Mohammed Shami: ఏంటి రూ. 4 లక్షలు పెద్ద అమౌంట్ కాదా.. షమీకి సుప్రీంకోర్టు నోటీసులు!
- మరోసారి వార్తల్లో నిలిచిన టీమిండియా స్టార్ బౌలర్ మహమ్మద్ షమీ..
- తనకు రూ. 4 లక్షల భరణం సరిపోవడం లేదన్న షమీ మాజీ భార్య హసిన్ జహాన్..
- నాలుగు వారాల్లో సమాధానం తెలియజేయాలని మహమ్మద్ షమీకి సుప్రీంకోర్టు నోటీసులు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Mohammed Shami: టీమిండియా వెటరన్ పేసర్ మహ్మద్ షమీ మరోసారి వార్తల్లో నిలిచారు. తనకు ఇస్తున్న భరణం సరిపోవట్లేదని అతడి మాజీ భార్య హసిన్ జహాన్ దేశ సర్వోన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. హసీన్ పిటీషన్ను విచారించిన కోర్టు షమీకి నోటీసులు ఇచ్చింది. నాలుగు వారాల్లో సమాధానం తెలియజేయాలని తెలిపింది. కోల్కాతా హైకోర్టు ఆదేశాల మేరకు హసీన్కు రూ. 4 లక్షలు భరణంగా షమీ చెల్లిస్తున్నాడు. ఇక, ఇందులో షమీ కూతురికి రూ. 2.5 లక్షలు, హసీన్కు రూ. 1.5 లక్షలు అందుతున్నాయి. అయితే, ఈ మొత్తం పరిహారం సరిపోవట్లేదని షమీపై హసీన్ మరోసారి కోర్టుకు పోయింది.
Read Also: Vande Mataram Row: వందేమాతరం గీతాన్ని నేను పాడలేను.. సమాజ్వాదీ పార్టీ ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు
Also Read
- WTC Points: పాకిస్థాన్ను క్లీన్స్వీప్ చేసిన ఇంగ్లండ్.. మారిపోయిన WTC పాయింట్ల పట్టిక.. భారత్ స్థానం ఎంతంటే..
- India Matches: రేపు భారత్కు డబుల్ ధమాకా.. అఫ్గాన్తో పురుషుల జట్టు.. శ్రీలంకతో మహిళల టైటిల్ పోరు.!
- Mohammed Siraj: డీఎస్పీ మొహమ్మద్ సిరాజ్కు ప్రమోషన్.. హైదరాబాద్ రంజీ కెప్టెన్గా జట్టు పగ్గాలు.!
- Wasim Akram: PSL, PCBపై వసీం అక్రమ్ సంచలన వ్యాఖ్యలు.. వైభవ్ సూర్యవంశీ పేరు ప్రస్తావిస్తూ..!
అయితే, గతంలోనూ ఇదే అంశంపై ట్రయల్ కోర్టు తీర్పును సవాలు చేస్తూ హసీన్ హైకోర్టుకు వెళ్లింది. అక్కడ ఆమెకు లభించే భరణాన్ని రూ. 1.3 లక్షల నుంచి రూ. 4 లక్షలకు పెంచింది. తాజాగా ఈ మొత్తం కూడా సరిపోవట్లేదని సుప్రీంకోర్టును హసీన్ ఆశ్రయించింది. ఆమె తరఫున న్యాయవాదులు శోభా గుప్తా, శ్రీరామ్ పరాకట్ వాదిస్తూ.. షమీ చాలా విలాసవంతమైన జీవితాన్ని గడుపుతున్నారు. నెలకు రూ. 1.08 కోటి ఖర్చు చేస్తాడు.. కానీ భార్య, కుమార్తెను పేదరికంలో విడిచి పెట్టాడు అని తెలిపారు. షమీ ఆస్తుల నికర విలువ సుమారు రూ. 500 కోట్ల వరకు ఉంటుంది.. హసీన్కు ఎలాంటి ఆదాయ వనరులు లేవు.. ఉద్యోగం చేసుకునే పరిస్థితిలో కూడా లేదు. కాబట్టి, షమీ తమ క్లయింట్కు ఇంకా రూ. 2.4 కోట్ల బకాయిలు చెల్లించాలి అన్నారు.
