IND vs ENG: రెండో వన్డేలో సీన్ రివర్స్.. భారత్ ఢమాల్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తొలి వన్డేలో అద్భుతమైన విజయం సాధించిన భారత్.. రెండో వన్డేలో మాత్రం ఘోర పరాజయం చవిచూసింది. బ్యాట్స్మన్లు పూర్తిగా చేతులెత్తేయడంతో, సునాయాసంగా గెలవాల్సిన మ్యాచ్ని చేజార్చుకుంది. ఓపెనర్లు పూర్తిగా ఫెయిల్ అవ్వడం, మిడిలార్డర్ బ్యాట్స్మన్లు కూడా రాణించకపోవడంతో.. ఏకంగా 100 పరుగుల తేడాతో ఓడిపోయింది. ఫస్ట్ వన్డేలో బుమ్రా తరహాలో రెండో వన్డేలో ప్రత్యర్థి బౌలర్ టాప్లీ భారత్ని దెబ్బ తీశాడు. ఆరు వికెట్లతో కొరడా ఝుళిపించాడు. దీంతో.. ఈ వన్డే సిరీస్ 1-1 తో సమం అయ్యింది.
లార్డ్స్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్లో తొలుత టాస్ గెలిచిన భారత్ బౌలింగ్ ఎంపిక చేసుకుంది. దీంతో, బ్యాటింగ్ చేసేందుకు ఇంగ్లండ్ రంగంలోకి దిగింది. తొలుత ఓపెనర్లు ఆచితూచి రాణించారు. 41 పరుగుల వరకూ వికెట్ పడకుండా జాగ్రత్త పడ్డారు. కానీ, తొలి వికెట్ పడ్డాక ఇంగ్లండ్ తడబడింది. భారత బౌలర్లు చుక్కలు చూపించడంతో.. 102 పరుగులకే ఐదు వికెట్లు కోల్పోయింది. తద్వారా మళ్లీ తక్కువ స్కోరుకే ఇంగ్లండ్ ఆలౌట్ అవుతుందని అంతా అనుకున్నారు. కానీ.. మోయిన్ అలీ (47), డేవిడ్ విల్లీ(41) బాగా రాణించడంతో ఇంగ్లండ్ గౌరవప్రదమైన స్కోరు చేయగలిగింది. 49 ఓవర్లలో 246 పరుగులు చేసి, ఇంగ్లండ్ ఆలౌట్ అయ్యింది.
Also Read
- IND Vs ENG 3rd ODI: లార్డ్స్ ఫైనల్ ఫైట్.. సుందర్ స్థానంలో యువ సంచలనానికి లక్కీ ఛాన్స్..
- Aakash Chopra: కుల్దీప్ యాదవ్ను ఎందుకు బలిపశువును చేస్తున్నారు.. మాజీ క్రికెటర్ సూటి ప్రశ్న..
- ENG Vs IND 3rd ODI: మెన్ ఇన్ బ్లూ టార్గెట్ లార్డ్స్.. 22 ఏళ్ల నిరీక్షణకు తెరదించే సమయం వచ్చేసింది..
- Rohit Sharma Retirement: బిగ్ షాక్.. సెలక్టర్లకు ఎదురుతిరిగిన రోహిత్ శర్మ.. జైస్వాల్ కోసం గిల్ త్యాగం!
