IND vs ENG 2nd T20: ప్లేయింగ్ ఎలెవన్లో సంజు, వైభవ్.. అసలు వేటు మనోడి పైనే?
- మాంచెస్టర్లో భారత్, ఇంగ్లండ్ రెండో టీ20
- టీమిండియా ప్లేయింగ్ ఎలెవన్లో కీలక మార్పు
- ప్లేయింగ్ ఎలెవన్లో సంజు, వైభవ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Tilak Varma to miss IND vs ENG 2nd T20: ఐదు మ్యాచ్ల టీ20 సిరీస్లో భాగంగా భారత్, ఇంగ్లండ్ జట్ల మధ్య మాంచెస్టర్లో మరికొద్ది గంటల్లో రెండో టీ20 మ్యాచ్ ఆరంభం కానుంది. వర్షం కారణంగా తొలి టీ20 రద్దు కావడంతో.. ప్రస్తుతం 5 మ్యాచ్ల సిరీస్ 0-0తో సమంగా ఉంది. ఈ నేపథ్యంలో ఈ రెండో మ్యాచ్లో విజయం సాధించి సిరీస్లో ఆధిక్యం సంపాదించాలని ఇరు జట్లు చూస్తున్నాయి. ఈ కీలక మ్యాచ్కు ముందు టీమిండియా ప్లేయింగ్ ఎలెవన్లో కొన్ని కీలక మార్పులు జరగనున్నట్లు తెలుస్తోంది.
ఐర్లాండ్ టీ20 సిరీస్తో పాటు ఇంగ్లండ్తో జరిగిన తొలి టీ20లోనూ అవకాశం దక్కని 15 ఏళ్ల యువ బ్యాటర్ వైభవ్ సూర్యవంశీకి.. మాంచెస్టర్ మ్యాచ్లో భారత తుది జట్టులో చోటు దక్కడం దాదాపు ఖాయమైనట్లు తెలుస్తోంది. స్టార్ ఓపెనర్ అభిషేక్ శర్మతో కలిసి వైభవ్ ఇన్నింగ్స్ను ప్రారంభించనున్నాడు. దాంతో తొలి మ్యాచ్లో ఓపెనర్గా ఆడిన సంజు శాంసన్ మూడో స్థానంలో బ్యాటింగ్కు రానున్నాడు. జట్టు బ్యాటింగ్ ఆర్డర్లో సమతుల్యత తీసుకురావడానికి మేనేజ్మెంట్ మిడిల్ ఆర్డర్లో ఒక కీలక మార్పు చేయబోతున్నట్లు సమాచారం. ఇటీవల వరుసగా విఫలమవుతున్న తెలుగు ఆటగాడు తిలక్ వర్మను తుది జట్టు నుంచి తప్పించనున్నట్లు తెలుస్తోంది. అతడి స్థానంలో ఇషాన్ కిషన్ ఐదో స్థానంలో బ్యాటింగ్ చేయనున్నాడట.
Also Read
- Captain Rajat Patidar: ఎట్టకేలకు కెప్టెన్సీ కొట్టేసిన రజత్ పాటిదార్.. సంతోషంలో ఆర్సీబీ ఫ్యాన్స్..
- Success Story: నీరజ్ చోప్రాను మట్టి కరిపించిన రుమేష్ పతిరాగే ఎవరు..? అతడికి క్రికెట్తో సంబంధం ఏంటి..?
- CWG 2026: కామన్వెల్త్లో ఇండియాకు మరో స్వర్ణ పతకం.. బాక్సింగ్ విభాగంలో పవర్ చూపించిన ‘ప్రీతి పవార్’..
- IND Vs PAK: హై-వోల్టేజ్ పోరుకు వేళాయె.. పాకిస్థాన్తో తలపడనున్న ఇండియా..
