IND vs ENG: రెండో వన్డేలో సీన్ రివర్స్.. భారత్ ఢమాల్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తొలి వన్డేలో అద్భుతమైన విజయం సాధించిన భారత్.. రెండో వన్డేలో మాత్రం ఘోర పరాజయం చవిచూసింది. బ్యాట్స్మన్లు పూర్తిగా చేతులెత్తేయడంతో, సునాయాసంగా గెలవాల్సిన మ్యాచ్ని చేజార్చుకుంది. ఓపెనర్లు పూర్తిగా ఫెయిల్ అవ్వడం, మిడిలార్డర్ బ్యాట్స్మన్లు కూడా రాణించకపోవడంతో.. ఏకంగా 100 పరుగుల తేడాతో ఓడిపోయింది. ఫస్ట్ వన్డేలో బుమ్రా తరహాలో రెండో వన్డేలో ప్రత్యర్థి బౌలర్ టాప్లీ భారత్ని దెబ్బ తీశాడు. ఆరు వికెట్లతో కొరడా ఝుళిపించాడు. దీంతో.. ఈ వన్డే సిరీస్ 1-1 తో సమం అయ్యింది.
లార్డ్స్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్లో తొలుత టాస్ గెలిచిన భారత్ బౌలింగ్ ఎంపిక చేసుకుంది. దీంతో, బ్యాటింగ్ చేసేందుకు ఇంగ్లండ్ రంగంలోకి దిగింది. తొలుత ఓపెనర్లు ఆచితూచి రాణించారు. 41 పరుగుల వరకూ వికెట్ పడకుండా జాగ్రత్త పడ్డారు. కానీ, తొలి వికెట్ పడ్డాక ఇంగ్లండ్ తడబడింది. భారత బౌలర్లు చుక్కలు చూపించడంతో.. 102 పరుగులకే ఐదు వికెట్లు కోల్పోయింది. తద్వారా మళ్లీ తక్కువ స్కోరుకే ఇంగ్లండ్ ఆలౌట్ అవుతుందని అంతా అనుకున్నారు. కానీ.. మోయిన్ అలీ (47), డేవిడ్ విల్లీ(41) బాగా రాణించడంతో ఇంగ్లండ్ గౌరవప్రదమైన స్కోరు చేయగలిగింది. 49 ఓవర్లలో 246 పరుగులు చేసి, ఇంగ్లండ్ ఆలౌట్ అయ్యింది.
Also Read
- BAN vs AUS: ఆసీస్కు ఊహించని షాక్.. 21 ఏళ్ల తర్వాత ఆస్ట్రేలియాపై బంగ్లాదేశ్ ఘన విజయం..
- APL 2026: బోణీ కొట్టిన అమరావతి రాయల్స్.. 6 వికెట్ల తేడాతో విజయం
- Vaibhav Sooryavanshi: ‘వైభవ్ సూర్యవంశీ ఆడటం చాలా కష్టం.. నాకు నమ్మకం లేదు’.. సంచలన వ్యాఖ్యలు..
- Gurnoor Brar: 17 ఏళ్ల వయసులో క్రికెట్ ప్రారంభం.. 9 ఏళ్ల కష్టానికి టీమిండియా పిలుపు..
ఇంగ్లండ్ నిర్దేశించిన లక్ష్యం ఏమంత పెద్దది కాదు కాబట్టి.. భారత్ ఈజీగానే ఛేదిస్తుందని అంతా భావించారు. కానీ, ఇంగ్లండ్ బౌలర్లు ఆ అంచనాల్ని తిప్పికొట్టారు. భారత ఆటగాళ్లకు ఆడే అవకాశమే ఇవ్వలేదు. ప్రధాన బ్యాట్స్మన్లందరూ ఇలా వచ్చి అలా వెళ్లిపోయారు. నిజానికి.. కోహ్లీ మూడు చక్కని ఫోర్లు కొట్టడం, కాస్త ఊపుమీద ఉన్నట్టు కనిపించడంతో.. ఈ వన్డేలో తప్పకుండా దుమ్ముదులుపుతాయని ఆశించారు. ఇంతలోనే ఆ ఆశల్ని ఆవిరి చేస్తూ.. 16 పరుగులకే వెను దిరిగాడు. 31 పరుగులకే 4 వికెట్లు కోల్పోవడంతో.. తొలి వన్డేలో ఇంగ్లండ్ సీన్ రివర్స్ అవుతున్నట్టు అనిపించింది. అయితే, ఆ తర్వాత వచ్చిన ఆటగాళ్లు ఆ పతనాన్ని అడ్డుకున్నారు.
హార్దిక్ పాండ్యా(29), సూర్యకుమార్ యాదవ్(27), రవీంద్రా జడేజా(29), మహమ్మద్ షమీ(23) కాసేపు పోరాడారు. ఇంగ్లండ్ బౌలర్లను ధీటుగా ఎదుర్కొని, భారత్ జట్టుని ముందుకు నడిపించేందుకు ప్రయత్నించారు. కానీ.. అది కూడా ఏమాత్రం సరిపోలేదు. చివర్లో ఆరు పరుగుల తేడాతో భారత్ వరుసగా నాలుగు వికెట్లు చేజార్చుకుంది. ఈ దెబ్బకు 146 పరుగులకే కుప్పకూలింది. ఇంగ్లండ్ బౌలర్లలో రీస్ టాప్లీ ఆరు వికెట్లతో మెరిశాడు. డేవిడ్ విలీ, బ్రైడన్ కార్స్, మోయిన్ అలీ, లివింగ్టన్లు చెరో వికెట్ తీసుకున్నారు.
తాజావార్తలు
-
Story Board: హైదరాబాద్లో చినుకు పడితే చిత్తడేనా..? వర్షాకాలం అంతా బిక్కుబిక్కుమనాల్సిందేనా?
-
RBI: క్రెడిట్ రిస్క్ నిబంధనల్లో కీలక మార్పులు.. ఆర్బీఐ ముసాయిదా విడుదల
-
Off The Record: BRSలో భారీ ప్రక్షాళన ఉండబోతుందా? కాస్త తేడాగా ఉన్న నాయకులకు ఫైనల్ వార్నింగ్?
-
Trump-Iran: ఈరోజే భారీగా విరుచుకుపడతాం.. ఇరాన్కు ట్రంప్ తాజా హెచ్చరిక
-
Whats App: వాట్సాప్లో అద్బుత ఫీచర్.. ఫార్వార్డెడ్ మెసేజ్ మొదట ఎక్కడ నుంచి వచ్చిందో కనిపెట్టడం చాలా ఈజీ..
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో Turbo 6X సిరీస్ విడుదల.! ధర ఎంతంటే.?
-
రూ.18,999లకే 144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీ, మూడు రోజుల బ్యాటరీ బ్యాకప్తో Realme P4R 5G లాంచ్..
-
20 రోజుల బ్యాటరీ, 3000 నిట్స్ AMOLED డిస్ప్లేతో Amazfit Bip Max స్మార్ట్వాచ్ లాంచ్..!
-
Hardik Pandya: షాకింగ్.. తప్పుకున్న హార్దిక్ పాండ్య!
-
Airtel: రూ.1,849తో రీఛార్జ్.. 365 రోజుల వ్యాలిడిటీతో అన్లిమిటెడ్ కాల్స్.!