Womens Asia Cup 2022: నేటి నుంచి మహిళల ఆసియా కప్.. శ్రీలంకతో భారత్ తొలిపోరు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Womens Asia Cup 2022: ఆసియా కప్ టోర్నీ తమ సత్తా చాటేందుకు భారత మహిళల జట్టు సిద్ధమైంది. ఇంగ్లండ్పై సిరీస్ విజయంతో ఫుల్ జోష్లో ఉన్న భారత మహిళల జట్టు.. శనివారం నుంచి టీ20 ఫార్మాట్లో ఆసియాకప్ ఆడనుంది. శనివారం జరుగనున్న తొలి పోరులో శ్రీలంకతో టీమ్ఇండియా అమీతుమీ తేల్చుకోనుంది. ఈ ఫార్మాట్లో అంతర్జాతీయ స్థాయిలో మన అమ్మాయిలు నిలకడగా విజయాలు సాధించలేకపోతున్నా.. ఆసియా వరకైతే హర్మన్ప్రీత్ బృందం ఫేవరెట్ అనే చెప్పొచ్చు. 2004 నుంచి 2018 వరకు ఏడుసార్లు మహిళల ఆసియా కప్ జరగగా.. అందులో ఆరుసార్లు భారత్ విజయం సాధించడం విశేషం. వన్డే ఫార్మాట్లో నాలుగు సార్లు ఛాంపియన్గా నిలిచిన భారత మహిళల జట్టు టీ20 ఫార్మాట్లో రెండు సార్లు టైటిల్ నెగ్గారు. గత టోర్నీలో మాత్రం బంగ్లాదేశ్పై ఓటమి పాలైంది.
నాలుగేళ్ల విరామం తర్వాత ఆసియా ఖండంలోని అత్యుత్తమ జట్ల మధ్య పోరుకు రంగం సిద్ధమైంది. శనివారమే ఈ టీ20 టోర్నీకి తెరలేవనుంది. ఏడు జట్లు పోటీపడుతున్న ఈ టోర్నీ ఆతిథ్య బంగ్లాదేశ్, థాయ్లాండ్ పోరుతో మొదలవనుంది. 2020లో జరగాల్సిన టోర్నీ కరోనా కారణంగా మొదట 2021కి వాయిదా పడి, ఆ తర్వాత రద్దయింది. నాలుగేళ్ల తర్వాత జరుగుతున్న ఈ టోర్నీలో విజయం సాధించేందుకు పలు దేశాల జట్లు పోటీ పడనున్నాయి. ఆఖరి వన్డేలో ‘మన్కడింగ్’తో వార్తల్లోకెక్కిన హర్మన్ప్రీత్ బృందం.. అవన్నీ పక్కన పెట్టి ఆటపై దృష్టిపెట్టేందుకు సిద్ధమైంది. కామన్వెల్త్ గేమ్స్లో రజత పతకం, ఇంగ్లండ్పై వన్డేల్లో సాధించిన విజయాలు సహజంగానే భారత్ను ఫేవరెట్గా చూపిస్తున్నాయి. టీమిండియా ఇవాళ శ్రీలంకతో మ్యాచ్ తర్వాత వరుసగా మలేసియా (3న), యూఏఈ (4న), పాకిస్తాన్ (7న), బంగ్లాదేశ్ (8న), థాయ్లాండ్ (10న) జట్లతో తలపడుతుంది.
Also Read
- Indian Players: పలు రికార్డులకు చేరువలో ఇండియన్ ప్లేయర్స్.. రిషబ్ పంత్ నుంచి శుభ్మన్ గిల్ వరకు ఇలా..
- Team India: టీమిండియా జట్టులోకి ముగ్గురు దిగ్గజ ఆటగాళ్లు..! ఎల్లుండే బరిలోకి..
- Indian Player: రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ రిటైర్మెంట్పై కీలక వ్యాఖ్యలు.. ‘సమయం వచ్చేసింది’..
