Vaibhav Sooryavanshi: సచిన్ తర్వాత మరో యువ సంచలనం.. వైభవ్ సూర్యవంశీ కోసం బీసీసీఐ ప్రత్యేక ఏర్పాట్లు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Vaibhav Sooryavanshi: భారత యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ త్వరలో జరగనున్న ఐర్లాండ్, ఇంగ్లండ్ పర్యటనల్లో తన తల్లిదండ్రులతో కలిసి ప్రయాణించనున్నాడు. ఈ ప్రత్యేక నిర్ణయాన్ని భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) తీసుకుంది. కేవలం 15 ఏళ్ల వయసులోనే భారత జట్టులో చోటు దక్కించుకున్న వైభవ్కు కొత్త వాతావరణంలో అలవాటు పడేందుకు ఈ ఏర్పాట్లు చేస్తున్నట్లు బీసీసీఐ కార్యదర్శి దేవజిత్ సైకియా వెల్లడించారు. అంతే కాదు.. వైభవ్ తల్లిదండ్రుల ప్రయాణ ఖర్చులను కూడా బీసీసీఐనే భరిస్తుందని సైకియా తెలిపారు. సీనియర్ జాతీయ జట్టులో 14 లేదా 15 ఏళ్ల వయసున్న ఆటగాడు ఉండటం చాలా అరుదైన విషయమని, ఇలాంటి పరిస్థితుల్లో యువ ఆటగాడికి కుటుంబ సభ్యుల మద్దతు ఎంతో అవసరమని ఆయన పేర్కొన్నారు.
“గతంలో సచిన్ టెండూల్కర్ చాలా చిన్న వయసులోనే భారత జట్టులోకి వచ్చాడు. ఇప్పుడు వైభవ్ సూర్యవంశీ కూడా అలాంటి అరుదైన ప్రతిభగా ఎదిగాడు. సీనియర్ జట్టులో మిగతా ఆటగాళ్లు, సిబ్బంది అంతా పెద్దవాళ్లే. అలాంటి వాతావరణంలో ఒక చిన్న వయస్కుడు సౌకర్యంగా ఉండేందుకు తల్లిదండ్రులు దగ్గర ఉండటం ఉపయోగపడుతుందని భావించాం” అని సైకియా తెలిపారు.
Also Read
- Vaibhav Sooryavanshi: ఐసీసీ ర్యాంకింగ్స్లో రాకెట్ వేగంతో దూసుకెళ్లిన వైభవ్.. ఏకంగా 230 స్థానాలు జంప్..
- VVS Laxman vs Gautam Gambhir: ఇప్పుడు గంభీర్ వర్సెస్ లక్ష్మణ్ చర్చ ఎందుకు..?
- Rohit Sharma: 2027 ప్రపంచకప్లో రోహిత్ శర్మ ఉండాలా..? మాజీ క్రికెటర్ ఆసక్తికర వ్యాఖ్యలు..
- Vaibhav Sooryavanshi: వైభవ్ బ్యాట్ మళ్లీ గర్జించేది ఎప్పుడు? తదుపరి మ్యాచ్ ఎప్పుడు? అభిమానుల్లో ఆసక్తి
ఐపీఎల్లో అద్భుత ప్రదర్శన
ఐపీఎల్ 2026లో వైభవ్ సూర్యవంశీ అద్భుత ప్రదర్శన కనబరిచాడు. టోర్నీలో 776 పరుగులు చేసి అత్యధిక పరుగులు సాధించిన బ్యాటర్గా నిలిచాడు. 237.30 స్ట్రైక్రేట్తో ప్రత్యర్థి బౌలర్లపై విరుచుకుపడ్డాడు. అతని ప్రదర్శనకు గుర్తింపుగా ఆరెంజ్ క్యాప్, మోస్ట్ వాల్యూబుల్ ప్లేయర్, ఎమర్జింగ్ ప్లేయర్ అవార్డులు దక్కాయి. ఈ అద్భుత ప్రదర్శనతోనే అతనికి భారత టీ20 జట్టులో తొలి పిలుపు వచ్చింది. భారత క్రికెట్ భవిష్యత్తు స్టార్గా ఇప్పటికే వైభవ్పై భారీ అంచనాలు నెలకొన్నాయి.
