IPL 2022: ఆరెంజ్ క్యాప్, పర్పుల్ క్యాప్ రెండూ రాజస్థాన్కే..!!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఎంతో ఆసక్తి రేపిన ఐపీఎల్ 2022 సంబరం ముగిసింది. ఈ సీజన్తోనే ఐపీఎల్ అరంగేట్రం చేసిన గుజరాత్ టైటాన్స్ తొలి సీజన్లోనే అద్భుతంగా రాణించి ఏకంగా టైటిల్ను కైవసం చేసుకుంది. ఈ సీజన్లో స్టార్ క్రికెటర్ల కంటే కొత్త వాళ్లే ఎక్కువగా రాణించారు. రజత్ పటీదార్, ఉమ్రాన్ మాలిక్, తిలక్ వర్మ, ఆయుష్ బదోనీ లాంటి పలువురు కొత్త ఆటగాళ్లు అంచనాలకు మించి ప్రతిభను చాటుకున్నారు. గుజరాత్ టైటాన్స్ టైటిల్ విన్నర్గా నిలిచినా.. ఆరెంజ్, పర్పుల్ క్యాప్లను మాత్రం రాజస్థాన్ రాయల్స్ సొంతం చేసుకోవడం విశేషం. ఆ జట్టు ఓపెనర్ జాస్ బట్లర్ 863 పరుగులు సాధించి ఈ సీజన్లో అత్యధిక పరుగులు సాధించిన ఆటగాడిగా నిలిచాడు. దీంతో ఆరెంజ్ క్యాప్ను దక్కించుకున్నాడు. ప్లేయర్ ఆఫ్ ద సీజన్ అవార్డు కూడా బట్లర్కే దక్కింది. అంతేకాకుండా అత్యధిక ఫోర్లు (83), అత్యధిక సిక్సర్లు (45) కొట్టిన రికార్డు కూడా బట్లర్నే వరించింది. పవర్ ప్లేయర్ ఆఫ్ ది సీజన్ అవార్డు కూడా అతడికే దక్కింది.
IPL 2022: ఆర్సీబీ కొంప ముంచిన రిటైన్ ఆటగాళ్లు
Also Read
- Vaibhav Sooryavanshi: జింబాబ్వే సిరీస్పై కన్నేసిన వైభవ్ సూర్యవంశీ.. ‘ఈ సిరీస్ వదిలే ప్రసక్తే లేదు’..
- Shreyas Iyer: రేపటి మ్యాచ్కు మా స్ట్రాటజీ ఇదే.. మమ్మల్ని ఎవరూ ఆపలేరు: శ్రేయస్ అయ్యర్
- Zimbabwe Series: ఐపీఎల్ నుంచి ఆర్సీబీని తొలగించండి.. సెలెక్టర్లపై మండిపడ్డ మాజీ క్రికెటర్..
- Sunrisers: బోణి కొట్టిన సన్ రైజర్స్.. ఎమ్ఐ లండన్పై ఘన విజయం..
మరోవైపు ఈ సీజన్లో 27 వికెట్లు తీసిన చాహల్ పర్పుల్ క్యాప్ విన్నర్గా నిలిచాడు. ఎమర్జింగ్ ప్లేయర్ ఆఫ్ ది సీజన్ అవార్డును సన్రైజర్స్ హైదరాబాద్ సంచలన ఆటగాడు ఉమ్రాన్ మాలిక్ సొంతం చేసుకున్నాడు. అతడు 13 మ్యాచ్లలో కలిపి 22 వికెట్లు తీశాడు. 157 కి.మీ. వేగంతో బౌలింగ్ చేసి మెప్పించడంతో త్వరలో సొంతగడ్డపై దక్షిణాఫ్రికాతో జరగనున్న ఐదు టీ20ల సిరీస్ కోసం టీమిండియాకు ఎంపికయ్యాడు. అటు పర్ఫెక్ట్ క్యాచ్ ఆఫ్ ది సీజన్ అవార్డు లక్నో సూపర్ జెయింట్స్ ప్లేయర్ ఎవిన్ లూయిస్కు దక్కింది. కోల్కతా నైట్రైడర్స్తో జరిగిన మ్యాచ్లో రింకూ సింగ్ క్యాచ్ను ఒంతిచేత్తో అద్భుతంగా అందుకోవడంతో లూయిస్ ఈ అవార్డుకు ఎంపికయ్యాడు. కాగా సూపర్ స్ట్రయికర్ ఆఫ్ ద సీజన్ అవార్డును బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్ ఆటగాడు దినేష్ కార్తీక్ గెలుచుకున్నాడు. ఈ సీజన్లో 183.33 స్ట్రయిక్ రేటును దినేష్ కార్తీక్ నమోదు చేశాడు. చివరగా ఫెయిర్ ప్లే అవార్డు మాత్రం రాజస్థాన్ జట్టును వరించింది.
తాజావార్తలు
-
Chiranjeevi: నా అభిమానులు ఎస్కేఎన్, సాయి రాజేష్లను చూసి గర్వపడుతున్నా..
-
Delhi Protest : దేశ రాజధానిలో మళ్లీ రగిలిన ఉద్రిక్తతలు.. జంతర్ మంతర్ వద్ద రణరంగం.!
-
CM Revanth Reddy : మున్సిపల్ అధికారులకు సీఎం రేవంత్ అల్టిమేటం..
-
Vaibhav Sooryavanshi: జింబాబ్వే సిరీస్పై కన్నేసిన వైభవ్ సూర్యవంశీ.. ‘ఈ సిరీస్ వదిలే ప్రసక్తే లేదు’..
-
HYDRA Ranganath: రూ.1.5 లక్షల కోట్ల ప్రభుత్వ భూములు కాపాడాం
ట్రెండింగ్
-
Natural Drinks : రక్తంలో యూరిక్ యాసిడ్ తగ్గాలంటే.. ఈ నాచురల్ డ్రింక్స్ తప్పక తాగండి
-
Palakura Chutney Recipe : ప్రోటీన్, కాల్షియం పుష్కలంగా ఉండే పాలకూర చట్నీ.. 10 నిమిషాల్లో రెడీ.!
-
Home Hacks : కాంతి తగ్గిన బల్బు మార్చొద్దు.. ఈ చిన్న ట్రిక్తో వెలుగు డబుల్.!
-
Nicholas Pooran: ముంబై స్టార్ ప్లేయర్ విధ్వంసం.. పాకిస్తాన్ బౌలర్ బతిమాడేలా ఆడాడుగా!
-
IND vs ZIM 1st T20: నయా బ్యాటింగ్-బౌలింగ్ లైనప్.. ఇద్దరు అరంగేట్రం.. టీమిండియా డేంజరస్ ప్లేయింగ్ 11 ఇదే!