WTC Final: రేపటి నుంచి డబ్ల్యూటీసీ ఫైనల్.. ఆసీస్-సఫారీ జట్లకు జై షా శుభాకాంక్షలు
- రేపటి నుంచి ప్రారంభంగానున్న డబ్ల్యూటీసీ ఫైనల్..
- ఆస్ట్రేలియా- దక్షిణాఫ్రికా మధ్య జరగనున్న ఈ ఫైనల్..
- ఆసీస్- సఫారీ జట్లను శుభాకాంక్షలు తెలిపిన ఐసీసీ ఛైర్మన్ జైషా..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
WTC Final: ప్రపంచవ్యాప్తంగా క్రికెట్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న డబ్ల్యూటీసీ ఫైనల్ కి రంగం సిద్ధమైంది. ఇంగ్లాండ్ లోని ప్రతిష్ఠాత్మక లార్డ్స్ క్రికెట్ స్టేడియంలో రేపటి నుంచి తుది పోరు ప్రారంభం కానుంది. ఈ పోరులో డిఫెండింగ్ ఛాంపియన్ ఆస్ట్రేలియా, తొలిసారి ఫైనల్ చేరిన దక్షిణాఫ్రికా జట్లు తలపడబోతున్నాయి. కాగా, రెండేళ్ల పాటు హోరాహోరీగా సాగిన లీగ్ దశ తర్వాత ఈ రెండు జట్లు ఫైనల్కు వచ్చాయి. సౌతాఫ్రికా ఆడిన 12 టెస్టుల్లో 8 విజయాలతో 69.44 పాయింట్ల శాతంతో టేబుల్ టాపర్ గా పట్టికలో అగ్రస్థానంలో నిలిచింది. మరోవైపు ఆస్ట్రేలియా 19 మ్యాచ్లలో 67.54 పాయింట్ల శాతంతో ఫైనల్ బెర్తును దక్కించుకుంది.
Read Also: Minister Kishan Reddy: అవినీతి రహిత పాలనకు నిదర్శన ప్రధాని మోడీ ప్రభుత్వం..!
Also Read
- IND vs SL: సచిన్, సెహ్వాగ్, ధోనీ, రోహిత్ వల్ల కూడా కాలేదు.. భారత్-శ్రీలంక టెస్టుల్లో అత్యధిక సిక్సర్లు బాదింది ఇతడే..
- Ajit Agarkar-BCCI: అజిత్ అగార్కర్ పదవికి ఎసరు?.. రోహిత్ శర్మనే కారణం!
- Himmat Singh: అరెరే.. ఇదేం రన్ అవుట్ భయ్యా.. ఇప్పటి వరకు చూడలే.! వీడియో వైరల్..
- Rohit Sharma-BCCI: నేను స్వచ్ఛందంగా తప్పుకోను.. ఇక బీసీసీఐ సెలెక్టర్ల ఇష్టం!
ఇక, లార్డ్స్లో జరగనున్న ఈ ఫైనల్, ఇరు జట్ల మధ్య ఉన్న చారిత్రక వైరుధ్యాన్ని మరోసారి గుర్తు చేస్తోంది అని క్రికెట్ ప్రేమికులు అంటున్నారు. సరిగ్గా 113 సంవత్సరాల క్రితం, 1912లో ఈ రెండు జట్లు ‘క్రికెట్ మక్కా’గా పిలువబడే ఇంగ్లాండ్ లోని లార్డ్స్లో తటస్థ వేదికపై చివరి సారిగా టెస్ట్ మ్యాచ్ ఆడాయి. ఇది ఈ పోరుకు మరింత చారిత్రక ప్రాధాన్యతను చేకూర్చే అవకాశం ఉంది. ఈ డబ్ల్యూటీసీ ఫైనల్ కేవలం రెండు క్రికెట్ జట్ల మధ్య పోటీ మాత్రమే కాదు, 2018లో జరిగిన వివాదాస్పద ‘శాండ్పేపర్ గేట్’ ఉదంతం వంటి ఘటలను కూడా గుర్తు చేయనుంది. కాగా, ఇప్పుడు తటస్థ వేదికపై తమ మధ్య ఉన్న వైరుధ్యంతో కొత్త అధ్యాయాన్ని లిఖించే ఛాన్స్ ఆసీస్- సఫారీ జట్లకు లభించింది.
