INDW vs WIW: వెస్టిండీస్ చిత్తు.. సత్తా చాటిన భారత అమ్మాయిలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Indian Women Cricket Team Won Against West Indies In T20 World Cup: మహిళల టీ20 ప్రపంచకప్లో మన భారత అమ్మాయిలు అదరగొట్టేశారు. గ్రూప్-బీలో వెస్టిండీస్తో జరిగిన మ్యాచ్లో 6 వికెట్ల తేడాతో భారత్ విజయం సాధించింది. వెస్టిండీస్ నిర్దేశించిన 119 పరుగుల లక్ష్యాన్ని 18.1 ఓవర్లలో భారత అమ్మాయిలు ఛేధించారు. షెఫాలీ వర్మ (28), హర్మన్ ప్రీత్ కౌర్ (33), రిచా ఘోష్ (44) రాణించడంతో.. భారత మహిళల జట్టు వరల్డ్ కప్ నెగ్గింది. తొలుత వెస్టిండీస్ బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ వేయడంతో.. బారత్ ఆశలు సన్నగిల్లాయి. కానీ, మన అమ్మాయిలు అంత సులభంగా ఓటమిని అంగీకరించలేదు. విండీస్ బౌలర్లను ధీటుగా ఎదుర్కొంటూ.. ఫైనల్గా జట్టుని గెలిపించారు.
Pooja Hegde: ఇకనుంచి ఆఫర్లు కావాలంటే.. పూజా ఆ పని చేయాల్సిందే..?
Also Read
- Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీ.. 300 బంతులు ఆడగలనని ప్రపంచానికి చూపించాలి!
- Shubman Gill Record: శుభ్మన్ గిల్ అరుదైన రికార్డు.. సచిన్, సెహ్వాగ్ తర్వాత..!
- Saransh Jain Debut: ఐపీఎల్ ఆడకుండానే టీమిండియా డెబ్యూ.. మూడో ఆటగాడిగా సారాంశ్ జైన్ అరుదైన రికార్డు!
- Vaibhav Sooryavanshi: 8 పరుగులకే ఔట్.. అరంగేట్రంలోనే వైభవ్ సూర్యవంశీ అట్టర్ ఫ్లాఫ్!
తొలుత టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంపిక చేసుకున్న వెస్టిండీస్.. నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 118 పరుగులు మాత్రమే చేయగలిగింది. తొలుత కెప్టెన్ హేలీ మాథ్యూస్ వెంటనే ఔట్ అవ్వడంతో.. విండీస్కి గట్టి దెబ్బ తగిలినట్టయ్యింది. అయితే.. ఆ తర్వాత వచ్చిన క్యాంప్బెల్(30)తో కలిసి స్టెఫనీ టేలర్ జట్టుని ముందుకు నడిపించింది. వెంటనే మరో వికెట్ పడకుండా వీళ్లిద్దరూ ఆచితూచి ఆడుతూ.. స్కోర్ బోర్డుని ముందుకు తీసుకెళ్లారు. రెండో వికెట్కి ఈ ఇద్దరు 73 పరుగుల భాగస్వామ్యాన్ని జోడించారు. ఇక చివర్లో చెడియన్ (21), షబికా (15) పర్వాలేదనిపించడంతో.. వెస్టిండీస్ జట్టు గౌరవప్రదమైన స్కోరు చేయగలిగింది. భారత బౌలర్ల విషయానికొస్తే.. దీప్తి శర్మ మూడు వికెట్లు తీయగా, రేణుక సింగ్ & పూజా వస్త్రాకర్ చెరో వికెట్ తీసుకున్నారు. ఈ మ్యాచ్లో దీప్తి శర్మ మూడు వికెట్లు తీయడంతో, అంతర్జాతీయ టీ20ల్లో వంద వికెట్ల మైలురాయిని అందుకుంది.
Manikrao Thakre: పొత్తులు అనేవి ఉండవు.. ఒంటరిగానే ఎన్నికలకు వెళ్తాం
ఇక 119 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ శుభారంభమే చేసింది. షెఫాలి, స్మృతి కలిసి తొలి వికెట్కి 32 పరుగుల భాగస్వామ్యం జోడించారు. అయితే.. ఆ వెంటనే రెండు ఝలక్కు తగిలాయి. స్మృతి(10) ఔటైనా కాసేపటికీ జెమిమా రోడ్రింగ్స్ (1) పెవిలియన్ చేరింది. దీంతో.. టీమిండియాపై ఒత్తిడి పెరిగింది. అప్పుడు హర్మన్ ప్రీత్ కౌర్ (33) కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడి జట్టుని ఆదుకోగా.. రిచా ఘోస్ (44) దుమ్ముదులిపేసి జట్టుని గెలుపు దిశగా పరుగులు పెట్టించింది. బ్యాటింగ్లో ఈ ఇద్దరు సమర్థవంతంగా రాణించడం వల్లే.. ఫైనల్లో భారత్ విజయకేతనం ఎగరవేయగలిగింది. ఈ టోర్నీలో భారత్కి ఇది రెండో విజయం. ఇదివరకే పాకిస్తాన్పై టీమిండియా గెలుపొందిన విషయం తెలిసిందే!
తాజావార్తలు
-
Konda Surekha : కాంగ్రెస్ అధ్యక్షుడితో కొండా సురేఖ భేటీ.. కూతురి వ్యాఖ్యలపై ఖర్గే ఆరా
-
Telangana Auto Strike : ఆటో, క్యాబ్ సమ్మె క్యాన్సిల్.. ప్రభుత్వ చర్చలు సక్సెస్
-
AK-203: AK-203 ‘షేర్’.. రష్యన్ టెక్నాలజీ, మేడ్ ఇన్ ఇండియా రైఫిల్
-
NMMS Scholarship : విద్యార్థులకు రూ.48 వేల స్కాలర్షిప్.. రేపే లాస్ట్ ఛాన్స్.!
-
Varanasi: 50కి పైగా భాషల్లో ‘వారణాసి’.. డబ్బింగ్ కోసం 1600 మందికి పైగా ఆర్టిస్టులు!
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi: 8 పరుగులకే ఔట్.. అరంగేట్రంలోనే వైభవ్ సూర్యవంశీ అట్టర్ ఫ్లాఫ్!
-
Home Remedies: వర్షాకాలంలో ఇంట్లో జెర్రులు, దోమలు, చీమలు, నల్లులకు చెక్ పెట్టే చిట్కాలు ఇవే!
-
Home Safety Tips: పాములను ఇంట్లోకి రాకుండా తరిమికొట్టే చిట్కాలు ఇవే.. ఈ జాగ్రత్తలు తీసుకోండి..
-
Maharashtra: “ఇది కదా విశ్వాసం అంటే”.. యజమానులు తిరిగిరారని తెలియక.. తిండి, నీళ్లు మానేసిన పెంపుడు కుక్క
-
Karnataka: పెళ్లి కొడుకు రాహుల్ గాంధీ ఫ్యాన్.. పెళ్లి క్యాన్సల్ చేసిన యువతి? షాకింగ్ కారణం!