WTC Final: రేపటి నుంచి డబ్ల్యూటీసీ ఫైనల్.. ఆసీస్-సఫారీ జట్లకు జై షా శుభాకాంక్షలు
- రేపటి నుంచి ప్రారంభంగానున్న డబ్ల్యూటీసీ ఫైనల్..
- ఆస్ట్రేలియా- దక్షిణాఫ్రికా మధ్య జరగనున్న ఈ ఫైనల్..
- ఆసీస్- సఫారీ జట్లను శుభాకాంక్షలు తెలిపిన ఐసీసీ ఛైర్మన్ జైషా..
WTC Final: ప్రపంచవ్యాప్తంగా క్రికెట్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న డబ్ల్యూటీసీ ఫైనల్ కి రంగం సిద్ధమైంది. ఇంగ్లాండ్ లోని ప్రతిష్ఠాత్మక లార్డ్స్ క్రికెట్ స్టేడియంలో రేపటి నుంచి తుది పోరు ప్రారంభం కానుంది. ఈ పోరులో డిఫెండింగ్ ఛాంపియన్ ఆస్ట్రేలియా, తొలిసారి ఫైనల్ చేరిన దక్షిణాఫ్రికా జట్లు తలపడబోతున్నాయి. కాగా, రెండేళ్ల పాటు హోరాహోరీగా సాగిన లీగ్ దశ తర్వాత ఈ రెండు జట్లు ఫైనల్కు వచ్చాయి. సౌతాఫ్రికా ఆడిన 12 టెస్టుల్లో 8 విజయాలతో 69.44 పాయింట్ల శాతంతో టేబుల్ టాపర్ గా పట్టికలో అగ్రస్థానంలో నిలిచింది. మరోవైపు ఆస్ట్రేలియా 19 మ్యాచ్లలో 67.54 పాయింట్ల శాతంతో ఫైనల్ బెర్తును దక్కించుకుంది.
Read Also: Minister Kishan Reddy: అవినీతి రహిత పాలనకు నిదర్శన ప్రధాని మోడీ ప్రభుత్వం..!
Also Read
- IPL 2026: ‘మీరు మారిపోయారు సార్’.. లక్నో ఓడినా పంత్ను హత్తుకున్న ఓనర్ సంజీవ్ గోయెంకా..
- IPL 2026: ‘వెళ్లి గల్లీ క్రికెట్ ఆడుకో’.. ఆ ఆటగాడిపై తీవ్ర ఆగ్రహం..
- SRH Players Dance: గ్రౌండ్లో బ్యాట్తోనే కాదు.. ఫ్లోర్పై డాన్స్తో కూడా అదరగొడుతున్న SRH ఆటగాళ్లు.. వీడియో వైరల్!
- Nandre Burger: కోడ్ ఆఫ్ కండక్ట్ ఉల్లంఘన.. రాజస్థాన్ రాయల్స్ ప్లేయర్ కు జరిమానా, డీమెరిట్ పాయింట్ కూడా.!
ఇక, లార్డ్స్లో జరగనున్న ఈ ఫైనల్, ఇరు జట్ల మధ్య ఉన్న చారిత్రక వైరుధ్యాన్ని మరోసారి గుర్తు చేస్తోంది అని క్రికెట్ ప్రేమికులు అంటున్నారు. సరిగ్గా 113 సంవత్సరాల క్రితం, 1912లో ఈ రెండు జట్లు ‘క్రికెట్ మక్కా’గా పిలువబడే ఇంగ్లాండ్ లోని లార్డ్స్లో తటస్థ వేదికపై చివరి సారిగా టెస్ట్ మ్యాచ్ ఆడాయి. ఇది ఈ పోరుకు మరింత చారిత్రక ప్రాధాన్యతను చేకూర్చే అవకాశం ఉంది. ఈ డబ్ల్యూటీసీ ఫైనల్ కేవలం రెండు క్రికెట్ జట్ల మధ్య పోటీ మాత్రమే కాదు, 2018లో జరిగిన వివాదాస్పద ‘శాండ్పేపర్ గేట్’ ఉదంతం వంటి ఘటలను కూడా గుర్తు చేయనుంది. కాగా, ఇప్పుడు తటస్థ వేదికపై తమ మధ్య ఉన్న వైరుధ్యంతో కొత్త అధ్యాయాన్ని లిఖించే ఛాన్స్ ఆసీస్- సఫారీ జట్లకు లభించింది.
