ధోని సలహాలను కోహ్లీ పట్టించుకోలేదా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టీ20 వరల్డ్ కప్లో పాక్పై భారత్ ఘోర పరాజయాన్ని ఫ్యాన్స్ అస్సలు జీర్ణించుకోలేకపోతున్నారు. టీమిండియా మెంటార్ ధోని సలహాలను కోహ్లీ లైట్ తీసుకున్నాడనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయ్. ధోనీ ఎప్పటికప్పుడు తన సలహాలను యువ బ్యాట్స్మెన్ ఇషాన్ కిషాన్తో విరాట్ కోహ్లికి పంపే ప్రయత్నం చేశాడు. ఎప్పుడు కాస్త సమయం దొరికినా.. వాటర్ బాటిల్స్ లేదంటే బ్యాట్లు పట్టుకొని ఫీల్డ్లోకి పరుగెత్తుకొచ్చిన ఇషాన్ కిషన్.. ధోనీ సందేశాన్ని విరాట్కు చేరవేసే ప్రయత్నం చేశాడు.అయితే కోహ్లి మాత్రం వాటిని పట్టించుకోకుండా సొంత నిర్ణయాలకే కట్టుబడి ఉన్నట్లు మ్యాచ్ చూస్తే అర్థమవుతోంది.
కోహ్లి, పంత్ బ్యాటింగ్ చేస్తున్న సమయంలో తర్వాత ఎవరు బ్యాటింగ్కు రావాలో క్రీజులో నుంచే డ్రెస్సింగ్ రూమ్కు సందేశం పంపించాడు విరాట్. రైట్హ్యాండ్ అయిన తాను ఔటైతే హార్దిక్, పంత్ ఔటైతే జడేజా రావాలన్నది అతని ప్లాన్. అందుకు తగినట్లే పంత్ ఔటవగానే జడేజా వచ్చాడు. ఈ విషయంలో ధోనీ ఇచ్చిన సూచనను కోహ్లి పట్టించుకోలేదు. 15 ఓవర్లు పూర్తయినా కూడా కోహ్లి, జడేజా స్కోరు వేగాన్ని పెంచలేకపోయారు. ఇది భారీ స్కోరు చేసే అవకాశాన్ని దెబ్బతీసింది.
Also Read
- IPL: ‘నన్ను అస్సలు పట్టించుకోలేదు’.. కేకేఆర్పై బంగ్లాదేశ్ స్టార్ లిటన్ దాస్ సంచలన వ్యాఖ్యలు..
- IPL 2026: ఐపీఎల్ అరంగేట్రంలోనే అదరగొట్టిన తెలుగు కుర్రాడు.. మంత్రి ప్రశంసలు..
- HCA Controversy: మరో వివాదంలో HCA.. కార్యదర్శి జీవన్ రెడ్డి ఎన్నికపై తీవ్ర ఆరోపణలు.. BCCIకి ఫిర్యాదు
- IPL 2026: ఐపీఎల్ ప్లేఆఫ్స్ షెడ్యూల్ మారుతుందా? బీసీసీఐ, కేంద్రం ఆదేశాలపై ఉత్కంఠ!
ఇక ఫీల్డింగ్ సమయంలోనూ గాయపడిన పాండ్యా స్థానంలో ఇషాన్ కిషన్నే ధోనీ పంపించాడు. అప్పుడు కూడా అతడు ధోనీ సందేశాలను విరాట్కు చేరేవేసే ప్రయత్నం చేశాడు. కానీ కోహ్లి మాత్రం తన నిర్ణయాలనే ఫాలో అయ్యాడు. తొలి నాలుగు ఓవర్లు నలుగురు బౌలర్లకు ఇవ్వడమన్నది కోహ్లి నిర్ణయమే. ఇది బెడసికొట్టి.. మొదట్లోనే పాక్ను ఒత్తిడిలోకి నెట్టే చాన్స్ టీమిండియా కోల్పోయింది. మొత్తానికి కోహ్లీ సొంత నిర్ణయాలతోనే పాక్పై ఓటమిని మూటకట్టుకున్నాడనే వాదనలు వినిపిస్తున్నాయ్. దీనిపై కోహ్లీ స్పందిస్తాడో లేదో… చూడాలి.
- Tags
- india
- Pakisthan
- T 20 world Cup
తాజావార్తలు
-
IPL: ‘నన్ను అస్సలు పట్టించుకోలేదు’.. కేకేఆర్పై బంగ్లాదేశ్ స్టార్ లిటన్ దాస్ సంచలన వ్యాఖ్యలు..
-
Peddi: పెద్ది సినిమాకి కూడా పర్సంటేజ్ కావాల్సిందే.. పట్టు పడుతున్న ఎగ్జిబిటర్లు!
-
Pakistan-Saudi Arabia: సౌదీ అరేబియా రక్షణకు పాకిస్తాన్ కిరాయి సైన్యం..
-
PM Modi: నార్వే ప్రధానితో మోడీ భేటీ.. ఇరు దేశాల సంబంధాలపై చర్చ
-
Viral Video: మూగజీవాల చెంతన మిగిలిన గుండెకోత.. ఏనుగుల కొట్లాటలో ప్రాణాలు కోల్పోయిన మహిళ..
ట్రెండింగ్
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్తో REDMAGIC 11S Pro సిరీస్ లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!