ఐపీఎల్ 2021 లో ఈరోజు చెన్నై సూపర్ కింగ్స్-ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య మ్యాచ్ జరుగుతుంది. అయితే ఈ మ్యాచ్ లో టాస్ ఒడి మొదట బ్యాటింగ్ కు వచ్చిన చెన్నై కి ఢిల్లీ బౌలర్లు చుక్కలు చూపించారు. ఓపెనర్లను త్వరగా వెన్నకి పంపిన వారు ఆ తర్వాత వచ్చిన రాబిన్ ఉతప్ప, మోయిన్ అలీ లను కూడా తక్కువ పరుగులకే కట్టడి చేసారు. ఈ క్రమంలోనే అంబటి రాయుడు హాఫ్ సెంచరీతో రాణించడంతో ఆ ఆజట్టు నిర్ణిత 20 ఓవర్లలో 136 పరుగులు చేసి 5 వికెట్లు కోల్పోయింది. ఇక ఢిల్లీ బౌలర్లలో అక్షర్ పటేల్ రెండు వికెట్లు, రవిచంద్రన్ అశ్విన్, అవేశ్ ఖాన్, అన్రిచ్ నార్ట్జే ఒక్కో వికెట్ పడగొట్టారు. ఇక ఈ మ్యాచ్ లో విజయం సాధించడానికి ఢిల్లీకి 137 పరుగులు కావాలి. చూడాలి మరి ఈ మ్యాచ్ లో గెలిచి ఢిల్లీ పాయింట్స్ టేబుల్ లో మొదటి స్థానానికి వెళ్తుందా.. లేదా అనేది.