Asia Cup 2025: దుబాయ్ వేదికగా ఆసియా కప్.. ఒకే గ్రూపులో భారత్-పాకిస్తాన్..
- దుబాయ్, అబుదాబీ వేదికలుగా ఆసియా కప్..
- తటస్థ వేదికలపై నిర్వహణకు బీసీసీఐ ఓకే..
- ఒకే గ్రూపులో భారత్, పాకిస్తాన్ జట్లు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Asia Cup 2025: ఆసియా కప్ 2025పై బిగ్ అప్డేట్ వచ్చింది. మరోసారి క్రికెట్ అభిమానులకు ఆనందాన్ని పంచబోతోంది. దాయాదులు మరోసారి కలబడే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఒకే గ్రూపులో భారత్, పాకిస్తాన్ ఉండే ఛాన్స్ ఉందని సంబంధిత వర్గాలు చెప్పాయి. పహల్గామ్ ఉగ్రవాద దాడి తర్వాత ఈ టోర్నీ నిర్వహణపై అనిశ్చితి ఏర్పడింది. క్రికెట్ అభిమానులు ఎంతో ఆసక్తిగా చూస్తున్న ఈ T20 టోర్నమెంట్కు ఇప్పుడు అన్ని అడ్డంకులు తొలగిపోయాయని తెలుస్తోంది. గురువారం ఢాకాలో జరిగిన ఆసియా క్రికెట్ కౌన్సిల్ (ACC) వార్షిక సర్వసభ్య సమావేశంలో (AGM) ఆసియా కప్ గురించి చర్చించారు. దీనికి భారత క్రికెట్ బోర్డు అధికారులు వర్చువల్గా హాజరయ్యారు.
Read Also: Cyber Fraud: కామపల్లి సైబర్ మోసగాడు పోలీసుల వలలో – 4 లక్షల రూపాయల దోపిడీ
Also Read
- Lionel Messi: 39 ఏళ్ల మెస్సీ.. మరో చరిత్రకు అడుగు దూరంలో.. గోల్డెన్ బూట్ గెలుస్తాడా?
- IND vs ENG 2nd ODI: వన్డే సిరీస్పై కన్నేసిన టీమిండియా.. నేడు రెండో వన్డే.! పిచ్ రిపోర్ట్, ప్లేయింగ్ XI, మ్యాచ్ వివరాలు ఇవే..!
- Lionel Messi:19ఏళ్ల క్రితం మెస్సీ చేతుల్లో పెరిగిన బుడతడు.. ఇప్పుడు ప్రపంచకప్ ఫైనల్లో అతడికే సవాల్ విసురుతున్న చిచ్చరపిడుగు!
- Argentina vs England 2026: ఇంగ్లాండ్పై అర్జెంటీనా సంచలన విజయం.. వరుసగా రెండోసారి ఫిఫా ప్రపంచకప్ ఫైనల్లోకి
బీసీసీఐ ఈ టోర్నీని తటస్థ వేదికలపై నిర్వహించేందుకు ఓకే చెప్పింది. దుబాయ్, అబుదాబీ వంటి ప్రదేశాల్లో టోర్నీని నిర్వహించడానికి సుముఖత వ్యక్తం చేసింది. మూడు వేదికలను ఉపయోగించుకునేందుకు క్రికెట్ బోర్డు (ECB)తో ఒప్పందం కుదుర్చుకున్నప్పటికీ, ఆసియా కప్ కోసం రెండింటిని మాత్రమే ఉపయోగిస్తారని అంతా భావిస్తున్నారు. 8 జట్లు పాల్గొనే ఆసియా కప్ను భారత్ నిర్వహించాల్సి ఉంది. అయితే, పమల్గామ్ ఉగ్రవాద దాడి తర్వాత భారత్ ఆసియా కప్ లో పాల్గొనదు, ఆతిథ్యం ఇవ్వదు అనే వార్తలు వెలువడ్డాయి. పాకిస్తాన్ జట్టు భారత్లో ఆడడానికి నో చెప్పవచ్చనే ఊహాగానాలు వెలువడ్డాయి.
బీసీసీఐ ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్లా, ఆసియా క్రికెట్ కౌన్సిల్ అధ్యక్షుడు, పాకిస్తాన్ క్రికెట్ బోర్డ్-పీసీబీ చైర్మన్ మోహ్సిన్ నఖ్వీలు రాబోయే రోజుల్లో వేదికలు, టోర్నమెంట్ షెడ్యూల్ ఖరారు చేసేందుకు సమావేశం కానున్నట్లు తెలుస్తోంది. సెప్టెంబర్ 7 నుంచి మూడు, నాలుగో వారంలో టోర్నమెంట్ షెడ్యూల్ ఉండనుంది. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో జరిగబోయే T20 ప్రపంచ కప్కు సన్నాహక కార్యక్రమంగా భావిస్తున్నారు.
తాజావార్తలు
-
Doctor Murder Case: రక్తపు మడుగులో భర్త.. 8ఏళ్ల పిల్లాడిని చావబాదింది.. తర్వాత మంచంపై పడుకొని ఫోన్లో రీల్స్ చూస్తూ…
-
Tollywood : డాన్సర్స్ అసోసియేషన్ వివాదంపై ఫిలిం ఫెడరేషన్ అత్యవసర సమావేశం
-
Siya Goyal: సియా గోయల్ కుటుంబానికి FDA షాక్.. రూ.8 లక్షల విలువైన వస్తువుల స్వాధీనం
-
Kalma Homework: స్కూల్లో ‘కల్మా’ హోంవర్క్ వివాదం.. బీజేపీ నేతల ఆగ్రహం..!
-
Diljit Dosanjh: రూ.1 రెమ్యునరేషన్ తీసుకున్న స్టార్ హీరో.. షాకింగ్ నిజం బయటపెట్టిన దర్శకుడు
ట్రెండింగ్
-
50MP సోనీ కెమెరా, 7100mAh బ్యాటరీ, 2K 144Hz LTPO AMOLED డిస్ప్లేతో Motorola Edge 70 Max భారత్లో లాంచ్..!
-
144Hz డిస్ప్లే, 50MP కెమెరా, 8000mAh భారీ బ్యాటరీతో Realme NARZO 100x 5G భారత్లో లాంచ్.. ధర, ఫీచర్లు ఇలా.!
-
Team India Coaching Staff: టీమిండియా కోచింగ్ స్టాఫ్లో విభేదాలు.. ఆ ఇద్దరిలో ఒకరిపై వేటు తప్పదు?
-
12-అంగుళాల 2.8K OLED డిస్ప్లే, 144Hz రిఫ్రెష్ రేట్, 10100mAh బ్యాటరీతో HUAWEI MatePad Air (2026) లాంచ్..!
-
Harry Brook: అదే మా ఓటమికి కారణం.. రెండో వన్డేలో టీమిండియాను దెబ్బ కొడతాం!