Read Also: Cargo Ship: కార్గో షిప్లో కొనసాగుతున్న పేలుళ్లు.. భారీగా మంటలు
అయితే, ఈ మ్యాచ్పై సర్వత్రా ఉత్కంఠ కొనసాగుతున్న.. నేపథ్యంలో ఐసీసీ ఛైర్మన్ జై షా ఇరు జట్లకు శుభాకాంక్షలు చెప్పారు. దీనిని ‘అల్టిమేట్ టెస్ట్’ గా అభివర్ణించారు.. క్రికెట్ క్రీడలోని స్ఫూర్తిని, క్రీడా ప్రపంచంలోని అత్యంత ప్రసిద్ధ వేదికలలో ఒకటైన లార్డ్స్లో ఈ మ్యాచ్ నిర్వహించడం యొక్క ప్రాముఖ్యతను తెలియజేశారు. ప్రపంచం నలుమూలల నుంచి ఈ మ్యాచ్ చూసేందుకు క్రికెట్ లవర్స్ భారీగా వస్తారని పేర్కొన్నారు.
Looking forward to an enthralling contest in the @ICC World Test Championship Final at Lord’s. Best of luck to both @ProteasMenCSA and @CricketAus in the Ultimate Test! pic.twitter.com/gSPJ8bgdFp
— Jay Shah (@JayShah) June 10, 2025
తాజావార్తలు
-
Donald Trump: కనిపించిన వెంటనే కాల్చిపారేయండి.. హార్ముజ్పై ట్రంప్ సంచలన ఆదేశాలు..
-
Telangana Cabinet: తెలంగాణ కేబినెట్లో ఆర్టీసీ కార్మికుల సమ్మెపై చర్చ.. రేపు కీలక భేటీ..
-
Telangana Govt: కీలక నిర్ణయం తీసుకున్న తెలంగాణ ప్రభుత్వం.. ఏప్రిల్ 26న రాష్ట్ర పండుగ..
-
Ration Cards: రేషన్ కార్డుదారులకు బిగ్ షాక్.. లక్షల కార్డులు రద్దు..
-
Donald Trump: భారత్ చాలా మంచి మిత్రుడు.. ట్రంప్ మరో యూ-టర్న్..
ట్రెండింగ్
-
రూ. 9,999కే 6.88 అంగుళాల పెద్ద స్క్రీన్, 5200mAh బ్యాటరీ.. POCO C81 సిరీస్ లాంచ్..!
-
Lava Bold N1 5G కొత్త వేరియంట్ లాంచ్.. ధర కూడా తక్కువే.!
-
Moong Dal Pakoda Recipe: శనగపిండి వాడకుండా ఆరోగ్యకరంగా, రుచిగా ఉండే ‘పెసరపప్పు పకోడీ’లను చేసేయండి ఇలా..!
-
మిడ్-రేంజ్లో ఫ్లాగ్షిప్ ఫీచర్లు.. 200MP కెమెరా, 5-స్టార్ డ్రాప్ & క్రష్ సర్టిఫికేషన్, 7000mAh బ్యాటరీతో HONOR 600 సిరీస్ లాంచ్..!
-
Kitchen Cleaning Hacks: మెరిసే పాత్రల కోసం చిట్కాలు.. పింగాణీ పాత్రలపై పసుపు మరకలను వదిలించుకోండిలా.!