Vande Mataram Row: వందేమాతరం గీతాన్ని నేను పాడలేను.. సమాజ్వాదీ పార్టీ ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు
- వందేమాతరంపై సమాజ్వాదీ పార్టీ ఎమ్మెల్యే అబూ అసిమ్ సంచలన వ్యాఖ్యలు..
- బీజేపీ అంటే భారత్ జలావ్ పార్టీ.. అది భారతదేశాన్ని నాశనం చేసే పార్టీ..
- బీజేపీ అధికారంలో ఉండటానికి ముస్లింలను అణచివేయడానికి ప్లాన్ వేస్తుంది: అబూ అజ్మీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Vande Mataram Row: సమాజ్వాదీ పార్టీ ఎమ్మెల్యే అబూ అసిమ్ అజ్మీ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చకు దారి తీశాయి. ఈ సందర్భంగా అతడు మాట్లాడుతూ.. వందేమాతరం పాడమని నన్ను ఎవరూ బలవంతం చేయలేరు అన్నారు. బీజేపీ అంటే భారత్ జలావ్ పార్టీ.. అది భారతదేశాన్ని నాశనం చేసే పార్టీ అని ఆరోపించారు. వారు మతపరమైన రాజకీయాలు చేస్తారు, ప్రజలను విభజిస్తారు, ప్రజల్లో ద్వేషాన్ని వ్యాపింపజేస్తారని తెలిపారు. అధికారంలో ఉండటానికి ముస్లింలను అణచివేయడానికి ఎల్లప్పుడూ ప్రణాళికలు వేస్తారని చెప్పారు. ముస్లిం, హిందూ, పాకిస్తాన్, భారత్ అనే అంశాలను కథనం నుంచి తీసేస్తే బీజేపీ సున్నా అని అబూ అసిమ్ వ్యాఖ్యానించారు.
Read Also: East Godavari : వీరవల్లి టోల్ ప్లాజా వద్ద 8 టన్నుల పీడీఎస్ బియ్యం స్వాధీనం !
Also Read
- BMC Taj Mahal Palace Hotel: 26/11 తర్వాత రోడ్లపై బారికేడ్లు ఏర్పాటు.. తాజ్ హోటల్కు రూ. 22 కోట్ల నోటీసు జారీ
- NDA Majority: మెజారిటీకి కేవలం ఆరుగురు ఎంపీల దూరం.. డీలిమిటేషన్ బిల్లుపై ఉత్కంఠ.. ఎన్డీఏ వ్యూహం ఫలిస్తుందా?
- India-UK: అమల్లోకి భారత్-యూకే ఒప్పందం.. ఏవేవి ధరలు తగ్గాయంటే..!
- Bengal: బెంగాల్ రాజకీయాల్లో కొత్త చర్చ! మమతకు కాంగ్రెస్ ఆహ్వానం
ఇక, ఒక ముస్లిం అల్లాను మాత్రమే ప్రార్థిస్తాడు.. కానీ చాలా మంది ముస్లింలు ముఖ్తార్ అబ్బాస్ నఖ్వీ లాగా భూమిని పూజిస్తారు అని సమాజ్వాదీ పార్టీ ఎమ్మెల్యే అబూ అసిమ్ తెలిపారు. వారం రోజుల పాటు జరిగే కార్యక్రమాల్లో పూర్తి వెర్షన్ వందేమాతరం పాడాలనే ఆదేశాలను తీవ్రంగా తప్పుబట్టారు. ప్రస్తుతం రాష్ట్రంలోని పాఠశాలలు ‘వందేమాతరం’ యొక్క మొదటి రెండు చరణాలను మాత్రమే పాడుతున్నాయి.. ఇక, వందేమాతరం పాడమని నన్ను ఎవరూ బలవంతం చేయలేరు.. ఎందుకంటే, నేను వందేమాతరం గీతాన్ని పాడలేను అని స్పష్టం చేశారు. ఇక, మత విశ్వాసాలు వ్యక్తులలో మారుతూ ఉంటాయి.. కాబట్టి వందేమాతరం గీతాన్ని పారాయణను తప్పనిసరి చేయడం సముచితం కాదన్నారు. అలాగే, ఇస్లాం ఒకరి తల్లిని గౌరవించడానికి ప్రాముఖ్యత ఇస్తుంది, కానీ ఆమె ముందు సాష్టాంగ నమస్కారం చేయడానికి అనుమతించదని ఎమ్మెల్యే అబూ అసిమ్ అన్నారు.
తాజావార్తలు
-
Guntur: కన్న కొడుకును చంపిన తల్లిదండ్రులు.!
-
Windfall Tax: పెట్రోల్-డీజిల్, ఏటీఎఫ్పై ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఈ పన్ను అకస్మాత్తుగా పెంపు
-
The Paradise Rights : ప్యారడైజ్ రైట్స్ కోసం రూ. 110 కోట్లు అఫర్ చేసిన దిల్ రాజు.. పుకార్లు నమ్మొద్దన్న నిర్మాత
-
Bonalu: నేటి నుంచి ఆషాఢ బోనాల సందడి షురూ.. గోల్కొండ జగదాంబిక అమ్మవారితో వైభవంగా బోనాల ఆరంభం..!
-
Dhanush – Anirudh : ధనుష్ – అనిరుధ్ మధ్య ఫ్రెండ్షిప్ చెడిందా..?
ట్రెండింగ్
-
Team India Coaching Staff: టీమిండియా కోచింగ్ స్టాఫ్లో విభేదాలు.. ఆ ఇద్దరిలో ఒకరిపై వేటు తప్పదు?
-
12-అంగుళాల 2.8K OLED డిస్ప్లే, 144Hz రిఫ్రెష్ రేట్, 10100mAh బ్యాటరీతో HUAWEI MatePad Air (2026) లాంచ్..!
-
Harry Brook: అదే మా ఓటమికి కారణం.. రెండో వన్డేలో టీమిండియాను దెబ్బ కొడతాం!
-
OLED డిస్ప్లే, 200MP కెమెరా, 100W ఫాస్ట్ ఛార్జింగ్తో HUAWEI Pura 90s Pro, Pura 90s Pro Max గ్లోబల్ లాంచ్..!
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో REDMI Note 17 Pro లాంచ్..!