BCCI New Rule: ఐపీఎల్ 2026 క్వాలిఫయర్-2కు ముందు.. కొత్త రూల్ తీసుకొచ్చిన బీసీసీఐ!
- ఐపీఎల్ 2026లో బీసీసీఐ కీలక నిర్ణయం
- నేడు జీటీ vs ఆర్ఆర్ క్వాలిఫయర్-2
- కొత్త రూల్ తీసుకొచ్చిన బీసీసీఐ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Smart Glasses Banned in IPL 2026: ఐపీఎల్ 2026 సీజన్ చివరి దశకు చేరుకున్న వేళ భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) కీలక నిర్ణయం తీసుకుంది. ఆటగాళ్లు, మ్యాచ్ అధికారుల కోసం కొత్త నిబంధన అమల్లోకి తీసుకొచ్చింది. ఇకపై ప్లేయర్లు, సపోర్ట్ స్టాఫ్, మ్యాచ్ అధికారులెవరూ స్మార్ట్ సన్గ్లాసెస్ లేదా స్మార్ట్ గాగుల్స్ వినియోగించకూడదని బీసీసీఐ యాంటీ కరప్షన్ యూనిట్ (ఏసీఎస్యూ) ఆదేశాలు జారీ చేసింది. ఈ గ్లాసెస్లో ఉన్న ఆధునిక కమ్యూనికేషన్ ఫీచర్లు భద్రతాపరమైన సమస్యలకు దారితీయవచ్చని బీసీసీఐ భావిస్తోంది.
బీసీసీఐ విడుదల చేసిన అడ్వైజరీ ప్రకారం.. ప్రస్తుతం కొన్ని కంపెనీలు ఆటగాళ్లు, సపోర్ట్ స్టాఫ్ను లక్ష్యంగా చేసుకుని స్మార్ట్ గాగుల్స్ను మార్కెట్ చేస్తున్నాయి. ఈ గ్లాసెస్ ద్వారా లైవ్ స్ట్రీమింగ్ చేయడం, టెక్స్ట్ మెసేజ్లు పంపడం, వీడియో కాల్స్, ఆడియో కాల్స్ చేయడం వంటి సదుపాయాలు ఉంటాయని బీసీసీఐ పేర్కొంది. మొబైల్ డేటా లేదా వైఫై ద్వారా పనిచేసే ఈ పరికరాలను కమ్యూనికేషన్ డివైస్ గానే కాకుండా ఆడియో-వీడియో రికార్డింగ్ డివైస్ గానూ పరిగణిస్తున్నట్లు తెలిపింది. ఈ నేపథ్యంలో ప్లేయర్స్, మ్యాచ్ ఆఫీషియల్స్ ఏరియాలో ఈ పరికరాల వినియోగాన్ని పూర్తిగా నిషేధించింది.
Also Read
- IPL 2027: కోహ్లీ, రోహిత్తో కలిసి IPL ఆడాలన్న పాక్ క్రికెటర్ కల నెరవేరుతుందా? బ్రిటిష్ పౌరసత్వంతో ఉత్కంఠ
- KKR Captaincy Crisis: రెండేళ్ల వ్యూహాత్మక తప్పిదం.. కేకేఆర్ను సంక్షోభంలోకి నెట్టిందెలా? రహానే రిటైర్మెంట్ కేవలం సాకు మాత్రమే..!
- రూ.2 లక్షల కోట్లకు చేరువలో IPL.. బ్రాండ్ విలువలో నెం.1గా RCB..
- Hardik Pandya: ఐపీఎల్ ట్రేడ్ హీట్.. హార్దిక్ పాండ్యా ఢిల్లీకా? చెన్నైకా? భారత మాజీ క్రికెటర్ ఆసక్తికర వ్యాఖ్యలు..