టీ20 ప్రపంచకప్ 2026లో సంజు శాంసన్, ఇషాన్ కిషన్, అభిషేక్ శర్మలు అద్భుతంగా రాణించడంతో.. వారికి మరిన్ని అవకాశాలు ఇవ్వాలని జట్టు యాజమాన్యం భావిస్తోంది. ఇదే విషయాన్ని కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్, కోచ్ గౌతమ్ గంభీర్ కూడా పలు ఇంటర్వ్యూలలో చెప్పారు. బ్యాటింగ్ ఆర్డర్లో మార్పులు ఉన్నప్పటికీ.. బౌలింగ్ విభాగంలో మాత్రం ఎలాంటి మార్పులు ఉండబోవని తెలుస్తోంది. తొలి మ్యాచ్లో కీలక ఇన్నింగ్స్ ఆడిన శివమ్ దూబే ఆల్రౌండర్గా జట్టులో కొనసాగనున్నాడు. పేస్ కోటాలో అర్ష్దీప్ సింగ్, హర్షిత్ రాణాలు ఆడుతారు. రవి బిష్ణోయ్, వరుణ్ చక్రవర్తి, అక్షర్ పటేల్ల స్పిన్ త్రయంపై జట్టు యాజమాన్యం మరోసారి నమ్మకం ఉంచనుంది.
భారత్ ప్లేయింగ్ ఎలెవన్ (అంచనా):
వైభవ్ సూర్యవంశీ, అభిషేక్ శర్మ, సంజు శాంసన్ (వికెట్కీపర్), శ్రేయస్ అయ్యర్ (కెప్టెన్), ఇషాన్ కిషన్, శివమ్ దూబే, అక్షర్ పటేల్, హర్షిత్ రాణా, రవి బిష్ణోయ్, అర్ష్దీప్ సింగ్, వరుణ్ చక్రవర్తి.
ఇంగ్లండ్ ప్లేయింగ్ ఎలెవన్:
ఫిల్ సాల్ట్, జోస్ బట్లర్, హ్యారీ బ్రూక్ (కెప్టెన్), జేకబ్ బెతెల్, టామ్ బాంటన్, సామ్ కరన్, విల్ జాక్స్, లియామ్ డాసన్, జోఫ్రా ఆర్చర్, ఆదిల్ రషీద్, జోష్ టంగ్.
తాజావార్తలు
-
Ponguleti Srinivas Reddy: ధరణి అక్రమాలు, భూ సమస్యలపై సెట్ విచారణ
-
Selling Racket: తల్లి ఒడిలో ఉండాల్సిన పసికందుకు ధర..
-
Operation Muskaan : ‘ఆపరేషన్ ముస్కాన్’ సక్సెస్.. 6,307 మంది చిన్నారులకు కొత్త జీవితం.!
-
Ayodhya: అయోధ్య మెడికల్ కాలేజీలో బాంబు తయారీ పత్రం కలకలం.. విద్యార్థి అరెస్ట్!
-
Extramarital affairs: అలా వాళ్లిద్దరూ ఒక్కటయ్యారు.. చివరికిలా..!
ట్రెండింగ్
-
Onion Cleaning Hack : ఉల్లిపాయతో గ్లాస్ మెరుస్తుందా.? వైరల్ హ్యాక్లో నిజం ఎంత.!
-
Kitchen Tips : బియ్యం కేవలం వంటకే కాదు.. ఈ సీక్రెట్ హ్యాక్స్ తెలిస్తే ఆశ్చర్యపోతారు.!
-
Flipkart Pay Later: ఇప్పుడు కొనండి.. నిమ్మలంగా కట్టండి.. ఫ్లిప్కార్ట్లో ‘పే లేటర్’ సదుపాయం!
-
ITR Filing Deadline: ట్యాక్స్పేయర్లకు అలెర్ట్.. ITR ఫైల్ చేశారా? ఈరోజే చివరి గడువు.!
-
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీ అవసరమా?.. అసలు ఆ ఆలోచన ఏంటి?.. ప్రముఖ వ్యాఖ్యాత ఆసక్తికర వ్యాఖ్యలు!