IND vs ENG: నేడే భారత్- ఇంగ్లాండ్ మధ్య తొలి టీ20
- నేడు భారత్, ఇంగ్లాండ్ మధ్య తొలి టీ20..
- కోల్కతా వేదికగా రాత్రి 7గంటలకు మ్యాచ్..
- తొలి మ్యాచ్ లో బోణీ కొట్టాలని వ్యూహాలు రచిస్తున్న ఇరు జట్లు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
IND vs ENG: సొంతగడ్డపై ఇంగ్లండ్తో జరిగే ఐదు మ్యాచ్ల టీ20 సిరీస్ లో భారత్ పోటీ పడబోతుంది. ఇందులో భాగంగా ఈ రోజు (జనవరి 22) ఈడెన్ గార్డెన్స్ మైదానంలో మొదటి మ్యాచ్ జరగబోతుంది. అయితే, ఇరు జట్ల బలాబలాలను చూస్తే దాదాపు సమానంగా కనపడుతున్నాయి. ఇక, ఇంగ్లాండ్ జట్టు టీ20 కోచ్గానూ పూర్తిస్థాయి బాధ్యతలు తీసుకున్న మెకల్లమ్ తనదైన శైలిలో జట్టును రెడీ చేశాడు. అలాగే, మరోవైపు, గాయం నుంచి కోలుకొని దాదాపు 14 నెలల తర్వాత జట్టులోకి వచ్చిన సీనియర్ పేసర్ మహ్మద్ షమీపై అందరి దృష్టి ఉంది. ఇప్పటికే ఛాంపియన్స్ ట్రోఫీ జట్టుకి కూడా ఎంపికైన అతడు టీ20 ఫార్మాట్ ద్వారా తన అత్యుత్తమ ప్రదర్శన ఇవ్వాలని చూస్తున్నాడు.
Read Also: JEE Mains Exams: రేపటి నుంచి జేఈఈ మెయిన్స్ పరీక్షలు.. విద్యార్థులకు కీలక సూచనలు..!
Also Read
- Suryakumar Yadav: టీ20 జట్టులోకి మళ్లీ సూర్యకుమార్ యాదవ్..? బీసీసీఐ కీలక సంకేతాలు
- India Women vs England Women: అబ్బాయిలు పరువు తీస్తే.. అమ్మాయిలు గర్జించారు.. ఇంగ్లండ్పై భారత్ చారిత్రక విజయం
- IPL 2027-CSK: సీఎస్కేకు క్రికెట్ దిగ్గజం గుడ్బై.. 18 ఏళ్ల బంధానికి ముగింపు!
- Gautam Gambhir: టీ20 వరల్డ్కప్ గెలిపించాడు.. కొత్త టార్గెట్ అదే..!
అయితే, రెండు నెలల క్రితం టీమిండియా దక్షిణాఫ్రికా గడ్డపై మెరుపు ప్రదర్శన చేసి.. 3–1తో సిరీస్ను కైవసం చేసుకుంది. సౌతాఫ్రికాతో సిరీస్ చివరి మ్యాచ్తో పోలిస్తే దాదాపు అదే జట్టు ఇప్పుడు బరిలోకి దిగే అవకాశం ఉంది. ఆ మ్యాచ్లో సెంచరీ సాధించిన సంజు శాంసన్ అంతర్జాతీయ క్రికెట్లో తన జోరును మరోసారి ప్రదర్శించాలని చూస్తున్నాడు. రెండో ఓపెనర్గా అభిషేక్ శర్మ రాణించాల్సి ఉంది. అలాగే, వరుసగా రెండు అంతర్జాతీయ టీ20 సెంచరీలు సాధించిన హైదరాబాదీ క్రికెటర్ తిలక్ వర్మ కూడా అదే ఉత్సాహంతో రెడీగా ఉండగా.. మిడిలార్డర్లో సూర్యకుమార్, హార్దిక్, రింకూ సింగ్ భారీ స్కోరును చేయగలరు. అయితే, తెలుగు క్రికెటర్ నితీశ్ కుమార్ రెడ్డికి తుది జట్టులో చోటు దక్కుతుందా లేదా అనేది వేచి చూడాలి. ఇక, ఈడెన్ గార్డెన్ స్టేడియం బ్యాటింగ్కు బాగా అనుకూలంగా ఉంటుంది. కాబట్టి భారీ స్కోర్లు చేయడం ఖాయం.. మంచు ప్రభావం ఉంటుంది కాబట్టి టాస్ గెలిచిన జట్టు తొలుత ఫీల్డింగ్ తీసుకునే ఛాన్స్ ఉండగా.. వర్షం పడే అవకాశం లేదు.
Read Also: Greenland: ‘‘మేం అమెరికన్లుగా ఉండాలనుకోవడం లేదు’’.. ట్రంప్కి షాక్..
ఇరు జట్ల వివరాలు
భారత్ (అంచనా): సూర్య కుమార్ యాదవ్ (కెప్టెన్), సంజు శాంసన్, అభిషేక్ శర్మ, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా, రింకూ సింగ్, అక్షర్ పటేల్, మహ్మద్ షమీ, ఆర్షదీప్ సింగ్, వరుణ్ చక్రవర్తి, రవి బిష్ణోయ్/ వాషింగ్టన్ సుందర్.
ఇంగ్లండ్: జోస్ బట్లర్ (కెప్టెన్), ఫిల్ సాల్ట్, డకెట్, హ్యారీ బ్రూక్, లివింగ్స్టోన్, బెతెల్, ఒవర్టన్, అట్కిన్సన్, జోఫ్రా ఆర్చర్, రషీద్, మార్క్ వుడ్.
తాజావార్తలు
-
Fake Shopping Offers : రూ.999 ఆఫర్.. ఖాతా ఖాళీ.! సైబర్ మోసగాళ్ల కొత్త ట్రిక్
-
OTR: కలెక్టర్ vs పోలీస్?.. పెద్దపల్లిలో హాట్ టాపిక్గా మారిన రివ్యూ మీటింగ్
-
OTR: ఎమ్మెల్యే మాధవి వైఖరి మిగతా ఎమ్మెల్యేలకు ఇబ్బందిగా మారిందా?
-
Train: మరీ చీఫ్గా దుప్పట్లు చోరీ.. కోచ్ అటెండెంట్లు గగ్గోలు.. ఎందుకంటే..!
-
ITR Filing: కొత్త ట్యాక్స్ విధానమే బెస్ట్? పాత విధానం ఎవరికి లాభం.. నిపుణులు ఏం చెబుతున్నారంటే?
ట్రెండింగ్
-
IPL 2027-CSK: సీఎస్కేకు క్రికెట్ దిగ్గజం గుడ్బై.. 18 ఏళ్ల బంధానికి ముగింపు!
-
IND vs ENG 1st ODI: ముగ్గురు మొనగాళ్లు వచ్చేశారు.. భారత్ ప్లేయింగ్ 11 ఇదే.. ఇక రచ్చరచ్చే!
-
APTRANSCO Recruitment: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. APTRANSCOలో 200 AEE ఉద్యోగాలు.. రూ.2.08 లక్షల వరకు జీతం.!
-
5G, 4G మోడళ్లతో ఎంట్రీ ఇవ్వనున్న Lava Virat V1 సిరీస్.. ఫీచర్స్ ఇవే.!
-
BSNL ధమాకా.. రూ. 259కే 700GB డేటా, అన్లిమిటెడ్ కాల్స్.. ఉచిత OTT కూడా.!