Asia Cup 2025: దుబాయ్ వేదికగా ఆసియా కప్.. ఒకే గ్రూపులో భారత్-పాకిస్తాన్..
- దుబాయ్, అబుదాబీ వేదికలుగా ఆసియా కప్..
- తటస్థ వేదికలపై నిర్వహణకు బీసీసీఐ ఓకే..
- ఒకే గ్రూపులో భారత్, పాకిస్తాన్ జట్లు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Asia Cup 2025: ఆసియా కప్ 2025పై బిగ్ అప్డేట్ వచ్చింది. మరోసారి క్రికెట్ అభిమానులకు ఆనందాన్ని పంచబోతోంది. దాయాదులు మరోసారి కలబడే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఒకే గ్రూపులో భారత్, పాకిస్తాన్ ఉండే ఛాన్స్ ఉందని సంబంధిత వర్గాలు చెప్పాయి. పహల్గామ్ ఉగ్రవాద దాడి తర్వాత ఈ టోర్నీ నిర్వహణపై అనిశ్చితి ఏర్పడింది. క్రికెట్ అభిమానులు ఎంతో ఆసక్తిగా చూస్తున్న ఈ T20 టోర్నమెంట్కు ఇప్పుడు అన్ని అడ్డంకులు తొలగిపోయాయని తెలుస్తోంది. గురువారం ఢాకాలో జరిగిన ఆసియా క్రికెట్ కౌన్సిల్ (ACC) వార్షిక సర్వసభ్య సమావేశంలో (AGM) ఆసియా కప్ గురించి చర్చించారు. దీనికి భారత క్రికెట్ బోర్డు అధికారులు వర్చువల్గా హాజరయ్యారు.
Read Also: Cyber Fraud: కామపల్లి సైబర్ మోసగాడు పోలీసుల వలలో – 4 లక్షల రూపాయల దోపిడీ
Also Read
- Team India: 94 ఏళ్ల టెస్ట్ క్రికెట్ ప్రయాణం.. నాడు లార్డ్స్ మైదానంలో ఓటమి.. నేడు ప్రపంచ నంబర్ 1 స్థానం..
- Vaibhav Sooryavanshi: వైభవ్ vs ఐర్లాండ్.. 'బేబీ బాస్'ను ఆపేందుకు ఐర్లాండ్ వేసిన మాస్టర్ ప్లాన్ లీక్..!
- IND-A Vs SL-A: మరోసారి ఫామ్ కొనసాగించిన సాయి సుదర్శన్.. 132 పరుగులతో వీరవిహారం..
- Vaibhav Sooryavanshi: పక్కా ప్లాన్తో బరిలోకి వైభవ్ సూర్యవంశీ.. కాటేరమ్మ కొడుకు రికార్డుపైనే గురి..
బీసీసీఐ ఈ టోర్నీని తటస్థ వేదికలపై నిర్వహించేందుకు ఓకే చెప్పింది. దుబాయ్, అబుదాబీ వంటి ప్రదేశాల్లో టోర్నీని నిర్వహించడానికి సుముఖత వ్యక్తం చేసింది. మూడు వేదికలను ఉపయోగించుకునేందుకు క్రికెట్ బోర్డు (ECB)తో ఒప్పందం కుదుర్చుకున్నప్పటికీ, ఆసియా కప్ కోసం రెండింటిని మాత్రమే ఉపయోగిస్తారని అంతా భావిస్తున్నారు. 8 జట్లు పాల్గొనే ఆసియా కప్ను భారత్ నిర్వహించాల్సి ఉంది. అయితే, పమల్గామ్ ఉగ్రవాద దాడి తర్వాత భారత్ ఆసియా కప్ లో పాల్గొనదు, ఆతిథ్యం ఇవ్వదు అనే వార్తలు వెలువడ్డాయి. పాకిస్తాన్ జట్టు భారత్లో ఆడడానికి నో చెప్పవచ్చనే ఊహాగానాలు వెలువడ్డాయి.
బీసీసీఐ ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్లా, ఆసియా క్రికెట్ కౌన్సిల్ అధ్యక్షుడు, పాకిస్తాన్ క్రికెట్ బోర్డ్-పీసీబీ చైర్మన్ మోహ్సిన్ నఖ్వీలు రాబోయే రోజుల్లో వేదికలు, టోర్నమెంట్ షెడ్యూల్ ఖరారు చేసేందుకు సమావేశం కానున్నట్లు తెలుస్తోంది. సెప్టెంబర్ 7 నుంచి మూడు, నాలుగో వారంలో టోర్నమెంట్ షెడ్యూల్ ఉండనుంది. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో జరిగబోయే T20 ప్రపంచ కప్కు సన్నాహక కార్యక్రమంగా భావిస్తున్నారు.
తాజావార్తలు
-
Early Pregnancy Diet: గర్భంతో ఉన్న వారు బొప్పాయి, పైనాపిల్ తినకూడదు ఎందుకు..? కారణం ఇదే..
-
Team India: 94 ఏళ్ల టెస్ట్ క్రికెట్ ప్రయాణం.. నాడు లార్డ్స్ మైదానంలో ఓటమి.. నేడు ప్రపంచ నంబర్ 1 స్థానం..
-
Specific Carbohydrate Diet for Gut Health: పేగుల సమస్యలకు డైట్ థెరపీ.. వైద్యులు ఏమంటున్నారు?
-
Amazon Offers: అమెజాన్లో సేల్స్.. టాప్ బ్రాండెడ్ స్మార్ట్ఫోన్లపై భారీ ఆఫర్లు..
-
Rahul Ravindran: “మహిళలు పురుషులపై దారుణాలు చేయడం నేనెక్కడా చూడలేదు… రాహుల్ రవీంద్రన్ సంచలనం!”
ట్రెండింగ్
-
52dB ANC, 54 గంటల బ్యాటరీ బ్యాకప్తో భారత్లో లాంచ్ అయిన OnePlus Nord Buds 4.. ధర ఎంతంటే.?
-
Benefits of Hugging: భార్యాభర్తలు కౌగిలించుకుని నిద్రపోతే కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే.!
-
Jamun Juice: యాంటీఆక్సిడెంట్ల పవర్హౌస్.. ‘నేరేడుపండు జ్యూస్’ ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
IPL Franchises: కార్పొరేట్ కంపెనీల సరసన ఐపీఎల్ జట్లు.. రిపోర్ట్లో సంచలన విషయాలు.!
-
Ben Stokes Apology: నేను పెద్ద తప్పు చేశాను.. నన్ను క్షమించండి!