Read Also: Cargo Ship: కార్గో షిప్లో కొనసాగుతున్న పేలుళ్లు.. భారీగా మంటలు
అయితే, ఈ మ్యాచ్పై సర్వత్రా ఉత్కంఠ కొనసాగుతున్న.. నేపథ్యంలో ఐసీసీ ఛైర్మన్ జై షా ఇరు జట్లకు శుభాకాంక్షలు చెప్పారు. దీనిని ‘అల్టిమేట్ టెస్ట్’ గా అభివర్ణించారు.. క్రికెట్ క్రీడలోని స్ఫూర్తిని, క్రీడా ప్రపంచంలోని అత్యంత ప్రసిద్ధ వేదికలలో ఒకటైన లార్డ్స్లో ఈ మ్యాచ్ నిర్వహించడం యొక్క ప్రాముఖ్యతను తెలియజేశారు. ప్రపంచం నలుమూలల నుంచి ఈ మ్యాచ్ చూసేందుకు క్రికెట్ లవర్స్ భారీగా వస్తారని పేర్కొన్నారు.
Looking forward to an enthralling contest in the @ICC World Test Championship Final at Lord’s. Best of luck to both @ProteasMenCSA and @CricketAus in the Ultimate Test! pic.twitter.com/gSPJ8bgdFp
— Jay Shah (@JayShah) June 10, 2025
తాజావార్తలు
-
RBI MPC 2026: ఆర్బీఐ కీలక నిర్ణయం.. రెపో రేటు 5.25 శాతం వద్దే కొనసాగింపు.. హోమ్, పర్సనల్ లోన్స్ EMIలపై ఎలాంటి ప్రభావం?
-
Ramayana: ‘రామాయణం’ ట్రైలర్లో హనుమంతుడు ఎందుకు కనిపించలేదు?.. క్లారిటీ ఇచ్చిన రణబీర్ కపూర్!
-
IND vs SL: సచిన్, సెహ్వాగ్, ధోనీ, రోహిత్ వల్ల కూడా కాలేదు.. భారత్-శ్రీలంక టెస్టుల్లో అత్యధిక సిక్సర్లు బాదింది ఇతడే..
-
కేవలం 50 మాత్రమే.. లగ్జరీతో పాటు ఫ్యాషన్ టచ్..! MG Cyberster, M9 Couture Edition కార్లు లాంచ్.!
-
ఏఐ, ఐటీ కోర్సులకు ఫుల్ డిమాండ్.. TG EAPCET 2026 ఫైనల్ ఫేజ్ సీట్ల కేటాయింపు పూర్తి..
ట్రెండింగ్
-
Ajit Agarkar-BCCI: అజిత్ అగార్కర్ పదవికి ఎసరు?.. రోహిత్ శర్మనే కారణం!
-
Rohit Sharma-BCCI: నేను స్వచ్ఛందంగా తప్పుకోను.. ఇక బీసీసీఐ సెలెక్టర్ల ఇష్టం!
-
50 గంటల బ్యాటరీ, 1.69 అంగుళాల డిస్ప్లే, పాప్-అప్ డిజైన్తో Lava Probuds Xplore 25° TWS ఇయర్బడ్స్ లాంచ్..!
-
POCO M8 Power 5G లాంచ్.. 8000mAh భారీ బ్యాటరీ, 120Hz OLED డిస్ప్లేతో అదిరిపోయే ఫోన్.!
-
Baba Vanga Prediction 2026: బాబా వంగా జోస్యం.. ఈ 5 రాశులకు కోటీశ్వర యోగం.!