Commonwealth Games: బార్బడోస్పై భారత మహిళల తాండవం.. సెమీస్లో చోటు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Indian Women Team Won Against Barbados In Commomwealth Games 2022: కామన్వెల్త్ గేమ్స్లో భాగంగా బుధవారం రాత్రి జరిగిన తాడోపేడో టీ20 మ్యాచ్లో.. బార్బడోస్పై భారత మహిళల జట్టు ఘనవిజయం సాధించింది. ఆల్రౌండ్ ప్రతిభతో ప్రత్యర్థి జట్టుని చిత్తు చేసి.. సెమీస్లో బెర్తు కన్ఫమ్ చేసుకుంది. ఎడ్జ్బాస్టన్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్లో.. టాస్ గెలిచిన బార్బడోస్ జట్టు బౌలింగ్ ఎంపిక చేసుకుంది. దీంతో రంగంలోకి దిగిన భారత అమ్మాయిలు.. మొదట్నుంచే చెలరేగిపోయారు. ఓపెనర్ స్మృతి మందాన 5 పరుగులకే పెవిలియన్ చేరి నిరాశపరిస్తే.. షెఫాలీ వర్మ (43)తో కలిసి రోడ్రిగ్స్ (56) పరుగుల వర్షం కురిపించింది. రెండో వికెట్కి వీళ్లిద్దరు 71 పరుగుల భాగస్వామ్యాన్ని జోడించారు.
అయితే.. ఆ తర్వాత వెనువెంటనే వికెట్లు పడ్డాయి. ఇది భారత జట్టుపై కాస్త ఒత్తిడి పెంచింది. ఆ సమయంలో వచ్చిన దీప్తి శర్మ (34).. రోడ్రిగ్స్తో కలిసి ఆచితూచి ఆడింది. వికెట్ పడకుండా 70 పరుగుల భాగస్వామ్యాన్ని జోడించారు. తద్వారా.. భారత జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 162 పరుగులు చేసింది. 163 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన బార్బడోస్, ఆది నుంచే తడబడింది. భారత బౌలర్ల ధాటిని తట్టుకోలేక, వరుసగా వికెట్లు కోల్పోయింది. ప్రత్యర్థి జట్టులో కైషోన నైట్ చేసిన 16 పరుగులే అత్యధిక వ్యక్తిగత స్కోరు అంటే, పరిస్థితి ఏంటో అర్థం చేసుకోవచ్చు. ఆరు మంది ప్లేయర్లు సింగిల్ డిజిట్కే పరిమితమైతే, మరో ఇద్దరు డకౌట్ అయ్యారు. షంకేరా సెల్మాన్ చేసిన 12 పరుగులు రెండో అత్యధిక వ్యక్తిగతం.
Also Read
- SRH vs GT : గుజరాత్ ధాటికి సన్రైజర్స్ కుప్పకూలింది.. 86 పరుగులకే ఆలౌట్.!
- Axar Patel: విజయం సాధించిన లేని ఆనందం.. ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్కు భారీ జరిమానా..!
- Virat Kohli: కోహ్లీ విమర్శలను పట్టించుకోడనేది అబద్దం.. సంజయ్ మంజ్రేకర్ ఆసక్తికర వ్యాఖ్యలు!
- GT vs SRH Playing 11: మొదట ప్లే-ఆఫ్ చేరేది ఎవరో.!
ప్రత్యర్థి జట్టులో ఏ ఒక్కరూ నిలకడగా రాణించలేకపోయారు. కనీసం స్ట్రైక్ రొటేట్ చేయడానికి కూడా ప్రయత్నించలేదు. భారత బౌలర్ల దెబ్బకు బార్బడోస్ 62 పరుగులకే కుప్పకూలింది. ఫలితంగా.. భారత మహిళల జట్టు 100 పరుగుల తేడాతో భారీ విజయాన్ని సాధించింది. భారత బౌలర్లలో రేణుకా సింగ్ 4 వికెట్లు తీసుకోగా, మేఘనా సింగ్, స్నేహ్ రాణా, రాధా యాదవ్, హర్మన్ ప్రీత్ చెరో వికెట్ తీసుకున్నారు. ఈ విజయంతో భారత జట్టు గ్రూప్-ఏ లో సెమీస్కు దూసుకెళ్లింది.
తాజావార్తలు
-
SRH vs GT : గుజరాత్ ధాటికి సన్రైజర్స్ కుప్పకూలింది.. 86 పరుగులకే ఆలౌట్.!
-
Off The Record : ఆపరేషన్ ఆకర్ష్ రివర్స్? టీడీపీ నేతలపై వైసీపీ కన్ను.. ఏపీ రాజకీయాల్లో కొత్త మలుపు!
-
Piyush Goyal: అందరం కలిసి ముందుకెళ్లాల్సిన సమయం వచ్చింది.. పరిశ్రమలకు పీయూష్ గోయల్ హెచ్చరిక
-
Anjali Sardana: 23 ఏళ్ల యువతి.. రూ.1700 కోట్ల సామ్రాజ్యం!
-
Story Board : ప్రధాని మోడీ స్పీచ్ దారి తప్పిందా ? ఏదో చెప్పాలని..ఇంకేదో చెప్పారా ?
ట్రెండింగ్
-
Matt Berger Fossil Discovery : కుక్క వెంట పరిగెత్తి.. 20 లక్షల ఏళ్ల రహస్యం బయటపెట్టిన బాలుడు.!
-
Met Gala 2026 : బంగారు కాళ్లతో మెరిసిన మోడల్.. ప్రాణాల మీదకు తెచ్చిన ఆ ఒక్క పొరపాటు.!
-
క్లచ్ లేకుండానే గేర్ మార్పులు.. ఈ-క్లచ్ టెక్నాలజీతో Honda NX500 లాంచ్..
-
స్టైలిష్ లుక్ + పవర్ ఫుల్ బ్యాటరీతో లాంచ్ కు సిద్దమైన Realme 16T 5G.!
-
TVK Floor Test: మద్రాస్ హైకోర్టు సంచలన తీర్పు.. బలపరీక్షకు ముందే టీవీకేకు కోలుకోలేని దెబ్బ!