INDW vs WIW: వెస్టిండీస్ చిత్తు.. సత్తా చాటిన భారత అమ్మాయిలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Indian Women Cricket Team Won Against West Indies In T20 World Cup: మహిళల టీ20 ప్రపంచకప్లో మన భారత అమ్మాయిలు అదరగొట్టేశారు. గ్రూప్-బీలో వెస్టిండీస్తో జరిగిన మ్యాచ్లో 6 వికెట్ల తేడాతో భారత్ విజయం సాధించింది. వెస్టిండీస్ నిర్దేశించిన 119 పరుగుల లక్ష్యాన్ని 18.1 ఓవర్లలో భారత అమ్మాయిలు ఛేధించారు. షెఫాలీ వర్మ (28), హర్మన్ ప్రీత్ కౌర్ (33), రిచా ఘోష్ (44) రాణించడంతో.. భారత మహిళల జట్టు వరల్డ్ కప్ నెగ్గింది. తొలుత వెస్టిండీస్ బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ వేయడంతో.. బారత్ ఆశలు సన్నగిల్లాయి. కానీ, మన అమ్మాయిలు అంత సులభంగా ఓటమిని అంగీకరించలేదు. విండీస్ బౌలర్లను ధీటుగా ఎదుర్కొంటూ.. ఫైనల్గా జట్టుని గెలిపించారు.
Pooja Hegde: ఇకనుంచి ఆఫర్లు కావాలంటే.. పూజా ఆ పని చేయాల్సిందే..?
Also Read
- Vaibhav Sooryavanshi: 3 మ్యాచ్లు.. కేవలం 42 పరుగులు.. వైభవ్ సూర్యవంశీకి నేడే 'అగ్ని పరీక్ష'!
- Sri Charani: చరిత్ర సృష్టించిన కడప బిడ్డ.. టెస్ట్ ఫార్మాట్లోకి అడుగు పెట్టిన తెలుగమ్మాయి..
- BCCI: టీమ్ ఇండియా కోచింగ్ టీమ్లో మార్పులు..! గంభీర్ సహాయకుల్లో ఇద్దరిని తొలగిస్తారా..?
- Virat Kohli: లండన్లో ఆ ప్లేయర్తో విరాట్ సీక్రెట్ మీటింగ్.. రెండు గంటల్లోనే వైరల్ ఫొటోలు చూసి కోహ్లీ షాక్!
తొలుత టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంపిక చేసుకున్న వెస్టిండీస్.. నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 118 పరుగులు మాత్రమే చేయగలిగింది. తొలుత కెప్టెన్ హేలీ మాథ్యూస్ వెంటనే ఔట్ అవ్వడంతో.. విండీస్కి గట్టి దెబ్బ తగిలినట్టయ్యింది. అయితే.. ఆ తర్వాత వచ్చిన క్యాంప్బెల్(30)తో కలిసి స్టెఫనీ టేలర్ జట్టుని ముందుకు నడిపించింది. వెంటనే మరో వికెట్ పడకుండా వీళ్లిద్దరూ ఆచితూచి ఆడుతూ.. స్కోర్ బోర్డుని ముందుకు తీసుకెళ్లారు. రెండో వికెట్కి ఈ ఇద్దరు 73 పరుగుల భాగస్వామ్యాన్ని జోడించారు. ఇక చివర్లో చెడియన్ (21), షబికా (15) పర్వాలేదనిపించడంతో.. వెస్టిండీస్ జట్టు గౌరవప్రదమైన స్కోరు చేయగలిగింది. భారత బౌలర్ల విషయానికొస్తే.. దీప్తి శర్మ మూడు వికెట్లు తీయగా, రేణుక సింగ్ & పూజా వస్త్రాకర్ చెరో వికెట్ తీసుకున్నారు. ఈ మ్యాచ్లో దీప్తి శర్మ మూడు వికెట్లు తీయడంతో, అంతర్జాతీయ టీ20ల్లో వంద వికెట్ల మైలురాయిని అందుకుంది.
Manikrao Thakre: పొత్తులు అనేవి ఉండవు.. ఒంటరిగానే ఎన్నికలకు వెళ్తాం
ఇక 119 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ శుభారంభమే చేసింది. షెఫాలి, స్మృతి కలిసి తొలి వికెట్కి 32 పరుగుల భాగస్వామ్యం జోడించారు. అయితే.. ఆ వెంటనే రెండు ఝలక్కు తగిలాయి. స్మృతి(10) ఔటైనా కాసేపటికీ జెమిమా రోడ్రింగ్స్ (1) పెవిలియన్ చేరింది. దీంతో.. టీమిండియాపై ఒత్తిడి పెరిగింది. అప్పుడు హర్మన్ ప్రీత్ కౌర్ (33) కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడి జట్టుని ఆదుకోగా.. రిచా ఘోస్ (44) దుమ్ముదులిపేసి జట్టుని గెలుపు దిశగా పరుగులు పెట్టించింది. బ్యాటింగ్లో ఈ ఇద్దరు సమర్థవంతంగా రాణించడం వల్లే.. ఫైనల్లో భారత్ విజయకేతనం ఎగరవేయగలిగింది. ఈ టోర్నీలో భారత్కి ఇది రెండో విజయం. ఇదివరకే పాకిస్తాన్పై టీమిండియా గెలుపొందిన విషయం తెలిసిందే!
తాజావార్తలు
-
Vaibhav Sooryavanshi: 3 మ్యాచ్లు.. కేవలం 42 పరుగులు.. వైభవ్ సూర్యవంశీకి నేడే ‘అగ్ని పరీక్ష’!
-
Vietnam: వియత్నాంలో ఘోర బోటు ప్రమాదం.. 18 మంది తెలుగు టూరిస్ట్లు మృతి
-
Jaipur Murder: ప్రభుత్వ ఉద్యోగం కోసం తల్లిని మాత్రమే కాదు, తండ్రిని కూడా చంపింది.!
-
Petrol Diesel Price Hike: వామ్మో.. ఒకేసారి రూ.13 పెరగనున్న పెట్రోల్, డీజిల్ ధరలు.. ఆ దేశ ప్రభుత్వం సంచలన ప్రకటన!
-
PM Modi: న్యూజిలాండ్లో కన్నీళ్లు పెట్టుకున్న ప్రధాని మోడీ .. ఆ గిఫ్ట్ను చూపిస్తూ స్టేజ్ పైనే భావోద్వేగం!
ట్రెండింగ్
-
అబ్బో.. BSNL ప్లాన్ మాములుగా లేదుగా.! 5TB డేటా, 200Mbps స్పీడ్, ఫ్రీ OTTలు..
-
Kanpur: డ్రైవ్లో బాలికలు, మహిళల ప్రైవేట్ వీడియోలు.. గూగుల్ అలర్ట్తో పోలీసులకు చిక్కిన యువకుడు.!
-
New Car Features: మైలేజ్ రోజులు పోయాయి.. ఇప్పుడు కార్లలో ఈ ఫీచర్లకే భారీ క్రేజ్.!
-
మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీ, HD+ డిస్ప్లే, IR బ్లాస్టర్తో రాబోతున్న Itel Zeno 100 Pro.!
-
డాల్బీ ఆటమ్స్ సపోర్ట్, AI కెమెరా ఫీచర్లతో గ్రాండ్ ఎంట్రీకి సిద్దమైన TECNO CAMON 50 Ultra 5G..!