IND Playing 11 vs PAK: సంజు, రింకు అవుట్.. సర్ప్రైజ్ ఎంట్రీ, పాకిస్థాన్పై ఆడే భారత్ తుది జట్టు ఇదే!
- ప్రపంచకప్ 2026లో భారత్ దూసుకెళుతోన్న భారత్
- అమెరికా, నమీబియాపై టీమిండియా విజయాలు
- ఫిబ్రవరి 15న పాకిస్థాన్తో భారత్ మ్యాచ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
India vs Playing XI Pakistan in T20 World Cup 2026: సొంత గడ్డపై జరుగుతున్న టీ20 ప్రపంచకప్ 2026లో భారత్ దూసుకెళుతోంది. ఇప్పటివరకు జరిగిన రెండు మ్యాచ్లలో సూర్య సేన విజయం సాధించింది. చిన్న జట్లు అమెరికా, నమీబియాపై టీమిండియా విజయాలు అందుకుంది. ఇక ఆదివారం (ఫిబ్రవరి 15)న దాయాది పాకిస్థాన్తో భారత్ తలపనుంది. ఎన్ని గెలిచినా పాకిస్థాన్పై గెలిస్తే.. ఆ కిక్కే వేరు. అందుకే టీమిండియా పటిష్ట జట్టుతో బరిలోకి దిగనుంది. పాకిస్థాన్ మ్యాచ్కు భారత్ రెండు మార్పులతో బరిలోకి దిగనున్నట్లు తెలుస్తోంది. టీమిండియా ప్లేయింగ్ ఎలెవన్ ఎలా ఉండనుందో ఓసారి చూద్దాం.
పాకిస్థాన్ మ్యాచ్కు జట్టు కాంబినేషన్లో మార్పులు చోటుచేసుకున్నట్లు సమాచారం. ముఖ్యంగా ఓపెనింగ్ జోడీ నుంచి మిడిల్ ఆర్డర్ వరకు కీలక నిర్ణయాలు తీసుకున్నట్లు తెలుస్తోంది. యువ బ్యాటర్ అభిషేక్ శర్మ మ్యాచ్కు సిద్ధంగా ఉన్నాడు. ఓపెనర్గా ఇషాన్ కిషన్తో కలిసి ఇన్నింగ్స్ ఆరంభించనున్నాడు. అభిషేక్ రాకతో వికెట్కీపర్ బ్యాటర్ సంజు శాంసన్ ప్లేయింగ్ 11 నుంచి తప్పుకొవాల్సి ఉంటుంది. మిడిల్ ఆర్డర్లో కూడా మార్పు చోటుచేసుకునేలా కనిపిస్తోంది. పవర్ హిట్టర్ రింకు సింగ్ను ఈ మ్యాచ్కు పక్కన పెట్టే అవకాశాలు ఉన్నాయి. అతని స్థానంలో ఆల్రౌండర్ వాషింగ్టన్ సుందర్ ఆడనున్నాడు. బౌలింగ్ బ్యాలెన్స్ పెంచేందుకు టీమిండియా మేనేజ్మెంట్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
Also Read
- Womens T20 World Cup: పాకిస్థాన్పై కొట్టడం అంటే ఆ మజానే వేరు.. ఫామ్లోకి వచ్చిన రిచా ఘోష్ ఆసక్తికర వ్యాఖ్యలు..
- Vaibhav Sooryavanshi: సూపర్ ఓవర్ వివాదం తర్వాత వైభవ్కు మరో అవకాశం.. మళ్లీ బేబీ బాస్పైనే అందరి కళ్లు..!
- Vaibhav Sooryavanshi: వైభవ్తో గొడవకు దిగిన ఆటగాడి తిక్క కుదిర్చిన శ్రీలంక బోర్డు.. సూర్యవంశీతో పెట్టుకుంటే అంతే మరి..
- T20 World Cup: పాక్పై గెలిచినా తగ్గని కసి.. డచ్ జట్టుపై భారీ విజయమే లక్ష్యంగా బరిలోకి టీమిండియా..
ఇషాన్ కిషన్ మంచి ఫామ్ మీదున్నాడు. అభిషేక్ శర్మ కూడా బ్యాట్ జుళిపిస్తే అదిరే ఆరంభం దక్కుతుంది. తిలక్ వర్మ, సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యాలు ఇప్పటికే హాఫ్ సెంచరీలతో సత్తాచాటారు. శివమ్ దూబే భారీ హిట్టింగ్ చేస్తున్నాడు. అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్ ఆల్రౌండర్ ప్రదర్శన జట్టుకు ఉపయోగపడనుంది. స్పిన్ దళానికి వరుణ్ చక్రవర్తి నాయకత్వం వహించనున్నాడు. పేస్ కోటాలో జస్ప్రీత్ బుమ్రా, అర్షదీప్ సింగ్ ఆడనున్నారు. హార్దిక్ మూడో పేసర్ గా ఉంటాడు. మొత్తంగా చూస్తే.. పాకిస్థాన్ వంటి బలమైన ప్రత్యర్థిని ఎదుర్కొనేందుకు టీమిండియా మేనేజ్మెంట్ వ్యూహాత్మకంగా ప్లేయింగ్ XIను సెట్ చేస్తోంది.
తుది జట్టు (అంచనా):
ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), అభిషేక్ శర్మ, తిలక్ వర్మ, సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), హార్దిక్ పాండ్యా, శివమ్ దూబే, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, వరుణ్ చక్రవర్తి, జస్ప్రీత్ బుమ్రా, అర్షదీప్ సింగ్.
తాజావార్తలు
-
Off The Record: మెట్రో కేంద్రంగా కాంగ్రెస్, బీజేపీ పొలిటికల్ వార్..
-
Honeymoon Mystery: హనీమూన్ మిస్టరీ.. ముస్సోరీలో విశాఖ మహిళ మృతి..
-
Dehradun: నేలరాలిన విద్యాకుసుమం.. 12వ తరగతి టాపర్ ఆత్మహత్య
-
Off The Record: గాంధీ భవన్ను తాకుతున్న పాత-కొత్త గొడవలు..
-
Mumbai: కనిపించని రుతుపవనాల జాడ.. ముంబైలో నీటి సరఫరాపై ఆంక్షలు.. జరిమానా
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi Fight: భారత్-శ్రీలంక మ్యాచ్లో గొడవ.. వైభవ్ సూర్యవంశీ ఆగ్రహానికి అసలైన కారణం ఇదే!
-
Mrigashira నక్షత్రంలో పుట్టినవారు ఒక్కచోటు కుదురుగా ఉండరుగా.! అదృష్టం, స్వభావం, కెరీర్ అవకాశాలు ఎలా ఉంటాయంటే.?
-
Tilak Varma: నేను ఎవరికీ నీతులు చెప్పడానికి ఇక్కడ రాలేదు.. తిలక్ వర్మ సంచలన వ్యాఖ్యలు!
-
Vaibhav Sooryavanshi Fight: వైభవ్ సూర్యవంశీపై కఠిన చర్యలు తప్పవా?.. ఐసీసీ నిబంధనలు ఏం చెబుతున్నాయంటే?
-
Lucky Plants : మీ పుట్టిన తేదీ ప్రకారం ఇంట్లో ఏ మొక్క పెంచితే అదృష్టం కలిసొస్తుందో తెలుసా?