పాకిస్థాన్కు షాకిచ్చిన ఇంగ్లాండ్
వచ్చే నెల తమ జట్ల పాక్ పర్యటన ఆలోచన విరమించుకుంది ఇంగ్లాండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు – ECB. అక్టోబర్ 13, 14 తేదీల్లో ఇంగ్లాండ్ పురుషుల జట్టు రావల్పిండిలో T-20 మ్యాచ్లు ఆడాల్సి ఉంది. T-20 వరల్డ్ కప్కు ఇవి సన్నాహకాలుగా ఉపయోగపడతాయని భావించింది ECB. అలాగే, అక్టోబర్ 17, 19, 21 తేదీల్లో ఇంగ్లాండ్ మహిళల జట్టు వన్ డే ఇంటర్నేషనల్ మ్యాచ్లు ఆడాల్సి ఉంది. కానీ, ఇప్పుడు నిర్ధిష్టమైన ముప్పు పొంచి ఉందంటూ తమ జట్ల పాక్ టూర్ను రద్దు చేసింది ECB. ప్రస్తుత పరిస్థితులో తాము పాకిస్థాన్ టూర్కు వెళ్లడం సరికాదని భావిస్తున్నామని తెలిపింది ECB.
ఇటీవలే పాక్ టూర్కు వచ్చిన న్యూజిలాండ్ క్రికెట్ జట్టు… ఒక్క మ్యాచ్ కూడా ఆడకుండా వెనుదిరిగింది. 18 ఏళ్ల తర్వాత పాకిస్థాన్ టూర్కు వచ్చిన న్యూజీలాండ్… రావల్పిండిలో 3 వన్డేలు, లాహోర్లో 5 T-20లు ఆడాల్సి ఉంది. అయితే, వాటిని రద్దు చేసుకుని స్వదేశానికి వెళ్లిపోయారు కివీస్ ఆటగాళ్లు. ఇప్పుడు ఇంగ్లాండ్ కూడా తమ జట్టు రావడం లేదని పాకిస్థాన్కు తేల్చి చెప్పింది.
Also Read
- IPL 2026: 8 మ్యాచ్లు ఆడి చేసిన స్కోర్ 88.. అతడిని తప్పించాల్సిందే.. రాజస్థాన్ రాయల్స్ ఆటగాడిపై సెహ్వాగ్ ఆగ్రహం..
- IPL Playoff Chance: ప్లే ఆఫ్స్ చేరే జట్లపై క్లారిటీ.. ఆ రెండు జట్లు ఔట్..!
- CSK Vs GT: ఒంటరి పోరాటం చేసిన రుతురాజ్ గైక్వాడ్.. చెపాక్లో కెప్టెన్ వీరోచిత ఇన్నింగ్స్..
- Sanju Samson: గుజరాత్ టైటాన్స్పై చేసిన పరుగులు 11.. అయినా మరో రికార్డ్ సాధించిన సంజూ శాంసన్..
దీంతో వచ్చే ఏడాది పాకిస్థాన్లో జరగాల్సిన పలు టోర్నీలపైనా ఈ ప్రభావం కనిపించే సూచనలున్నాయి. 2022లో ఆస్ట్రేలియాతో పాటు మరికొన్ని దేశాలకు ఆతిథ్యమివ్వాలని భావిస్తోంది పాకిస్థాన్. ఇలాంటి పరిస్థితుల్లో న్యూజిలాండ్, ఇంగ్లాండ్ల నిర్ణయం పాక్కు శరాఘాతమే. తమ దేశానికి వచ్చే క్రికెట్ జట్లకు సంపూర్ణ భద్రత కల్పిస్తోంది పాకిస్థాన్. కానీ… అక్కడి వాస్తవిక పరిస్థితుల దృష్ట్యా పాక్ టూర్ అంటే భయపడుతున్నాయి ప్రపంచ దేశాలు. ఇంగ్లాండ్ నిర్ణయంపై పాకిస్థాన్ క్రికెట్ బోర్డు ఆవేదన వ్యక్తం చేసింది.
తాజావార్తలు
-
CM Revanth Reddy : ఐఏఎస్ల బదిలీల్లో రేవంత్ రెడ్డి క్యారెట్ అండ్ స్టిక్ పాలసీ
-
House Sales Down: భారీగా పడిపోయిన ఇళ్ల అమ్మకాలు.. ప్రధాన కారణం ఇదే..
-
Software Jobs Opening: లేఆఫ్స్ మధ్య భారీ ఊరట.. నియామకాలు స్టార్ట్ చేసిన ప్రముఖ సాఫ్ట్వేర్ సంస్థ..
-
Success Story: ఊరి నుంచి రూ.12 అప్పు చేసి వచ్చాడు.. నేడు రూ. 15 వేల కోట్లకు అధిపతి..
-
Angkrish Raghuvanshi: రేర్ డిస్మిసల్.. అంగ్క్రిష్ రఘువంశీ ఆబ్స్ట్రక్టింగ్ ది ఫీల్డ్ కు ఔట్.. కేకేఆర్ ఆగ్రహం
ట్రెండింగ్
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!
-
165Hz రిఫ్రెష్ రేట్, 12.3 అంగుళాల డిస్ప్లే, 10,100mAh బ్యాటరీతో Honor MagicPad 3 Pro లాంచ్.!
-
వేసవికాలంలో చల్లటి కబురు.. 22,000 భారీ తగ్గింపుతో Lloyd Air Conditioner.. త్వరపడండి.!
-
రూ. 9,999కే 6.88 అంగుళాల పెద్ద స్క్రీన్, 5200mAh బ్యాటరీ.. POCO C81 సిరీస్ లాంచ్..!