IND vs ENG 4th T20: సిరీస్ కైవసం.. ఇంగ్లండ్ పై భారత్ ఘన విజయం
- భారత్- ఇంగ్లండ్ మధ్య జరిగిన నాలుగో టీ20లో భారత్ ఘన విజయం
- 15 పరుగుల తేడాతో ఇంగ్లీష్ జట్టుపై ఘన విజయం
- మరో మ్యాచ్ మిగిలి ఉండగానే సిరీస్ కైవసం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
భారత్- ఇంగ్లండ్ మధ్య జరిగిన నాలుగో టీ20లో భారత్ ఘన విజయం సాధించింది. సిరీస్ పై కన్నేసిన టీమిండియా మరో మ్యాచ్ మిగిలి ఉండగానే సిరీస్ కైవసం చేసుకుంది. టఫ్ ఫైట్ లో ఇంగ్లండ్ ను సూర్యకుమార్ సేన మట్టికరిపించింది. 15 పరుగుల తేడాతో ఇంగ్లీష్ జట్టుపై ఘన విజయం సాధించింది. కాగా ఈ మ్యాచ్ లో ముందుగా టాస్ గెలిచిన ఇంగ్లండ్ బౌలింగ్ ఎంచుకుంది. టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్స్ నష్టపోయి 181 పరుగులు చేసి ఇంగ్లండ్ కు 182 పరుగుల టార్గెట్ ను నిర్ధేశించింది. గెలుపే లక్ష్యంగా బరిలోకి దిగిన ఇంగ్లండ్ 19.4 ఓవర్లలో 166 పరుగులు చేసి చేతులెత్తేసింది. బౌలర్ల ధాటికి భారత్ ఈ మ్యాచ్లో విజయం సాధించింది. పుణె విజయంతో టీమిండియా సిరీస్లో తిరుగులేని ఆధిక్యం సాధించింది.
ఇక ఈ మ్యాచ్ లో భారత సారథి సూర్యకుమార్ యాదవ్, యంగ్ ప్లేయర్ తిలక్ వర్మ డకౌట్ అయ్యారు. సంజు శాంసన్ 1 పరుగు,అభిషేక్ శర్మ 19 బంతుల్లో 4 ఫోర్లు, 1 సిక్స్ తో రాణించాడు. ఈ మ్యాచ్ లో చోటు దక్కించుకున్న రింకూ సింగ్26 బంతుల్లో 4 ఫోర్లు, 1 సిక్స్ బాది 30 రన్స్ సాధించాడు.శివం దూబే, హార్థిక్ పాండ్య విధ్వంసకర బ్యాటింగ్ తో భారత స్కోర్ బోర్డ్ పరుగులు పెట్టింది. టీమిండియా భారీ స్కోర్ సాధించింది.
Also Read
- Vaibhav Sooryavanshi: 3 మ్యాచ్లు.. కేవలం 42 పరుగులు.. వైభవ్ సూర్యవంశీకి నేడే 'అగ్ని పరీక్ష'!
- Sri Charani: చరిత్ర సృష్టించిన కడప బిడ్డ.. టెస్ట్ ఫార్మాట్లోకి అడుగు పెట్టిన తెలుగమ్మాయి..
- BCCI: టీమ్ ఇండియా కోచింగ్ టీమ్లో మార్పులు..! గంభీర్ సహాయకుల్లో ఇద్దరిని తొలగిస్తారా..?
- Virat Kohli: లండన్లో ఆ ప్లేయర్తో విరాట్ సీక్రెట్ మీటింగ్.. రెండు గంటల్లోనే వైరల్ ఫొటోలు చూసి కోహ్లీ షాక్!
హార్థిక్ పాండ్య 30 బాల్స్ లో 4 ఫోర్లు, 4 సిక్స్ లతో విరుచుకు పడి హాఫ్ సెంచరీ(53) సాధించాడు. శివం దూబే 34 బంతుల్లో 7 ఫోర్లు, 2 సిక్స్ లు బాది 53 రన్స్ చేశాడు. అక్షర్ పటేల్ 4 బంతుల్లో 5 పరుగులు చేశాడు. ఇంగ్లండ్ బౌలర్లలో సాకిబ్ మహమూద్ 3 వికెట్స్, బ్రైడన్ కార్సే1, జామీ ఓవర్టన్ 2, ఆదిల్ రషీద్1 వికెట్ పడగొట్టారు. భారత బౌలర్లలో హర్షిత్ రాణా 3 వికెట్లు తీశాడు. రవి బిష్ణోయ్కు 3 వికెట్లు దక్కాయి. వరుణ్ చక్రవర్తి 4 ఓవర్లలో 8 పరుగులిచ్చి 2 వికెట్లు తీశాడు. అర్ష్దీప్ సింగ్కు 1 వికెట్ దక్కింది.
తాజావార్తలు
-
Bhagyasri Borse : ఏడ్చేసిన ‘లెనిన్’ హీరోయిన్.. అండగా నిలబడ్డారంటూ భాగ్యశ్రీ కన్నీళ్లు!
-
Best Jobs: బాస్ తిట్లు, డెడ్లైన్ల ప్రెజర్ లేవు.. మంచి ప్యాకేజీలతో పాటు పీస్ ఆఫ్ మైండ్ ఇచ్చే బెస్ట్ జాబ్స్ ఇవే గురూ..
-
Trump-Iran: ఆ విషయంలో ‘పొరపాటు’ జరిగింది.. ట్రంప్ బృందానికి ఇరాన్ రహస్య సందేశం?
-
Train Accident: లోకో పైలట్ అప్రమత్తత.. తప్పిన రైలు ప్రమాదం
-
Akkineni Akhil : నా వల్ల సినిమా దెబ్బ తింటుందేమోనని భయపడ్డాను!
ట్రెండింగ్
-
అబ్బో.. BSNL ప్లాన్ మాములుగా లేదుగా.! 5TB డేటా, 200Mbps స్పీడ్, ఫ్రీ OTTలు..
-
Kanpur: డ్రైవ్లో బాలికలు, మహిళల ప్రైవేట్ వీడియోలు.. గూగుల్ అలర్ట్తో పోలీసులకు చిక్కిన యువకుడు.!
-
New Car Features: మైలేజ్ రోజులు పోయాయి.. ఇప్పుడు కార్లలో ఈ ఫీచర్లకే భారీ క్రేజ్.!
-
మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీ, HD+ డిస్ప్లే, IR బ్లాస్టర్తో రాబోతున్న Itel Zeno 100 Pro.!
-
డాల్బీ ఆటమ్స్ సపోర్ట్, AI కెమెరా ఫీచర్లతో గ్రాండ్ ఎంట్రీకి సిద్దమైన TECNO CAMON 50 Ultra 5G..!