CSK vs SRH: ఇప్పుడు హైదరాబాద్ వంతు.. ఎక్కడ చూసినా ధోనీ నామస్మరణే! జోరుగా బ్లాక్ టికెట్ల దందా
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Fans Try To Buy Tickets for MS Dhoni in Uppal Stadium: దేశవ్యాప్తంగా ఇప్పుడు ఎక్కడ చూసినా ‘ఎంఎస్ ధోనీ’ నామస్మరణే. ఇందుకు రెండు కారణాలు ఉన్నాయి. భారత్కు రెండు ప్రపంచకప్లు అందించిన మహీ కేవలం ఐపీఎల్ మాత్రమే ఆడుతుండడం ఒకటైతే.. ధోనీకి ఇదే ఆఖరి ఐపీఎల్ సీజన్ అని ప్రచారం జరుగుతుండడం రెండోది. అందుకే ఐపీఎల్ 2024లో ధోనీ ఆట చూసేందుకు అభిమానులు ఎగబడుతున్నారు. మిస్టర్ కూల్ ఏ నగరానికి వెళ్లినా.. స్టేడియాలు కిక్కిరిసిపోతున్నాయి. ఇప్పుడు హైదరాబాద్ వంతు వచ్చింది.
శుక్రవారం రాత్రి ఉప్పల్ స్టేడియంలో సన్రైజర్స్ హైదరాబాద్, చెన్నై సూపర్ కింగ్స్ జట్లు ఢీకొట్టనున్నాయి. దాదాపు 5 ఏళ్ల తర్వాత ఎంఎస్ ధోనీ హైదరాబాద్లో మ్యాచ్ ఆడుతుండటంతో.. ఈ మ్యాచ్ టికెట్ల కోసం ఫుల్ డిమాండ్ ఏర్పడింది. సాధారణ వ్యక్తి నుంచి అత్యున్నతస్థాయి అధికారుల వరకు టికెట్ల కోసం అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. అయినా కూడా చాలా మందికి నిరాశే ఎదురవుతోంది. ఆన్లైన్లో ఉంచిన టికెట్లు నిమిషాల్లో మాయమవడంతో.. అభిమానులకు ఏం చేయాలో అర్ధం కావడం లేదు.
Also Read
- Angry On Vaibhav: ‘వెళ్లి ఐపీఎల్ ఆడుకోపో.. నీకు అంతర్జాతీయ క్రికెట్ అనవసరం’.. వైభవ్పై తీవ్ర ఆగ్రహం..
- NKR: ‘చిన్న మార్పు చేశాను.. సక్సెస్ అయ్యాను’.. నితీష్ కుమార్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు..
- Vaibhav Batting: ఎట్టకేలకు వైభవ్ బ్యాటింగ్ సీక్రెట్ రివీల్ చేసిన కోచ్.. అందరూ ఇది ఫాలో అవుతారేమో ఇక..
- Kane Williamson: ఆరెంజ్ ఆర్మీ గుండెల్లో ‘కేన్ మామ’.. ఒంటిచేత్తో SRHను ఫైనల్కు చేర్చిన క్షణాలు..
సాధారణంగా ఏ నగరంలో అయినా ఉన్నతాధికారులకు ఐపీఎల్ నిర్వాహకులు కాంప్లిమెంటరీ పాసులు ఇస్తుంటారు. అయితే నగరానికి ఎంఎస్ ధోనీ రాకతో పరిస్థితి పూర్తిగా మారిపోయింది. హైదరాబాద్, చెన్నై మ్యాచ్ టికెట్ల డిమాండ్ను ముందే ఊహించిన సన్రైజర్స్ ఫ్రాంచైజీ.. చాలా తక్కువ సంఖ్యలో ఆన్లైన్లో టికెట్లను అమ్మినట్లుగా సోషల్ మీడియాలో ఆరోపణలు వస్తున్నాయి. 35 వేల సామర్థ్యమున్న ఉప్ప్పల్ స్టేడియం టికెట్లను పెద్ద సంఖ్యలో బ్లాక్ చేసినట్లు విమర్శలు వస్తున్నాయి. వీటిని కాంప్లిమెంటరీ పాసులుగా ముద్రించి.. బ్లాక్లో అధిక ధరకు విక్రయిస్తున్నట్లు తెలుస్తోంది. ఒక్కో టికెట్ రూ.10 కూడా పలుకుతోందట.
Also Read: CSK vs SRH: కరెంట్ పునరుద్ధరణ.. ఉప్పల్ స్టేడియంలో యధావిధిగా హైదరాబాద్, చెన్నై మ్యాచ్!
బ్లాక్ టికెట్ల వ్యవహారంపై మీడియాలో కథనాలు వస్తున్నా.. పట్టించుకున్న వారే లేరు. హెచ్సీఏ అధికారులు కూడా మిన్నకుండిపోయారు. టికెట్ల గురించి హెచ్సీఏ మాట కూడా మాట్లాడం లేదు. మ్యాచ్ కోసం ఎన్ని టికెట్లు ఆన్లైన్లో పెట్టారు, వాటిని ఎవరు కొన్నారు? అనే వివరాలు ఆన్లైన్ సంస్థ, సన్రైజర్స్, హెచ్సీఏ దగ్గర ఉంటాయి. కానీ ఇప్పటివరకు టికెట్ల విక్రయాల గురించి ఎలాంటి ప్రకటన లేదు. దీన్ని బట్టే అర్ధంమవుతోంది బ్లాక్ టికెట్ల దందా ఏ రేంజ్లో సాగుతోందో.
తాజావార్తలు
-
Harmanpreet Kaur: ‘చాలా సంతోషంగా ఉంది.. ఈ సీక్రెట్ ప్లాన్తో ఆస్ట్రేలియాను ఓడించి సెమీస్కు వెళ్తాం’..
-
HYDRAA : హైదరాబాద్ చెరువులకు హైడ్రా టచ్.. రూ.107 కోట్ల భారీ ప్రాజెక్ట్.!
-
Kitchen Cleaning Tips: వంటగది లైట్ స్విచ్లపై జిగురు మరకలా? 5 నిమిషాల్లో క్లీనింగ్కు సూపర్ టిప్స్
-
Ind Vs Ban: బంగ్లాదేశ్పై భారత్ ఘన విజయం.. సెమీస్ రేసులో దూసుకెళ్లిన టీమిండియా..
-
First T20 Captain: ధోని కాదు.. భారత్కు తొలి టీ-20 కెప్టెన్ ఎవరో తెలుసా..?
ట్రెండింగ్
-
Iron Box Cleaning : ఐరన్ బాక్స్ కింద మరకలా..? 5 నిమిషాల్లో కొత్తదానిలా..!
-
52dB ANC, 54 గంటల బ్యాటరీ బ్యాకప్తో భారత్లో లాంచ్ అయిన OnePlus Nord Buds 4.. ధర ఎంతంటే.?
-
Benefits of Hugging: భార్యాభర్తలు కౌగిలించుకుని నిద్రపోతే కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే.!
-
Jamun Juice: యాంటీఆక్సిడెంట్ల పవర్హౌస్.. ‘నేరేడుపండు జ్యూస్’ ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
IPL Franchises: కార్పొరేట్ కంపెనీల సరసన ఐపీఎల్ జట్లు.. రిపోర్ట్లో సంచలన విషయాలు.!