Womens World Cup 2025 : భారత్ విజయ దుందుభి.. సాధించార్రా మనోళ్లు..
- మహిళల ప్రపంచ కప్ కైవసం చేసుకున్న భారత్
- ఫైనల్లో సౌతాఫ్రికాపై టీమిండియా జయభేరీ
- తొలిసారి ప్రపంచ కప్ గెలిచిన భారత మహిళల జట్టు
- 52 పరుగుల తేడాతో భారత్ ఘన విజయం
- 5 వికెట్లు తీసి దక్షిణాప్రికా పతనాన్ని శాసించిన దీప్తి.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Womens World Cup 2025 : ఏదైనా మనస్పూర్తిగా కోరుకుంటే, ఆ కల నిజమవుతుందంటారు. మనసు, కృషి, పట్టుదలతో ప్రయత్నిస్తే విశ్వం కూడా కలసి పనిచేస్తుందంటారు. ఆ నమ్మకాన్ని నిజం చేసింది భారత మహిళా క్రికెట్ జట్టు. ఎన్నాళ్లుగానో ఎదురుచూస్తున్న ఆ కల.. ఇప్పుడు సాకారం అయింది. అయితే ఈ విజయం అంత సులభంగా రాలేదు. గ్రూప్ దశలో మూడు మ్యాచ్లు ఓడిపోయి జట్టు పయనం కాస్త సంక్లిష్టమైంది. కానీ ఆ ఒత్తిడిని అవకాశంగా మలచి, తర్వాతి ప్రతి మ్యాచ్లో భారత్ తన స్థాయిని చూపించింది. “మేము ఇక్కడ ఉన్నాం, గెలుపుకోసం” అని స్పష్టంగా ప్రకటించింది.
ఐసీసీ మహిళల ప్రపంచకప్ ఫైనల్లో భారత జట్టు చరిత్ర సృష్టించింది. శఫాలీ వర్మ అద్భుత ఆల్రౌండ్ ప్రదర్శనతో భారత్కు తొలి వరల్డ్కప్ టైటిల్ అందించింది. నాకౌట్ దశకు ముందు జట్టులోకి చివరివేళ చేర్చబడిన శఫాలీ, ఫైనల్లో 87 పరుగులు (తన కెరీర్లో అత్యధికం) సాధించి, తర్వాత కీలక వికెట్లు తీసి మ్యాచ్ను భారత్ వైపు తిప్పింది. ఆమెతో పాటు దీప్తి శర్మ కూడా అద్భుత ఆల్రౌండ్ ప్రదర్శన కనబర్చింది. ఫలితంగా భారత్ దీర్ఘకాలంగా ఎదురుచూస్తున్న తొలి ప్రపంచకప్ ట్రోఫీని గెలుచుకుంది. లారా వోల్వార్డ్ శతకంతో పోరాడిన దక్షిణాఫ్రికా మరోసారి (మూడోసారి వరుసగా) రన్నరప్గా ముగిసింది.
Also Read
- Pat Cummins: బిగ్ షాక్.. వచ్చే ఐపీఎల్ నుంచి ప్యాట్ కమిన్స్ దూరం..? రూ.113 కోట్లతో భారీ డీల్..
- TG20 Cricket: తెలంగాణ క్రికెట్ లీగ్కు బీసీసీఐ ఆమోదం..
- Abhishek Sharma: రికార్డుల వేటలో అభిషేక్ శర్మ.. ఆ క్లబ్లోకి కూడా చేరిన అభిషేక్.
- Amanpreet Singh Gill: విరాట్ కోహ్లీ సహచరుడు.. పంజాబ్ కింగ్స్ ఆటగాడు కన్నుమూత

భారత్ తొలి బ్యాటింగ్లో 298/7 పరుగులు చేసింది.. శతకం లేకుండా జట్టు సాధించిన మూడవ అతిపెద్ద స్కోరు ఇది. ఓపెనర్లు శఫాలీ వర్మ, స్మృతి మంధాన శతక భాగస్వామ్యంతో దూకుడుగా ఆరంభించారు. వర్షం కారణంగా ఆలస్యమైన మ్యాచ్లో తొలి ఓవర్లలో బంతి స్వింగ్ అవుతుందని భావించినా, శఫాలీ దూకుడుగా ఆడింది. ఆరుగోవర్లలోనే భారత్ 45 పరుగులు చేసింది. సౌతాఫ్రికా బౌలర్లు బౌలింగ్ మార్పులతో రన్రేట్ను కట్టడి చేశారు. మంధాన ఔటవడంతో భారత్ వేగం తగ్గింది కానీ శఫాలీ సగం శతకాన్ని అందుకుంది. జెమిమా రోడ్రిగ్స్ కూడా బాగానే ఆడింది. అయితే ఇద్దరూ అవుట్ కావడంతో భారత్ కొంత వెనుకబడింది. హర్మన్ప్రీత్, దీప్తి శర్మ ఇన్నింగ్స్ను స్థిరపరచారు. చివర్లో రిచా ఘోష్ దూకుడుగా ఆడి స్కోరును 298 పరుగులకు చేర్చింది.
లక్ష్యం ఛేదించేందుకు దిగిన దక్షిణాఫ్రికా ప్రారంభంలోనే తడబడింది. తజ్మిన్ బ్రిట్స్ రనౌట్ అవ్వగా, వోల్వార్డ్ అద్భుతంగా ఆడి మరో సగం శతకం సాధించింది. కానీ హర్మన్ప్రీత్ కౌర్ వ్యూహాత్మకంగా శఫాలీకి బౌలింగ్ అప్పగించగా, ఆమె తన రెండో బంతికే లూస్ వికెట్ తీసింది. వెంటనే కాప్ కూడా అవుట్ కావడంతో మ్యాచ్ భారత్ వైపుకు మళ్లింది. తర్వాత దీప్తి శర్మ అద్భుత బౌలింగ్ ప్రదర్శన కనబర్చింది. వరుస వికెట్లు తీసి దక్షిణాఫ్రికా మధ్యవరుసను ధ్వంసం చేసింది. వోల్వార్డ్ శతకం చేసినా, దీప్తి ఆమెను అవుట్ చేయడంతో ఆ జట్టు ఆశలు ఆవిరయ్యాయి. చివరికి 45.3 ఓవర్లలో దక్షిణాఫ్రికా 246 పరుగులకే ఆలౌట్ అయింది. దీంతో భారత్ 52 పరుగుల తేడాతో విజయ పతాకం ఎగురవేసింది. దీప్తి ఐదు వికెట్లు, శఫాలీ రెండు వికెట్లు దక్కించుకున్నారు.
తాజావార్తలు
-
Watermelon Case: పుచ్చకాయ తిని నలుగురు మృతి.. ఫోరెన్సిక్ నివేదికలో షాకింగ్ నిజం..
-
TVK Vijay: విజయ్కు కొత్త చిక్కులు.. వాట్సాప్ మెసేజ్లపై వామపక్షాలు గుర్రు!
-
CM Chandrababu : బుల్లెట్ బండి.. కాలేజీ జ్ఞాపకాలు.. రాయల్ ఎన్ఫీల్డ్ నడపడంపై చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యలు
-
US-Iran Talks: హార్ముజ్పై గుడ్న్యూస్.. ఇరాన్-యూఎస్ మధ్య కీలక చర్చలు.. ఏం నిర్ణయం తీసుకున్నారంటే..!
-
Ponnam Prabhakar : రాజకీయాల్లో హుందాతనం ముఖ్యం.. భౌతిక దాడులపై మంత్రి పొన్నం ప్రభాకర్ ఆగ్రహం