PAK vs SL: భయంగా ఉంది.. పాక్ నుంచి స్వదేశానికి శ్రీలంక ప్లేయర్స్!
- పాకిస్థాన్, శ్రీలంక మధ్య వన్డే సిరీస్
- ఇస్లామాబాద్లో బాంబు పేలుడుతో 12 మంది మృతి
- పాక్ నుంచి స్వదేశానికి శ్రీలంక ప్లేయర్స్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పాకిస్థాన్, శ్రీలంక మధ్య వన్డే సిరీస్ జరుగుతోంది. సిరీస్లో ఇప్పటికే మొదటి మ్యాచ్ (నవంబర్ 11) పూర్తయింది. రావల్పిండిలో జరిగిన మొదటి మ్యాచ్లో పాక్ గెలిచింది. రావల్పిండిలోనే రెండో, మూడో వన్డేలు జరగనున్నాయి. మొదటి వన్డే జరిగిన రోజే ఇస్లామాబాద్లో బాంబు పేలుడుతో 12 మంది మృతి చెందారు. ఇస్లామాబాద్కు చాలా దగ్గర్లోనే రావల్పిండి ఉండడంతో శ్రీలంక ప్లేయర్స్ భయాందోళనకు గురయ్యారు. పాకిస్థాన్లో భద్రతపై ఆందోళన చెందిన లంక ప్లేయర్స్ సిరీస్ ఆడలేమని స్పష్టం చేశారట.
రావల్పిండికి బాంబ్ దాడి జరిగిన ఇస్లామాబాద్ సమీపంలోనే ఉందని, భద్రతపై తమ క్రికెటర్లు ఆందోళన చెందుతున్నారని ఓ శ్రీలంక బోర్డు అధికారి చెప్పాడు. దాంతో పాకిస్థాన్, శ్రీలంక సిరీస్ రద్దయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. లంక జట్టులోని 8 మంది ప్లేయర్స్ నేడు స్వదేశానికి బయల్దేరనున్నారు. వన్డే సిరీస్ తర్వాత శ్రీలంక, పాకిస్థాన్, జింబాబ్వే మధ్య ముక్కోణపు సిరీస్ ఉంది. ఈ సిరీస్ కూడా ఇప్పుడు సందిగ్ధంలో పడింది. రెండు సిరీస్లు రద్దయితే పీసీబీకి భారీ నష్టం వాటిల్లనుంది. ఇప్పటికే అంతంత మాత్రంగా ఉన్న పీసీబీ పరిస్థితి ఇప్పుడు మరింత దిగజారనుంది.
Also Read
- Vaibhav Sooryavanshi: ఈసారి కొట్టాల్సిందే..! హనుమంతుడి ఆశీస్సులు తీసుకొని నెట్స్లోకి వైభవ్
- New Country: ఐసీసీ సభ్యత్వం పొందిన మరో దేశం.. మొత్తం 111కు చేరిన సంఖ్య..
- Ben Stokes Returns: 'క్రికెట్పై మళ్లీ ఆసక్తి వచ్చింది'.. రీఎంట్రీకి సిద్ధమైన స్టార్ ఆల్రౌండర్
- India U-19 vs Sri Lanka U-19: చరిత్ర సృష్టించిన భారత యువ ఓపెనర్లు.. రికార్డుల మోత
2009లో లాహోర్లోని గడాఫీ స్టేడియానికి వెళ్తుండగా శ్రీలంక క్రికెటర్ల బస్సుపై ఉగ్ర వాదులు దాడి చేసిన విషయం తెలిసిందే. అదృష్టవశాత్తు ఆ ఘటనలో ప్లేయర్స్ ప్రాణాలతో భయపడ్డారు. మహేల జయవర్దనే, చమింద వాస్, అజంత మెండిస్, కుమార్ సంగక్కర, తిలకరత్నే దిల్షాన్ సహా మరికొందరు గాయపడ్డారు. ఆ ఘటనలో భద్రత సిబ్బంది చాలా మంది మృతి చెందారు. భద్రత సిబ్బంది ప్రతిఘటించడంతో ప్లేయర్స్ సురక్షితంగా బయటపడ్డారు. ఆ దాడితో దాదాపు దశాబ్దం పాటు విదేశీ జట్లు పాకిస్థాన్కు క్రికెట్ ఆడేందుకు వెళ్లలేదు. 2019లో శ్రీలంక జట్టే పాకిస్థాన్కు వెళ్లింది. అప్పటి నుంచి అన్ని టీమ్స్ పాక్ వెళ్లి ఆడాయి. తాజా ఘటనతో మరలా అప్పటి పరిస్థితే వచ్చే అవకాశాలు లేకపోలేదు.
తాజావార్తలు
-
Off The Record: తెలంగాణ బీజేపీలో ‘నో సింగిల్స్.. ఓన్లీ మింగిల్స్’
-
NDA Majority: మెజారిటీకి కేవలం ఆరుగురు ఎంపీల దూరం.. డీలిమిటేషన్ బిల్లుపై ఉత్కంఠ.. ఎన్డీఏ వ్యూహం ఫలిస్తుందా?
-
Off The Record: విజయశాంతి తీరుపై తెలంగాణ పీసీసీ సీరియస్ గా ఉందా..?
-
Vaibhav Sooryavanshi: ఈసారి కొట్టాల్సిందే..! హనుమంతుడి ఆశీస్సులు తీసుకొని నెట్స్లోకి వైభవ్
-
OTR: కూటమి సర్కార్కే షాకిచ్చిన జనసేన ఎమ్మెల్యే
ట్రెండింగ్
-
Team India Coaching Staff: టీమిండియా కోచింగ్ స్టాఫ్లో విభేదాలు.. ఆ ఇద్దరిలో ఒకరిపై వేటు తప్పదు?
-
12-అంగుళాల 2.8K OLED డిస్ప్లే, 144Hz రిఫ్రెష్ రేట్, 10100mAh బ్యాటరీతో HUAWEI MatePad Air (2026) లాంచ్..!
-
Harry Brook: అదే మా ఓటమికి కారణం.. రెండో వన్డేలో టీమిండియాను దెబ్బ కొడతాం!
-
OLED డిస్ప్లే, 200MP కెమెరా, 100W ఫాస్ట్ ఛార్జింగ్తో HUAWEI Pura 90s Pro, Pura 90s Pro Max గ్లోబల్ లాంచ్..!
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో REDMI Note 17 Pro లాంచ్..!