Vande Mataram Row: వందేమాతరం గీతాన్ని నేను పాడలేను.. సమాజ్వాదీ పార్టీ ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు
- వందేమాతరంపై సమాజ్వాదీ పార్టీ ఎమ్మెల్యే అబూ అసిమ్ సంచలన వ్యాఖ్యలు..
- బీజేపీ అంటే భారత్ జలావ్ పార్టీ.. అది భారతదేశాన్ని నాశనం చేసే పార్టీ..
- బీజేపీ అధికారంలో ఉండటానికి ముస్లింలను అణచివేయడానికి ప్లాన్ వేస్తుంది: అబూ అజ్మీ
Vande Mataram Row: సమాజ్వాదీ పార్టీ ఎమ్మెల్యే అబూ అసిమ్ అజ్మీ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చకు దారి తీశాయి. ఈ సందర్భంగా అతడు మాట్లాడుతూ.. వందేమాతరం పాడమని నన్ను ఎవరూ బలవంతం చేయలేరు అన్నారు. బీజేపీ అంటే భారత్ జలావ్ పార్టీ.. అది భారతదేశాన్ని నాశనం చేసే పార్టీ అని ఆరోపించారు. వారు మతపరమైన రాజకీయాలు చేస్తారు, ప్రజలను విభజిస్తారు, ప్రజల్లో ద్వేషాన్ని వ్యాపింపజేస్తారని తెలిపారు. అధికారంలో ఉండటానికి ముస్లింలను అణచివేయడానికి ఎల్లప్పుడూ ప్రణాళికలు వేస్తారని చెప్పారు. ముస్లిం, హిందూ, పాకిస్తాన్, భారత్ అనే అంశాలను కథనం నుంచి తీసేస్తే బీజేపీ సున్నా అని అబూ అసిమ్ వ్యాఖ్యానించారు.
Read Also: East Godavari : వీరవల్లి టోల్ ప్లాజా వద్ద 8 టన్నుల పీడీఎస్ బియ్యం స్వాధీనం !
Also Read
ఇక, ఒక ముస్లిం అల్లాను మాత్రమే ప్రార్థిస్తాడు.. కానీ చాలా మంది ముస్లింలు ముఖ్తార్ అబ్బాస్ నఖ్వీ లాగా భూమిని పూజిస్తారు అని సమాజ్వాదీ పార్టీ ఎమ్మెల్యే అబూ అసిమ్ తెలిపారు. వారం రోజుల పాటు జరిగే కార్యక్రమాల్లో పూర్తి వెర్షన్ వందేమాతరం పాడాలనే ఆదేశాలను తీవ్రంగా తప్పుబట్టారు. ప్రస్తుతం రాష్ట్రంలోని పాఠశాలలు ‘వందేమాతరం’ యొక్క మొదటి రెండు చరణాలను మాత్రమే పాడుతున్నాయి.. ఇక, వందేమాతరం పాడమని నన్ను ఎవరూ బలవంతం చేయలేరు.. ఎందుకంటే, నేను వందేమాతరం గీతాన్ని పాడలేను అని స్పష్టం చేశారు. ఇక, మత విశ్వాసాలు వ్యక్తులలో మారుతూ ఉంటాయి.. కాబట్టి వందేమాతరం గీతాన్ని పారాయణను తప్పనిసరి చేయడం సముచితం కాదన్నారు. అలాగే, ఇస్లాం ఒకరి తల్లిని గౌరవించడానికి ప్రాముఖ్యత ఇస్తుంది, కానీ ఆమె ముందు సాష్టాంగ నమస్కారం చేయడానికి అనుమతించదని ఎమ్మెల్యే అబూ అసిమ్ అన్నారు.
తాజావార్తలు
-
Ragi Puri: ఆరోగ్యానికి ఆరోగ్యం.. రుచికి రుచి.. రాగి పిండితో మెత్తటి పూరీలు.. ఇలా చేస్తే లొట్టలేయాల్సిందే!
-
Senior Citizen FD: సీనియర్ సిటిజన్లకు FDలో అత్యధిక రాబడి.. ఏ బ్యాంకులు ఉత్తమం? పూర్తి వివరాలు
-
FTA: ఇరాన్ యుద్ధం గొడవలో ప్రపంచం.. సైలెంట్గా కీలక ఒప్పందాన్ని పూర్తి చేసిన భారత్..
-
Sanju Samson: గుజరాత్ టైటాన్స్పై చేసిన పరుగులు 11.. అయినా మరో రికార్డ్ సాధించిన సంజూ శాంసన్..
-
Post Office Scheme: కేవలం వడ్డీతోనే రూ.18 లక్షలు.. సింపుల్గా కోటీశ్వరులు అయ్యే ఛాన్స్!
ట్రెండింగ్
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!
-
165Hz రిఫ్రెష్ రేట్, 12.3 అంగుళాల డిస్ప్లే, 10,100mAh బ్యాటరీతో Honor MagicPad 3 Pro లాంచ్.!
-
వేసవికాలంలో చల్లటి కబురు.. 22,000 భారీ తగ్గింపుతో Lloyd Air Conditioner.. త్వరపడండి.!
-
రూ. 9,999కే 6.88 అంగుళాల పెద్ద స్క్రీన్, 5200mAh బ్యాటరీ.. POCO C81 సిరీస్ లాంచ్..!