IND vs SA: ఇద్దరు కీపర్లు, ముగ్గురు స్పిన్నర్లు.. పాపం నితీష్ రెడ్డి, టీమిండియా ప్లేయింగ్ 11 ఇదే!
- కోల్కతాలోని ఈడెన్ గార్డెన్స్లో మొదటి టెస్ట్
- తొలి టెస్ట్కు ముందు బీసీసీఐ కీలక నిర్ణయం
- తెలుగు ఆటగాడు నితీశ్ రెడ్డి విడుదల
- టీమిండియా ప్లేయింగ్ 11 ఇదే
- Follow Us :
-
-
Add as a preferred
source on google
భారత్, దక్షిణాఫ్రికా జట్ల మధ్య కోల్కతాలోని ఈడెన్ గార్డెన్స్లో శుక్రవారం (నవంబర్ 14) నుంచి మొదటి టెస్ట్ మ్యాచ్ జరగనుంది. తొలి టెస్ట్కు ముందు బీసీసీఐ కీలక నిర్ణయం తీసుకుంది. తెలుగు ఆటగాడు నితీశ్ కుమార్ రెడ్డిని సిరీస్ నుంచి విడుదల చేసింది. నితీష్ పూర్తి ఫిట్నెస్తో ఉన్నప్పటికీ.. దక్షిణాఫ్రికాతో టెస్టు సిరీస్ తుది జట్టులో చోటు ఇవ్వడం కష్టంగా మారడంతో ఈ నిర్ణయం తీసుకుంది. దాంతో ఇప్పుడు అతడు దక్షిణాఫ్రికా-ఎతో వన్డేలు ఆడనున్న భారత్-ఎ జట్టుకు ప్రాతినిధ్యం వహించనున్నాడు.
దేశవాళీల్లో సత్తా చాటుకున్న వికెట్ కీపర్ ధ్రువ్ జురెల్ దక్షిణాఫ్రికాతో తొలి టెస్టులో ఆడడం దాదాపుగా ఖాయం అయింది. ఇంగ్లాండ్ పర్యటనలో రిషబ్ పంత్ గాయపడడంతో అతడి స్థానంలో జురెల్ ఆడాడు జురెల్. పంత్ గాయం నుంచి కోలుకుని దక్షిణాఫ్రికా సిరీస్కు ఎంపికవ్వడంతో జురెల్కు ప్లేయింగ్ 11లో స్థానం కష్టమే అనిపించింది. కానీ తాజాగా ఫస్ట్క్లాస్ మ్యాచ్ల్లో (127 నాటౌట్, 132 నాటౌట్, 44, 125, 56, 140) అదరగొట్టాడు. దాంతో తుది జట్టులో కూడా ప్లేస్ ఖాయంగామారింది. దాంతో నితీశ్ కుమార్ రెడ్డిని జట్టు నుంచి విడుదల చేయాల్సి వచ్చిందని తెలుస్తోంది.
Also Read
- Abdullah Shafique: 49 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణకు తెర.. విండీస్ గడ్డపై పాకిస్థాన్ ప్లేయర్ చారిత్రాత్మక రికార్డు..
- Mohammad Amir-IPL 2027: పాక్ స్టార్ మహ్మద్ అమీర్కు లైన్ క్లియర్.. ఇక ఐపీఎల్ 2027లో ఆడతాడా?
- రికార్డుల మోత..! The Hundredలో పరుగుల సునామీ.. ఒక్క మ్యాచ్లో 31 సిక్సర్లు, 445 పరుగులు..
- Ishan Kishan: మైదానంలో సిక్సర్ల కింగ్.. బ్యాంకులో సర్కారీ నౌకరీ.. బిజీ క్రికెట్ లైఫ్లోనూ ఉద్యోగ బాధ్యతలు
అక్షర్ పటేల్ తొలి టెస్ట్ మ్యాచ్కు దూరం కావచ్చు. భారత్ ముగ్గురు స్పిన్నర్లు, ఇద్దరు పసర్లతో ఆడనుంది. రవీంద్ర జడేజా, వాషింగ్టన్ సుందర్, కుల్దీప్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా, మహమ్మద్ సిరాజ్ బౌలింగ్ విభాగంలో ఆడనున్నారు. రిషబ్ పంత్ వికెట్ కీపింగ్ బాధ్యతలు చేపడతాడు. ఓపెనర్లుగా యశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్ ఆడుతారు. సాయి సుదర్శన్, శుభ్మన్ గిల్, రిషబ్ పంత్, ధ్రువ్ జురెల్ తర్వాతి స్థానాల్లో బ్యాటింగ్ చేయనున్నారు. ఆల్రౌండర్ కోటాలో జడేజా, సుందర్ బ్యాటింగ్ చేయనున్నారు.
Also Read: PAK vs SL: భయంగా ఉంది.. పాక్ నుంచి స్వదేశానికి శ్రీలంక ప్లేయర్స్!
భారత్ తుది జట్టు (అంచనా):
యశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్, సాయి సుదర్శన్, శుభ్మన్ గిల్, రిషబ్ పంత్, ధ్రువ్ జురెల్, రవీంద్ర జడేజా, వాషింగ్టన్ సుందర్, కుల్దీప్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్.
తాజావార్తలు
-
SVC 63: టైటిల్ లేదు.. హైప్ మాత్రం పీక్స్లో.. మొదలైన సల్మాన్, నయనతారల హై వోల్టేజ్ యాక్షన్
-
144Hz డిస్ప్లే, మిలిటరీ-గ్రేడ్ షాక్ రెసిస్టన్స్, 7,000mAh బ్యాటరీతో Realme 16x 5G లాంచ్ కు ముహూర్తం ఫిక్స్..!
-
Abdullah Shafique: 49 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణకు తెర.. విండీస్ గడ్డపై పాకిస్థాన్ ప్లేయర్ చారిత్రాత్మక రికార్డు..
-
SpaceX Rocket Moon Crash: గంటకు 8,690 కి.మీ వేగంతో.. చంద్రుడిని ఢీకొట్టనున్న SpaceX రాకెట్..!
-
Tragedy News: స్నేహం, పెళ్లి, కోపం.. చివరికి నదిలోకి తోసి ప్రాణాలు తీసిన యువకుడు!
ట్రెండింగ్
-
AI పవర్తో iQOO Z11 ఎంట్రీ.. కొత్త డిజైన్, స్మార్ట్ ఫీచర్లపై క్లారిటీ ఇచ్చిన కంపెనీ.!
-
boltt Ace 5G, Evo 4G డిజైన్ రివీల్.. ఆగస్టు 25న భారత్లో లాంచ్కు సిద్ధం..!
-
TVS Raider Doctor Doom Edition లాంచ్.. Marvel థీమ్, Spectral Green కలర్తో కొత్త స్టైల్..!
-
115 అంగుళాల Mini LED TV, OLED evo, Micro RGB evoతో LG 2026 AI TV సిరీస్ భారత్లో లాంచ్..!
-
VVS Laxman Chief Selector: అజిత్ అగార్కర్కు బిగ్ షాక్.. బీసీసీఐ చీఫ్ సెలెక్టర్గా వీవీఎస్ లక్ష్మణ్?