్నాడు. బయట కూర్చొని కామెంట్లు చేసే చాలా మందికి మ్యాచ్ పరిస్థితి తెలియదని మండిపడ్డాడు.
Also Read
- IPL 2026 Playoff Tickets: ఐపీఎల్ 2026 ప్లేఆఫ్స్ టిక్కెట్స్ షెడ్యూల్ వచ్చేసింది.. ఇక్కడ బుక్ చేసుకోండిలా..
- CSK vs SRH: ధోని లేకుండానే బరిలోకి CSK.. మొదటి బ్యాటింగ్ ఎవరిదంటే.!
- IPL: ‘నన్ను అస్సలు పట్టించుకోలేదు’.. కేకేఆర్పై బంగ్లాదేశ్ స్టార్ లిటన్ దాస్ సంచలన వ్యాఖ్యలు..
- IPL 2026: ఐపీఎల్ అరంగేట్రంలోనే అదరగొట్టిన తెలుగు కుర్రాడు.. మంత్రి ప్రశంసలు..
Also Read: T20 World Cup 2024: న్యూజిలాండ్ ప్రపంచకప్ జట్టు ప్రకటన.. స్టార్లకు దక్కని చోటు!
‘స్పిన్ను సరిగ్గా ఆడలేనని, స్ట్రైక్రేట్ తక్కువగా ఉందని నాపై కామెంట్లు చేసేవారికి ఆటపై పెద్దగా అవగాహన ఉండి ఉండదు. ప్రతి మ్యాచ్లో విజయం కోసమే నేను కష్టపడతా. అందుకే 15 ఏళ్లుగా ఆటలో కొనసాగుతున్నా. మేం ప్రతి రోజూ జట్టు కోసం ఆలోచిస్తాం. బయట కూర్చొని కామెంట్లు చేసే వారికి మ్యాచ్ పరిస్థితి ఏంటో తెలియదు. అభిమానులు మా నుంచి ఇంకా మెరుగైన ప్రదర్శన ఆశిస్తారు. అందులో తప్పేం లేదు కానీ.. మ్యాచ్ ఎలాంటి స్థితిలో ఉందనేది కూడా మాకు చాలా కీలకం. ఉన్నతస్థాయిలో క్రికెట్ ఆడిన వారెవరూ విమర్శలు చేయరు. తెలిసీతెలియని వారే విమర్శలు చేస్తుంటారు. మేం ఆత్మగౌరవంతో మ్యాచ్లను ఆడతాం. బయట నుంచి వచ్చే కామెంట్లను నేను పెద్దగా పట్టించుకోను’ అని విరాట్ కోహ్లీ అన్నాడు.
తాజావార్తలు
-
CM Chandrababu: ప్రజల్లో ప్రభుత్వంపై నమ్మకం పెరగాలి.. పారదర్శక పాలనతో ముందుకు వెళ్లాలి..!
-
The Red Bag : రాశీ కీలక పాత్రలో ‘ది రెడ్ బ్యాగ్’
-
Maharashtra: పెళ్లింట తీవ్ర విషాదం.. రోడ్డు ప్రమాదంలో 13 మంది మృతి..
-
Loan: అప్పు ఇచ్చి మర్చిపోవాల్సిందే.. మళ్లీ అడిగారో కాటికే..
-
Afghan Women: ‘అమ్మాయి మౌనం పెళ్లికి అంగీకారమే’.. తాలిబన్ కొత్త చట్టంపై ఆగ్రహజ్వాలలు
ట్రెండింగ్
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్తో REDMAGIC 11S Pro సిరీస్ లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!