IND vs AUS World Cup Final: రేపే వరల్డ్ కప్ ఫైనల్.. తెలుగు రాష్ట్రాల్లో బిగ్ స్క్రీన్లు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
IND vs AUS World Cup Final Match In Big Screens: రేపు అహ్మదాబాద్లోని నరేంద్ర మోడీ స్టేడియంలో ఐసీసీ వన్డే ప్రపంచకప్ 2023 ఫైనల్ మ్యాచ్ జరగనుంది. రేపు మధ్యాహ్నం 2 గంటలకు ప్రారంభమయ్యే ఫైనల్లో భారత్- ఆస్ట్రేలియా జట్లు తలపడనున్నాయి. ఈ ఫైనల్ మ్యాచ్ను ప్రజలు ఒకే చోట వీక్షించేలా తెలుగు రాష్ట్రాల్లో బిగ్ స్క్రీన్లు ఏర్పాటు చేస్తున్నారు. ఇందులో భాగంగా ఏపీలోని 13 ఉమ్మడి జిల్లా కేంద్రాల్లో భారీ స్క్రీన్లు ఏర్పాటు చేస్తున్నట్లు ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ కార్యదర్శి ఎస్.గోపీనాథ్రెడ్డి పేర్కొన్నారు. 2 లక్షల మంది మ్యాచ్ చూసేలా ఈ స్ర్కీన్లు ఏర్పాట్లు చేస్తున్నట్లు ఆయన చెప్పారు. ఇందులో ప్రవేశం పూర్తిగా ఫ్రీ అని చెప్పుకొచ్చారు.
Read Also: Liquor Price Hiked: మందుబాబులకు బ్యాడ్న్యూస్.. మళ్లీ భారీగా పెరిగిన మద్యం ధరలు..
Also Read
- Women's World Cup 2026: రన్రేట్ ప్లస్.. కానీ ఆసీస్తో నెక్స్ట్ మ్యాచ్! సెమీఫైనల్ చేరాలంటే భారత్కు ఉన్న అవకాశాలివే..
- Yash Dayal: యశ్ దయాల్ ‘కమ్బ్యాక్’.. ‘పోక్సో’ కేసుల నుంచి విముక్తి!
- Vaibhav Sooryavanshi Records: ఐర్లాండ్తో డెబ్యూ.. వైభవ్ ముందున్న 5 రికార్డులు ఇవే.!
- Vaibhav Sooryavanshi Debut: ఎంతో ప్రతిభ ఉన్నా.. వైభవ్ సూర్యవంశీకి అరంగేట్రం చేసే అర్హత ఉందా?
ఈ బిగ్ స్ర్కీన్ల ఏర్పాటుకు అయ్యే ఖర్చు మొత్తం అసోసియేషన్ భరిస్తోందని గోపీనాథ్ రెడ్డి తెలిపారు. సీఎం జగన్ సహకారంతో ఏసీఏ అనేక విప్లవాత్మక కార్యక్రమాలు చేపట్టిందని చెప్పారు. దేశంలోనే తొలిసారిగా సెమీ ఫైనల్ మ్యాచ్ కోసం విశాఖ, కడప, విజయవాడలో ఏర్పాటు చేసిన బిగ్ స్క్రీన్లకు మంచి స్పందన రావడంతో ఫైనల్ మ్యాచ్ కోసం ఉమ్మడి జిల్లాల కేంద్రాల్లో భారీ స్క్రీన్లు ఏర్పాటుకు నిర్ణయించామని ఏసీఏ కార్యదర్శి గోపినాథ్ రెడ్డి తెలిపారు. ఈ నిర్ణయాన్ని సీఎం వైఎస్ జగన్ అభినందించారు.
Read Also: Post office Scheme :సూపర్ స్కీమ్.. ఒక్కసారి ఇన్వెస్ట్ చేస్తే..రూ.7 లక్షలకు పైగా రాబడి..
ఇక, మరో వైపు తెలంగాణ రాష్ట్రంలో పలు చోట్లు భారీ స్క్రీన్లు ఏర్పాటు చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. అయితే, ఓటర్లను ఆకర్షించేందుకు నియోజకవర్గాల్లో ఆయా పార్టీల లీడర్లు గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ) మైదనాల్లో బిగ్ స్ర్కీన్లు ఏర్పాటు చేస్తున్నట్లు సమాచారం. గతంలోనూ క్రికెట్ ఈవెంట్లకు భారీ స్పందన రావడంతో ఈ ఫైనల్ మ్యాచ్ కు పెద్ద స్ర్కీన్లను తయారు చేస్తున్నారు. ఇక, ఈ సారి వినోదాన్ని మరింత పంచేందుకు సౌండ్ బాక్సులు, లైటింగ్ వైపు మొగ్గుచూపుతున్నారు.
తాజావార్తలు
-
Home Freshness Tips: ఇంట్లో దుర్వాసనకు చెక్.. ఎయిర్ ఫ్రెషనర్లు లేకుండానే సింపుల్ చిట్కాలతో ఇంటిని ఫ్రెష్గా ఉంచండి.!
-
Saikrishna Lockup Death: సాయికృష్ణ లాకప్ డెత్ కేసులో సిట్ దూకుడు.. మరో ఇద్దరు పోలీసుల కోసం గాలింపు!
-
Ayodhya: అయోధ్య రామాలయ విరాళాల కుంభకోణంలో కీలక పరిణామం.. ట్రస్ట్ కీలక సభ్యులు రాజీనామా..
-
Women’s World Cup 2026: రన్రేట్ ప్లస్.. కానీ ఆసీస్తో నెక్స్ట్ మ్యాచ్! సెమీఫైనల్ చేరాలంటే భారత్కు ఉన్న అవకాశాలివే..
-
CM Yogi: “ఎవ్వరినీ వదిలి పెట్టను”.. అయోధ్య విరాళాల దుర్వినియోగంపై సీఎం యోగి ఆగ్రహం..
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi Records: ఐర్లాండ్తో డెబ్యూ.. వైభవ్ ముందున్న 5 రికార్డులు ఇవే.!
-
Viral Video: పోలీస్ స్టేషన్లో సహోద్యోగిని ముద్దుపెట్టుకున్న మహిళా కానిస్టేబుల్.. చివరకు.?
-
రూ.9,999కే Lava Smart 4 Plus లాంచ్.. 6.75 అంగుళాల డిస్ప్లే, 5000mAh బ్యాటరీతో అదిరిపోయే ఫీచర్లు.!
-
Pesara Garelu Recipe: బయట క్రిస్పీగా, లోపల సాఫ్ట్గా ఉండే రుచికరమైన స్నాక్ “పెసర గారెలు” చేసేయండి ఇలా.!
-
Baahubali 3 Announced: ఇండియన్ సినీ ప్రియులకు బిగ్ సర్ప్రైజ్.. ‘బాహుబలి 3′ వస్తోంది!