IND vs PAK Highest Scores in T20 World Cup History: టీ20 వరల్డ్కప్ చరిత్రలో ఇండియా–పాకిస్థాన్ మ్యాచ్ అంటేనే ఉత్కంఠ, ఒత్తిడి, అద్భుత ప్రదర్శనలు గుర్తుకు వస్తాయి. ఈ హై వోల్టేజ్ పోరులో పలువురు స్టార్ బ్యాట్స్మెన్ అసాధారణ ఇన్నింగ్స్ ఆడి తమ ముద్ర వేశారు. భారత్-పాకిస్థాన్ జట్ల మధ్య వరల్డ్కప్ మ్యాచ్ల్లో నమోదైన అత్యధిక వ్యక్తిగత స్కోర్ల జాబితాలో భారత స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ అగ్రస్థానంలో నిలిచాడు. టాప్ 10లో ఏకంగా నాలుగు స్థానాలు సొంతం చేసుకున్నాడు. అయితే టాప్ 10లో ఏకంగా ఐదుగురు పాక్ బ్యాటర్లు ఉండడం విశేషం.
భారత్-పాకిస్థాన్ జట్ల మధ్య 2022లో జరిగిన మ్యాచ్లో విరాట్ కోహ్లీ అజేయంగా 82 పరుగులు చేసి చరిత్ర సృష్టించాడు. ఈ జాబితాలో పాకిస్థాన్ వికెట్కీపర్ బ్యాటర్ మహమ్మద్ రిజ్వాన్ 2021లో 79 రన్ చేసి రెండో స్థానంలో ఉండు. కోహ్లీ మరోసారి 2012లో 78 నాటౌట్ స్కోర్ చేసి తన స్థిరత్వాన్ని చూపించాడు. ఈ జాబితాలో భారత మాజీ ఓపెనర్ గౌతమ్ గంభీర్ 2007లో చేసిన 75 పరుగులతో నాలుగో స్థానంలో నిలిచాడు. పాకిస్థాన్ మాజీ కెప్టెన్ బాబర్ ఆజామ్ 2022లో 68 చేసి తన క్లాస్ను నిరూపించాడు. అదే మ్యాచ్లో పాకిస్థాన్ తరఫున షాన్ మసూద్ 52 పరుగులు చేసి జాబితాలో చోటు సంపాదించాడు.
Also Read: Healthy Smoothie: ప్రతిరోజుకు హెల్తీ స్మూతీస్.. సహజ ఆరోగ్యం, అందం, ఆనందం మీ సొంతం!
ఇక 2007 టీ20 వరల్డ్కప్లో పాకిస్థాన్ మాజీ కెప్టెన్, మాజీ కోచ్ మిస్బా ఉల్ హక్ 53 పరుగులు కీలక ఇన్నింగ్స్ ఆడాడు. 2022లో ఇఫ్తికార్ అహ్మద్ 51 పరుగులతో మెరిశాడు. భారత మాజీ ఆటగాడు రాబిన్ ఉతప్ప 2007లో చేసిన 50 పరుగులు కూడా ఈ జాబితాలో ప్రత్యేకంగా నిలిచాయి. ఇండియా–పాక్ మ్యాచ్లు ఎప్పుడూ వ్యక్తిగత ప్రతిభకు వేదికగా నిలుస్తాయి. ముఖ్యంగా కోహ్లీ లాంటి ఆటగాళ్లు కీలక సందర్భాల్లో ఆడిన ఇన్నింగ్స్లు ఈ పోరాటాన్ని మరింత చారిత్రాత్మకంగా మార్చాయి. భవిష్యత్తులో కూడా ఈ రెండు జట్ల మధ్య జరిగే మ్యాచ్ల్లో కొత్త రికార్డులు నమోదయ్యే అవకాశం ఉంది.
