WTC Final: రేపటి నుంచి డబ్ల్యూటీసీ ఫైనల్.. ఆసీస్-సఫారీ జట్లకు జై షా శుభాకాంక్షలు
- రేపటి నుంచి ప్రారంభంగానున్న డబ్ల్యూటీసీ ఫైనల్..
- ఆస్ట్రేలియా- దక్షిణాఫ్రికా మధ్య జరగనున్న ఈ ఫైనల్..
- ఆసీస్- సఫారీ జట్లను శుభాకాంక్షలు తెలిపిన ఐసీసీ ఛైర్మన్ జైషా..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
WTC Final: ప్రపంచవ్యాప్తంగా క్రికెట్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న డబ్ల్యూటీసీ ఫైనల్ కి రంగం సిద్ధమైంది. ఇంగ్లాండ్ లోని ప్రతిష్ఠాత్మక లార్డ్స్ క్రికెట్ స్టేడియంలో రేపటి నుంచి తుది పోరు ప్రారంభం కానుంది. ఈ పోరులో డిఫెండింగ్ ఛాంపియన్ ఆస్ట్రేలియా, తొలిసారి ఫైనల్ చేరిన దక్షిణాఫ్రికా జట్లు తలపడబోతున్నాయి. కాగా, రెండేళ్ల పాటు హోరాహోరీగా సాగిన లీగ్ దశ తర్వాత ఈ రెండు జట్లు ఫైనల్కు వచ్చాయి. సౌతాఫ్రికా ఆడిన 12 టెస్టుల్లో 8 విజయాలతో 69.44 పాయింట్ల శాతంతో టేబుల్ టాపర్ గా పట్టికలో అగ్రస్థానంలో నిలిచింది. మరోవైపు ఆస్ట్రేలియా 19 మ్యాచ్లలో 67.54 పాయింట్ల శాతంతో ఫైనల్ బెర్తును దక్కించుకుంది.
Read Also: Minister Kishan Reddy: అవినీతి రహిత పాలనకు నిదర్శన ప్రధాని మోడీ ప్రభుత్వం..!
Also Read
- Vaibhav Sooryavanshi: ‘నేను ఏం తప్పు చేశా..?’.. కోపంతో రగిలిపోతున్న వైభవ్ సూర్యవంశీ..
- SKY: సూర్యకుమార్ యాదవ్ 36వ పుట్టినరోజు.. 'మిస్టర్ 360' అరుదైన రికార్డుల ప్రయాణం ఇలా..
- Asia Cup Trophy Row: అది ప్లేయర్స్ నిర్ణయం కాదు.. బీసీసీఐది!
- Ajit Agarkar-BCCI: బీసీసీఐ కీలక సమావేశం.. అజిత్ అగార్కర్ భవిష్యత్తుపై ఉత్కంఠ!
ఇక, లార్డ్స్లో జరగనున్న ఈ ఫైనల్, ఇరు జట్ల మధ్య ఉన్న చారిత్రక వైరుధ్యాన్ని మరోసారి గుర్తు చేస్తోంది అని క్రికెట్ ప్రేమికులు అంటున్నారు. సరిగ్గా 113 సంవత్సరాల క్రితం, 1912లో ఈ రెండు జట్లు ‘క్రికెట్ మక్కా’గా పిలువబడే ఇంగ్లాండ్ లోని లార్డ్స్లో తటస్థ వేదికపై చివరి సారిగా టెస్ట్ మ్యాచ్ ఆడాయి. ఇది ఈ పోరుకు మరింత చారిత్రక ప్రాధాన్యతను చేకూర్చే అవకాశం ఉంది. ఈ డబ్ల్యూటీసీ ఫైనల్ కేవలం రెండు క్రికెట్ జట్ల మధ్య పోటీ మాత్రమే కాదు, 2018లో జరిగిన వివాదాస్పద ‘శాండ్పేపర్ గేట్’ ఉదంతం వంటి ఘటలను కూడా గుర్తు చేయనుంది. కాగా, ఇప్పుడు తటస్థ వేదికపై తమ మధ్య ఉన్న వైరుధ్యంతో కొత్త అధ్యాయాన్ని లిఖించే ఛాన్స్ ఆసీస్- సఫారీ జట్లకు లభించింది.
Read Also: Cargo Ship: కార్గో షిప్లో కొనసాగుతున్న పేలుళ్లు.. భారీగా మంటలు
అయితే, ఈ మ్యాచ్పై సర్వత్రా ఉత్కంఠ కొనసాగుతున్న.. నేపథ్యంలో ఐసీసీ ఛైర్మన్ జై షా ఇరు జట్లకు శుభాకాంక్షలు చెప్పారు. దీనిని ‘అల్టిమేట్ టెస్ట్’ గా అభివర్ణించారు.. క్రికెట్ క్రీడలోని స్ఫూర్తిని, క్రీడా ప్రపంచంలోని అత్యంత ప్రసిద్ధ వేదికలలో ఒకటైన లార్డ్స్లో ఈ మ్యాచ్ నిర్వహించడం యొక్క ప్రాముఖ్యతను తెలియజేశారు. ప్రపంచం నలుమూలల నుంచి ఈ మ్యాచ్ చూసేందుకు క్రికెట్ లవర్స్ భారీగా వస్తారని పేర్కొన్నారు.
Looking forward to an enthralling contest in the @ICC World Test Championship Final at Lord’s. Best of luck to both @ProteasMenCSA and @CricketAus in the Ultimate Test! pic.twitter.com/gSPJ8bgdFp
— Jay Shah (@JayShah) June 10, 2025
తాజావార్తలు
-
Stock Markets Crash: గ్లోబల్ మార్కెట్లలో రక్తకన్నీరు.. భారత్కి కలిసొచ్చిన సెలవు.. లేదంటే భారీ నష్టాలే!
-
Nandigram Bypoll: ఉద్యోగం కోల్పోయిన టీచర్.. నందిగ్రామ్ పోరులో మమతా బెనర్జీ అభ్యర్థి..
-
CM Vijay: త్రిషతో కలిసి విదేశాల్లో తిరుగుతారా? సీఎం విజయ్పై విపక్షాలు ధ్వజం
-
Iran War: విమానం కూలింది.. ఎముకలు విరిగాయి.. అయినా వెనక్కి తగ్గలేదు.. ఇరాన్లో అమెరికా సైనికుడి పోరాటం
-
Vaibhav Sooryavanshi: ‘నేను ఏం తప్పు చేశా..?’.. కోపంతో రగిలిపోతున్న వైభవ్ సూర్యవంశీ..
ట్రెండింగ్
-
Ganga Aarti in London: లండన్లో తొలిసారి గంగా హారతి.. థేమ్స్ నది తీరంలో ఆధ్యాత్మిక సందడి.!
-
Ragi Drumstick Leaves Roti: డయాబెటిస్, బీపీ ఉన్నవారికి సంపూర్ణ ఆహారం.. సంపూర్ణ పోషణనిచ్చే ‘రాగి మునగాకు రొట్టె’ చేసేయండి ఇలా.!
-
Beetroot Pachadi: బీట్రూట్ అంటే నచ్చదా? ఇలా పచ్చడి చేసి పెట్టండి.. ప్లేట్ మొత్తం ఖాళీ చేసేస్తారు.!
-
India Women: నాలుగింటిలో నాలుగు.. ఆరింటిలో నాలుగు.. ఆసియా కప్లో భారత్ హవా!
-
Rajyogam: 200 ఏళ్ల తర్వాత అరుదైన యోగం.. ఈ 5 రాశుల వారికి పట్టిందల్లా బంగారమే..!