Read Also: CM Revanth Reddy : ORRను పల్లిబఠానీల లెక్క అమ్మేశారు కేసీఆర్
ఇక, లాయర్ల వాదన ముగిసిన తర్వాత న్యాయస్థానం హసీన్కు పరోక్షంగా చురకలు అంటించ్చినట్లు సమాచారం. నెలకు రూ. 4 లక్షల భరణం చాలా పెద్ద మొత్తం కదా అని క్వశ్చన్ చేశారని తెలుస్తుంది. అయితే, షమీ-హసీన్లు 2014లో పెళ్లి చేసుకున్నారు. నాలుగేళ్లు వీళ్లు కాపురం సజావుగా కొనసాగింది. వీరిద్దరికి ఓ అమ్మాయి జన్మించింది. అనంతరం షమీ- జహాన్ మధ్య విభేదాలు వచ్చాయి. అలాగే, 2018లో షమీపై హసీన్ గృహ హింస, వేధింపుల కేసు పెట్టింది. అప్పటి నుంచి వీరూ వేరువేరుగా నివాసం ఉంటున్నారు. ఈ ఏడాది జులైలో కోల్కతా హైకోర్టు రూ. 4 లక్షల భరణం హసీన్కు చెల్లించాలని మహ్మద్ షమీకి ఆదేశాలు ఇచ్చింది.
తాజావార్తలు
-
BRICS Summit 2026: మోడీ-జిన్పింగ్ భేటీ.. బ్రిక్స్ ఉమ్మడి ప్రకటన.. సదస్సు తొలి రోజు 10 కీలక విషయాలు
-
Aamir Khan: లోకేష్ ప్రాజెక్ట్ను పక్కన పెట్టి.. మరో సూపర్హీరో మూవీకి ఆమిర్ ఖాన్ రెడీ! దర్శకుడు ఎవరంటే?
-
Astrology: సెప్టెంబర్ 13 ఆదివారం దినఫలాలు.. ఏ రాశివారికి ఎలా ఉందంటే..!
-
OTR : హిందూపురం గడ్డ మా అడ్డా! బాలయ్య ఇలాకాలో లోకల్ వార్ మొదలైందా?
-
Story Board : BRICS సదస్సు ప్రధాన ఉద్దేశమేంటి..? భారత్ ఎలాంటి సందేశం ఇస్తుంది..?
ట్రెండింగ్
-
Ganesh Chaturthi AI Prompts: మీ స్వంత ఫొటోలతో AI ఉపయోగించి గణపతి శుభాకాంక్షలు చెప్పండి.. ప్రాంప్ట్స్ ఇదిగో మీకోసం..!
-
Moto Buds 2 Fusion: 55dB ANC, 13 గంటల ప్లేబ్యాక్తో సెప్టెంబర్ 15న భారత్లో లాంచ్ కానున్న Moto Buds 2 Fusion.!
-
1 Crore Investment Plan: రూ. కోటి సంపాదించడానికి ఎంత సమయం పడుతుంది.? SIPలో ఎంత పెట్టుబడి పెట్టాలి?
-
Lemon Storage Tips: రసం తగ్గకుండా, రుచి మారకుండా నిమ్మకాయలు నెల రోజులు తాజాగా ఉండాలంటే ఈ సింపుల్ ట్రిక్స్ ఫాలో అయితే చాలు.!
-
BRICS Summit 2026: బ్రిక్స్ వేదికగా ఇరాన్తో భారత్ దౌత్యం.. చాబహార్తో కొత్త ట్రేడ్ రూట్.!