మ్యాచ్ రోజుల్లో స్టేడియంలోకి వెళ్లేముందు ఆటగాళ్లు, సపోర్ట్ స్టాఫ్ తమ మొబైల్ ఫోన్లు, స్మార్ట్వాచ్లతో పాటు ఈ స్మార్ట్ గ్లాసెస్ను కూడా సెక్యూరిటీ లియాజన్ ఆఫీసర్ వద్ద ఉంచాలని ఆదేశించింది. ఈ నిబంధనను ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని బీసీసీఐ హెచ్చరించింది. ఇటీవల ఐపీఎల్లో కొన్ని కోడ్ ఆఫ్ కండక్ట్ ఉల్లంఘనలు చోటుచేసుకోవడంతో బీసీసీఐ మరింత కఠినంగా వ్యవహరిస్తోంది. రాజస్థాన్ రాయల్స్కు చెందిన రోమీ భిందర్ మ్యాచ్ సమయంలో డగౌట్లో మొబైల్ ఫోన్ ఉపయోగించినందుకు రూ.1 లక్ష జరిమానా విధించడంతో పాటు వార్నింగ్ కూడా జారీ అయింది. ఆ ఘటన తర్వాతే బీసీసీఐ భద్రతా నిబంధనలను మరింత కట్టుదిట్టం చేసింది.
ఇప్పటికే ఆటగాళ్లు రాత్రివేళ అనుమతి లేకుండా బయటకు వెళ్లకుండా బీసీసీఐ ఆంక్షలు విధించిన విషయం తెలిసిందే. అలాగే భద్రతా కారణాలు, హనీ ట్రాప్ భయాలతో ప్లేయర్లు, సపోర్ట్ స్టాఫ్ హోటల్ గదుల్లో అతిథులను అనుమతించడాన్ని కూడా నిషేధించింది. ఇప్పుడు స్మార్ట్ గ్లాసెస్పై నిషేధం విధించడం ద్వారా బీసీసీఐ ఐపీఎల్లో అవినీతి నిరోధక చర్యలను మరింత బలోపేతం చేస్తున్నట్లు స్పష్టమవుతోంది.
తాజావార్తలు
-
Dare Devil: అజిత్ ‘డేర్ డెవిల్’ నుంచి తప్పుకున్న మోహన్లాల్.. సెప్టెంబర్ నుంచి షూటింగ్
-
Babar Azam: బాబర్ ఆజంకు బిగ్ షాక్.. పాక్కు కొత్త కెప్టెన్..
-
Premier League: ఆ జట్టుకు బిగ్ షాక్.. లీగ్ నుంచి అవుట్..
-
Off The Record: పరకాల టికెట్ ఆశలు గల్లంతైనట్లేనా..! కొండా ఫ్యామిలీకి సీఎం బిగ్ షాక్?
-
Jharkhand: దిగొచ్చిన హేమంత్ సర్కార్.. విద్యార్థుల డిమాండ్లకు అంగీకారం!
ట్రెండింగ్
-
BSNL పెద్ద స్కెచే వేసిందిగా.. రూ.1,111కే 200 Mbps స్పీడ్, 5000GB డేటా, 25+ OTT ప్లాట్ ఫార్మ్స్.!
-
CSK Coach: అతడు ఏం చేశాడని.. కోచ్గా వద్దు.. కామెంటరీకే పరిమితమైతే మంచిది!
-
Guinness World Record: 44 ఏళ్ల ‘యాష్లే పాల్సన్’ సంచలనం.. 12 గంటల 47 నిమిషాల్లో 100 మైళ్ల పరుగు.. గిన్నిస్బుక్లో చోటు.!
-
Coriander at Home: విత్తనాలు లేకుండానే కొత్తిమీర మొక్కలను పెంచండి ఇలా.. ఇక మార్కెట్లో కొనాల్సిన అవసరమే ఉండదు.!
-
6.9-అంగుళాల HD+ IPS LCD స్క్రీన్, 6,000mAh బ్యాటరీతో రూ.20 వేలలోపే POCO M8x 5G.!