BCCI New Rule: ఐపీఎల్ 2026 క్వాలిఫయర్-2కు ముందు.. కొత్త రూల్ తీసుకొచ్చిన బీసీసీఐ!
- ఐపీఎల్ 2026లో బీసీసీఐ కీలక నిర్ణయం
- నేడు జీటీ vs ఆర్ఆర్ క్వాలిఫయర్-2
- కొత్త రూల్ తీసుకొచ్చిన బీసీసీఐ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Smart Glasses Banned in IPL 2026: ఐపీఎల్ 2026 సీజన్ చివరి దశకు చేరుకున్న వేళ భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) కీలక నిర్ణయం తీసుకుంది. ఆటగాళ్లు, మ్యాచ్ అధికారుల కోసం కొత్త నిబంధన అమల్లోకి తీసుకొచ్చింది. ఇకపై ప్లేయర్లు, సపోర్ట్ స్టాఫ్, మ్యాచ్ అధికారులెవరూ స్మార్ట్ సన్గ్లాసెస్ లేదా స్మార్ట్ గాగుల్స్ వినియోగించకూడదని బీసీసీఐ యాంటీ కరప్షన్ యూనిట్ (ఏసీఎస్యూ) ఆదేశాలు జారీ చేసింది. ఈ గ్లాసెస్లో ఉన్న ఆధునిక కమ్యూనికేషన్ ఫీచర్లు భద్రతాపరమైన సమస్యలకు దారితీయవచ్చని బీసీసీఐ భావిస్తోంది.
బీసీసీఐ విడుదల చేసిన అడ్వైజరీ ప్రకారం.. ప్రస్తుతం కొన్ని కంపెనీలు ఆటగాళ్లు, సపోర్ట్ స్టాఫ్ను లక్ష్యంగా చేసుకుని స్మార్ట్ గాగుల్స్ను మార్కెట్ చేస్తున్నాయి. ఈ గ్లాసెస్ ద్వారా లైవ్ స్ట్రీమింగ్ చేయడం, టెక్స్ట్ మెసేజ్లు పంపడం, వీడియో కాల్స్, ఆడియో కాల్స్ చేయడం వంటి సదుపాయాలు ఉంటాయని బీసీసీఐ పేర్కొంది. మొబైల్ డేటా లేదా వైఫై ద్వారా పనిచేసే ఈ పరికరాలను కమ్యూనికేషన్ డివైస్ గానే కాకుండా ఆడియో-వీడియో రికార్డింగ్ డివైస్ గానూ పరిగణిస్తున్నట్లు తెలిపింది. ఈ నేపథ్యంలో ప్లేయర్స్, మ్యాచ్ ఆఫీషియల్స్ ఏరియాలో ఈ పరికరాల వినియోగాన్ని పూర్తిగా నిషేధించింది.
Also Read
- రూ.2 లక్షల కోట్లకు చేరువలో IPL.. బ్రాండ్ విలువలో నెం.1గా RCB..
- Hardik Pandya: ఐపీఎల్ ట్రేడ్ హీట్.. హార్దిక్ పాండ్యా ఢిల్లీకా? చెన్నైకా? భారత మాజీ క్రికెటర్ ఆసక్తికర వ్యాఖ్యలు..
- Angry On Vaibhav: ‘వెళ్లి ఐపీఎల్ ఆడుకోపో.. నీకు అంతర్జాతీయ క్రికెట్ అనవసరం’.. వైభవ్పై తీవ్ర ఆగ్రహం..
- NKR: ‘చిన్న మార్పు చేశాను.. సక్సెస్ అయ్యాను’.. నితీష్ కుమార్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు..
మ్యాచ్ రోజుల్లో స్టేడియంలోకి వెళ్లేముందు ఆటగాళ్లు, సపోర్ట్ స్టాఫ్ తమ మొబైల్ ఫోన్లు, స్మార్ట్వాచ్లతో పాటు ఈ స్మార్ట్ గ్లాసెస్ను కూడా సెక్యూరిటీ లియాజన్ ఆఫీసర్ వద్ద ఉంచాలని ఆదేశించింది. ఈ నిబంధనను ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని బీసీసీఐ హెచ్చరించింది. ఇటీవల ఐపీఎల్లో కొన్ని కోడ్ ఆఫ్ కండక్ట్ ఉల్లంఘనలు చోటుచేసుకోవడంతో బీసీసీఐ మరింత కఠినంగా వ్యవహరిస్తోంది. రాజస్థాన్ రాయల్స్కు చెందిన రోమీ భిందర్ మ్యాచ్ సమయంలో డగౌట్లో మొబైల్ ఫోన్ ఉపయోగించినందుకు రూ.1 లక్ష జరిమానా విధించడంతో పాటు వార్నింగ్ కూడా జారీ అయింది. ఆ ఘటన తర్వాతే బీసీసీఐ భద్రతా నిబంధనలను మరింత కట్టుదిట్టం చేసింది.
ఇప్పటికే ఆటగాళ్లు రాత్రివేళ అనుమతి లేకుండా బయటకు వెళ్లకుండా బీసీసీఐ ఆంక్షలు విధించిన విషయం తెలిసిందే. అలాగే భద్రతా కారణాలు, హనీ ట్రాప్ భయాలతో ప్లేయర్లు, సపోర్ట్ స్టాఫ్ హోటల్ గదుల్లో అతిథులను అనుమతించడాన్ని కూడా నిషేధించింది. ఇప్పుడు స్మార్ట్ గ్లాసెస్పై నిషేధం విధించడం ద్వారా బీసీసీఐ ఐపీఎల్లో అవినీతి నిరోధక చర్యలను మరింత బలోపేతం చేస్తున్నట్లు స్పష్టమవుతోంది.
తాజావార్తలు
-
Chicken Biryani: ప్రభుత్వ స్కూళ్లలో చికెన్ బిర్యానీ? సర్కార్ కొత్త ఆలోచన!
-
Allu Arjun : అల్లు అర్జున్ హిత బోధ వెనుక కారణం ఇదా?
-
Supreme Court: కేంద్రానికి సుప్రీంకోర్టు షాక్.. పోస్ట్-ఫాక్టో పర్యావరణ అనుమతులకు బ్రేక్
-
Pawan Kalyan: జనసేన పార్టీ కీలక నిర్ణయం.. ఆ 26 మంది అవుట్!
-
Manmohan Singh: కోల్ స్కామ్ కేసులో సంచలన తీర్పు.. దివంగత మాజీ ప్రధానికి సుప్రీంకోర్టు క్లీన్ చిట్!
ట్రెండింగ్
-
7,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో వచ్చేస్తున్న బడ్జెట్ ఫోన్ OnePlus N6x.!
-
AI ఫీచర్లు, Intel Core Ultra ప్రాసెసర్లతో Dell XPS 13, Dell 14S, Dell 16S, Alienware 15 ల్యాప్టాప్లు లాంచ్..!
-
Subhadeep Ghosh: టీమిండియా కొత్త కోచ్గా మాజీ క్రికెటర్.. ఎవరీ సుభదీప్ ఘోష్?.. అంత తోపా!
-
Womens Shave Heads: విక్రమార్కుడు మూవీ సీన్ రిపీట్.. డబ్బు కోసం గుండు కొట్టించుకున్న మహిళలు.. చివరలో ఊహించని ట్విస్ట్!
-
200MP డ్యూయల్ కెమెరాలు, ARRI సినిమా టెక్నాలజీతో రానున్న HONOR Robot Phone..!