IND vs ENG 4th T20: సిరీస్ కైవసం.. ఇంగ్లండ్ పై భారత్ ఘన విజయం
- భారత్- ఇంగ్లండ్ మధ్య జరిగిన నాలుగో టీ20లో భారత్ ఘన విజయం
- 15 పరుగుల తేడాతో ఇంగ్లీష్ జట్టుపై ఘన విజయం
- మరో మ్యాచ్ మిగిలి ఉండగానే సిరీస్ కైవసం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
భారత్- ఇంగ్లండ్ మధ్య జరిగిన నాలుగో టీ20లో భారత్ ఘన విజయం సాధించింది. సిరీస్ పై కన్నేసిన టీమిండియా మరో మ్యాచ్ మిగిలి ఉండగానే సిరీస్ కైవసం చేసుకుంది. టఫ్ ఫైట్ లో ఇంగ్లండ్ ను సూర్యకుమార్ సేన మట్టికరిపించింది. 15 పరుగుల తేడాతో ఇంగ్లీష్ జట్టుపై ఘన విజయం సాధించింది. కాగా ఈ మ్యాచ్ లో ముందుగా టాస్ గెలిచిన ఇంగ్లండ్ బౌలింగ్ ఎంచుకుంది. టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్స్ నష్టపోయి 181 పరుగులు చేసి ఇంగ్లండ్ కు 182 పరుగుల టార్గెట్ ను నిర్ధేశించింది. గెలుపే లక్ష్యంగా బరిలోకి దిగిన ఇంగ్లండ్ 19.4 ఓవర్లలో 166 పరుగులు చేసి చేతులెత్తేసింది. బౌలర్ల ధాటికి భారత్ ఈ మ్యాచ్లో విజయం సాధించింది. పుణె విజయంతో టీమిండియా సిరీస్లో తిరుగులేని ఆధిక్యం సాధించింది.
ఇక ఈ మ్యాచ్ లో భారత సారథి సూర్యకుమార్ యాదవ్, యంగ్ ప్లేయర్ తిలక్ వర్మ డకౌట్ అయ్యారు. సంజు శాంసన్ 1 పరుగు,అభిషేక్ శర్మ 19 బంతుల్లో 4 ఫోర్లు, 1 సిక్స్ తో రాణించాడు. ఈ మ్యాచ్ లో చోటు దక్కించుకున్న రింకూ సింగ్26 బంతుల్లో 4 ఫోర్లు, 1 సిక్స్ బాది 30 రన్స్ సాధించాడు.శివం దూబే, హార్థిక్ పాండ్య విధ్వంసకర బ్యాటింగ్ తో భారత స్కోర్ బోర్డ్ పరుగులు పెట్టింది. టీమిండియా భారీ స్కోర్ సాధించింది.
Also Read
- Gautam Gambhir: టెస్టుల్లో నంబర్-3పై కోచ్ గంభీర్ క్లారిటీ.. రిషభ్ పంత్పై కీలక వ్యాఖ్యలు!
- KS Bharat Retirement: ఇట్స్ అఫీషియల్.. అంతర్జాతీయ క్రికెట్కు వీడ్కోలు పలికిన తెలుగు క్రికెటర్
- KL Rahul: కేఎల్ రాహుల్కు ఊహించని షాక్!
- Praggnanandhaa: వరల్డ్ ఛాంపియన్కు చెక్ మెట్.. హ్యాట్రిక్ విజయంతో నార్వే చెస్ టైటిల్ రేసులో దూసుకపోతున్న ప్రజ్ఞానంద.!
హార్థిక్ పాండ్య 30 బాల్స్ లో 4 ఫోర్లు, 4 సిక్స్ లతో విరుచుకు పడి హాఫ్ సెంచరీ(53) సాధించాడు. శివం దూబే 34 బంతుల్లో 7 ఫోర్లు, 2 సిక్స్ లు బాది 53 రన్స్ చేశాడు. అక్షర్ పటేల్ 4 బంతుల్లో 5 పరుగులు చేశాడు. ఇంగ్లండ్ బౌలర్లలో సాకిబ్ మహమూద్ 3 వికెట్స్, బ్రైడన్ కార్సే1, జామీ ఓవర్టన్ 2, ఆదిల్ రషీద్1 వికెట్ పడగొట్టారు. భారత బౌలర్లలో హర్షిత్ రాణా 3 వికెట్లు తీశాడు. రవి బిష్ణోయ్కు 3 వికెట్లు దక్కాయి. వరుణ్ చక్రవర్తి 4 ఓవర్లలో 8 పరుగులిచ్చి 2 వికెట్లు తీశాడు. అర్ష్దీప్ సింగ్కు 1 వికెట్ దక్కింది.
తాజావార్తలు
-
Gautam Gambhir: టెస్టుల్లో నంబర్-3పై కోచ్ గంభీర్ క్లారిటీ.. రిషభ్ పంత్పై కీలక వ్యాఖ్యలు!
-
Jhanvi Kapoor : ఇన్స్టాగ్రామ్లో పెద్ది నెగిటివ్ రివ్యూ పోస్ట్ను లైక్ చేసిన జాన్వీ.. ఫీలైనట్టుంది?
-
Rama Nandana: లగ్జరీ లైఫ్స్టైల్ వెనుక “గలీజ్ దందా”.. యూట్యూబర్ రమానందన, మధుకర్కు లుకౌట్ నోటీసులు!
-
OnePlus Community Sale 2026: వన్ప్లస్ కమ్యూనిటీ సేల్ ప్రారంభం.. ఫ్లాగ్షిప్ ఫోన్లు, ట్యాబ్లెట్లపై భారీ డిస్కౌంట్లు
-
KS Bharat Retirement: ఇట్స్ అఫీషియల్.. అంతర్జాతీయ క్రికెట్కు వీడ్కోలు పలికిన తెలుగు క్రికెటర్
ట్రెండింగ్
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!
-
HONOR Magic V6 లాంచ్.. కేవలం 8.75mm మందం, 6660mAh భారీ బ్యాటరీతో ఫోల్డబుల్ ఫ్లాగ్షిప్.!
-
Healthy Parenting Tips : పిల్లల ఎత్తు పెరగడం లేదా? తల్లిదండ్రులు తప్పక తెలుసుకోవాల్సిన పోషకాహార రహస్యాలు.!
-
Home Remedies : రాత్రిపూట దోమల బెడదా..? దీన్ని ఒక నిమ్మకాయలో పిండి, మీ దిండు దగ్గర ఉంచుకోండి..!