Hyderabad: టీమిండియాలో హైదరాబాద్ యువకుడు మహమ్మద్ మాలిక్కు అవకాశం లభించింది. అండర్-19 ఏ జట్టులో చోటు దక్కించుకున్న మాలిక్ ప్రస్తుతం ఫాస్ట్ బౌలర్గా అద్భుత ప్రతిభ కనబరుస్తున్నాడు. నాంపల్లి మల్లెపల్లికి చెందిన ఈ యువ క్రికెటర్ వినూ మన్కడ్ ట్రోఫీలో తన ప్రతిభతో అందరినీ ఆకట్టుకున్నాడు. ఆ టోర్నమెంట్లో మాలిక్ అత్యధిక వికెట్లు తీసి టాప్ వికెట్ టేకర్గా నిలిచాడు.
దక్షిణాఫ్రికా-ఎతో జరిగే రెండు టెస్ట్ మ్యాచ్ల సిరీస్ కోసం బీసీసీఐ మంగళవారం భారత్-ఎ జట్టును ప్రకటించింది. కెప్టెన్గా రిషబ్ పంత్, వైస్ కెప్టెన్గా సాయి సుదర్శన్ వ్యవహరించనున్నారు. జట్టులో సీనియర్, జూనియర్ ఆటగాళ్లకు చోటు దక్కింది. అయితే దేశవాళీ క్రికెట్లో పరుగుల సునామీ సృష్టిస్తున్న టీమిండియా బ్యాట్స్మన్ సర్ఫరాజ్ ఖాన్కు మాత్రం చోటు దక్కలేదు. ఇది అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. మాజీ క్రికెటర్స్ సహా అభిమానూలు బీసీసీఐ, సెలెక్టర్లపై ఫైర్ అవుతున్నారు. తాజాగా టీమిండియా హెడ్ కోచ్…