PAK vs SL: భయంగా ఉంది.. పాక్ నుంచి స్వదేశానికి శ్రీలంక ప్లేయర్స్!
- పాకిస్థాన్, శ్రీలంక మధ్య వన్డే సిరీస్
- ఇస్లామాబాద్లో బాంబు పేలుడుతో 12 మంది మృతి
- పాక్ నుంచి స్వదేశానికి శ్రీలంక ప్లేయర్స్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పాకిస్థాన్, శ్రీలంక మధ్య వన్డే సిరీస్ జరుగుతోంది. సిరీస్లో ఇప్పటికే మొదటి మ్యాచ్ (నవంబర్ 11) పూర్తయింది. రావల్పిండిలో జరిగిన మొదటి మ్యాచ్లో పాక్ గెలిచింది. రావల్పిండిలోనే రెండో, మూడో వన్డేలు జరగనున్నాయి. మొదటి వన్డే జరిగిన రోజే ఇస్లామాబాద్లో బాంబు పేలుడుతో 12 మంది మృతి చెందారు. ఇస్లామాబాద్కు చాలా దగ్గర్లోనే రావల్పిండి ఉండడంతో శ్రీలంక ప్లేయర్స్ భయాందోళనకు గురయ్యారు. పాకిస్థాన్లో భద్రతపై ఆందోళన చెందిన లంక ప్లేయర్స్ సిరీస్ ఆడలేమని స్పష్టం చేశారట.
రావల్పిండికి బాంబ్ దాడి జరిగిన ఇస్లామాబాద్ సమీపంలోనే ఉందని, భద్రతపై తమ క్రికెటర్లు ఆందోళన చెందుతున్నారని ఓ శ్రీలంక బోర్డు అధికారి చెప్పాడు. దాంతో పాకిస్థాన్, శ్రీలంక సిరీస్ రద్దయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. లంక జట్టులోని 8 మంది ప్లేయర్స్ నేడు స్వదేశానికి బయల్దేరనున్నారు. వన్డే సిరీస్ తర్వాత శ్రీలంక, పాకిస్థాన్, జింబాబ్వే మధ్య ముక్కోణపు సిరీస్ ఉంది. ఈ సిరీస్ కూడా ఇప్పుడు సందిగ్ధంలో పడింది. రెండు సిరీస్లు రద్దయితే పీసీబీకి భారీ నష్టం వాటిల్లనుంది. ఇప్పటికే అంతంత మాత్రంగా ఉన్న పీసీబీ పరిస్థితి ఇప్పుడు మరింత దిగజారనుంది.
Also Read
- Tilak Varma: తిలక్ వర్మకు కొత్త బాధ్యతలు.. కెప్టెన్గా ఎంపిక చేసిన బీసీసీఐ..
- RCB: ఆర్సీబీకి బిగ్ షాక్.. పాయింట్ల పట్టికలో టాప్లో ఉన్నా ఆర్సీబీ కంటే ఆ జట్టుకే ప్లే ఆఫ్ అవకాశాలు..
- IPL 2026: ప్లేఆఫ్స్ మిస్.. ఐపీఎల్లో ఈ ముగ్గురు కెప్టెన్లకు గండం!
- Virat Kohli Century: “నేనే చెప్పాను కదా.. అందుకే”.. కోహ్లీ సెంచరీపై తర్వాత కృనాల్ పాండ్యా వైరల్ పోస్ట్..!
2009లో లాహోర్లోని గడాఫీ స్టేడియానికి వెళ్తుండగా శ్రీలంక క్రికెటర్ల బస్సుపై ఉగ్ర వాదులు దాడి చేసిన విషయం తెలిసిందే. అదృష్టవశాత్తు ఆ ఘటనలో ప్లేయర్స్ ప్రాణాలతో భయపడ్డారు. మహేల జయవర్దనే, చమింద వాస్, అజంత మెండిస్, కుమార్ సంగక్కర, తిలకరత్నే దిల్షాన్ సహా మరికొందరు గాయపడ్డారు. ఆ ఘటనలో భద్రత సిబ్బంది చాలా మంది మృతి చెందారు. భద్రత సిబ్బంది ప్రతిఘటించడంతో ప్లేయర్స్ సురక్షితంగా బయటపడ్డారు. ఆ దాడితో దాదాపు దశాబ్దం పాటు విదేశీ జట్లు పాకిస్థాన్కు క్రికెట్ ఆడేందుకు వెళ్లలేదు. 2019లో శ్రీలంక జట్టే పాకిస్థాన్కు వెళ్లింది. అప్పటి నుంచి అన్ని టీమ్స్ పాక్ వెళ్లి ఆడాయి. తాజా ఘటనతో మరలా అప్పటి పరిస్థితే వచ్చే అవకాశాలు లేకపోలేదు.
తాజావార్తలు
-
Pakistan: ఢిల్లీని టార్గెట్ చేసే మిస్సైల్ను పరీక్షించిన పాకిస్తాన్..
-
Nizam Exhibitors: మేం పెద్ది సినిమాని టార్గెట్ చేయలేదు.. పర్సనల్ టార్గెట్ చేశారు!
-
Ragi Vadiyalu: అమ్మమ్మల కాలం నాటి టేస్ట్.. హెల్తీ రాగి వడియాలను సింపుల్గా ఇలా చేసుకోండి!
-
Japanese Skin Care : మెరిసే చర్మం కోసం జపనీస్ రహస్యం.. ఇంట్లోనే మీ ముఖాన్ని యవ్వనంగా మార్చుకోండి.!
-
Tilak Varma: తిలక్ వర్మకు కొత్త బాధ్యతలు.. కెప్టెన్గా ఎంపిక చేసిన బీసీసీఐ..
ట్రెండింగ్
-
AI ఫీచర్లతో రియల్మీ కొత్త గ్యాడ్జెట్లు.. కొత్త Realme Buds Air8 Pro, Watch S5 లాంచ్.!
-
WhatsAppలో ‘Incognito AI Chat’.. యూజర్లకు మెటా బిగ్ అప్డేట్.!
-
8000mAh భారీ బ్యాటరీ, 200MP కెమెరా, Snapdragon 8 Elite Gen 5తో తో Xiaomi 17 Max పవర్ఫుల్ ఎంట్రీ.!
-
8K కెమెరా, 165Hz డిస్ప్లే, Snapdragon 8 Gen 5తో Motorola Razr Fold లాంచ్.. ధరే కాస్త ఎక్కువ..!
-
48MP ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 1TB స్టోరేజ్ తో Sony Xperia 1 VIII లాంచ్.. ధర ఎంతంటే.?