INDW vs WIW: వెస్టిండీస్ చిత్తు.. సత్తా చాటిన భారత అమ్మాయిలు
Indian Women Cricket Team Won Against West Indies In T20 World Cup: మహిళల టీ20 ప్రపంచకప్లో మన భారత అమ్మాయిలు అదరగొట్టేశారు. గ్రూప్-బీలో వెస్టిండీస్తో జరిగిన మ్యాచ్లో 6 వికెట్ల తేడాతో భారత్ విజయం సాధించింది. వెస్టిండీస్ నిర్దేశించిన 119 పరుగుల లక్ష్యాన్ని 18.1 ఓవర్లలో భారత అమ్మాయిలు ఛేధించారు. షెఫాలీ వర్మ (28), హర్మన్ ప్రీత్ కౌర్ (33), రిచా ఘోష్ (44) రాణించడంతో.. భారత మహిళల జట్టు వరల్డ్ కప్ నెగ్గింది. తొలుత వెస్టిండీస్ బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ వేయడంతో.. బారత్ ఆశలు సన్నగిల్లాయి. కానీ, మన అమ్మాయిలు అంత సులభంగా ఓటమిని అంగీకరించలేదు. విండీస్ బౌలర్లను ధీటుగా ఎదుర్కొంటూ.. ఫైనల్గా జట్టుని గెలిపించారు.
Pooja Hegde: ఇకనుంచి ఆఫర్లు కావాలంటే.. పూజా ఆ పని చేయాల్సిందే..?
Also Read
- IPL 2026: ‘వెళ్లి గల్లీ క్రికెట్ ఆడుకో’.. ఆ ఆటగాడిపై తీవ్ర ఆగ్రహం..
- SRH Players Dance: గ్రౌండ్లో బ్యాట్తోనే కాదు.. ఫ్లోర్పై డాన్స్తో కూడా అదరగొడుతున్న SRH ఆటగాళ్లు.. వీడియో వైరల్!
- Nandre Burger: కోడ్ ఆఫ్ కండక్ట్ ఉల్లంఘన.. రాజస్థాన్ రాయల్స్ ప్లేయర్ కు జరిమానా, డీమెరిట్ పాయింట్ కూడా.!
- Ravindra Jadeja: అయ్యబాబోయ్.. కాస్త ఉంటే అభిమానులను కొట్టేలాగా ఉన్నాడే.! వీడియో వైరల్
తొలుత టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంపిక చేసుకున్న వెస్టిండీస్.. నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 118 పరుగులు మాత్రమే చేయగలిగింది. తొలుత కెప్టెన్ హేలీ మాథ్యూస్ వెంటనే ఔట్ అవ్వడంతో.. విండీస్కి గట్టి దెబ్బ తగిలినట్టయ్యింది. అయితే.. ఆ తర్వాత వచ్చిన క్యాంప్బెల్(30)తో కలిసి స్టెఫనీ టేలర్ జట్టుని ముందుకు నడిపించింది. వెంటనే మరో వికెట్ పడకుండా వీళ్లిద్దరూ ఆచితూచి ఆడుతూ.. స్కోర్ బోర్డుని ముందుకు తీసుకెళ్లారు. రెండో వికెట్కి ఈ ఇద్దరు 73 పరుగుల భాగస్వామ్యాన్ని జోడించారు. ఇక చివర్లో చెడియన్ (21), షబికా (15) పర్వాలేదనిపించడంతో.. వెస్టిండీస్ జట్టు గౌరవప్రదమైన స్కోరు చేయగలిగింది. భారత బౌలర్ల విషయానికొస్తే.. దీప్తి శర్మ మూడు వికెట్లు తీయగా, రేణుక సింగ్ & పూజా వస్త్రాకర్ చెరో వికెట్ తీసుకున్నారు. ఈ మ్యాచ్లో దీప్తి శర్మ మూడు వికెట్లు తీయడంతో, అంతర్జాతీయ టీ20ల్లో వంద వికెట్ల మైలురాయిని అందుకుంది.
Manikrao Thakre: పొత్తులు అనేవి ఉండవు.. ఒంటరిగానే ఎన్నికలకు వెళ్తాం
ఇక 119 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ శుభారంభమే చేసింది. షెఫాలి, స్మృతి కలిసి తొలి వికెట్కి 32 పరుగుల భాగస్వామ్యం జోడించారు. అయితే.. ఆ వెంటనే రెండు ఝలక్కు తగిలాయి. స్మృతి(10) ఔటైనా కాసేపటికీ జెమిమా రోడ్రింగ్స్ (1) పెవిలియన్ చేరింది. దీంతో.. టీమిండియాపై ఒత్తిడి పెరిగింది. అప్పుడు హర్మన్ ప్రీత్ కౌర్ (33) కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడి జట్టుని ఆదుకోగా.. రిచా ఘోస్ (44) దుమ్ముదులిపేసి జట్టుని గెలుపు దిశగా పరుగులు పెట్టించింది. బ్యాటింగ్లో ఈ ఇద్దరు సమర్థవంతంగా రాణించడం వల్లే.. ఫైనల్లో భారత్ విజయకేతనం ఎగరవేయగలిగింది. ఈ టోర్నీలో భారత్కి ఇది రెండో విజయం. ఇదివరకే పాకిస్తాన్పై టీమిండియా గెలుపొందిన విషయం తెలిసిందే!
తాజావార్తలు
-
Easy Mango Lassi Recipe: క్షణాల్లో అదిరిపోయే మామిడి లస్సీ.. ఒక్క గ్లాస్తో ఆగరు అంతే..
-
Donald Trump: ‘‘బిడ్డను కనడానికే వస్తారు’’.. భారతీయులపై ట్రంప్ అక్కసు..
-
Soft Pink Lips Tips: మీ పెదాలు మృదువుగా.. గులాబీ రంగులో మెరిసిపోయే చిట్కాలు ఇవే..
-
Darling Re-release: రీ-రిలీజ్లో ‘డార్లింగ్’ విధ్వంసం.. మైండ్ బ్లాకింగ్ కలెక్షన్స్!
-
OMG: ఆడుకుంటూ గంగాళంలో ఇరుక్కున్న చిన్నారి.. చివరి ప్రయత్నంలో ఇలా..
ట్రెండింగ్
-
రూ. 9,999కే 6.88 అంగుళాల పెద్ద స్క్రీన్, 5200mAh బ్యాటరీ.. POCO C81 సిరీస్ లాంచ్..!
-
Lava Bold N1 5G కొత్త వేరియంట్ లాంచ్.. ధర కూడా తక్కువే.!
-
Moong Dal Pakoda Recipe: శనగపిండి వాడకుండా ఆరోగ్యకరంగా, రుచిగా ఉండే ‘పెసరపప్పు పకోడీ’లను చేసేయండి ఇలా..!
-
మిడ్-రేంజ్లో ఫ్లాగ్షిప్ ఫీచర్లు.. 200MP కెమెరా, 5-స్టార్ డ్రాప్ & క్రష్ సర్టిఫికేషన్, 7000mAh బ్యాటరీతో HONOR 600 సిరీస్ లాంచ్..!
-
Kitchen Cleaning Hacks: మెరిసే పాత్రల కోసం చిట్కాలు.. పింగాణీ పాత్రలపై పసుపు మరకలను వదిలించుకోండిలా.!