IND vs ENG: పాండ్యా వీరవిహారం.. అర్థశతకంతో రాణించిన కోహ్లీ.. ఇంగ్లండ్ లక్ష్యం ఇది!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
India Batting Innings Report Against England In T20 World Cup: టీ20 వరల్డ్కప్లో ఇంగ్లండ్తో జరుగుతున్న సెమీ ఫైనల్ మ్యాచ్లో భారత బ్యాటింగ్ ఇన్నింగ్స్ ముగిసింది. నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి భారత్ 168 పరుగులు చేసింది. విరాట్ కోహ్లీ (50), హార్దిక్ పాండ్యా (63) అద్భుతంగా ఆడటం వల్లే.. భారత్ ఆ గౌరవప్రదమైన స్కోరు చేయగలిగింది. మొదట్లో కేఎల్ రాహుల్ (5) వికెట్ రూపంలో భారత్కి గట్టి దెబ్బ తగలడంతో.. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ ఆచితూచి ఆడారు. వెంటనే మరో వికెట్ పడనివ్వకుండా, ఇంగ్లండ్ బౌలర్లను ఎదుర్కొంటూ నిదానంగా ఇన్నింగ్స్ కొనసాగించారు. వీళ్లిద్దరు కలిసి రెండో వికెట్కి 45 పరుగుల భాగస్వామ్యాన్ని జోడించారు. అనంతరం రోహిత్ శర్మ (27) ఔట్ అవ్వగా.. ఆ తర్వాత వచ్చిన సూర్యకుమార్ యాదవ్ (14) కూడా వెంటనే పెవిలియన్ చేరాడు. అప్పుడు క్రీజులోకి వచ్చిన హార్దిక్ పాండ్యాతో కలిసి.. విరాట్ కోహ్లీ భారత్ స్కోర్ బోర్డును ముందుకు నడిపించాడు. అప్పటివరకూ నిదానంగా ఆడిన కోహ్లీ.. ఒక్కసారిగా చెలరేగిపోయి ఆడాడు.
అయితే.. సరిగ్గా అర్థశతకం చేసిన వెంటనే కోహ్లీ ఔట్ అయ్యాడు. కోహ్లీ క్రీజులో ఉన్నప్పటి నుంచే తన బ్యాట్కి పనిచెప్పడం మొదలుపెట్టిన పాండ్యా.. కోహ్లీ ఔటయ్యాక మరింత విజృంభించాడు. సిక్సులు, ఫోర్లతో పరుగుల వర్షం కురిపించాడు. తనని ఔట్ చేసే అవకాశం ఇంగ్లండ్ బౌలర్లకు ఇవ్వకుండా.. చివరివరకూ క్రీజులో నిలబడి తాండవం చేశాడు. చివర్లో పాండ్యా విజృంభణ వల్లే.. భారత్ స్కోరు 168 పరుగులకి చేరిందని చెప్పుకోవడంలో సందేహం లేదు. అయితే.. చివర్లో ఓ అనూహ్య పరిణామం చోటు చేసుకుంది. పాండ్యా ఫోర్ కొట్టాడు కానీ, తాను వికెట్లకు తగలడంతో దాన్ని హిట్ వికెట్గా ప్రకటించారు. ఒకవేళ పాండ్యా వికెట్లకు తగలకపోయి ఉంటే.. భారత్ ఖాతాలో మరో నాలుగు పరుగులు వచ్చేవి. ఇక ఇంగ్లండ్ బౌలర్ల విషయానికొస్తే.. క్రిస్ జోర్డాన్ 3 వికెట్లు పడగొట్టగా.. క్రిస్ వోక్స్, ఆదిల్ రషీద్ చెరో వికెట్ తీశారు. ఇంగ్లండ్కి 169 పరుగుల లక్ష్యమనేది పెద్ద సవాలుతో కూడుకున్న పని కాదు. అలాగని డిఫెండ్ చేసుకోలేనంత చిన్న స్కోరూ కాదు. ఈ మ్యాచ్ గెలవాలంటే.. భారత బౌలర్ల ప్రతిభపైనే ఆధారపడి ఉంది.
Also Read
- Jasprit Bumrah: ఆఫ్ఘనిస్థాన్ సిరీస్కు దూరం.. బుమ్రా రీఎంట్రీపై బీసీసీఐ కీలక అప్డేట్?
- Pakistan Whitewash: తేలిపోయిన పాకిస్థాన్ బ్యాటర్స్.. బంగ్లాదేశ్ చేతిలో క్లీన్ స్వీప్..!
- PV Sindhu: క్రీడా రంగంలో ఏఐ విప్లవం.. అథ్లెట్ల కోసం ‘టెంపుల్’ స్మార్ట్ సెన్సార్ ప్యాచ్.. ప్రత్యేక ఆకర్షణగా పీవీ సింధు!
- Vaibhav Sooryavanshi: వైభవ్ విధ్వంసం.. ఒక్క ఇన్నింగ్స్తో ఐపీఎల్ చరిత్రనే తిరగరాసిన బుడ్డోడు..
తాజావార్తలు
-
Motorola Razr Fold: మోటరోలా రేజర్ ఫోల్డ్ సేల్ స్టార్ట్.. రూ. 10000 డిస్కౌంట్! 6,000mAh బ్యాటరీ, 8.1-అంగుళాల స్క్రీన్
-
Tech Layoffs: ‘‘60 రోజులు లేదా అమెరికా వదలాలి’’.. లేఆఫ్స్తో H-1B ఇండియన్లలో భయం..
-
Kejriwal: కేజ్రీవాల్ ఎన్నికల్లో పోటీ చేయొద్దనడానికి మీరెవరు? పిటిషనర్కు ఢిల్లీ హైకోర్టు చీవాట్లు
-
WFH: ఆ బ్యాంక్ ఉద్యోగులకు శుభవార్త.. వారంలో రెండు రోజులు వర్క్ ఫ్రం హోం..
-
Chiranjeevi : ఏపీసెట్ టాపర్ రుషి.. కలను నిజం చేసి, ల్యాప్టాప్ బహుకరించిన మెగాస్టార్
ట్రెండింగ్
-
Cockroach Janata Party: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న “కాక్రోచ్ జనతా పార్టీ”.. కేవలం 72 గంటల్లోనే 20 లక్షల ఫాలోవర్స్!
-
55dB ANC, 53 గంటల బ్యాటరీతో Moto Buds 2 లాంచ్.. ధర కూడా తక్కవే.!
-
Explained: పెట్రోల్ వాత, డాలర్ మోత.. ఆసియాలోనే అత్యంత వీక్ కరెన్సీగా ‘Rupee’.. పతనానికి అసలు కారణం ఇదే..
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో వచ్చేస్తున్న గేమింగ్ మాన్స్టర్ Lenovo Legion Y70 (2026)..!
-
Healthy Ragi Kudumulu: రక్త హీనతను తొలగించి ఎముకలను దృఢంగా చేసే ‘రాగి కుడుములు’ చేసేయండి ఇలా..!