Roger Binny: అఫ్రిది వ్యాఖ్యలపై బీసీసీఐ చీఫ్ ఆగ్రహం.. టీమిండియాకు ఐసీసీ ఎలా సహకరిస్తుంది?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Roger Binny: టీ20 ప్రపంచకప్లో టీమిండియాకు ఐసీసీ సహరిస్తోందని పాకిస్థాన్ మాజీ ఆటగాడు షాహిద్ అఫ్రిది చేసిన వ్యాఖ్యలపై బీసీసీఐ అధ్యక్షుడు రోజర్ బిన్నీ స్పందించారు. తమిళనాడు క్రికెట్ అసోసియేషన్లో జరిగిన ఒక కార్యక్రమానికి హాజరైన ఆయన అఫ్రిది వ్యాఖ్యలపై పెదవి విప్పారు. అఫ్రిది చేసిన ఆరోపణలు సమంజసం కాదని అసహనం వ్యక్తం చేశారు. ఐసీసీ టీమిండియాకు అనుకూలంగా వ్యవహరిస్తోందని ఆరోపించడం సరికాదని.. ఐసీసీ అన్ని జట్ల విషయంలో ఒకేలా వ్యవహరిస్తుందని స్పష్టం చేశారు. ఐసీసీ పక్షపాతం చూపిస్తోందని ఎలా అంటారని ప్రశ్నించారు. మిగతా జట్లతో పోలిస్తే టీమిండియా అదనంగా ఎలాంటి సహకారం లభిస్తోందో చూపించాలని సవాల్ విసిరారు. క్రికెట్లో భారత్ పవర్ హౌస్ జట్టే.. కానీ ఐసీసీ అన్ని జట్లను సమానంగానే పరిగణిస్తుందని రోజర్ బిన్నీ తెలిపారు.
Read Also: TATA Motors: కార్ల ధరలను పెంచుతూ టాటా కీలక నిర్ణయం..
Also Read
- Vaibhav Sooryavanshi Debut: వైభవ్ అరంగేట్రాన్ని టీమిండియా ఎందుకు అడ్డుకుంటోంది?.. అసలు కారణం ఇదే!
- Jai Moondra: టీమిండియాపై చెలరేగాడు.. బంపర్ ఛాన్స్ కొట్టేశాడు.. జయహో జై ముంద్రా!
- Vaibhav Sooryavanshi: దయచేసి వైభవ్ను ఆడించండి.. బీసీసీఐకి ఎవరన్నా చెప్పండ్రా బాబు.. దిగ్గజాల కామెంట్స్ వైరల్!
- T20 World Cup 2026: సెమీస్లో దక్షిణాఫ్రికాపై ఘన విజయం.. ఫైనల్లో ఆస్ట్రేలియాతో ఇంగ్లండ్ ఢీ!
కాగా టీమిండియా మ్యాచ్లలో అంపైర్లు తీసుకున్న నిర్ణయాలు కొన్ని వివాదాస్పదంగా నిలిచాయి. భారత్, పాకిస్తాన్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్లో చివరి ఓవర్లో అంపైర్లు నోబాల్ ఇచ్చారు. అది నోబాల్ కాదని సోషల్ మీడియాలో పాకిస్థాన్ అభిమానులు తెగ కామెంట్లు చేశారు. ఇటీవల బంగ్లాదేశ్, భారత్ మధ్య జరిగిన మ్యాచ్లో వర్షం పడి మైదానం చిత్తడిగా ఉందని బంగ్లాదేశ్ కెప్టెన్ చెప్పినా అంపైర్లు వినిపించుకోలేదని ఆ జట్టు అభిమానులు ఆరోపించారు. ఇదే మ్యాచ్లో కోహ్లీ ఫేక్ ఫీల్డింగ్ చేశాడని బంగ్లాదేశ్ ఆటగాడు నురుల్ హసన్ ఆరోపించాడు. ఈ అంశాన్ని గమనించడంలో అంపైర్లు విఫలమయ్యారని.. అంపైర్లు కావాలనే భారత్కు సహకారం అందిస్తున్నారని పలువురు బంగ్లాదేశ్ అభిమానులు కోహ్లీని ట్రోల్ చేశారు.
తాజావార్తలు
-
Vaibhav Sooryavanshi Debut: వైభవ్ అరంగేట్రాన్ని టీమిండియా ఎందుకు అడ్డుకుంటోంది?.. అసలు కారణం ఇదే!
-
Ayodhya Ram Temple Land Deal: అయోధ్య రామమందిర కేసులో కొత్త మలుపు.. భూ కొనుగోళ్లపై SIT దర్యాప్తు
-
Rushikonda Buildings: రుషికొండ భవనాల వినియోగంపై ప్రభుత్వం కీలక నిర్ణయం..
-
Jai Moondra: టీమిండియాపై చెలరేగాడు.. బంపర్ ఛాన్స్ కొట్టేశాడు.. జయహో జై ముంద్రా!
-
Vizag Steel Plant Blast: స్టీల్ ప్లాంట్ ప్రమాదంపై నివేదిక.. ఏడుగురు సీనియర్ అధికారులపై వేటు..
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi: దయచేసి వైభవ్ను ఆడించండి.. బీసీసీఐకి ఎవరన్నా చెప్పండ్రా బాబు.. దిగ్గజాల కామెంట్స్ వైరల్!
-
RCB అభిమానులకు నథింగ్ సర్ప్రైజ్.. జూలై 7న Nothing Phone (4b) RCB Edition విడుదల
-
Samsung Galaxy A27 5G vs OnePlus Nord 6: ఏ స్మార్ట్ఫోన్ బెస్ట్?
-
10100mAh బ్యాటరీతో రెడ్మీ నోట్ 17 ప్రో మాక్స్? Redmi Note 17 సిరీస్లో డిస్ప్లే, బ్యాటరీలో భారీ అప్గ్రేడ్లు.!
-
50MP ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 120Hz Super AMOLED డిస్ప్లేతో Samsung Galaxy Jump 5 లాంచ్.!