IND vs ENG 4th T20: సిరీస్ కైవసం.. ఇంగ్లండ్ పై భారత్ ఘన విజయం
- భారత్- ఇంగ్లండ్ మధ్య జరిగిన నాలుగో టీ20లో భారత్ ఘన విజయం
- 15 పరుగుల తేడాతో ఇంగ్లీష్ జట్టుపై ఘన విజయం
- మరో మ్యాచ్ మిగిలి ఉండగానే సిరీస్ కైవసం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
భారత్- ఇంగ్లండ్ మధ్య జరిగిన నాలుగో టీ20లో భారత్ ఘన విజయం సాధించింది. సిరీస్ పై కన్నేసిన టీమిండియా మరో మ్యాచ్ మిగిలి ఉండగానే సిరీస్ కైవసం చేసుకుంది. టఫ్ ఫైట్ లో ఇంగ్లండ్ ను సూర్యకుమార్ సేన మట్టికరిపించింది. 15 పరుగుల తేడాతో ఇంగ్లీష్ జట్టుపై ఘన విజయం సాధించింది. కాగా ఈ మ్యాచ్ లో ముందుగా టాస్ గెలిచిన ఇంగ్లండ్ బౌలింగ్ ఎంచుకుంది. టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్స్ నష్టపోయి 181 పరుగులు చేసి ఇంగ్లండ్ కు 182 పరుగుల టార్గెట్ ను నిర్ధేశించింది. గెలుపే లక్ష్యంగా బరిలోకి దిగిన ఇంగ్లండ్ 19.4 ఓవర్లలో 166 పరుగులు చేసి చేతులెత్తేసింది. బౌలర్ల ధాటికి భారత్ ఈ మ్యాచ్లో విజయం సాధించింది. పుణె విజయంతో టీమిండియా సిరీస్లో తిరుగులేని ఆధిక్యం సాధించింది.
ఇక ఈ మ్యాచ్ లో భారత సారథి సూర్యకుమార్ యాదవ్, యంగ్ ప్లేయర్ తిలక్ వర్మ డకౌట్ అయ్యారు. సంజు శాంసన్ 1 పరుగు,అభిషేక్ శర్మ 19 బంతుల్లో 4 ఫోర్లు, 1 సిక్స్ తో రాణించాడు. ఈ మ్యాచ్ లో చోటు దక్కించుకున్న రింకూ సింగ్26 బంతుల్లో 4 ఫోర్లు, 1 సిక్స్ బాది 30 రన్స్ సాధించాడు.శివం దూబే, హార్థిక్ పాండ్య విధ్వంసకర బ్యాటింగ్ తో భారత స్కోర్ బోర్డ్ పరుగులు పెట్టింది. టీమిండియా భారీ స్కోర్ సాధించింది.
Also Read
- IPL 2026: RCB Vs KKR మ్యాచ్కు వర్షం గండం.. మ్యాచ్ రద్దయితే వీరికి పండగే.. RCB పరిస్థితి..?
- Test Rankings: ICC టెస్ట్ ర్యాంకింగ్స్ విడుదల.. బ్యాటింగ్, బౌలింగ్, ఆల్ రౌండర్ల విభాగాల్లో దుమ్మురేపిన టీమిండియా..
- Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీకి వార్నింగ్ ఇచ్చిన ఏబీ డివిలియర్స్.. అది అంత ఈజీ కాదంటూ..
- CSK Vs SRH: సీఎస్కే జట్టులోకి మరో విధ్వంసకర బ్యాట్స్మెన్.. SRH ప్లే ఆఫ్ ఆశలు గల్లంతేనా..?
హార్థిక్ పాండ్య 30 బాల్స్ లో 4 ఫోర్లు, 4 సిక్స్ లతో విరుచుకు పడి హాఫ్ సెంచరీ(53) సాధించాడు. శివం దూబే 34 బంతుల్లో 7 ఫోర్లు, 2 సిక్స్ లు బాది 53 రన్స్ చేశాడు. అక్షర్ పటేల్ 4 బంతుల్లో 5 పరుగులు చేశాడు. ఇంగ్లండ్ బౌలర్లలో సాకిబ్ మహమూద్ 3 వికెట్స్, బ్రైడన్ కార్సే1, జామీ ఓవర్టన్ 2, ఆదిల్ రషీద్1 వికెట్ పడగొట్టారు. భారత బౌలర్లలో హర్షిత్ రాణా 3 వికెట్లు తీశాడు. రవి బిష్ణోయ్కు 3 వికెట్లు దక్కాయి. వరుణ్ చక్రవర్తి 4 ఓవర్లలో 8 పరుగులిచ్చి 2 వికెట్లు తీశాడు. అర్ష్దీప్ సింగ్కు 1 వికెట్ దక్కింది.
తాజావార్తలు
-
Aasara Pensions: గుడ్న్యూస్.. తెలంగాణలో ఆసరా పింఛన్లపై బిగ్ అప్డేట్..
-
UP: యూపీలో భారీ తుపాను.. 11 మంది మృతి
-
CM Convoy: ‘నా కాన్వాయ్లో వాహనాలను కుదించండి’.. ఆదేశాలు జారీ చేసిన సీఎం చంద్రబాబు..
-
CBI Director: సీబీఐ డైరెక్టర్ ఎంపికపై కేంద్రం కీలక నిర్ణయం.. మళ్లీ లక్కీ ఛాన్స్ ఆయనకే
-
Pakistan: ‘‘భారత్, ఆఫ్ఘనిస్తాన్ ఒకటే’’.. పాక్ రక్షణ మంత్రి రెచ్చగొట్టే వ్యాఖ్యలు..
ట్రెండింగ్
-
8K కెమెరా, 165Hz డిస్ప్లే, Snapdragon 8 Gen 5తో Motorola Razr Fold లాంచ్.. ధరే కాస్త ఎక్కువ..!
-
48MP ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 1TB స్టోరేజ్ తో Sony Xperia 1 VIII లాంచ్.. ధర ఎంతంటే.?
-
TTE Suspended: రూ. 700 వందే భారత్ టికెట్ రూ. 380కి.. వైరల్ వీడియోతో TTE సస్పెండ్..!
-
Gold Import Duty: పసిడి, వెండి ప్రియులకు షాక్.. దిగుమతి సుంకాలు పెంపు.. నేటి నుంచే అమలు..!
-
Matt Berger Fossil Discovery : కుక్క వెంట పరిగెత్తి.. 20 లక్షల ఏళ్ల రహస్యం బయటపెట్టిన బాలుడు.!