Commonwealth Games: బార్బడోస్పై భారత మహిళల తాండవం.. సెమీస్లో చోటు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Indian Women Team Won Against Barbados In Commomwealth Games 2022: కామన్వెల్త్ గేమ్స్లో భాగంగా బుధవారం రాత్రి జరిగిన తాడోపేడో టీ20 మ్యాచ్లో.. బార్బడోస్పై భారత మహిళల జట్టు ఘనవిజయం సాధించింది. ఆల్రౌండ్ ప్రతిభతో ప్రత్యర్థి జట్టుని చిత్తు చేసి.. సెమీస్లో బెర్తు కన్ఫమ్ చేసుకుంది. ఎడ్జ్బాస్టన్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్లో.. టాస్ గెలిచిన బార్బడోస్ జట్టు బౌలింగ్ ఎంపిక చేసుకుంది. దీంతో రంగంలోకి దిగిన భారత అమ్మాయిలు.. మొదట్నుంచే చెలరేగిపోయారు. ఓపెనర్ స్మృతి మందాన 5 పరుగులకే పెవిలియన్ చేరి నిరాశపరిస్తే.. షెఫాలీ వర్మ (43)తో కలిసి రోడ్రిగ్స్ (56) పరుగుల వర్షం కురిపించింది. రెండో వికెట్కి వీళ్లిద్దరు 71 పరుగుల భాగస్వామ్యాన్ని జోడించారు.
అయితే.. ఆ తర్వాత వెనువెంటనే వికెట్లు పడ్డాయి. ఇది భారత జట్టుపై కాస్త ఒత్తిడి పెంచింది. ఆ సమయంలో వచ్చిన దీప్తి శర్మ (34).. రోడ్రిగ్స్తో కలిసి ఆచితూచి ఆడింది. వికెట్ పడకుండా 70 పరుగుల భాగస్వామ్యాన్ని జోడించారు. తద్వారా.. భారత జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 162 పరుగులు చేసింది. 163 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన బార్బడోస్, ఆది నుంచే తడబడింది. భారత బౌలర్ల ధాటిని తట్టుకోలేక, వరుసగా వికెట్లు కోల్పోయింది. ప్రత్యర్థి జట్టులో కైషోన నైట్ చేసిన 16 పరుగులే అత్యధిక వ్యక్తిగత స్కోరు అంటే, పరిస్థితి ఏంటో అర్థం చేసుకోవచ్చు. ఆరు మంది ప్లేయర్లు సింగిల్ డిజిట్కే పరిమితమైతే, మరో ఇద్దరు డకౌట్ అయ్యారు. షంకేరా సెల్మాన్ చేసిన 12 పరుగులు రెండో అత్యధిక వ్యక్తిగతం.
Also Read
- World Cup: కేవలం 30 సెకన్ల మీటింగ్.. వరల్డ్ కప్ కొట్టిన భారత్.. సంచలన రహస్యం చెప్పిన కెప్టెన్..
- Team India Injuries: టీమిండియాకు వరుస షాక్లు.. కోహ్లీ ఔట్.. రోహిత్కు గాయం..! హార్దిక్ కూడా అనుమానమేనా..?
- Shubman Gill: ఆ ఒక్క మార్పుతోనే శుభ్మన్ గిల్ పరుగుల వరద.. సీక్రెట్ బయటపెట్టిన అశ్విన్..
- Krunal Pandya: హార్దిక్ పాండ్యాకు కృనాల్కు మధ్య విభేదాలు.. ఎట్టకేలకు ఏం జరిగిందో చెప్పిన కృనాల్ పాండ్య..
ప్రత్యర్థి జట్టులో ఏ ఒక్కరూ నిలకడగా రాణించలేకపోయారు. కనీసం స్ట్రైక్ రొటేట్ చేయడానికి కూడా ప్రయత్నించలేదు. భారత బౌలర్ల దెబ్బకు బార్బడోస్ 62 పరుగులకే కుప్పకూలింది. ఫలితంగా.. భారత మహిళల జట్టు 100 పరుగుల తేడాతో భారీ విజయాన్ని సాధించింది. భారత బౌలర్లలో రేణుకా సింగ్ 4 వికెట్లు తీసుకోగా, మేఘనా సింగ్, స్నేహ్ రాణా, రాధా యాదవ్, హర్మన్ ప్రీత్ చెరో వికెట్ తీసుకున్నారు. ఈ విజయంతో భారత జట్టు గ్రూప్-ఏ లో సెమీస్కు దూసుకెళ్లింది.
తాజావార్తలు
-
World Cup: కేవలం 30 సెకన్ల మీటింగ్.. వరల్డ్ కప్ కొట్టిన భారత్.. సంచలన రహస్యం చెప్పిన కెప్టెన్..
-
High Protein Roti Recipe: గోధుమ పిండిలో ఈ 3 పదార్థాలు కలపండి.. హై ప్రోటీన్ రోటీ రెడీ..
-
Ameerpet Fire Accident : అగ్ని సెగలతో మెట్రో పిల్లర్కు క్రాక్.. రంగంలోకి జేఎన్టీయూ నిపుణులు
-
Forbes Billionaires List: 4 గదుల ఫ్లాట్ నుంచి 92.8 బిలియన్ డాలర్ల సామ్రాజ్యం వరకు..! అంబానీని దాటేసిన టిక్టాక్ సృష్టికర్త..
-
DK.Shivakumar: డీకే.శివకుమార్ కేబినెట్పై విమర్శలు.. మహిళలకు చోటు లేకపోవడంపై నిలదీత
ట్రెండింగ్
-
Home Remedies : రాత్రిపూట దోమల బెడదా..? దీన్ని ఒక నిమ్మకాయలో పిండి, మీ దిండు దగ్గర ఉంచుకోండి..!
-
Xiaomi 17T భారత్లో లాంచ్.! Leica కెమెరాలు, 6500mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్ప్లేతో ప్రీమియం స్మార్ట్ఫోన్..
-
Motorola edge 70 pro+ లాంచ్.. మిలిటరీ గ్రేడ్ సర్టిఫికేషన్, 50MP క్వాడ్ కెమెరాలు, 6.99 మి.మీ. మందంతో అదిరిపోయే ఫోన్..
-
Heart Disease: లైంగిక సమస్య గుండెపోటుకు దారి తీస్తోందా.? అసలు నిజమేంటంటే.!
-
రూ.11,999కే Lava Bold N2 5G స్మార్ట్ఫోన్ లాంచ్.. 6000mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో పాటు.!