Team India Squad: రోహిత్ శర్మ, విరాట్ సహా ఆస్ట్రేలియాతో తలపడేది వీళ్ళే!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
వెస్టిండీస్తో టెస్ట్ సిరీస్ ముగిసిన వెంటనే టీం ఇండియా చేపట్టబోయే కీలకమైన ఆస్ట్రేలియా పర్యటన కోసం బీసీసీఐ సెలక్షన్ కమిటీ శనివారం జట్లను ప్రకటించింది. చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ విలేకరుల సమావేశంలో వివరాలను వెల్లడించారు. ఈ పర్యటనలో భాగంగా భారత జట్టు ఆస్ట్రేలియాతో మూడు వన్డేలు, ఐదు టీ20 మ్యాచ్లు ఆడనుంది. ఈ సుదీర్ఘ పర్యటన అక్టోబర్ 19 నుంచి నవంబర్ 8 వరకు జరగనుంది.
Also Read :Shubman Gill : రోహిత్ శర్మకు షాక్.. టీమిండియా వన్డే కెప్టెన్గా గిల్..
Also Read
- Gautam Gambhir-BCCI: గౌతమ్ గంభీర్ హెడ్ కోచ్ పోస్ట్ సేఫ్.. ఆ రెండు కారణాల వల్లే!
- Rohit Sharma: ఎప్పటికీ ఆడలేరు.. రోహిత్ భవిష్యత్తుపై హేడెన్ కీలక వ్యాఖ్యలు!
- India vs Pakistan: భారత్-పాకిస్థాన్ మ్యాచ్పై బిగ్ అప్డెట్.. ఈ ఫైట్ ఎప్పుడు, ఎక్కడ జరుగుతుదంటే?
- IND Playing 11: ఆరుగురి మధ్య తీవ్ర పోటీ.. గుర్నూర్ అరంగేట్రం ఖాయం.. శ్రీలంకతో తొలి టెస్టుకు భారత్ జట్టు ఇదే!
వన్డే సారథిగా శుభ్మాన్ గిల్
ఈ పర్యటనలో అతిపెద్ద మార్పు కెప్టెన్సీకి సంబంధించిందే. టెస్టు జట్టుకు నాయకత్వం వహిస్తున్న శుభ్మాన్ గిల్కు వన్డే జట్టు సారథ్య బాధ్యతలను కూడా అప్పగించారు. దీంతో, గతంలో కెప్టెన్గా వ్యవహరించిన సీనియర్ ఆటగాడు రోహిత్ శర్మ ఇకపై కేవలం బ్యాట్స్మన్గా మాత్రమే జట్టులో కొనసాగుతాడు. డిసెంబర్ 2021 తర్వాత రోహిత్ శర్మ ఒక సాధారణ ఆటగాడిగా జట్టుకు ఎంపిక కావడం ఇదే తొలిసారి.
Also Read :IND vs WI: వెస్టిండీస్తో టెస్ట్ మ్యాచ్.. భారత్ ఘన విజయం
తిరిగి వచ్చిన సీనియర్లు.. విశ్రాంతిలో బుమ్రా
దాదాపు ఏడు నెలల విరామం తర్వాత సీనియర్ స్టార్ ఆటగాళ్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ వన్డే జట్టులోకి రీ ఎంట్రీ ఇచ్చారు. వీరిద్దరూ చివరిసారిగా 2025 ఛాంపియన్స్ ట్రోఫీలో భారత జట్టుకు ప్రాతినిధ్యం వహించారు. ఛాంపియన్స్ ట్రోఫీ గెలిచిన తర్వాత టీం ఇండియా ఆడబోతున్న తొలి వన్డే సిరీస్ ఇదే కావడం విశేషం. అదే సమయంలో, వెస్టిండీస్ పర్యటనలో పని భారం దృష్ట్యా స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రాకు వన్డే సిరీస్ నుంచి విశ్రాంతి కల్పించారు. గాయాల కారణంగా ఆల్-రౌండర్ హార్దిక్ పాండ్యా, వికెట్ కీపర్ రిషబ్ పంత్ కూడా ఈ పర్యటనకు దూరమయ్యారు.
ఆస్ట్రేలియా పర్యటనకు ఎంపికైన జట్లు
వన్డే జట్టు:
శుభ్మన్ గిల్ (కెప్టెన్), రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, యశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్ (వికెట్ కీపర్), ధృవ్ జురెల్ (వికెట్ కీపర్), నితీష్ కుమార్ రెడ్డి, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, కుల్దీప్ యాదవ్, మహమ్మద్ సిరాజ్, అర్ష్దీప్ సింగ్, ప్రసిద్ధ్ కృష్ణ, హర్షిత్ రాణా.
టీ20 జట్టు:
సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), శుభ్మన్ గిల్ (వైస్ కెప్టెన్), అభిషేక్ శర్మ, తిలక్ వర్మ, నితీష్ కుమార్ రెడ్డి, శివమ్ దూబే, జితేష్ శర్మ (వికెట్ కీపర్), హర్కీరత్సన్ భాటియా (వికెట్ కీపర్), అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, వరుణ్ చక్రవర్తి, కుల్దీప్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా, అర్ష్దీప్ సింగ్, హర్షిత్ రాణా.
తాజావార్తలు
-
Parliament Monsoon Session: 18 రోజులు.. చర్చ కంటే వాయిదాలే ఎక్కువ! ముగిసిన పార్లమెంట్ సమావేశాలు..
-
Amaravati Seed Access Road: అమరావతికి మరో కీలక రహదారి.. సీడ్ యాక్సెస్ రోడ్డును ప్రారంభించిన చంద్రబాబు
-
Explainer: అమెరికా కుట్ర? ఏకమౌతున్న ముస్లిం దేశాలు..!
-
Annapurna Studios: ఏఎన్నార్ దార్శనికత.. నాగార్జున ఆధునికత.. అన్నపూర్ణ స్టూడియోస్కు 51 ఏళ్లు
-
South Stars Mumbai Homes : సౌత్ స్టార్స్కు సెకండ్ హోమ్గా ముంబై.. కోట్లాది రూపాయల విలువైన హౌసెస్ కొనుగోలు
ట్రెండింగ్
-
HONOR Robot Phone లాంచ్.. 200MP డ్యూయల్ కెమెరాలు, 200x జూమ్, 7,060mAh బ్యాటరీ, 120W ఛార్జింగ్..
-
Gautam Gambhir-BCCI: గౌతమ్ గంభీర్ హెడ్ కోచ్ పోస్ట్ సేఫ్.. ఆ రెండు కారణాల వల్లే!
-
40 గంటల బ్యాటరీ, 3,000 నిట్స్ స్క్రీన్.. Google Pixel Watch 5 ధర, ఫీచర్లు ఇవే!
-
IND Playing 11: ఆరుగురి మధ్య తీవ్ర పోటీ.. గుర్నూర్ అరంగేట్రం ఖాయం.. శ్రీలంకతో తొలి టెస్టుకు భారత్ జట్టు ఇదే!
-
నాయిస్ క్యాన్సిలేషన్ (ANC) మరింత స్మార్ట్గా.. కొత్త ఫీచర్లు, Olive కలర్లో Google Pixel Buds 2a, Pro 2..!