IND vs ENG: రెండో వన్డేలో సీన్ రివర్స్.. భారత్ ఢమాల్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తొలి వన్డేలో అద్భుతమైన విజయం సాధించిన భారత్.. రెండో వన్డేలో మాత్రం ఘోర పరాజయం చవిచూసింది. బ్యాట్స్మన్లు పూర్తిగా చేతులెత్తేయడంతో, సునాయాసంగా గెలవాల్సిన మ్యాచ్ని చేజార్చుకుంది. ఓపెనర్లు పూర్తిగా ఫెయిల్ అవ్వడం, మిడిలార్డర్ బ్యాట్స్మన్లు కూడా రాణించకపోవడంతో.. ఏకంగా 100 పరుగుల తేడాతో ఓడిపోయింది. ఫస్ట్ వన్డేలో బుమ్రా తరహాలో రెండో వన్డేలో ప్రత్యర్థి బౌలర్ టాప్లీ భారత్ని దెబ్బ తీశాడు. ఆరు వికెట్లతో కొరడా ఝుళిపించాడు. దీంతో.. ఈ వన్డే సిరీస్ 1-1 తో సమం అయ్యింది.
లార్డ్స్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్లో తొలుత టాస్ గెలిచిన భారత్ బౌలింగ్ ఎంపిక చేసుకుంది. దీంతో, బ్యాటింగ్ చేసేందుకు ఇంగ్లండ్ రంగంలోకి దిగింది. తొలుత ఓపెనర్లు ఆచితూచి రాణించారు. 41 పరుగుల వరకూ వికెట్ పడకుండా జాగ్రత్త పడ్డారు. కానీ, తొలి వికెట్ పడ్డాక ఇంగ్లండ్ తడబడింది. భారత బౌలర్లు చుక్కలు చూపించడంతో.. 102 పరుగులకే ఐదు వికెట్లు కోల్పోయింది. తద్వారా మళ్లీ తక్కువ స్కోరుకే ఇంగ్లండ్ ఆలౌట్ అవుతుందని అంతా అనుకున్నారు. కానీ.. మోయిన్ అలీ (47), డేవిడ్ విల్లీ(41) బాగా రాణించడంతో ఇంగ్లండ్ గౌరవప్రదమైన స్కోరు చేయగలిగింది. 49 ఓవర్లలో 246 పరుగులు చేసి, ఇంగ్లండ్ ఆలౌట్ అయ్యింది.
Also Read
- Smriti Mandhana: మిథాలీ రాజ్ను పక్కకు నెట్టిన స్మృతి.. ఆసియా కప్లో సరికొత్త చరిత్ర..
- Prabhsimran Singh: టీమిండియాలో దక్కని చోటు.. మూడు రోజుల్లో రెండు సెంచరీలతో వీరవిహారం..
- Mohsin Naqvi: ‘భారత్ పసికూన ఐర్లాండ్ చేతిలో ఓడిపోలేదా..? పాకిస్థాన్పై మీ విమర్శలు ఎందుకు..’?
- Asia Cup 2026: ఆసియా కప్లో జోరుమీదున్న భారత్.. నేడు హాంకాంగ్తో మ్యాచ్.. తుది జట్టు ఇదే..
ఇంగ్లండ్ నిర్దేశించిన లక్ష్యం ఏమంత పెద్దది కాదు కాబట్టి.. భారత్ ఈజీగానే ఛేదిస్తుందని అంతా భావించారు. కానీ, ఇంగ్లండ్ బౌలర్లు ఆ అంచనాల్ని తిప్పికొట్టారు. భారత ఆటగాళ్లకు ఆడే అవకాశమే ఇవ్వలేదు. ప్రధాన బ్యాట్స్మన్లందరూ ఇలా వచ్చి అలా వెళ్లిపోయారు. నిజానికి.. కోహ్లీ మూడు చక్కని ఫోర్లు కొట్టడం, కాస్త ఊపుమీద ఉన్నట్టు కనిపించడంతో.. ఈ వన్డేలో తప్పకుండా దుమ్ముదులుపుతాయని ఆశించారు. ఇంతలోనే ఆ ఆశల్ని ఆవిరి చేస్తూ.. 16 పరుగులకే వెను దిరిగాడు. 31 పరుగులకే 4 వికెట్లు కోల్పోవడంతో.. తొలి వన్డేలో ఇంగ్లండ్ సీన్ రివర్స్ అవుతున్నట్టు అనిపించింది. అయితే, ఆ తర్వాత వచ్చిన ఆటగాళ్లు ఆ పతనాన్ని అడ్డుకున్నారు.
హార్దిక్ పాండ్యా(29), సూర్యకుమార్ యాదవ్(27), రవీంద్రా జడేజా(29), మహమ్మద్ షమీ(23) కాసేపు పోరాడారు. ఇంగ్లండ్ బౌలర్లను ధీటుగా ఎదుర్కొని, భారత్ జట్టుని ముందుకు నడిపించేందుకు ప్రయత్నించారు. కానీ.. అది కూడా ఏమాత్రం సరిపోలేదు. చివర్లో ఆరు పరుగుల తేడాతో భారత్ వరుసగా నాలుగు వికెట్లు చేజార్చుకుంది. ఈ దెబ్బకు 146 పరుగులకే కుప్పకూలింది. ఇంగ్లండ్ బౌలర్లలో రీస్ టాప్లీ ఆరు వికెట్లతో మెరిశాడు. డేవిడ్ విలీ, బ్రైడన్ కార్స్, మోయిన్ అలీ, లివింగ్టన్లు చెరో వికెట్ తీసుకున్నారు.
తాజావార్తలు
-
Nitin Gadkari: ట్రాఫిక్ రూల్స్ ఉల్లంఘిస్తే లైసెన్స్ రద్దు.. గడ్కరీ కీలక ప్రకటన
-
Trump: ముదురుతోన్న అమెరికా-కెనడా వాణిజ్య యుద్ధం.. కార్నీపై ట్రంప్ ఆగ్రహం
-
Konda Surekha : కొండా సురేఖకు ఫైనల్ షాక్.. బర్తరఫ్కు గవర్నర్ ఓకే..
-
Smriti Mandhana: మిథాలీ రాజ్ను పక్కకు నెట్టిన స్మృతి.. ఆసియా కప్లో సరికొత్త చరిత్ర..
-
OTR: రాజగోపాల్ రెడ్డి రాజన్న రాగం ఎందుకు వినిపిస్తున్నారు..?
ట్రెండింగ్
-
243 కి.మీ రేంజ్, 90 కి.మీ టాప్ స్పీడ్.. రూ.1.10 లక్షలకే Simple Wave ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్..!
-
Rohit Sharma Retirement: రిటైర్మెంట్కు అంగీకరించిన రోహిత్ శర్మ.. సంచలన రిపోర్ట్!
-
6 రోజుల బ్యాటరీ, 24 గంటల బీపీ మానిటరింగ్.. HUAWEI WATCH D3 లాంచ్.!
-
204hp పవర్, 480Nm టార్క్.. 7-సీటర్ SUVగా రీఎంట్రీ ఇవ్వబోతున్న Mitsubishi Pajero.!
-
7050mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్ప్లే, 50MP సోనీ కెమెరాతో VIVO T5 ఫోన్ లాంచ్!