ఇంగ్లండ్ నిర్దేశించిన లక్ష్యం ఏమంత పెద్దది కాదు కాబట్టి.. భారత్ ఈజీగానే ఛేదిస్తుందని అంతా భావించారు. కానీ, ఇంగ్లండ్ బౌలర్లు ఆ అంచనాల్ని తిప్పికొట్టారు. భారత ఆటగాళ్లకు ఆడే అవకాశమే ఇవ్వలేదు. ప్రధాన బ్యాట్స్మన్లందరూ ఇలా వచ్చి అలా వెళ్లిపోయారు. నిజానికి.. కోహ్లీ మూడు చక్కని ఫోర్లు కొట్టడం, కాస్త ఊపుమీద ఉన్నట్టు కనిపించడంతో.. ఈ వన్డేలో తప్పకుండా దుమ్ముదులుపుతాయని ఆశించారు. ఇంతలోనే ఆ ఆశల్ని ఆవిరి చేస్తూ.. 16 పరుగులకే వెను దిరిగాడు. 31 పరుగులకే 4 వికెట్లు కోల్పోవడంతో.. తొలి వన్డేలో ఇంగ్లండ్ సీన్ రివర్స్ అవుతున్నట్టు అనిపించింది. అయితే, ఆ తర్వాత వచ్చిన ఆటగాళ్లు ఆ పతనాన్ని అడ్డుకున్నారు.
హార్దిక్ పాండ్యా(29), సూర్యకుమార్ యాదవ్(27), రవీంద్రా జడేజా(29), మహమ్మద్ షమీ(23) కాసేపు పోరాడారు. ఇంగ్లండ్ బౌలర్లను ధీటుగా ఎదుర్కొని, భారత్ జట్టుని ముందుకు నడిపించేందుకు ప్రయత్నించారు. కానీ.. అది కూడా ఏమాత్రం సరిపోలేదు. చివర్లో ఆరు పరుగుల తేడాతో భారత్ వరుసగా నాలుగు వికెట్లు చేజార్చుకుంది. ఈ దెబ్బకు 146 పరుగులకే కుప్పకూలింది. ఇంగ్లండ్ బౌలర్లలో రీస్ టాప్లీ ఆరు వికెట్లతో మెరిశాడు. డేవిడ్ విలీ, బ్రైడన్ కార్స్, మోయిన్ అలీ, లివింగ్టన్లు చెరో వికెట్ తీసుకున్నారు.
తాజావార్తలు
-
Ramayana: ఇలాంటి పాత్ర చేయడం పూర్వ జన్మ సుకృతం… ‘రామాయణం’ వేదికపై సాయి పల్లవి ఎమోషనల్
-
Two US Soldiers Killed: ఇరాన్ దాడిలో ఇద్దరు అమెరికా సైనికులు మృతి.. “మరచిపోలేని గుణపాఠం చెబుతాం” అంటూ ఖమేనీ హెచ్చరిక
-
OTR : వైసీపీ నేతలతో టచ్.. టీడీపీ ఎమ్మెల్యేతో మ్యాచ్? కాకినాడలో హాట్ టాపిక్
-
Story Board : ఇరాన్ యుద్ధం గల్ఫ్ కు చేసిన నష్టమేంటి..? దుబాయ్ గతానికి, ప్రస్తుతానికి తేడా ఏంటి..?
-
Nitin Gadkari: E20 వద్దనుకునేవారు100 శాతం పెట్రోల్ పొందొచ్చు: నితిన్ గడ్కరీ
ట్రెండింగ్
-
IND vs ENG 3rd ODI: టీమిండియా తుది జట్టుపై ఉత్కంఠ.. ఆ ఇద్దరు స్టార్లకు నిరాశే.. రోహిత్పైనే అందరి చూపు!
-
IND vs ENG 3rd ODI: అభిమానులకు అలర్ట్.. మూడో వన్డే మ్యాచ్ సమయంలో మార్పు.. లైవ్ స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!
-
Android vs iPhone ఫైట్కు కొత్త ట్విస్ట్.! మెస్సీ కోసం Samsung, రొనాల్డో కోసం iPhone.. లగ్జరీ ఫోన్లు విడుదల..!
-
Jeera Rice: రెస్టారెంట్ స్టైల్ ‘జీరా రైస్’ ఇంట్లోనే.. వంట రాని వాళ్లు కూడా 5 నిమిషాల్లో సులువుగా చేసేయండి ఇలా..!
-
Rohit Sharma Retirement: రోహిత్ శర్మ అభిమానులకు శుభవార్త.. రిటైర్మెంట్ లేనట్టే!