శ్రీలంకలో వివాదం
సీనియర్ జట్టులో చేరకముందు వైభవ్ భారత-ఏ తరఫున శ్రీలంకలో జరిగిన త్రైసిరీస్లో ఆడాడు. ఆఫ్ఘనిస్తాన్-ఏ, శ్రీలంక-ఏ జట్లతో జరిగిన ఈ టోర్నీలో ఒక మ్యాచ్ సందర్భంగా ఆతిథ్య జట్టు ఆటగాడితో మైదానంలో వాగ్వాదం చోటుచేసుకుంది. ఈ ఘటన సోషల్ మీడియాలో చర్చనీయాంశమైంది. అయితే ఈ వ్యవహారంలో బీసీసీఐ జోక్యం చేసుకోదని దేవజిత్ సైకియా స్పష్టం చేశారు. మ్యాచ్లో జరిగిన సంఘటనలపై నిర్ణయం తీసుకునే అధికారం మ్యాచ్ రిఫరీలు, అంపైర్లకే ఉంటుందని చెప్పారు. “మైదానంలో జరిగే విషయాలపై నిర్ణయం తీసుకునేందుకు ప్రత్యేక వ్యవస్థ ఉంది. బీసీసీఐ ఆ పరిధిలోకి వెళ్లదు” అని ఆయన వివరించారు.
కొత్త ప్రయాణానికి సిద్ధమైన వైభవ్
భారత జట్టులో చోటు దక్కించుకున్న అతి పిన్న వయస్కులలో ఒకరిగా నిలిచిన వైభవ్ సూర్యవంశీ.. ఐర్లాండ్ మరియు ఇంగ్లండ్ పర్యటనల ద్వారా తన అంతర్జాతీయ కెరీర్ను ప్రారంభించబోతున్నాడు. ఈ పర్యటనలో కుటుంబ సభ్యుల అండతో మరింత ఆత్మవిశ్వాసంతో రాణించాలని అభిమానులు ఆశిస్తున్నారు.. అయితే, ఐపీఎల్లో అద్భుతమైన ప్రదర్శన తర్వాత వైభవ్ సూర్యవంశీ ఏ మ్యాచ్ ఆడినా.. బ్యాటింగ్ ఎలా చేస్తాడు.. ఎన్ని పరుగులు చేస్తాడు.. వైభవ్ బ్యాటింగ్ ఎలా ఉంది.. ఇలాంటి అంశాలపై క్రికెట్ ఫ్యాన్స్ ఫోకస్ పెట్టారు..
తాజావార్తలు
-
Off The Record: కందుకూరు పాలిటిక్స్లో కొత్త ట్విస్ట్.. మానుగుంట మహీధర్ రెడ్డి మళ్లీ రంగంలోకి?
-
OTR : హైకోర్టు తీర్పుతో BRSకు బ్రహ్మాస్త్రమా? HYDRAపై కొత్త వ్యూహంతో గ్రేటర్ ఎన్నికలే టార్గెట్!
-
Sleeping Less Than 5 Hours?: రోజుకు 5 గంటల కంటే తక్కువ నిద్రపోతున్నారా? ఎంత ప్రమాదమో తెలుసా?
-
CM Vijay: మెట్రోలో ప్రయాణించిన సీఎం విజయ్.. ప్రయాణికులతో సంభాషణ.. అభిమానులు కేరింతలు
-
China: అమెరికా శత్రువులతో చైనా ఒప్పందం.. ప్రపంచం ముందు మరో సంక్షోభం..
ట్రెండింగ్
-
Health Tips : వర్షాకాలంలో గొంతు నొప్పా? ఈ అల్లం-బెల్లం కషాయం ట్రై చేయండి.!
-
Protein Tips : పనీర్ తింటున్నారా? పచ్చిదా.. వండిందా.. ఏది బెస్ట్.?
-
7,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో వచ్చేస్తున్న బడ్జెట్ ఫోన్ OnePlus N6x.!
-
AI ఫీచర్లు, Intel Core Ultra ప్రాసెసర్లతో Dell XPS 13, Dell 14S, Dell 16S, Alienware 15 ల్యాప్టాప్లు లాంచ్..!
-
Subhadeep Ghosh: టీమిండియా కొత్త కోచ్గా మాజీ క్రికెటర్.. ఎవరీ సుభదీప్ ఘోష్?.. అంత తోపా!