- Saransh Jain: టీమిండియా డ్రెస్సింగ్ రూమ్లో మజా లేదు.. సారాంశ్ జైన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
Sourav Ganguli: బుమ్రా టీ20 వరల్డ్ కప్కు దూరం కాలేదు
మొత్తం 7 జట్లు బరిలోకి దిగుతుండగా, భారత్తో పాటు బంగ్లాదేశ్, పాకిస్తాన్, శ్రీలంక, యూఏఈ, మలేసియా, థాయ్లాండ్ తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నాయి. యూఏఈ తొలిసారి ఆసియా కప్లో ఆడనుంది. రౌండ్ రాబిన్ ఫార్మాట్లో ఈ టోర్నీ జరగనుంది. ఒక్కో జట్టు మిగతా ఆరింటితో ఒక్కో మ్యాచ్ ఆడుతుంది. లీగ్ దశ మ్యాచ్లు పూర్తయ్యేసరికి తొలి నాలుగు స్థానాల్లో నిలిచిన జట్లు నేరుగా సెమీస్లో తలపడతాయి. ప్రస్తుతం భారత జట్టు పటిష్టంగా ఉంది. కెప్టెన్ హర్మన్ప్రీత్ కౌర్తో పాటు వైస్ కెప్టెన్ స్మృతి మందన అద్భుత ఫామ్లో ఉండగా.. వారికి తోడుగా జెమీమా రోడ్రిగ్స్ చేరడంతో జట్టు మరింత పటిష్టంగా మారింది. గత ఆసియా కప్ ఫైనల్ను పక్కన పెడితే మరోసారి భారత్ కప్ను దక్కించుకునే అవకాశాలు చాలానే ఉన్నాయి. అబ్బాయిలు ఆసియా కప్లో నిరాశపరిచినా.. మరి అమ్మాయిలైనా సాధిస్తారో వేచి చూడాల్సిందే!.
తాజావార్తలు
-
Offer for Gamers: వీడియో గేమ్ ఆడేవారికి రూ.1.38 కోట్ల ప్యాకేజీ.. డిగ్రీ అవసరం లేకుండానే ఉద్యోగం..
-
Renukaswamy Murder: నటుడు దర్శన్కు బిగుస్తోన్న ఉచ్చు.. సహ నిందితుడి సంచలన వాంగ్మూలం
-
BE ALERT: అనకాపల్లిలో దారుణం.. బాలికపై లైంగిక దాడి, తల్లిపైనా పోక్సో కేసు
-
Khiladi Wife: పక్కా ప్లాన్ చేసింది.. భర్తను లేపేసింది..
-
Rahul Gandhi: ఇటలీ ప్రధాని మెలోనీని టార్గెట్ చేసిన కాంగ్రెస్.. రాహుల్ గాంధీ వీడియో వైరల్
ట్రెండింగ్
-
బ్లాక్ డిజైన్, హైబ్రిడ్ పవర్తో Toyota Hyryder Aero Black Edition వచ్చేసింది.. ధర, ఫీచర్లు ఇవే..!
-
5,000 నిట్స్ డిస్ప్లే, 50MP కెమెరాలు, 6,500mAh బ్యాటరీతో Vivo X300 FE కొత్త వేరియంట్ లాంచ్..!
-
Airtel Recharge Plans: రూ.299 సహా 4 ప్రీపెయిడ్ ప్లాన్లు తొలగింపు.. ఇకపై కొత్త ఆప్షన్లు ఇవే.!
-
Money Plant Growing Tips: మానీ ప్లాంట్ వేగంగా, గుబురుగా పెరగాలంటే ఈ చిట్కాలు ఫాలో అవ్వండి.!
-
CSK Head Coach: సీఎస్కే హెడ్ కోచ్గా వరల్డ్ కప్ విన్నింగ్ కెప్టెన్!